న్యూస్ రీడ్ (తిరుపతి) : పరిపాలనా సౌలభ్యం కోసం తిరుపతి కలెక్టరేట్ కార్యాలయంలో నూతనంగా యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ను ఏర్పాటు చేయనున్నారు. నూతనంగా ఏర్పాటు చేయనున్న బ్యాంక్ సేవలు ఈనెల 19 నుంచి అందుబాటులోకి రానున్నాయని అధికారులు వెల్లడించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి బ్రాంచి శ్రీ పద్మావతి నిలయం కలెక్టరేట్ నందు ఈ నెల 19 న ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న సత్యనారాయణ స్వామి పూజా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి, జెసి డి కే బాలాజీ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సుభాష్ తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస రావు, యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ అధికారి రాంప్రసాద్, శ్రీనివాస్ డిప్యూటీ రీజనల్ హెడ్, నగేష్ కుమార్ చీఫ్ మేనేజర్, మణి ప్రశాంత్ మేనేజర్, కార్తిక్ కుమార్ రావు బ్రాంచ్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి కలెక్టరేట్ లో యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ : పూజా కార్యక్రమాలు నిర్వహించిన జిల్లా అధికారులు.
RELATED ARTICLES