Wednesday, March 27, 2024

చిత్తూరు లో ఘనంగా గంగమ్మ జాతర వేడుకలు: చిత్తూరు నగరం మొత్తం జాతర బ్యానర్లే.

న్యూస్ రీడ్ (ఆంధ్రప్రదేశ్ ) : గతం కంటే ఈ ఏడాది చిత్తూరు లో ఎంతో ఘనంగా గంగమ్మ జాతర వేడుకలు చేపట్టారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న చిత్తూరు లో ఎన్నో సంవత్సరాలుగా గంగమ్మ జాతర వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న వేడుకల్లో బజారు వీధిలో, కొంగారెడ్డిపల్లి, గిరింపేట, సంతపేట ల్లో గంగమ్మ లను ప్రతిష్టించారు. జాతర ను పురస్కరించుకుని చిత్తూరు నగరం మొత్తం జాతర బ్యానర్లు దర్శనమిచ్చాయి. పలు ప్రాంతాల్లో భక్తులకు వివిధ రూపాల్లో గంగమ్మ దర్శనమిచ్చారు. ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్ లో వేచి ఉన్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు అంబళ్ళు పోసి మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరు నడివీధి గంగమ్మ జాతరను మాజీ ఎమ్మెల్యే,ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే సికే బాబు దంపతులు తొలి పూజను అమ్మవారికి అందజేసి జాతరను ప్రారంభించారు. చిత్తూరు గిరింపేటలో గంగ జాతరకు తొలి పూజను అందజేసి జాతరను ప్రారంభించిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నగర మేయర్ ఆముద, ఉప మేయర్ జాతర కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ లు పాల్గొన్నారు. కొంగారెడ్డి పల్లి గంగమ్మ జాతరను ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి తొలి పూజను అమ్మవారికి అందజేసి జాతారని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గంగమ్మ జాతర చైర్మన్ ఉపమేయర్ రాజేష్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. సంతపేటలో గంగమ్మ జాతరను చైర్మన్ వైఎస్ఆర్సిపి నాయకులు గోపీనాథ్ భూపేష్ కుటుంబ సభ్యులు అమ్మవారికి తొలి పూజలు అందజేసి జాతరను ప్రారంభించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular