

No.1 Short News
Newsreadహైవేపై భారీ దోపిడీ.. రూ.10 లక్షల విలువైన సెల్ఫోన్లు చోరీ
తెలంగాణ : నిజామాబాద్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. విశ్రాంతి కోసం జాతీయ రహదారి పక్కన ఆపిన లారీలో నుంచి సెల్ ఫోన్ డబ్బాలను దొంగలు ఎత్తుకెళ్లారు. లారీ డ్రైవర్ ఫిర్యాదుతో నిజామాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి గురైన సెల్ ఫోన్ల విలువ మార్కెట్లో సుమారు రూ.10 లక్షలకు పైగా ఉంటుందని డ్రైవర్ పోలీసులకు తెలియజేశాడు.
Breaking News
12 Jul 2025 15:09 PM