Friday, March 29, 2024

4 రోజులుగా అనుమానంగా బైక్.. అటవీప్రాంతంలోకి వెళ్లి చూస్తే, తీవ్ర విషాదం

న్యూస్ రీడ్ (మదనపల్లి): మదనపల్లె సమీపంలో ప్రేమ జంట ప్రాణాలు తీసుకుంది. ఒకే చున్నీకి ఉరి వేసుకున్నారు.. నాలుగు రోజుల క్రితం వీరు ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. కొద్దిరోజులుగా ఆ సమీపంలో పల్సర్ బైక్ ఉందని స్థానికులు చెబుతున్నారు. బైక్ వివరాల ఆధారంగా చనిపోయిన వారి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. ఈ బైక్ అనంతపురం జిల్లాకు చెందినదిగా చెబుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ప్రేమ జంట ఆత్మహత్య….
అన్నమయ్య జిల్లా, మదనపల్లి. ప్రేమ జంట ఆత్మహత్య లో కీలక మలుపు చోటుచేసుకుంది.
తమ పెళ్ళికి పెద్దలు అంగీకరించలేదని వినీషా 20, వెంకట్ నాయుడు 24 సంవత్సరాలు సంవత్సరాలు అటవీ ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.మదనపల్లెలోని అటవీ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నారు. మృతి చెందిన ప్రేమజంట అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలాన్ని తాలూకా సిఐ సత్యనారాయణ పరిశీలిస్తున్నారు.దాదాపు 15 రోజుల క్రితం ఉరి వేసుకుంటారని పోలీసులు అంచనా వేశారు. మృతదేహాలు కుళ్ళిపోవడంతో సంఘటన స్థలంలోని పంచనామ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular