

No.1 Short News
Newsreadప్రజాసేవే రాజకీయం అని నిరూపించిన మహానేత వంగవీటి రంగా: డా. గొట్టిపాటి లక్ష్మీ
పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చివరి శ్వాస వరకు పనిచేసిన స్వర్గీయ వంగవీటి రంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత అని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు.
ఆదివారం దర్శిలో జరిగిన శ్రీకృష్ణదేవరాయలు, వంగవీటి రంగా, కనకం వెంకయ్య గార్ల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రంగా కులాలకు అతీతంగా పేదల నాయకుడని, ప్రజాసేవే ఆయన రాజకీయ ధ్యేయమని డా. గొట్టిపాటి లక్ష్మీ కొనియాడారు.
రంగా ఆశయాలే తన రాజకీయ స్ఫూర్తి అని పేర్కొన్న డా. గొట్టిపాటి లక్ష్మీ, కూటమి ప్రభుత్వంలో దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రాంతంగా మార్చడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వంగవీటి రాధా , టిడిపి, జనసేన నాయకులు, కూటమి శ్రేణులు భారీగా పాల్గొన్నారు.