No.1 Short News

Newsread
రేపు దర్శి‌లో భారీగా అభివృద్ధి శంఖారావం
దర్శి, జనవరి 17: దర్శి నియోజకవర్గంలో రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు, ప్రజాప్రతినిధులు విచ్చేయనున్నారు. ఉదయం 10.30కి దర్శిలో రూ.4 కోట్లతో కొత్త విద్యుత్ డివిజనల్ కార్యాలయానికి భూమిపూజ, 11.15కి ఉల్లగల్లు లో రూ.3.90 కోట్లతో 33/11 కేవి సబ్‌స్టేషన్ శంఖుస్థాపన జరుగుతుంది. 11.45కి కీ.శే. నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ, 12 గంటలకు బహిరంగ సభ జరుగుతుంది. మధ్యాహ్నం 2గంటలకు పసుపుగళ్లలో బస్ షెల్టర్‌ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొననున్నారు. మీడియా సోదరులు కార్యక్రమాలను విస్తృతంగా కవర్ చేయాలని దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కోరారు.
Latest News
16 Jan 2026 15:44 PM
0
1

Newsread
For better experience and daily news update.
Download our app from play store.