

No.1 Short News
Newsreadఎప్పటికైనా రాష్ట్ర గౌరవాన్ని, హక్కులను కాపాడేది చంద్రబాబే : దర్శి టిడిపి ఇంచార్జి Dr. గొట్టిపాటి లక్ష్మీ
విశాఖ ఉక్కు కర్మాగారానికి పునర్వైభవం తీసుకురావడంలో చంద్రబాబు పాత్ర ఎంతో ఉంది. జగన్మోహన్ రెడ్డి కేసుల మాఫీ కోసం విశాఖ ఉక్కుని అమ్మకానికి పెడితే, చంద్రబాబు రాష్ట్రానికే మణిహారమైన ప్లాంట్ ను కాపాడేందుకు అహర్నిశలు శ్రమించారు.తనపై ఉన్న అవినీతి కేసుల్ని తొలగిస్తే, ఏకంగా రాష్ట్రాన్నే తాకట్టు పెట్టడానికి సిద్ధమైన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ... రాష్ట్రమే తన కుటుంబం... రాష్ట్రాభివృద్ధే తన సంకల్పమంటూ అడుగులు వేస్తున్న చంద్రబాబు ఎక్కడా అని గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు
Breaking News
21 Jan 2025 13:53 PM