న్యూస్ రీడ్ (తిరుపతి): ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండేలా చూడు గంగమ్మ తల్లి అంటూ రాష్ట్ర ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలు ఆకాంక్షించారు. తిరుపతి గంగ జాతర సందర్భంగా సోమవారం ఉదయం గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తన తండ్రి, రాష్ట్ర ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆయన తల్లి లక్ష్మితో పాటు కుటుంబ సభ్యులతో కలిసి చంద్రగిరి నియోజకవర్గ తరఫున చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మేళతాళాల మధ్య ఊరేగింపుగా విచ్చేసి పట్టు వస్త్రాలను అందజేయడం జరిగింది. గంగమ్మ ఆలయం వద్ద తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో చెవిరెడ్డి కుటుంబ సభ్యులకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేయించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి లు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.జాతర సందర్భంగా గంగమ్మ తల్లిని కుటుంబ సమేతంగా
దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి అమ్మవారికి సారె సమర్పించే సంప్రదాయాన్ని మా ప్రియతమ గురువర్యులు కరుణాకరన్న తీసుకొచ్చారు….
ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గం నుంచి మేమూ భాగస్వామ్యం వహించడం, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది.ఆలయానికి ఉన్న శతాబ్ధాల చరిత్ర, ప్రాశస్థ్యం గురించి వెలికితీసి, ఆలయాన్ని రాష్ట్రంలో ప్రముఖ దేవాలయంగా తీర్చిదిద్దాడానికి కరుణాకరన్న చేస్తున్న కృషి అభినందనీయం.ఆలయ పునర్నిర్మాణం నుంచి జాతర నిర్వహణ వరకు కరుణాకరన్న ఎంతో కృషి చేశారు. ఒకప్పుడు పరిమిత ప్రాంతంలో జరిగే జాతర వేడుక , ఇప్పుడు అంతటా విస్తరించేలా చేశారు. రాష్ట్ర ప్రజలకు కూడా ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చారు..చంద్రగిరి నియోజకవర్గం తరఫున గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించడం, అమ్మ వారిని దర్శించు కోవడం సంతోషంగా వుందన్నారు. అమ్మ వారి ఆశీస్సులు అందరికీ వుండాలని, ప్రజలందరూ బాగుండాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు.
ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూడు తల్లీ : రాష్ట్ర ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.
RELATED ARTICLES