Select Location
Newsread Image

No.1 Short News

Newsread
ఇక బ్యాంకు ఖాతాకు నలుగురు నామినీలు!గతంలో ఒక్క నమినీకే అవకాశం
▪️మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, బీమా ఖాతాలకు ముగ్గురు నామినీలు. ▪️ఒకరి తర్వాత ఒకరిని హక్కుదారులుగా సూచించవచ్చు. ▪️ఖాతాలోని ఆస్తిని శాతాల వారీగా కేటాయించవచ్చు. ▪️బ్యాంకింగ్ చట్టాల బిల్లు సవరణతో అవకాశం. బ్యాంకు ఖాతాదారులు నలుగురిని నామినీలుగా నియమించుకునే అవకాశం రానుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో క్లెయిమ్ చేయని డిపాజిట్ల సంఖ్యను తగ్గించడం కోసం కేంద్రం ఈ మార్పు తీసుకొస్తోంది. ఇందుకోసం ఇటీవలే బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లును పార్లమెంటు ఆమోదించింది. నాలుగు రోజుల క్రితమే ఈ సవరణపై నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీంతో బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, బీమా నామినేషన్ నియమాలలో త్వరలో కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. గతంలో బ్యాంక్ ఖాతాకు ఒక్క నామినీని మాత్రమే పేర్కొనే అవకాశం ఉండేది. దీనివల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నట్లు చాలాకాలం నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. నామినీ మరణించినా అతని ఖాతాలోని ఆస్తులు వారసులకు బదిలీ కాకపోవడంతో పాటు రెండో నామినీ లేకపోవడం వల్ల చట్టపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. చివరికి పదేళ్ల తర్వాత ఖాతాలోని ఆస్తులు ఎవరికీ క్లెయిమ్ చేయకపోవడం వల్ల డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎవేర్నెస్ ఫండ్ కి అవి జమ అయిపోతున్నాయి. ఖాతాదారుకి రెండు ఆప్షన్లు నలుగురు నామినీల్లో ఎవరిని హక్కుదారుగా నిర్ణయించాలనేది బ్యాంకు ఖాతాదారు ఇష్టం. దీనికోసం రెండు ఆప్షన్లను కేంద్రం ప్రతిపాదించింది. మొదటి ఆప్షన్ లో ఓ ఖాతాదారుకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉంటే అందరినీ నామినీలుగా పెట్టుకుని ఒకరి మరణానంతరం మరొకరిని హక్కుదారుగా పేర్కొనవచ్చు. ఉదాహరణకు తొలుత భార్య ఆమె మరణానంతరం కుమారుడు, అతని మరణానంతరం కుమార్తెలను హక్కుదారులుగా సూచించవచ్చు. రెండో ఆప్షన్ లో తన ఖాతాలోని ఆస్తిని శాతాలవారీగా నలుగురికీ కేటాయించవచ్చు. ఈ మార్పు అన్ని ఖాతాలకు (మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, బీమా, బ్యాంక్) వర్తిస్తుంది. బ్యాంకు ఖాతాకు మాత్రమే నలుగురు నామినీలను ఎంచుకునే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, బీమా వంటి వాటికి ముగ్గురు నామినీలను నియమించే అవకాశం మాత్రమే ఉంది.
View More
Latest News
26 Apr 2025 19:37 PM
1
6
Newsread Image

No.1 Short News

Newsread
న్యూస్ రీడ్: ప్రజల వద్దకే ముఖ్యమంత్రి..
ఎచ్చెర్ల నియోజకవర్గం, బుడగట్లపాలెం సముద్ర తీరంలో మత్స్యకార కుటుంబం అయిన మద్దు పోలేష్, రామలక్ష్మిలతో మాట్లాడి, వారి జీవన విధానం, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ప్రకటన: న్యూస్ రీడ్ లో మీ వార్తల కోసం 9948680044 నెంబర్ కి వాట్సాప్ చేయగలరు.
View More
Latest News
26 Apr 2025 19:15 PM
0
2
Newsread Image

No.1 Short News

Newsread
వక్ఫ్ నిరసన కరపత్రాన్ని ఆవిష్కరించిన అబ్దుల్ సత్తార్
ఒంగోలులో సోమవారం ఉదయం కర్నూలు రోడ్డు ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుండి కలెక్టరు కార్యాలయం వరకు శాంతియుత ర్యాలీ జమియతే ఉలేమా, ఒంగోలు JAC, ఆల్ పార్టీ, ఆల్ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరుగుతుంది, ప్రతీ మసీదునుండి ప్రతీ వార్డు నుండీ స్వచ్ఛందంగా పాల్గొని వక్ఫ్ వ్యతిరేకతను భారీ స్థాయిలో తెలియపరచుదాం, Sdpi పార్టీ సభ్యులు, బ్రాంచ్ కమిటీ సభ్యులు r, అసెంబ్లీ సభ్యులు, ప్రతి ఒక్కరూ హాజరు కావాలి, మన గళాన్ని వినిపించాలి, JAC కమిటీ వారి నినాదాల ప్రకారం మనమంతా క్రమశిక్షణతోమేలగాలని అబ్దుల్ సత్తార్ కోరారు.
View More
Latest News
26 Apr 2025 19:08 PM
0
2
Newsread Image

No.1 Short News

ADN NEWS TV
ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు సెలవు.. కీలక ఆదేశాలు జారీ చేసిన కేంద్రం..
న్యూ ఢిల్లీ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇంధన వనరుల వాడకని తగ్గించడం కోసం ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులకు సెలవు ప్రకటించారు.. మే నెల 14వ తేదీ నుండి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందనీ పెట్రోల బంకుల యజమానులు సంఘం తెలియజేసింది.పెట్రోలియం వాడకం తగ్గించడం ద్వారా ఇంధన వనరుల పరిరక్షణ చేయుట కొరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు..
View More
Latest News
26 Apr 2025 18:56 PM
0
2
Newsread Image

No.1 Short News

ADN NEWS TV
నర్సింగ్ సేవల అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం ..
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గత ఆరు దశాబ్దాల్లో (ఉమ్మడి రాష్ట్రంతో కలిపి) మొట్టమొదటి సారిగా ఫ్లోరెస్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుతూ నర్సింగ్ సేవలకు సంబంధించి వివిధ కేటగిరీల్లో ఉత్తమ సేవల్ని అందించిన వారికి ఫ్లోరెస్స్ నైటింగేల్ అవార్డులు-2025 ప్రదానం చేయనుంది. నాలుగు కేటగిరీలు..నర్స్ అడ్మి నిస్ట్రేటర్, నర్స్ ఎడ్యుకేటర్, నర్స్ రిసెర్చెర్ నర్సింగ్ సర్వీసెస్(ANMలు, స్టాఫ్ నర్సులు, హెడ్ నర్సులు) లకు ప్రభుత్వ, ప్రైవేట్, రైల్వే ఆసుపత్రులు, PHC, CHC, ESI, నర్సులు ఈ అవార్డులకు దరఖాస్తులు చేయవచ్చు. అవార్డు వివరాలు 25,000 /- నగదు, నర్సింగ్ కౌన్సిల్ షీల్డ్ ఇస్తారు. ఆరోజు TA/DA లు ఇస్తారు. అవార్డు ఎంపిక కమిటీ: ▪️వైద్య ఆరోగ్య శాఖ హెచ్.ఓ.డి లు ▪️డిప్యూటీ డైరెక్టర్ నర్సింగ్ ▪️రిజిస్ట్రార్, నర్సింగ్ కౌన్సిల్ ▪️సీనియర్ ప్రిన్సిపల్స్, ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ విద్యాసంస్థలు. అర్హత ప్రమాణాలు, దరఖాస్తు మార్గదర్శకాల పూర్తి సమాచారం కొరకు https://hmis.ap.nic.in/ వెబ్ సైట్ చూడండి. దరఖాస్తులు పంపవలసిన చిరునామా: ఈమేరకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ప్రత్యక్షంగా గానీ లేదా పోస్టు, కొరియర్ ద్వారా.. The Registrar, AP Nurses & Midwives Council, Government General Hospital (old) Campus, Olo Director of Medical Education Hanumanpet, Vijayawada- 520002, Amaravathi, AP.
View More
Latest News
26 Apr 2025 18:56 PM
0
2
Newsread Image

No.1 Short News

Umar Fharooq
మే 2న అమరావతికి ప్రధాని మోదీ
మే 2న అమరావతి పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోదీను ఆహ్వానించిన సీఎం చంద్రబాబు.
Latest News
26 Apr 2025 18:10 PM
0
5
Newsread Image

No.1 Short News

ADN NEWS TV
సిబ్బందిని పరిగెత్తిస్తున్న కమీషనర్.. పారిశుద్యం పై ప్రత్యేక దృష్టి..
ప్రకాశంజిల్లా పొదిలి నూతన నగరపంచాయితీ కమీషనర్ నారాయణరెడ్డి సిబ్బందిని పరిగెత్తి స్తున్నారు.ప్రతిరొజు తెల్లవారుజామున వీది వీది తిరుగుతు మురుగుకాల్వల లోపాలను తెలుసుకుంటు సిబ్బందిని దగ్గరుండి పనులు చేయిస్తున్నారు.కొన్నిచొట్ల మురుగుకాల్వలపై ఉన్న బంకులను,ఆక్రమణల ను తొలగించాలని సిబ్బందికి ఆదేశాలు..ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదని మురుగు కాల్వల అవతలే వ్యాపారాలు నిర్వహించు కొనాలని సూచన..చెత్తను రోడ్లమీద,కాలువలలో వేయకుండా తప్పనిసరిగా డస్ట్ బిన్లు ఉపయెగించుకొవాలని ప్రజలకు సూచన..పొదిలి అభివృద్ధికి ప్రజల సహకారం తప్పనిసరి ప్రజలలో శానిటేషన్ ఆవగాహన పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.స్దానిక అమ్మవారిశాల,ఆంద్రాబ్యాంక్ వీదిని సందర్శించి సిబ్బంది కి పలు సూచనలు ఇచ్చారు..
View More
Latest News
26 Apr 2025 18:10 PM
0
3
Newsread Image

No.1 Short News

ADN NEWS TV
పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో ద్వితీయ స్థానం సాధించిన యరగూటి నిత్యను సన్మానించిన దర్శి MRO
ఈ రోజు దరిశి స్థానిక తహశిల్దారు కార్యాలయంలో, ప్రకాశం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జికూటివ్ మెంబర్ మరియూ మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో.. పదోతరగతి ఫలితాలలో ప్రకాశం జిల్లాలో మొదటి స్థానం 600 మార్కులకు గాను 598 పశ్చిమ ప్రకాశానికి రాగా, 600 మార్కులకు 597మార్కులు సాధించి ఒకే ఒక్క మార్కు తేడాతో దరశి ప్రాంతానికి చెందిన ఆణిముత్యం యరగూటి నిత్య జిల్లాలో ద్వితీయ స్థానాన్ని సొంతం చేసికొన్న శుభ సందర్భంగా దరిశి మండల తహశిల్దారు మరియు మండల ఎగ్జికూటివ్ మేజిస్ట్రేట్ శ్రావణ్ కుమార్,కపురం శ్రీనివాసరెడ్డి సంయుక్తంగా దుశ్శాలువాతో,పూల బొకేలతో నిత్యను ఘనంగా సత్కరించి స్వీట్లు పంచుకొని,మధురానుభూతులు పొందారు.ఈ సందర్భంగా తహశిల్దారు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. ఇలాంటి శుభసందర్భాలు జీవితంలో చాలా రావాలని నిత్య ను కొనియాడి మనసారా దీవించి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో కపురం శ్రీనివాసరెడ్డి మాట్లడుతూ.. గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన నిత్య నిరుపేద విద్యార్థులందరికీ ఆదర్శవంతంగా వుండాలని దీవించి, ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నిత్య తండ్రి రాజశేఖరరెడ్డి, రెవెన్యూసిబ్బంది పాల్గొన్నారు..
View More
Latest News
26 Apr 2025 18:10 PM
1
14
Newsread Image

No.1 Short News

ADN NEWS TV
పాక్‌కు వత్తాసు పలికిన MLA అరెస్ట్.. దేశద్రోహం కేసు నమోదు
పహల్గాంలో ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే, అస్సాంలోని మంకాచార్ నియోజకవర్గానికి చెందిన ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం.. పహల్గాం ఘటనలో పాకిస్థాన్‌ను సమర్థిస్తున్నట్లు ఆరోపణలున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సీరియస్ అయ్యారు. సీఎం ఆదేశాలతో ఎమ్మెల్యేని అరెస్టు చేసి, దేశద్రోహం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
View More
Latest News
26 Apr 2025 18:10 PM
0
3
Newsread Image

No.1 Short News

ADN NEWS TV
నేడు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి నియోజకవర్గంలోని గ్రామాల పర్యటన అనివార్య కారణాలవల్ల రద్దు..
తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులకు కార్యకర్తలకు విన్నపం మన దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి శనివారం దర్శి నియోజకవర్గంలోని, తానంచింతల, చలివేంద్రం, ఎర్రఓబనపల్లి గ్రామాల పర్యటన అనివార్య కారణాలవల్ల రద్దయిందని తెలియజేస్తున్నాము గమనించగలరు..
View More
Latest News
26 Apr 2025 18:10 PM
1
2
Newsread Image

No.1 Short News

ADN NEWS TV
దళిత,గిరిజన, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష..
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో అంబేద్కర్ సర్కిల్ నందు సబ్ రిజిస్టర్ అవినీతి,అరాచకాలపై సోమవారం 28/04/2025 వ తేదీ న జరిగే రిలే నిరాహార దీక్షకు దళిత, గిరిజన,ప్రజాసంఘాల నాయకులు అలాగే సబ్ రిజిస్టర్ బాధిత ప్రజలు కులాలకు,మతాలకు, పార్టీలకు,అతీతంగా హాజరై సబ్ రిజిస్టర్ అవినీతి ని ఎండగట్టి ప్రజల పక్షాన పోరాటం చెయ్యబోయే ఈ మహా యజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం..
View More
Latest News
26 Apr 2025 18:09 PM
0
2
Newsread Image

No.1 Short News

ADN NEWS TV
వారం రోజులు ఎండలు, వడగాలులు.. బయటికెళ్లొద్దు..
తెలుగు రాష్ట్రాల్లో 40-44 డిగ్రీల ఎండలు, వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వడదెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నారు. TGలో 2 రోజులు సాధారణం కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని IMD వెల్లడించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలో 4 మండలాల్లో తీవ్ర వడగాలులు, 17 మండలాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. మధ్యాహ్నం వేళ్లలో బయటికి వెళ్లకపోవడం మంచిది..
View More
Latest News
26 Apr 2025 18:09 PM
0
1
Newsread Image

No.1 Short News

ADN NEWS TV
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోతవరం నందు పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందన సభ ..
ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోతవరం నందు పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాఠశాలలో మొదటి మూడు స్థానాల్లో సాధించిన విద్యార్థులకు పోతవరం గ్రామ వాస్తవ్యులు శ్రీ కోరే బాల రంగ సాయి గారు ఏడువేల రూపాయలు నగదు బహుమతుల్ని అందించారు. వీరిలో గురు ప్రసన్న నియోజకవర్గస్థాయిలోని ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక మార్కులు 586 మార్కులు సాధించింది. ప్రదీప్ 547 మార్కులు, తోక రామలక్ష్మి 541 మార్కులు సాధించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ నర్రా వెంకటేశ్వర్లు గారు, పోతవరం ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయులు శ్రీ ధనిరెడ్డి వెంకటరెడ్డి గారు (UTF సీనియర్ నాయకులు )పాఠశాల ఉపాధ్యాయులు టి. విజయ భాస్కర్ రెడ్డి, ఐ వి ఎల్ నారాయణ, వై జి లివింగ్స్టన్, వివిఎస్ శాస్త్రి, టి.బాలసుబ్బయ్య, డి.మాన్ సింగ్, జి.శిల్పకుమారి, జి సుధారాణి, ఎ. ఖాశీం పాల్గొని విద్యార్థులని అభినందించారు..
View More
Latest News
26 Apr 2025 18:09 PM
1
2
Newsread Image

No.1 Short News

ADN NEWS TV
జమ్మూకాశ్మీర్ ఫహల్గాం లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ దర్శి పట్టణంలో ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన ర్యాలీ
జమ్మూకాశ్మీర్ ఫహల్గాం లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ దర్శి పట్టణంలో ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన ర్యాలీ..
Latest News
26 Apr 2025 13:32 PM
0
11
Newsread Image

No.1 Short News

Umar Fharooq
పెహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి అశ్రునివాళి
పహల్గాం ఉగ్రదాడి ఘటనపై యావత్‌ భారత జాతి రగిలిపోతోంది. ఉగ్రవాదులను, వారిని ఎగదోస్తున్న పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి ఇటువంటి పరిస్తులు పునారావతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేస్తూ.ఈ రోజు 6 గంటలకు దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దర్శిలోని పొదిలి రోడ్డు నుంచి గడియార స్తంభం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది.
View More
Latest News
26 Apr 2025 13:02 PM
0
10
Newsread Image

No.1 Short News

Umar Fharooq
పహల్గాం ఉగ్రవాద దాడులలో మరణించిన వారికి నివాళులు
పహల్గాం ఉగ్రవాద దాడులలో మరణించిన వారికి నివాళులు అర్పిస్తూ విజయవాడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వైఎస్ షర్మిల రెడ్డి మాట్లాడుతూ, ఈ దాడి మన దేశం మీద జరిగిన దాడి, ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యుల రోధాలు ఎంతో బాధను కలిగిస్తున్నాయని, ఈ ఘటనకు భద్రత వైఫల్యమే కారణమని, బిజెపి ఈ విషయాన్ని తప్పు దోవ పట్టిస్తుంది ఒక మతం మీద జరిగిన దాడిగా క్రియేట్ చేస్తుంది.అంతే కాకుండా దాన్ని అనుబంధ సంస్థ అయినా RSS కూడా ఇదే పనిలో ఉందని ఇది చాలా బాధాకరమైన విషయం అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వైయస్ షర్మిల అన్నారు.
View More
Latest News
26 Apr 2025 12:24 PM
0
12

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బీర్కూర్ లో పహాగ్ గాం మృతులకు క్రోవత్తులతో నివాళులు
పహాల్గం ఉగ్రదాడి ని ఖండిస్తూ మృతులకు నివాళిగా బిర్కుర్ లో బీజేపీ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది కాశ్మీర్ అందాలను అశ్వదించేందుకు వెళ్లిన అమాయక ప్రజల పై దాడి చేయడం బాధాకరం అలాగే కులం అడుగకుండ మతం చూసి నువు హిందువు అయితే చాలు అని చూసి చంపడం బాధాకరం ఈ కార్యక్రమంలో ,పార్టీల కు అతీతంగా గ్రామ పెద్దలు గ్రామ యువత పాల్గొన్నారు. News Read Birkur Reporter : Sai Raja
View More
Latest News
25 Apr 2025 20:49 PM
2
16
Newsread Image

No.1 Short News

Umar Fharooq
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం
73వ ఆర్టికల్ ద్వారా పంచాయితీలకు సర్వాధికారాలు వచ్చాయి దీంతో పంచాయితీలు ఎంతగానో అభివృద్ధి చెందాయి.అయితే ప్రకాశం జిల్లాలోని తాళ్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం పంచాయితీ రాజ్ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎంపీడీఓ దార హనుమంతరావు, డిప్యూటీ ఎంపీడీఓ సుందర రామయ్యల ఆధ్వర్యంలో జాతి పిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.
View More
Latest News
25 Apr 2025 20:44 PM
0
14
Newsread Image

No.1 Short News

Umar Fharooq
ఉత్తమ సర్పంచ్ గా పోశం సుమలత
ప్రకాశం జిల్లా,తాళ్లూరు మండలంలోని బెల్లంకొండ వారి పాలెం సర్పంచ్ పోశం సుమలత ఉత్తమ సర్పంచ్ గా ఎంపిక కాగా, జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవం సందర్భంగా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత చేతుల మీదుగా ఉత్తమ సర్పంచ్ అవార్డు తీసుకోవడం జరిగింది. గ్రామాభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతగానో కృషి చేసినందుకు గాను ఉత్తమ సర్పంచ్ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని పలువురు అభినందించడం జరిగింది.
View More
Latest News
25 Apr 2025 20:43 PM
0
14
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తూర్పు గంగవరం సర్పంచికి రూ.5,00,000 అందజేత
తూర్పు గంగవరం సర్పంచ్ నాగమణి భర్త సుధాకర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. టీడీపీ సభ్యత్వం కలిగిన సుధాకర్కు, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ రూ.5,00,000 చెక్ను శుక్రవారం సర్పంచ్ నాగమణికి అందించారు. అలాగే తన పిల్లలకి తోడుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోపిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి (చందన), ఉప సర్పంచ్ యత్తపు కాశిరెడ్డి పాల్గొన్నారు.
View More
Local Updates
25 Apr 2025 11:57 AM
1
18
Newsread Image

No.1 Short News

మీ వార్తల కోసం Call: 9948680044 - Reporter Sk.Asma
జన రంజక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం - డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
దొనకొండ మండలం, దొండపాడు గ్రామంలో శుక్రవారం జరిగిన శ్రీ పట్టాభి రామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం లో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. సందర్భంగా ప్రత్యేక పూజలు అందుకొని ఆమె మాట్లాడారు ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలతో జన రంజక ప్రభుత్వంగా ముందుకు వెళుతుందన్నారు.
View More
Latest News
25 Apr 2025 11:34 AM
0
16
Newsread Image

No.1 Short News

మీ వార్తల కోసం Call: 9948680044 - Reporter Sk.Asma
కురిచేడు: జెడ్పీ హైస్కూల్ లో సదుపాయాల కోసం ఎమ్మెల్యే ను కోరిన యువకులు
దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం లోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు క్రీడా మైదానం ను క్రీడలు ఆడుకునేందుకు అవకాశం కల్పించాలి అని బాలికల హాస్టల్ వేరే ప్లేస్ లో నిర్మించాలని యువకులు కోరగా అధికారులతో మాట్లాడతానని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగినది.
View More
Latest News
25 Apr 2025 11:03 AM
0
14
Newsread Image

No.1 Short News

Newsread
టీడీపీ కుటుంబానికి భరోసా - మృతి చెందిన కార్యకర్త కి నగదు సాయం
తాళ్లూరు మండలం, తూర్పు గంగవరం గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త చాట్ల సుధాకర్ ఇటీవల ఆక్సిడెంట్ కి గురి అయి మృతి చెందాగా... గతం లో సుధాకర్ టిడిపి సభ్యత్వం తీసుకున్నారు.... టిడిపి సభ్యత్వం ఉండుటచే... వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉండి... శుక్రవారం దర్శి లోని డా || లక్ష్మీ నివాసం వద్ద చాట్ల సుధాకర్ సతీమణి నాగమణి గారికి 5,00,000 రూపాయల చెక్కుని అందజేసిన దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు. వారితో పాటు తూర్పు గంగవరం గ్రామ టిడిపి నాయకులు ఉన్నారు.
View More
Latest News
25 Apr 2025 10:20 AM
1
15
Newsread Image

No.1 Short News

Newsread
రేపు కురిచేడు లో ప్రజా దర్బార్
తేదీ : 25-04-2025, అనగా రేపు ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 1.00 గం||ల వరకు కురిచేడు టౌన్ లో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ కార్యక్రమం జరుగును.కావున కురిచేడు మండలం లోని ప్రజలు సమస్యలు ఉన్నవారు అర్జీతో పాటు హక్కు పత్రాలను తీసుకొని స్వయం గా డా|| గొట్టిపాటి లక్ష్మీ మేడం కి అందజేసి తమ సమస్యలను పరిష్కరించుకోగలరు. ప్రతి ఒక్కరి వద్ద విజ్ఞాపన పత్రాలు స్వీకరించి సాధ్యమైనంత మేరకు తక్షణమే పరిష్కారాలు చూపిస్తారు. మిగిలిన వాటికి వినతుల ద్వారా వచ్చే సమస్యలు ఇక్కడి నుంచే విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి కృషి చేస్తారు.
View More
Latest News
24 Apr 2025 20:02 PM
0
17
Newsread Image

No.1 Short News

Newsread
ఉల్లగల్లు : దర్శి లో జరిగిన ముస్లింల శాంతి ర్యాలీలో పాల్గొన్న యువత
దర్శి లో జరిగిన ముస్లింల భారీ శాంతియుత నిరసన ర్యాలీకి ముండ్లమూరు మండలం ఉల్లగల్లు గ్రామం నుంచి ముస్లిం యువత కీలక పాత్ర పోషించడం జరిగింది. మండలం మొత్తం ర్యాలీ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విస్తృతస్థాయిలో ముస్లిం శ్రేణులు తరలివచ్చేందుకు కృషి చేశారు.
View More
Latest News
23 Apr 2025 23:22 PM
2
47
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తూర్పు గంగవరంలో ముస్లింల ప్రచారం
తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలోని మర్కస్ మసీద్ పరిధిలో ముస్లిం సోదరులు మంగళవారం ప్రచారం చేశారు. ముస్లిం సోదరులందరూ ఏకం కావాలని, వక్స్ చట్ట సవరణకు నిరసనగా దర్శిలో బుధవారం నిర్వహించే ర్యాలీలో ముస్లిం సోదరులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు ఫజల్, అబ్దుల్ కరీం, మదర్ వలి, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
View More
Local Updates
23 Apr 2025 23:21 PM
0
17
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తాళ్లూరు మండలంలో వైన్ షాపులు బంద్
తాళ్లూరు మండలంలో వైన్ షాపులు బుధవారం బంద్ నిర్వహించినట్లు వైన్స్ సిండికేట్ సభ్యులు తెలిపారు. సిండికేట్ సభ్యుల కథనం మేరకు.. ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆయన హత్యకు నిరసనగా మద్యం షాపులు బంద్ చేసినట్లు తెలిపారు. అలానే హంతకులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరారు.
View More
Local Updates
23 Apr 2025 23:20 PM
0
15
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
బొద్దికూరపాడు విద్యార్థికి 570 మార్కులు
తాళ్లూరు మండలం బొద్దికూరపాడు జిల్లా ఉన్నత పాఠశాల విద్యార్థి విష్ణువర్ధన్ రెడ్డి 10వ తరగతి ఫలితాల్లో సత్తా చాటాడు. 600కు గాను 570 మార్కులు సాధించి ప్రభుత్వ స్కూళ్ల మండల టాపర్గా నిలిచాడు. టీచర్లు అతడిని అభినందించారు.
View More
Local Updates
23 Apr 2025 23:20 PM
0
11
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
వీరయ్య చౌదరి ఒంటిపై 53 కత్తిపోట్లు: CM
వీరయ్య చౌదరి లాంటి నేతను కోల్పోవడం చాలా బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. అమ్మనబ్రోలులో ఆయన మాట్లాడుతూ.. 'నారా లోకేశ్, అమరావతి రైతుల పాదయాత్రలో వీరయ్య కీలకంగా ఉన్నారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నా. వీరయ్య ఒంటిపై 53 కత్తిపోట్లు ఉన్నాయి. ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టను. ఎక్కడ దాక్కున్నా లాక్కొని వస్తా' అని సీఎం హెచ్చరించారు.
View More
Local Updates
23 Apr 2025 23:20 PM
0
12
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తాళ్లూరు: 'నీటితొట్టెలను వేగంగా పూర్తి చేయాలి'
తాళ్లూరు మండలంలోని పలు గ్రామాల్లో నిర్మిస్తున్న నీటితొట్టెలను APD లలిత కుమారి పరిశీలించారు. 16 పంచాయతీల్లో 6 నీటితొట్టెలు పూర్తి చేయగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నట్లు తెలిపారు. వీటిని వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో FAS, TAS, BFT, ECలు పాల్గొన్నారు.
View More
Local Updates
23 Apr 2025 23:20 PM
0
11
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: ముస్లిం మహిళల్లో ఉప్పొంగిన సామాజిక చైతన్యం
దర్శి లో జరిగిన ముస్లింల భారీ శాంతియుత ర్యాలీలో తండోపతండాలుగా తరలివచ్చిన ముస్లిమ్ నారీమణులు. సహజంగా ఇళ్లలోనే పరిమితమై ఉండే ముస్లిం మహిళలు వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ భారీ నిరసనల్లో పాల్గొనడం, ముస్లిం మహిళల్లో సామాజిక చైతన్యం ఇప్పుడిప్పుడే మొదలైంది అన్న మాటలు వినిపిస్తున్నాయి.
View More
Latest News
23 Apr 2025 23:09 PM
2
16
Newsread Image

No.1 Short News

Newsread
తురకపాలెం: విద్యుత్ షాక్ తో గాయపడ్డ కార్యకర్తను పరామర్శించిన బూచేపల్లి
దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం తురకపాలెం గ్రామములో ఇటీవల విద్యుత్ షాక్ తో గాయపడ్డ పార్టీ కార్యకర్త యాతం సుబ్బారెడ్డి ని పరామర్శించి మనోధైర్యం కల్పించిన దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి.
View More
Latest News
23 Apr 2025 22:54 PM
1
18
Newsread Image

No.1 Short News

Newsread
ఒంగోలు: కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ
ఒంగోలు లో కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ లో దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
View More
Latest News
23 Apr 2025 22:44 PM
2
11
Newsread Image

No.1 Short News

Newsread
ఒక్క గంట లో తప్పిపోయిన ముగ్గురు పిల్లలను తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ప్రకాశం పోలీసులు
ఒంగోలు అన్నవరప్పాడు శ్రీ సూర్య విద్యానికేతన్ నందు 3వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఈ రోజు మధ్యాహ్నం స్కూల్ గేట్ నుండి వెళ్లిపోయి కనిపించలేదు. 1. షేక్ ఇస్మాయిల్ S/o అలీ ముర్తుజా, 09 సంవత్సరములు సంతపేట సాయిబాబా గుడి వద్ద, ఒంగోలు. 3rd Class. 2. కొంపల్లి సాల బిల్వనాధ్ S/o బుచ్చే శ్వరరావు, 10 సంవత్సరములు, 3rd Class, R/o ధారా వారి తోట ఒంగోలు. 3. అప్పాడిపాడు S/o నరసింహం, 09 సం, పల్లెపాలెం కొత్తపట్నం మండలం. 3rd Class. పోలీస్ లకు సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించిన పోలీసులు ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు గారి ఆదేశములతో ఒంగోలు టు టౌన్ ఇన్స్పెక్టర్ యం.శ్రీనివాసరావు మరియు వారి సిబ్బంది వెంటనే గాలింపు చర్యలు చేపట్టగా, గంట వ్యవధిలోపలే తప్పిపోయి పిల్లలు అగ్రహారం రైల్వే గేటు వద్ద వారిని కనుగొని, సూర్య స్కూల్ వద్దకు తీసుకుని వచ్చి టూ టౌన్ ఇన్స్పెక్టర్ స్కూలు ప్రిన్సిపాల్ సమక్షంలో వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించడమైనది. తప్పిపోయిన తమ పిల్లలను తిరిగి క్షేమంగా వారి వద్దకు చేర్చినందుకు పిల్లలు తల్లిదండ్రులు మరియు స్కూలు యాజమాన్యం ఒంగోలు టు టౌన్ పోలీస్ స్టేషన్ పోలీస్ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు. తప్పిపోయిన పిల్లలను కేవలం గంట వ్యవధిలోనే తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఒంగోలు టు టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులను మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.
View More
Latest News
23 Apr 2025 22:37 PM
1
18
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: ముస్లింల శాంతియుత ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్న బాలలు
ఈరోజు దర్శి లో జరిగిన ముస్లింల శాంతియుత ర్యాలీలో ఐదు మండలాల నుంచి భారీ సంఖ్యలో ముస్లిం లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐదు మండలాల నుంచి ఉత్సాహంగా బాలలు యువకులు మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్స్ సవరణ చట్టం పట్ల శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బాలల చిత్రమిది.
View More
Latest News
23 Apr 2025 22:28 PM
0
11
Newsread Image

No.1 Short News

Newsread
వక్ఫ్ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిన దర్శి.
ప్రకాశం జిల్లా దర్శిలో ముస్లింలు కొత్తగా అమల్లోకి వచ్చిన వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలంలోని ముస్లింలు ప్రవాహంగా మారి దర్శిని జనసముద్రంగా మార్చారు. వక్ఫ్ వ్యతిరేక నినాదాలతో దర్శి దద్దరిల్లింది. పార్టీలకు అతీతంగా వారి ఉనికి కోసం ముస్లింలు చేస్తున్న ఈ ర్యాలీ తో దర్శి గడియారం స్తంభం గడగడలాడిపోయింది. గంగవరం రోడ్డులోని మర్కస్ మస్జిద్ నుండి గడియార స్తంభం మీదుగా కురిచేడు రోడ్ లోని అక్సా మజీద్ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో ముస్లిం మహిళలు సోదరులు ప్లకార్డులతో నల్లజెండాలతో నల్ల రిబ్బన్లతో ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని దీనిని మేమంతా వ్యతిరేకిస్తున్నామని శాంతియుతంగా నిరసన తెలుపుతూ 150 అడుగుల జాతీయ జెండాతో భారతదేశం జిందాబాద్ భారతీయులంతా ఒక్కటే హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ భారతదేశంపై తమకున్న ప్రేమను జాతీయ జెండాలతో ప్రదర్శించి నిరూపించుకున్నారు. దేశవ్యాప్తంగా ముస్లింల ఆస్తులపై తీసుకువచ్చిన ఈ చట్టం ద్వారా తమ ధర్మ సంబంధమైన మస్జిదులు మదర్సాలు, తమ స్మశానాలు స్థలాలని కోల్పోయే ప్రమాదం ఉందని, రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను మతానికి సంబంధించిన ప్రాథమిక హక్కులను వ్యతిరేకించే ఈ చట్టం రద్దు చేసేంతవరకు దేశవ్యాప్తంగా శాంతియుత పోరాటాలు చేస్తూనే ఉంటామని నినాదాలు చేశారు.
View More
Local Updates
23 Apr 2025 21:18 PM
1
12
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
నివాళులు అర్పించిన బీర్కూర్ బీజేపీ సీనియర్ నాయకుడు బీరుగొండ
జమ్మూ కశ్మీర్‌లో జరిగిన భారీ ఉగ్రదాడి.. యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనలో ఉండగా.. అదే సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్‌లో బరితెగించి.. ఏకంగా పర్యటకులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం సంచలనంగా మారింది. జమ్ము కాశ్మీర్ పహాల్గంలో జరిగిన ఉగ్రదాడి బాధాకరం కాల్పుల్లో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మరణించిన వారి ఆత్మలకు శాంతిని చేకూరాలని ప్రార్థిద్దాం అని బీర్కూర్ బిజెపి నాయకుడు బీరుగొండ ఒక ప్రకటనద్వారా తెలిపారు
View More
Latest News
23 Apr 2025 17:57 PM
0
14
Newsread Image

No.1 Short News

Umar Fharooq
వక్ఫ్ సవరణ చట్టం వెంటనే రద్దు చేయాలి
వక్ఫ్ సవరణ చట్టంకు వ్యతిరేకంగా ఈరోజు దర్శి లో భారీ ర్యాలీ జరగగా ముస్లిం సోదరులు ,సోదరీమణులు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. సందర్భంగా తాళ్లూరు మండల ముస్లిం సోదరులు మాట్లాడుతూ ఇది ఒక ముస్లిం శాంతి ర్యాలీ మేము మా హక్కుల కోసం మా స్వేచ్ఛ కోసం పోరాడుతున్నాం కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని దిగి వచ్చేంతవరకు ఇలాగే పోరాడుతూ ఉంటామని అన్నారు.
View More
Latest News
23 Apr 2025 16:41 PM
3
13
Newsread Image

No.1 Short News

Umar Fharooq
ముస్లింల ర్యాలీతో దద్దరిల్లిన దర్శి
కేంద్ర ప్రభుత్వం చేసిన వక్ఫ్ సవరణ చట్టం వెంటనే రద్దు చేయాలని ఈరోజు దర్శి పట్టణంలో ముస్లింలు భారీ ర్యాలీని చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీ దర్శి లోని మర్కజ్ మసీదు నుండి అక్సా మస్జిద్ వరకు జరగగా, ముస్లిం సోదరులు,సోదరీమణులు,అందరూ కలిసి తహసిల్దార్ కార్యాలయమునకు చేరుకొని డిప్యూటీ తహసిల్దారు దేవదానం కు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముస్లిం సమాజం యొక్క హక్కులను స్వేచ్ఛలను హరించడం సరికాదని కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకునేంతవరకు ఇలానే పోరాడుతూ ఉంటామని తెలియజేశారు.
View More
Latest News
23 Apr 2025 15:51 PM
0
13
Newsread Image

No.1 Short News

Newsread
రేపు దర్శి లో ముస్లింల శాంతియుత ర్యాలీ
కొత్తగా చట్టం చేయబడిన వక్ఫ్ చట్టం ముస్లిం ల ధార్మిక ఆస్తులకు నష్టం కలిగించేలా ఉందనీ, ఎన్నో ఏళ్లుగా దైవ కార్యక్రమాలకు వక్ష చేయబడినటువంటి ఆస్తులు ఈ చట్టం మూలంగా ముస్లింలు కోల్పోయే అవకాశం ఉందని ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకునే ప్రయత్నం చేయాలని దర్శి లోని ముస్లిం సోదరులు రేపు ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీ చేపట్టనున్నారు. ఇరాలి అద్దంకి రోడ్డుకి మర్కస్మాజిక నుండి గడియార స్తంభం మీదుగా కురిచేడు రోడ్డునని వరకు జరగబోతోంది. ఈ ర్యాలీలో నియోజకవర్గంలోని ఐదు మండలాల ముస్లిం సోదరులు పాల్గొనబోతున్నారు.
View More
Latest News
22 Apr 2025 20:47 PM
1
18
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
రెడ్ కలర్ బైక్ ను దొంగతనం చేశారు..
హయి ఫ్రెండ్స్... నా పేరు ఉదయ్ కుమార్... వీడియోగ్రాఫర్ 2... 16 ໖໖ 2025 ໖ 09:45 10:45 సమయం లో ఒంగోలు లోని కర్నూల్ రోడ్డు నందు గల కూరపాటి కాంప్లెక్స్ ముందు పార్క్ చేసిన నా బైక్ AP 39SC 4664 నెంబర్ గల పాల్సార్ 125cc రెడ్ కలర్ బైక్ ను దొంగతనం చేశారు... రెడ్ అండ్ బ్లాక్ కలర్ సిట్... హెడ్ లైట్ మీద UKCaptures అని మరియు లోగో.... బ్యాక్ సిట్ సైడ్ డోము ల మీద UKCaptures అని స్టిక్కర్లు వుంటాయి ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ ఎవరైనా చూస్తే దయచేసి నాకూ తెలియ చేయమని కోరుతున్నారు మీ ఉదయ్ కుమార్ 9652020050 ఒంగోలు
View More
Local Updates
22 Apr 2025 20:29 PM
0
14
Newsread Image

No.1 Short News

Rasul.Sk
తప్పిన పెను ప్రమాదం
ముండ్లమూరు మండల పరిషత్ భవన కార్యాలయ సముదాయంలో సోమవారం పెను ప్రమాదం తప్పింది. 108 సిబ్బంది ఉండే భవనంలో విత్ షార్ట్ సర్క్యూట్ వలన మంటలు చెల రేగాయి. వెంటనే మంటలను ఆర్పారు. స్టాటర్ బాక్స్ పూర్తిగా కాలిపోయింది. సకాలంలో స్పందించి మంటలను ఆర్పేయడం వల్ల పెను ప్రమాదం తప్పిందని ప్రజలు పేర్కొన్నారు.
View More
Latest News
22 Apr 2025 12:43 PM
0
18
Newsread Image

No.1 Short News

Rasul.Sk
ప్రమాదకరంగా విద్యుత్ లైన్
మండల కేంద్రమైన ముండ్లమూరు విద్యుత్తులైన్ ప్రమాదకరంగా ఉంది. రెడ్డి బజారున రాగి పిండి నాగేశ్వర్రెడ్డి ఇంటి సమీపంలో విద్యుత్ తీగలు వేలబడి ఉన్నాయి. చేతికందే ఎత్తులో విద్యుత్ వైర్ లు వేలబడి ఉన్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ప్రజలు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
View More
Latest News
22 Apr 2025 12:43 PM
0
14
Newsread Image

No.1 Short News

Rasul.Sk
ముండ్లమూరు ఏపీఓగా వెంకట్రావు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ అభివృద్ధి పథకం ఏపీవోగా వెంకట్రావు సోమవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. వెంకట్రావు పొదిలి నుండి ముండ్లమూరు బదిలి అయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న నాగరాజు మార్కాపురం కు బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏపీఓను ఫీల్డ్ అసిస్టెంట్ కార్యాలయం సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు.
View More
Latest News
22 Apr 2025 12:43 PM
0
14
Newsread Image

No.1 Short News

Umar Fharooq
ముస్లిం సమాజం మేలుకోవాలి
23 -4 -2025 -అనగా రేపు బుధవారం దర్శి లో ఉదయం 10 గంటలకు వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయడం కోసం మర్కజ్ మసీదు నుండి అక్సా మసీదు వరకు దర్శి నియోజకవర్గ ముస్లింల శాంతి ర్యాలీ జరుగును. ముస్లిం అనే ప్రతి వ్యక్తి ఈ ర్యాలీలో పాల్గొనవలసిందిగా ముస్లిం పెద్దలు పిలుపునిచ్చారు. వక్ఫ్ చట్టం రద్దు కావడం అనేది మన అందరి సమస్య,ఇది మన కుటుంబ సమస్య, కావున మనమందరం కలిసి ఐక్యతతో మన యొక్క మనుగడను మనమే చాటి చెప్పుదాం. ఇది న్యాయం కోసం పోరాటం కాదు మన హక్కుల కోసం పోరాటం. కావున ముస్లిం సమాజం మేలుకోవాలని తప్పనిసరిగా రేపు ముస్లింలు అందరూ ర్యాలీకి రావాలని పెద్దలు కోరడం జరిగింది.
View More
Latest News
22 Apr 2025 12:42 PM
0
12
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: గడియార స్తంభం తొలగించవద్దని కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన బూచేపల్లి
దర్శి పట్టణంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 2001 వ సంవత్సరం లో గడియార స్తంభం ఏర్పాటు చేయడం జరిగినది.ఈ గడియార స్తంభం అప్పటి పంచాయతీ పర్మిషన్ మరియు R&B అధికారుల పర్మిషన్ తో నిర్మించి దర్శి కి ఒక గుర్తింపు చిహ్నం గా నిలిచినది.ఈ గడియార స్తంభం ను తొలగించాలి అని ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలుసుకొని ఈరోజు ఒంగోలు లో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియ గారిని కలిసి దర్శి పట్టణానికి 23 సంవత్సరాల నుండి చిహ్నం గా ఉన్న గడియార స్తంభం ను తొలగించవద్దని దర్శి MLA డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఈరోజు వినతి పత్రం అందజేయడం జరిగినది.
View More
Latest News
21 Apr 2025 21:56 PM
0
17
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
అమెరికాలో కుంద్రురు యువకుడు మృతి
ఉమ్మడి ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలోని కుందుర్రుకి చెందిన బోడేపూడి రాజబాబు కుమారుడు అవినాశ్ అమెరికాలో మృతి చెందాడు. ఏప్రిల్ 13న అమెరికాలో బ్రెయిన్ స్ట్రోక్తో అవినాశ్ మరణించాడు. ప్రస్తుతం వారి కుటుంబం గుంటూరులో ఉంటుండగా.. శనివారం మృతదేహాన్ని అమెరికా నుంచి తీసుకువచ్చి గుంటూరులోనే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కాగా అవినాశ్కు నెల క్రితమే వివాహమైంది.
View More
Local Updates
21 Apr 2025 17:02 PM
0
16
Newsread Image

No.1 Short News

Newsread
మార్కాపురం: చెన్నకేశవ స్వామి తిరునాళ్ల లో బూచేపల్లి
మార్కాపురం లో చెన్నకేశవ స్వామి తిరునాళ్ళ సందర్భముగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రభ పై ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి,జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ,మాజీ శాసనసభ్యులు మార్కాపురం ఇంచార్జ్ అన్నా రాంబాబు.
View More
Latest News
21 Apr 2025 00:43 AM
0
16
Newsread image

No.1 Short News

గంగాధర్,అదిలాబాద్ జిల్లా
ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద ఘన నివాళులు అర్పించిన మంత్రి సీతక్క
ఆదిలాబాద్ జిల్లా :ఇంద్రవెళ్లి అమరవీరులకు జోహార్ అంటూ నినాదాలు చేసిన మంత్రులు ఎమ్ ఎల్ ఎలు,మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇక్కడి మట్టికి గొప్పదనం ఉంది, ఇక్కడి గాలిలో పౌరుషం ఉంది. తినే తిండిలో, వేసే అడుగులో పోరాట పటిమ ఉంది అని మంత్రి సీతక్క తెలిపారు,ఎమ్మెల్సీ దండే విఠల్ ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు, జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క,ఎమ్మెల్సీ దండే విఠల్,ఎమ్మెల్యే వేడ్మా బొజ్జు పటేల్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు,ఎంపీ నగేశ్, గిరిజన శాఖ చైర్మెన్ కోట్నాక్ తిరుపతి, మాజీ ఎంపీ సోయం బాపు ,మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు,ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ,2021 ఆగస్టు 8న ఇంద్రవెల్లి అమరవీరుల పోరాట స్ఫూర్తితో ‘దళిత గిరిజన దండోరా’ సభతో కేసీఆర్ గారి మీద నాటి పీసీసీ నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమరశంఖం పూరించి ఇందిరమ్మ రాజ్య స్థాపనకు బయలుదేరారు,ఇంద్రవెల్లి అమరవీరుల పోరాట స్ఫూర్తితో అసెంబ్లీ ఎన్నికల ముందు సమరశంఖం పూరించిన రేవంత్ రెడ్డి, అభివృద్ధిలో అట్టడుగునున్న ఆదిలాబాద్ జిల్లాను అగ్రభాగాన నిలుపడానికి ఇక్కడి నుంచే అభివృద్ధి శంఖారావం పూరించడం మనకు ఎంతో గర్వకారణం. జిల్లాలోని ఆదివాసీ గూడేల్లోని పేదలకు కూడు, గూడు కల్పించే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది.కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదల పక్షానే నిలుస్తుంది,అమరవీరుల స్తూపంతో పాటు నాగోబా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి మాటిచ్చారు.నేడు ఆ మాటను నిలబెట్టుకున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తోంది,అమరవీరుల స్మృతి వనం ఏర్పాటుకు చర్యలు చేపట్టడం చారిత్రాత్మకమం,అమరవీరుల స్థూపాన్ని స్మృతి వనంగా తీర్చిదిద్దేందుకు రూ. 97.లక్షలు కేటాయించిన గౌరవ ముఖ్య మంత్రి గారికి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క గారికి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
View More
Politics
21 Apr 2025 00:36 AM
0
15
Newsread Image

No.1 Short News

DR Local News - Chirala
మే 4 వా తేదీన ఉచిత నాయి బ్రాహ్మణ వివాహ వేదిక
నాయి బ్రాహ్మణ వివాహ వేదికను వినియోగించుకోండి ఒంగోలులో పద్మావతి ఫంక్షన్ హాల్ లో మే 4వ తారీకు ఆదివారం జరుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ ఉద్యోగుల ,సాంస్కృతిక ,సంక్షేమ సంఘం ఒంగోలు వారిచే 5 ఉచిత వివాహ పరిచయ వేదికను వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన డాక్టర్ హైమ సుబ్బారావు మరియు డాక్టర్ తాడివలస దేవరాజు. చీరాల హైమ హాస్పిటల్ ఆవరణలో ఉచిత వివాహ వేదిక కరపత్రాన్ని ప్రారంభించిన డాక్టర్ హైమ సుబ్బారావు మరియు డాక్టర్ తాడివలస దేవరాజు ఈ సందర్భంగా డాక్టర్ సుబ్బారావు డాక్టర్ దేవరాజు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా మూడు వేల మందికి పైగా ఉచితంగా వివాహ వేదిక ద్వారా వివాహాలు చేసినటువంటి వివాహ పరిచయ వేదిక నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ వధూవరుల కోసం ఎదురుచూస్తున్నటువంటి తల్లిదండ్రులు మరియు వాళ్ళ పిల్లలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కన్వీనర్ నాదెండ్ల రాఘవ మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాల నుండి గత ఐదు సంవత్సరాలుగా ఎంతోమంది ఈ వివాహ వేదిక కార్యక్రమంలో పాల్గొంటున్నారని , నాయి బ్రాహ్మణ తల్లిదండ్రులకు వధూవరుల పరిచయం మాది, నిర్ణయం మీది అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉచిత వివాహ వేదిక కన్వీనర్ నాదెండ్ల రాఘవ, పోతకమూరి మధుబాబు, మార్కాపూరాం వెంకట రామారావు పాల్గొన్నారు.
View More
Local Updates
20 Apr 2025 17:14 PM
2
20
Refresh Page
You are offline
Please check your internet connection.
Close

Find News

News Categories

  • All Categories
  • Jobs
  • Latest News
  • Motivation
  • Crime News
  • Local Ads
  • Entertainment
  • Local Updates
  • Sports News
  • Education
  • Business Promotions
  • Politics
  • Breaking News
  • Install App
    ALL
    | newsread.in

    Install App

    Install App
    Cancel