Select Location
Newsread Image

No.1 Short News

Newsread
ఉప్పాల హారికను ఫోన్ లో పరామర్శించిన వైఎస్ జగన్
బీసీ మహిళపై జరిగిన పాశవిక దాడిని ఆయన ఖండించిన జగన్ ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. గుడివాడలో టీడీపీ, జనసేన గూండాలు దాడి చేసిన విషయాన్ని..పార్టీ నాయకులు తన దృష్టికి తెచ్చారనీ బీసీ మహిళ, జిల్లా ప్రథమ పౌరురాలు భయంతో వణికిపోయే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయంటే ఇంతకంటే దారుణం ఉంటుందా? ఏపీలో ప్రజాస్వామ్య హననం జరుగుతోంది రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని ఆయన తెలిపారు.
View More
Latest News
12 Jul 2025 23:39 PM
0
51
Newsread Image

No.1 Short News

Newsread
విభజన హామీల అమలు కోసం జులై 18 న చలో ఢిల్లీ పిలుపు.
కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయడంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ DYFI ఆధ్వర్యంలో ఈనెల 18న ఛలో డిల్లీ నిర్వహించడం జరుగుతుందని నిరుద్యోగ యువత పాల్గొని జయప్రదం చేయాలని DYFI జిల్లా అధ్యక్షులు కే వి పిచ్చయ్య తెలిపారు. శనివారం నాడు దర్శి లో స్థానిక సుందరయ్య భవన్ నందు ఛలో డిల్లీ పోస్టర్లు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కే వి పిచ్చయ్య మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు విభజన హామీలు అనేకం ఇచ్చారని కానీ నేటికి అవి అమలు దిశ కు చర్యలు చేపట్టడం లేదన్నారు. ముఖ్యంగా విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు అది ముగిసిన అధ్యాయమని అంటున్నారు. తిరుపతిలో జరిగిన సభలో తిరుమల వెంకన్న సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐదు సంవత్సరాల హోదా ఇస్తామని ఇప్పటికే ఏం లేదన్నారు.హోదా ఇవ్వకపోవడానికి కేంద్రానికి ఉన్న అడ్డంకులు ఏమిటని ప్రశ్నించారు. దొనకొండలో పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని. పరిశ్రమలు వస్తె వలసలు కరువు తీరుతుందని అన్నారు. 32 మంది ప్రాణ బలిదానం తో ఏర్పరుచుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగుగులు వేస్తుందని అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కేంద్రం భాగస్వామ్యంలో కీలక భూమిక పోషిస్తున్న తరుణం లో ఇదే సరైన సమయం అని కేంద్రం పై ఒత్తిడి తెచ్చి విభజన హామీలు అమలుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నాం అన్నారు. ఏపీ అంటే అమరావతి,పోలవరమే కాదని విభజన హామీలు కూడా ఉన్నాయని, వెనుకబడిన ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం ముఖ్యమే అన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగి యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు.18న డిల్లీ లో జంతర్ మంతర్ వద్ద జరిగే మహా ధర్నా లో యువత పాల్గొని జయప్రదం పిలుపునిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు ఆర్ జె సి పాల్.మండల నాయకులు షేక్ పీరా సాహెబ్. కళ్యాణ్.షేక్ సుభాని. తదితరులు పాల్గొన్నారు
View More
Latest News
12 Jul 2025 21:51 PM
0
36
Newsread Image

No.1 Short News

Newsread
తమిళనాడు ముఖ్యమంత్రి, స్టాలిన్.. ఉపాధ్యాయులకు గట్టి సందేశం ఇచ్చాడు. సైన్సు మాత్రమే ప్రచారంలో ఉండాలి.. మూఢనమ్మకాలు కాదు! పాఠశాలల బోధనలో కచ్చితంగా సైన్స్ విధివిధానాలను పాటించాలని, మూఢనమ్మకాలు అంధ విశ్వాసాలకు సంబంధించిన విషయాలను పిల్లలకు బోధించకూడదు అని గట్టిగా ఆదేశాలు ఇచ్చాడు. పాఠాలలో ఎక్కడైనా మూఢత్వపు విషయాలు ఉంటే తమిళనాడు పాఠశాల బోర్డు కు తెలియజేయాలి అని ఆదేశాలు ఇచ్చాడు! విజ్ఞాన పథంలో దేశాన్ని ముందుకు నడిపిస్తున్న తమిళనాడు !
సైన్సు మాత్రమే ప్రచారంలో ఉండాలి.. మూఢనమ్మకాలు కాదు! పాఠశాలల బోధనలో కచ్చితంగా సైన్స్ విధివిధానాలను పాటించాలని, మూఢనమ్మకాలు అంధ విశ్వాసాలకు సంబంధించిన విషయాలను పిల్లలకు బోధించకూడదు అని గట్టిగా ఆదేశాలు ఇచ్చారు. పాఠాలలో ఎక్కడైనా మూఢత్వపు విషయాలు ఉంటే తమిళనాడు పాఠశాల బోర్డు కు తెలియజేయాలి అని ఆదేశాలు జారీ చేశారు! విజ్ఞాన పథంలో దేశాన్ని ముందుకు నడిపిస్తున్న తమిళనాడు !
View More
Latest News
12 Jul 2025 16:20 PM
0
72
Newsread Image

No.1 Short News

Newsread
శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా తగ్గిన వరద
శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా తగ్గిన వరద..మూడు గేట్లు మూసివేత,ఒక గేటు ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల..ఇన్ ఫ్లో 1,37,635 క్యూసెక్కులు.ఔట్ ఫ్లో 94,497 క్యూసెక్కులు..పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు..ప్రస్తుత నీటిమట్టం 882.70 అడుగులు..కుడి,ఎడమ జల విద్యుత్‌ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
View More
Latest News
12 Jul 2025 16:14 PM
0
70
Newsread Image

No.1 Short News

Newsread
మాడపాకుల నారాయణమ్మ కి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేతలు
ఈరోజు (12 జూలై 2025) దర్శి పట్టణానికి చెందిన మాడపాకుల నారాయణమ్మ మార్కెట్ యాడ్ చైర్మన్‌గా పేరు నమోదు అయిన సందర్భంగా, వారి నివాసంలో ఘనంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ సెగ్గం శ్రీనివాసులు నారాయణమ్మ ని సన్మానించి, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ — ఈ పదవిని అందుకోవడంలో సహకారం అందించిన రాష్ట్ర కూటమి నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, 20 సూత్రాల చైర్మన్ లంక దినకర్ గారు, సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, టీడీపీ ఇన్‌చార్జ్ గొట్టిపాటి లక్ష్మీ లలిత్ సాగర్, మాజీ ఎమ్మెల్యే నారపు శెట్టి పాపారావు, చైర్మన్ పిచ్చయ్య కి మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియ చేశారు. ఈ అవకాశాన్ని కూటమి తరపున గౌరవంగా స్వీకరించి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో మాడపాకుల శ్రీనివాసులు (అసెంబ్లీ కన్వీనర్), జిల్లా ప్రధాన కార్యదర్శి కూకట్ల నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు తిండి నారాయణరెడ్డి, మండల అధ్యక్షులు మరియు బీజేపీ పార్టీ కార్యకర్తలు పాల్గొని నారాయణమ్మ కి శుభాకాంక్షలు తెలియజేశారు.
View More
Latest News
12 Jul 2025 15:43 PM
1
49
Newsread Image

No.1 Short News

Newsread
శ్రీకాళహస్తి ఇన్చార్జి వినుతకోట జనసేన పార్టీ నుంచి బహిష్కరణ
శ్రీకాళహస్తి ఇంచార్జ్ వినుత కోటను జనసేన పార్టీ నుంచి బహిష్కరణ! ఆమె వ్యవహార శైలి పార్టీ విధానాలకు భిన్నంగా ఉండటం, చెన్నైలో హత్య కేసు నమోదుతో పార్టీ కార్యక్రమాలకు దూరం చేసి, బహిష్కరించారు.
View More
Latest News
12 Jul 2025 15:17 PM
0
72
Newsread Image

No.1 Short News

Newsread
హైవేపై భారీ దోపిడీ.. రూ.10 లక్షల విలువైన సెల్‌ఫోన్లు చోరీ
తెలంగాణ : నిజామాబాద్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. విశ్రాంతి కోసం జాతీయ రహదారి పక్కన ఆపిన లారీలో నుంచి సెల్ ఫోన్ డబ్బాలను దొంగలు ఎత్తుకెళ్లారు. లారీ డ్రైవర్ ఫిర్యాదుతో నిజామాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి గురైన సెల్ ఫోన్ల విలువ మార్కెట్లో సుమారు రూ.10 లక్షలకు పైగా ఉంటుందని డ్రైవర్ పోలీసులకు తెలియజేశాడు.
View More
Breaking News
12 Jul 2025 15:09 PM
0
53
Newsread Image

No.1 Short News

Newsread
శ్రీకాళహస్తి జనసేన ఇంఛార్జ్ కోటా వినుత దంపతులు అరెస్ట్
- డ్రైవర్ శ్రీనివాసులు హత్య కేసులో వినుత దంపతుల అరెస్ట్ - చెన్నైలోని కూవం నదిలో శ్రీనివాసులు మృతదేహం లభ్యం - హత్య కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు - అరెస్ట్ అయిన వారిలో జనసేన నేత కోటా వినుత దంపతులు.
View More
Crime News
12 Jul 2025 15:05 PM
0
72
Newsread Image

No.1 Short News

Newsread
సెల్ఫీ పేరుతో భర్తను నదిలోకి తోసేసిన భార్య
సెల్ఫీ దిగుదామని నమ్మించి భర్తను భార్య నదిలోకి తోసేసిన ఘటన కర్ణాటక - తెలంగాణ సరిహద్దులో చోటు చేసుకుంది . కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాకు చెందిన తాతప్పను అతనీ భార్య కృష్ణానది వంతెన దగ్గరకు తీసుకెళ్లింది. సెల్ఫీ దిగుతామని చెప్పి ఒక్కసారిగా నదిలోకి తోసేసింది. ఆమె భర్త కొంతదూరం కొట్టుకుపోయి బండరాళ్ల దగ్గర ఆగాడు. అక్కడ ఉన్న స్థానికులు గమనించి తాడుతో బయటకు అతడిని బయటకి లాగారు. అయితే భర్తే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని భార్య చెప్పడం గమనార్ధం.
View More
Latest News
12 Jul 2025 14:46 PM
0
79
Newsread Image

No.1 Short News

Newsread
ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ నందు ఉచిత శిక్షణ :-
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంత యువకులకు ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ నందు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లుగా రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 22వ తేదీ నుండి ఆగస్టు 20వ తేదీ వరకు 30 రోజులు ఒంగోలులో శిక్షణ ఇస్తామన్నారు. 18 ఏళ్ల నుండి 45 ఏళ్ల లోపు యువకులు తమ వివరాలతో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి, సదుపాయాలు ఉంటాయని, ఆసక్తి గలవారు ఈ క్రింది ఫోన్ నెంబర్ ను సంప్రదించవలెను 9573363141 అని తెలిపారు.
View More
Education
12 Jul 2025 11:04 AM
0
44
Newsread Image

No.1 Short News

Newsread
చామంతి పూడి లో చంద్రన్న పచ్చదనం కార్యక్రమం
చంద్రన్న పచ్చదనం కార్యక్రమం, దర్శి మండలం చామంత పూడి లో గ్రామంలో ఒంగోలు mp మాగుంట శ్రీనివాసరెడ్డి, గొట్టిపాటి లక్ష్మి, కడియాల లలిత్ సాగర్, పాఠశాల విద్యార్థులు గ్రామస్తులకు, పరిటాల సురేష్ అద్యక్షతన మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నారపుశెట్టి పాపారావు, శోభారాణి, గ్రామస్తులు జంపాల నాగేశ్వర రావు, సుబ్బయ్య, కృష్ణయ్య, పోకిరి అచేయ్య, బెంజిమన్,గ్రామస్తులు పాల్గొన్నారు.
View More
Latest News
12 Jul 2025 08:59 AM
0
68
Newsread Image

No.1 Short News

Newsread
అమరావతి: మాజీమంత్రి పేర్నినాని వివాదాస్పద వ్యాఖ్యలు
లోకేష్ చెప్పే రెడ్‍బుక్.. రేపు వారికే ఉరితాడు అవుతుంది.. పామర్రులో జరిగిన నిన్నటి కార్యకర్తల భేటీలో పేర్నినాని వ్యాఖ్యలు. చెప్పికాదు.. చెప్పకుండా నరికేయాలి.. చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి.. అది తెలుసుకోండి. అంతా అయిపోయాక ఉదయం మనం కూడా పరామర్శలకు వెళ్లాలి.. ఇప్పుడు అరవడం కాదు.. తప్పు చేసినవాడు ఎవరైనా ఉంటే మన ప్రభుత్వం వచ్చాక వేసేయండి. జగన్ సరదగా రప్పా.. రప్పా అన్నారు.. మీరు దాన్ని పట్టుకుని రోజూ ఎందుకు మాట్లాడుతారు? మనం రోజూ రప్పా రప్పా అంటే జనంలో చులక అయిపోతాం. మొరిగే కుక్క కరవదు.. కరిచే కుక్క అరవదు అని తెలుసుకోండి.
View More
Latest News
12 Jul 2025 08:54 AM
0
67
Newsread Image

No.1 Short News

Newsread
ఐపీఎస్ సిద్ధార్థ కౌశల్ రాజీనామాకు కేంద్రం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ : సీనియర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ రాజీనామాను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆమోదించింది. 2012 బ్యాచ్‌కు చెందిన కౌశల్ రెండు రాష్ట్రాల్లో సేవలందించారు. ఇటీవలే వ్యక్తిగత కారణాలతో స్వచ్ఛంద పదవీ విరమణకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు కేంద్రం ఆయన రాజీనామాను అధికారికంగా ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయ‌న తీసుకున్న ఈ నిర్ణయం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
View More
Latest News
12 Jul 2025 08:42 AM
0
62
Newsread Image

No.1 Short News

Vijaya Chandra
బి మఠం పీఎసి చైర్మన్ గా సాంబశివారెడ్డి
కడప జిల్లా బ్రహ్మం గారి మఠం సోమిరెడ్డి పల్లె పిఎసిఎస్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంచైర్మన్ గా ఎల్లటూరు సాంబశివరెడ్డి నియామకం
Latest News
11 Jul 2025 16:25 PM
2
82
Newsread Image

No.1 Short News

Vijaya Chandra
సుపరిపాలనలో తొలి అడుగు ఈ కార్యక్రమంలో కానాల మల్లికార్జున రెడ్డి
సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శాసన సభ్యులు గౌ *శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్* గారి ఆదేశాలతో ఈరోజు బి మఠం మండలం రేకలకుంట పంచాయతీలోని బూతు నెంబర్ 231 డి అగ్రహారం గ్రామంలో పర్యటించి ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరిస్తున్న టిడిపి మండల యువ నాయకుడు కానాల మల్లికార్జునరెడ్డి. ఈ కార్యక్రమంలో బూతు ఇంచార్జ్ రామచంద్ర ఇల్లూరి లక్ష్మీ రెడ్డి వీరమోహన్ రెడ్డి డీలర్ దశరధ పుటాల శివ యాదవ్ పెరుగు నాగేంద్ర నాగి పోగు మధు రాజారత్నం మరియు టిడిపి కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.
View More
Politics
11 Jul 2025 15:14 PM
3
64
Newsread Image

No.1 Short News

DR Local News - Chirala
కన్నుల పండుగగా జరిగిన పౌర్ణమి సాగర హారతి: బంగారు బాబు
బాపట్ల జిల్లా,చీరాల మండలం,వాడరేవు గ్రామం (సముద్ర తీర ప్రాంతం) నందు గల ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా సాగర తీరాన ఆషాడ పౌర్ణమి, గురు పౌర్ణమి మరియు వ్యాస పౌర్ణమి సందర్భంగా కన్నుల పండుగగా, అత్యంత వైభవో పేతంగా సామూహిక పౌర్ణమి సాగర హారతి కార్యక్రమాన్ని హిందూ చైతన్య వేదిక చీరాల నియోజకవర్గ ప్రమఖ్ డాక్టర్ తాడివలస దేవరాజు ఆధ్వర్యంలో అర్చక స్వాములు మరియు వేద పండితులు కారంచేటి నగేష్ కుమార్, విట వెంకటేష్, కార్తీక్ శర్మ, సుధాకర్ శర్మ గార్ల మంత్రోచ్ఛారణతో స్పటిక శివలింగానికి పంచామృతాలతో అభిషేకం, మంత్ర పుష్పం మరియు సామూహిక సాగర హారతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి హిందూ చైతన్య వేదిక ప్రత్యేక ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా బాపట్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు బంగారు బాబు గారు, కొండారెడ్డి గారు, అనిల్ గారు పాల్గొని వీరి చేతుల మీదుగా అభిషేకం, సాగర హారతిని నిర్వహించుట జరిగినది. ఈ సందర్భంగా.... బిజెపి బాపట్ల జిల్లా అధ్యక్షులు బంగారు బాబు గారు మాట్లాడుతూ.... సముద్రం నుండి ఎటువంటి ప్రమాదాలు వాటిల్లకుండా, సముద్రం యొక్క అనుగ్రహం మన అందరిపై ఉండాలని కోరుకుంటూ సముద్ర హారతి ఇవ్వటం అనేది చాలా మంచి కార్యక్రమం అని తెలియజేశారు. టెంపుల్ టూరిజం బాగా అభివృద్ధి సాధిస్తుందని, సాగర హారతి మొదలు పెట్టిన తర్వాత వాడరేవు హైవే పనులు త్వరిత గతిన జరుగుతున్నాయని, హిందూ చైతన్య వేదిక నాయకులు ఈ కార్యక్రమం చక్కగా చేస్తున్నందుకు అభినందనీయమని వారిని ప్రశంసించటం జరిగినది. హిందూ చైతన్య వేదిక బాపట్ల జిల్లా సంయోజక్ బండారు జ్వాలా నరసింహo గారు గురు పౌర్ణమి గురించి వివరించుట జరిగినది. సాగర హారతి నిర్వాహకులు డాక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ శివానుగ్రహంతో ఎంతో విజయవంతంగా ప్రతి పౌర్ణమికి సాగర హారతి చీరాల వాడరేవులో ఎంతో వైభవంగా జరుగుతుందని , త్వరలో మరకత శివ లింగం తో అభిషేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు . ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న హిందూ సంఘాలకు మరియు చీరాల శాసనసభ్యులు ఎం ఎం కొండయ్య గారికి, పోలీస్ సిబ్బంది వారికి, వాడరేవు పంచాయతీ సిబ్బందికి , భజన బృందం వారికి, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామ కృష్ణ,మనోహర్ రెడ్డి,మణి కుమార్, భవానీ, సుధ, మున్నం శ్రీనివాస్ రెడ్డి , దామిశెట్టి శ్రీనివాస్ గుప్తా, వెంకటేశ్వర రెడ్డి, పిక్కి రాంబాబు , కోటి శ్రీను , జంపాల చిట్టి బాబు, సున్నం శ్రీనివాస్,సతీష్ వులిచి, మూర్తి జొన్న, పిక్కి నారాయణ, గోలి సాంబశివ రావు, బుర్ల సాంబశివరావు ,తడవర్తి చంద్ర , రాజేష్ ,డాక్టర్ సబరి , గుమ్మ బాలాజీ, ఆర్ఎస్ఎస్ నాయకులు, విశ్వహిందూ పరిషత్ నాయకులు, హిందూ చైతన్య వేదిక వాడరేవు గ్రామ ధార్మిక జట్టు సభ్యులు శ్రీనివాసులు రెడ్డి, వాడరేవు టిడిపి నాయకులు మరియు గ్రామ పెద్దలు, ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.
View More
Local Updates
11 Jul 2025 11:14 AM
1
80
Newsread Image

No.1 Short News

Newsread
పొలాల్లో పడి ఉన్న రెండేళ్ల బాలుడు..! దగ్గరికెళ్లి చూడగా.. గుండెపగిలే దృశ్యం
ప్రకాశం జిల్లా కంభం మండలంలో రెండున్నరేళ్ళ బాలుడు లక్షిత్ అదృశ్యమై రెండు రోజుల తర్వాత శవంగా దొరికాడు. అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన బాలుడు తిరిగి రాలేదు. పోలీసులు గాలించినా ఫలితం లేకపోగా, చివరకు గ్రామ శివారులో మృతదేహం లభించింది. హత్యాయత్నమా, ప్రమాదమా అనేది దర్యాప్తులో తేలాలి. ముక్కుపచ్చలారనేలేదు.. ఆ తల్లి అచ్చట, ముచ్చట తీరనేలేదు.. పొత్తిళ్ళల్లో ఒదిగిపోయిన ఆ ముద్దు నవ్వుల మోము వెచ్చని శ్వాస ఇంకా వీడనే లేదు.. ఇంతలో కాళ్ళ కింద భూమి కదిలిపోయి అమాంతం భూమిలో కూరుకుపోయినట్టు అయింది ఆ కన్నతల్లికి.. రెండు రోజులుగా కనిపించకుండా పోయిన రెండున్నరేళ్ళ బాలుడ్ని వెతుకుతూ తల్లడిల్లుతున్న ఆ మాతృమూర్తికి గర్భశోకం అశనిపాతంలా తాకింది.. అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి అక్షరాలు నేర్చుకుంటానని బుడిబుడి అడుగులతో వెళ్ళిన బాలుడు ఊరి శివారులో శవమై కనిపించడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.. చిన్నారి కోసం గుండెలవిశేలా రోదిస్తున్నారు.. ప్రకాశంజిల్లాలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన రెండున్నరేళ్ళ బాలుడి ఉదంతం విషాదంగా ముగిసింది. రెండురోజుల క్రితం అదృశ్యం… రెండున్నరేళ్ళ బాలుడు లక్షిత్‌ ఈ నెల 8వ తేదిన అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి తిరిగిరాలేదు. బాలుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు, గ్రామస్థులు ఊరంతా గాలించారు.. తల్లిదండ్రులు శ్రీను, సురేఖలు కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే చుట్టుపక్కల గ్రామాల్లో వెతికారు. అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు రెండు రోజులు తీవ్రంగా గాలించినా ఆచూకీ లభించలేదు. బాలుడి అదృశ్యంపై గ్రామంలో మార్కాపురం డీఎస్‌పీ నాగరాజు విచారించారు. అనంతరం బృందాలుగా పోలీసులు విడిపోయి లింగోజీపల్లితో పాటు సూరేపల్లి, ఎల్.కోట, మార్కాపురం, తర్లుపాడు, గిద్దలూరు, పొదిలి, బేస్తవారపేట ప్రాంతాల్లో గాలించారు. బాలుడి ఫొటోలు, వివరాలను ముద్రించిన కరపత్రాలను రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో అంటించారు. రెండో రోజు 9వ తేదిన గ్రామ సమీపంలోని నల్లవాగు దగ్గర బాలుడు లక్షిత్ చెప్పులు కనిపించడంతో ఎవరైనా అపహరించారా అన్న కోణంలోనూ ఆరా తీశారు. డ్రోన్ సాయంతో అన్వేషించినా బాలుడి వివరాలు తెలియకపోవడంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అంగన్‌వాడీ కేంద్రానికి 8వ తేది వచ్చిన బాలుడు ఎప్పటిలాగే ఆడుకున్నాడని, ఆ తరువాత ఇంటికి బయలుదేరి చేరకపోవడంతో తల్లిదండ్రులు విచారించారని అంగన్‌వాడీ కేంద్రం సిబ్బంది చెబుతున్నారు.
View More
Latest News
10 Jul 2025 21:07 PM
3
110
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: గురుకుల పాఠశాల లో ఘనంగా మెగా పేరెంట్స్ డే నిర్వహణ.
ముఖ్య అతిథిగా దర్శి తహశిల్దార్ శ్రావణ్ కుమార్. ఈ రోజు, దర్శి లోని స్థానిక ఎన్నెస్పీ కాలనీలో గల డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ సాంఘీక సంక్షేమ బాలుర గురుకులం లో మెగా పేరెంట్స్ డే ను 550 మంది విద్యార్థులతో తల్లిదండ్రుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఇంచార్జ్ ప్రిన్సిపాల్ మీరా సాహెబ్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిధులుగా జిల్లా కో-ఆర్డినేటర్ జయ, దరిశి తహశీల్దారు శ్రావణ్ కుమార్, ప్రకాశం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జికూటివ్ మెంబర్, మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్నుద్దేశించి డీసీసీ జయ మాట్లడుతూ, విద్యార్థుల బవిష్యత్ అద్యాపకుల మీదే కాకుండా, తల్లిదండ్రులు కూడా గురుతరమైన బాధ్యతను కలిగివుండాలన్నారు. తహశీల్దార్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రభుత్వం అన్నీ ప్రోత్సాహకాలిచ్చి, మెరుగైన భోజన సదుపాయాల కోసం సన్నబియ్యాన్నిచ్చి అన్నివిధాల ఆదుకుంటుందని తెలిపారు. ఈ సంధర్భంగా ఇండయన్ రెడ్ క్రాస్ ఎగ్జికూటివ్ మెంబర్ కపురం శ్రీనివాసరెడ్డి మాట్లడుతూ, విద్యార్థుల ఎదుగుదలకు గురువుల పాత్ర ఎంతుందో, వారిని కన్న తలిదండ్రుల పాత్ర అంతకంటే ఎక్కువ వుందని, గురువులు ఎంతటి ప్రావీణ్యులైనప్పటికీ, తలిదండ్రుల పెంపకం సరిగా లేకపోతే పిల్లలు చదువులోనేగాదు, నిజజీవితంలో కూడా రాణించలేరని, ఈ రోజుల్లో విద్యార్థులను గురువులు మందలిస్తేనే కొందరు తలిదండ్రులు ఓర్చుకొనే పరిస్థితుల్లోలేరని, ఈ పద్ధతిలో పూర్తిగా మార్పువస్తేనే విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని, ఎలాంటి చెడు అలవాట్లకు లోనుగాకుండా పిల్లలపట్ల తలిదండ్రులు అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని, ఎల్లవేళలా తలిదండ్రులకూ పాఠశాల యాజమాన్యానికీ ఒక వారధి గా వుంటానని కపురం శ్రీనివాసరెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గత విద్యా సంవత్సరంలో ప్రధమ, ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన పదోతరగతి మరియూ ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్టడీ చైర్స్ మరియు బహుమతులను కపురం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో చింతా తిరుపతిరెడ్డి సహకారంతో అందజేయడం జరిగింది. తల్లిదండ్రులు కూడా ఆటలపోటీలో పాల్గొని బహుమతులందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎసెంసీ చైర్మన్ ఏసురత్నం, స్థానికులు తెల్లయ్య,ఎలీషా,సుశీలమ్మ,అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
View More
Latest News
10 Jul 2025 19:52 PM
2
72
Newsread Image

No.1 Short News

Newsread
పొదిలి డిపో: రేపు సాయంత్రం నాలుగు గంటలకు డయల్ యువర్ డిఎం కార్యక్రమం
పొదిలి డిపో పరిధిలో బస్సులు తిరిగే విషయమై అవసరమగు సలహాలు సూచనల మరియు డిపో అభివృద్ధి కొరకు రేపు అనగా 11 - 7- 2025వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు నేను (పొదిలి డిపో మేనేజర్ గారు) డయల్ యువర్ డిఎం కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కావున పొదిలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు వారి సలహాలు సూచనలు డిపో మేనేజర్ తో పంచుకోవచ్చు డయల్ యువర్ డి ఎం ఫోన్ నెంబర్ - 9959225700
View More
Latest News
10 Jul 2025 16:49 PM
0
99
Newsread Image

No.1 Short News

Newsread
దొనకొండ: మెగా పేరెంట్స్ మీట్ కార్యక్రమం లో పాల్గొన్న డా|| గొట్టిపాటి లక్ష్మీ.
మండల కేంద్రమైన దొనకొండలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం లో గురువారం మెగా పేరెంట్స్ మీట్ లో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్.గొట్టిపాటి లక్ష్మీ. ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థుల్ని, తల్లిదండ్రులు ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. తదుపరి కేజీబివి స్కూల్ కి కంప్యూటర్ ని దాత మోడీ ఆంజనేయులు సహకారం తో అందించటం జరిగినది. డా|| లక్ష్మీ తో పాటు మండలం లోని MRO, MPDO, MEO, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లితండ్రులు, మండల టిడిపి అధ్యక్షులు మోడీ ఆంజనేయులు మరియు మండలం లోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు పాల్గొన్నారు.
View More
10 Jul 2025 16:20 PM
0
95
Newsread Image

No.1 Short News

Newsread
దొనకొండ లో ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో మెగా పేరెంట్స్ మీట్ కార్యక్రమం లో పాల్గొన్న డా|| గొట్టిపాటి
మండల కేంద్రమైన దొనకొండలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో గురువారం మెగా పేరెంట్స్ మీట్ లో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్. గొట్టిపాటి లక్ష్మీ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థుల్ని, తల్లిదండ్రులు ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో ప్రభుత్వ జూనియర్ కాలేజీ అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు దొనకొండ మండల పార్టీ అధ్యక్షులు మోడీ ఆంజనేయులు, నియోజకవర్గం లోని వివిధ హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
View More
10 Jul 2025 16:00 PM
1
77
Newsread Image

No.1 Short News

Vijaya Chandra
పెద్దిరాజుపల్లి పాఠశాలలో మెగా పీటీఎం 2.0
బ్రహ్మం గారి మఠం మండల పరిది లోని పెద్దిరాజుపల్లి ప్రాధమిక పాఠశాల నందు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సి. తిరుపతి రెడ్డి ఉపాధ్యాయులు జి. ఆర్ నాగమణి, ఖాధర్ బాష, యం.అంకయ్య. సీపీఐ సహాయ కార్యదర్శి చేజర్ల రవి తల్లి దండ్రులు విధ్యార్థులు పాల్గొనడం జరిగింది.
View More
Latest News
10 Jul 2025 14:54 PM
2
79
Newsread Image

No.1 Short News

Newsread
దర్శికి అన్న క్యాంటీన్ రావడం నాకు ఆనందంగా ఉంది: డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్ లో గురువారం అన్నా క్యాంటీన్ పునః నిర్మాణ పనులను దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. డా|| లక్ష్మీ తో పాటు టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి-సుబ్బారావు, మున్సిపల్ కమిషనర్ మహేష్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ... ✴️ పేదల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు తిరిగి కూటమి ప్రభుత్వాధికారంలోనికి రాగానే అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. ✴️ గత వైసిపి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మూసివేసి పేదల కడుపు కొట్టింది. ✴️ పేదల జీవితాలలో వెలుగులు నింపి వారి ఆకలి తీర్చాలన్న మంచి సంకల్పంతో మన కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించింది. ✴️ అదే స్ఫూర్తితో దర్శి పట్టణంలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించాలన్న సంకల్పంతో గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారిని పలుసార్లు కలిసి విన్నవించడం జరిగిందని ఆమె తెలిపారు. ✴️ గౌరవ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారు దర్శికి అన్న క్యాంటీన్ ను మంజూరు చేయడం అభినందనీయమన్నారు. వారికి ప్రత్యేకంగా దర్శి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ✴️ 60 లక్షల నిధులతో అన్నా క్యాంటీన్ ను సుందరంగా తీర్చిదిద్దుకోగలుగుతున్నామన్నారు. ✴️ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ అభివృద్ధి ఎజెండాగా మన ప్రభుత్వం ముందుకు వెళుతుంది అన్నారు. ✴️ నగర పంచాయతీగా ఉన్న దర్శిని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేసుకోగలిగామని, దర్శి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంగా ముందుకు నడుస్తున్నామన్నారు. ✴️ ఇప్పటికే పట్టణంలో దాదాపు 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.మౌలిక సదుపాయాల కల్పనే ద్వేయంగా రోడ్లు, డ్రైన్ లు నిర్మాణ పనులు శరవేగంగా చేయగలుగుతున్నామన్నారు. ✴️ పార్కుల అభివృద్ధి, పట్టణంలో విద్యుదీకరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా దర్శిని తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామన్నారు. ✴️ జల శక్తి మిషన్ ద్వారా దర్శి పట్టణంలో తాగునీటి సమస్యను అధికమిస్తామని ఆమె వివరించారు. ✴️ మన ఏడాది అభివృద్ధి పాలనలో ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రజల అభివృద్ధి సంక్షేమం మన మంచి ప్రభుత్వంలో ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నామన్నారు. మన అభివృద్ధి ప్రభుత్వాన్ని ఆదరించండి, ఆశీర్వదించండి అని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరారు. ఈ కార్యక్రమంలో దర్శి మండల పార్టీ అధ్యక్షులు మారెళ్ళ వెంకటేశ్వర్లు, టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్న, వైస్ చైర్మన్ గర్నపూడి స్టీవెన్, మరియు కౌన్సిలర్లు, క్లస్టర్లు, యూనిట్ & బూత్ ఇంచార్జిలు, నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
View More
Latest News
10 Jul 2025 13:19 PM
0
88
Newsread Image

No.1 Short News

Vijaya Chandra
తల్లి దండ్రుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న టీడీపీ మండల యువ నాయుకులు కానాల మల్లికార్జునరెడ్డి
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం రేకలకుంట పంచాయతీలోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఉపాధ్యాయుల ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా టీడీపీ మండల యువనాయకులు కానాల మల్లికార్జున రెడ్డి మాజీ మండల అధ్యక్షులు మాలేపాటి సుబ్బారావు స్థానిక నాయకులు కూనపులి రాజానాయుడు పాల్గొన్నారు ఈ సమావేశంలో కానాల మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విధ్యార్థులకు తల్లికి వందనం నాణ్యమైన యూనఫామ్స్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా సన్న నాణ్యమైన భోజనం అందిస్తుందని తెలిపారు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నియోజకవర్గంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్థున్నారని తెలిపారు విద్యార్థుల సౌకర్యార్థం కోసం కొంత అభివృద్ధి పని చేయాలని ఉపాధ్యాయుల కోరగా వెంటనే తమ సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపడతానని కానాల మల్లి కార్జున రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమం లో పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాసులరెడ్డి స్కూల్ చైర్మన్ రామాంజనేయులు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.
View More
Latest News
10 Jul 2025 11:26 AM
1
73
Newsread Image

No.1 Short News

Vijaya Chandra
తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న నాయకులు
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం రేకలకుంట పంచాయతీలోని ప్రాథమిక పాఠశాలనందు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న టిడిపి మండల నాయకుడు కానాల మల్లికార్జున్రెడ్డి, కూనపులి రాజానాయుడు, గుజ్జు రామాంజనేయులు, గంగన్న, పుట్టాలశివయాదవ్, ఓబయ్య, దాసు, బ్రహ్మనాయుడు, చెన్నయ్య, వెంకటేశ్ నాయుడు, తదితరులు పాల్గొనడం జరిగింది.
View More
Latest News
10 Jul 2025 10:27 AM
2
64
Newsread Image

No.1 Short News

DR Local News - Chirala
చీరాల లో జరుగు సాగర హారతి లో పాల్గొన్న బాపట్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు బంగారు బాబు
బాపట్ల లో బీజేపీ జిల్లా కార్యాలం లో బాపట్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ బంగారు బాబు గారిని, బాపట్ల బీజేపీ నాయకులను కలిసి జూలై 10 తేదీన చీరాల ఓడరేవులో జరిగే సాగర హారతి కార్యక్రమంలో పాల్గొనవలసినదిగా ఆహ్వించము. ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక చీరాల నియోజకవర్గ ప్రముఖ్ డాక్టర్ తాడివలస దేవరాజు, ఓడరేవు బిజెపి నాయకులు మరియు సాగర హారతి కమిటీ సభ్యులు శ్రీనివాస్ గుప్తా, రాజేష్, కొండలు, అన్నవరం, చిట్టి బాబు పాల్గొన్నారు.
View More
Local Ads
10 Jul 2025 05:52 AM
1
71
Newsread Image

No.1 Short News

Newsread
న్యూస్ రీడ్ ప్రేక్షకులకు గురుపౌర్ణమి శుభాకాంక్షలు
Local Ads
10 Jul 2025 05:52 AM
0
64
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: మొహర్రం సందర్భంగా జ్యారతా & అన్నదాన కార్యక్రమంలో గొట్టిపాటి లక్ష్మి
దర్శి పట్టణం లోని జండా చెట్టు వద్ద మొహరం పండుగ పూర్తి అయినా సందర్బంగా...బుధవారం సాయంత్రం జార్త కార్యక్రమం లో పాల్గొని ముస్లిం సోదరులకు అన్నదాన కార్యక్రమం లో దర్శి టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. వారితో పాటు మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు, దర్శి మండల పార్టీ అధ్యక్షులు మరెళ్ల వెంకటేశ్వర్లు, టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్న, 17వ వార్డ్ కౌన్సిలర్ వలిబాబు, మౌలాలి, సుభాని మరియు నియోజకవర్గం లోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
View More
Latest News
09 Jul 2025 21:48 PM
0
93
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: మొహర్రం సందర్భంగా అన్నదానం లో పాల్గొన్న బూచేపల్లి
దర్శి లోని జెండా చెట్టు వద్ద మొహరం పండుగ సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ గారు దర్శి MLA ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి .
View More
Latest News
09 Jul 2025 21:39 PM
0
100
Newsread Image

No.1 Short News

Newsread
మామిడి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వైయస్ జగన్ డిమాండ్
కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర కష్టనష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను పరామర్శించేందుకు వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్‌యార్డు ను సందర్శించారు. అక్కడ మామిడి రైతులను కలిసి, వారి సమస్యలు ఆరా తీసిన వైయస్‌ జగన్, ఆ తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్న మామిడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
View More
Latest News
09 Jul 2025 20:44 PM
0
65
Newsread Image

No.1 Short News

Newsread
పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం శుభ్రమైన ఆహారాన్ని అందించాలి
దర్శి పురపాలక సంఘం అద్దంకి రోడ్డులో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను దళిత,ప్రజా సంఘాలనాయకులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా నవ్యాంధ్ర మాదిగ చర్మ, డప్పు కళాకారుల పోరాటసంఘం రాష్ట్రవ్యవస్థాపకఅధ్యక్షులు కవలకుంట్ల గోవిందప్రసాద్ మాదిగ, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు జూపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులపాఠశాలలో పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారని విద్యార్థులకుతగిన మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలని, అన్నారు. త్రాగునీటి సౌకర్యం విద్యార్థులకు కల్పించాలని, పరిసరాలు పరిశుభ్రంగాఉంచాలని, వంట రూము అపరిశుభ్రత లేకుండా తగిన జాగ్రత్తలుతీసుకోవాలని, వారు తెలిపారు. విద్యార్థులకుఅందించే మెనూ అద్దంకిఏజెన్సీనుండి కూరగాయలు, కోడిగుడ్లు, సరఫరా విషయంలో, తగిన జాగ్రత్తలుతీసుకొని, దర్శి నుండి ఏజెన్సీఏర్పాటు చేయాలని, ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు, అనంతరం అక్కడ వండిన వంటలను రుచిచూసి సంతృప్తి చెందారు. విద్యార్థులకు ఆహార పదార్థాలను వేస్ట్ చేయకుండా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘసేవకులు జి.వి రత్నం రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గం అధ్యక్షులు గర్నెపూడి ప్రేమ్ కుమార్ గర్నిపూడి యాకోబు తదితరులు పాల్గొన్నారు.
View More
Local Updates
09 Jul 2025 20:29 PM
1
92
Newsread Image

No.1 Short News

Newsread
అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్కు అర్హుల జాబితా సిద్ధం, ఇలా చెక్ చేసుకోండి!
సిద్ధమైన అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ పథకం అర్హుల జాబితా - రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో అర్హులైన రైతుల పేర్ల జాబితాలు అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం అర్హుల జాబితా సిద్దమైంది. అర్హులైన రైతుల జాబితాలను సంబంధిత రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయశాఖ తెలిపింది. రైతు సేవా కేంద్రంలో ఉన్న జాబితాలో రైతులు వారి పేర్లును పరిశీలించుకోవచ్చని వ్యవసాయ సంచాలకులు డిల్లీరావు తెలిపారు. అన్నదాత సుఖీభవ పోర్టల్​లోనూ ఆధార్ నెంబర్ ద్వారా తన అర్హతను తెలుసుకోవచ్చని వెల్లడించారు. మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా రైతులు వారి అర్హతను తెలుసుకునే సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ఆధార్ నెంబర్‌ను మన మిత్ర వాట్సాప్ నంబరు 9552300009కు పంపితే వివరాలు లభ్యమవుతాయని సూచించారు. రైతు పేరు లేని పక్షంలో, అర్హత ఉందని భావిస్తే రైతు సేవా కేంద్రంలో అర్జీతో పాటు పత్రాలు సమర్పించాలని సూచించారు. అన్నదాత సుఖీభవ పోర్టల్ లోనీ గ్రీవెన్స్ మాడ్యులులో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 13 వరకు మాత్రమే గ్రీవెన్స్ నమోదు చేసుకునే అవకాశం ఉందని డిల్లీరావు స్పష్టం చేశారు. వివరాలు రైతులకు మరింత చేరేలా వ్యవసాయ శాఖ సిబ్బంది ముమ్మర ప్రచారం చేయాలని డిల్లీరావు ఆదేశించారు. అర్హులుగా 47.77 లక్షల రైతులు: 'అన్నదాతా సుఖీభవ-పీఎం కిసాన్‌' పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 47.77 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించామని కొద్ది రోజుల క్రితం వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ ఢిల్లీరావు తెలిపారు. గ్రామ/వార్డు సచివాలయాల సర్వే ఆధారంగా 98% మందికి ఈకేవైసీ పూర్తయిందని తెలిపారు. ఈ ప్రక్రియ ఇంకా 61,000 మందికి పూర్తి చేయాల్సి ఉందని ఢిల్లీరావు వివరించారు. సొంతభూమి కలిగిన డీ.పట్టాదారులు, ఎసైన్డ్, ఈనాం భూముల రైతులను కూడా అర్హులుగా గుర్తించామని ఢిల్లీరావు పేర్కొన్నారు. వెబ్‌ల్యాండ్‌లో ఆధార్‌ జత కాకున్నా, తప్పుగా జోడించినా, చనిపోయిన ఖాతాలు, నోషనల్‌ ఖాతాలు కలిగిన రైతులు రెవెన్యూ అధికారులను వద్దకు వెళ్లి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు. అనంతరం వారికి కూడా ఈ సుఖీభవ పథకం వర్తింపజేస్తామని తెలిపారు. రైతుల అభ్యర్థనలు స్వీకరించేందుకు త్వరలో అన్నదాతా సుఖీభవ పోర్టల్‌ అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు భూమిలేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల కౌలు రైతులు గుర్తింపు కార్డు పొందడంతోపాటు ఈ-పంటలో పేరు నమోదు చేసుకోవాలని ఢిల్లీరావు సూచించారు. అర్హత ప్రకారం అందరికి లబ్ధి చేకూరుస్తామని అక్టోబరు, 2026 జనవరి నెలల్లో 2 విడతలుగా కౌలు రైతులకు అన్నదాతా సుఖీభవ-పీఎం కిసాన్‌ మొత్తాన్ని అందిస్తామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయగానే రాష్ట్రం ప్రభుత్వం కూడా రైతుల ఖాతాలో నిధులు జమ చేసేందుకు సిద్ధంగా ఉందని ఢిల్లీరావు అన్నారు. వెబ్‌ల్యాండ్‌ డేటాను వారి లాగిన్లకు: రైతు సేవా కేంద్రాల(ఆర్‌ఎస్‌కే) వారీగా వెబ్‌ల్యాండ్‌ డేటాను వీఏఏలు, వీఎస్‌ఏలు, వీహెచ్‌ఏలతో పాటు ఏవోల లాగిన్లకు ఇచ్చారు. వెబ్‌ల్యాండ్‌లో సర్వే నంబర్లు, రైతు పేరు, విస్తీర్ణం కచ్చితంగా ఉన్నాయా లేదా అన్నది రైతు సేవా కేంద్రాల సహాయకులు పరిశీలించి కచ్చిత వివరాలను మండల వ్యవసాయాధికారులకు వారు జిల్లా వ్యవసాయాధికారికి నివేదించాలి.
View More
Latest News
09 Jul 2025 12:27 PM
0
93
Newsread Image

No.1 Short News

Rasul.Sk
ముండ్లమూరు లో పాముతో వ్యక్తి హల్ చల్
ముండ్లమూరు సెంటరలో దర్శి -అద్దంకి రహదారి లో మద్యం మత్తులో ఓ వ్యక్తి మంగళవారం పాముతో జనాలను భయాందోళనకు గురిచేశాడు. నడి రోడ్డు పై కూర్చొని పామును చేతపట్టి వాహనదారులను ఇబ్బందులకు గురిచేశాడు. దీం తో దారి వెంట వెళ్లే ప్రజలు, కళాశాల విద్యార్థులు చొరవ తీసుకొని అతనికి సర్ది చెప్పి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
View More
Latest News
09 Jul 2025 11:34 AM
0
79
Newsread Image

No.1 Short News

Newsread
విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేసిన దర్శి ఎస్సై మురళి
చంద్రన్న పచ్చదనం కార్యక్రమం, దర్శి పుట్ట బజార్ లో, పాఠశాల విద్యార్థులు గ్రామస్తులు లకు, నాగేశ్వరరావు అద్యక్షతన దర్శి ఎస్సై ఎం మురళి మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మురళి మాట్లాడుతూ మానివాళి మనుగడకు మొక్కలు లేకపోతే ప్రమాదం పొంచి ఉంది అన్నారు. ఒజోన్ పొరను రక్షించాలి అంటే మొక్కలు విరివిగా నాటాలి అని, వాతావరణం లో సమతుల్యత గా ఉండాలి అంటే అందరూ మొక్కలు నాటి పెంచాలి అని, ఎండలు లేకుండా వాతావరణం బాగా ఉండాలి అంటే మొక్కలు పెంచాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పరిటాల సురేష్, అస్సాం,షడ్రక్ , వెంకట సుబ్బయ్యా గ్రామస్తులు పాల్గొన్నారు.
View More
Latest News
09 Jul 2025 10:59 AM
0
82
Newsread Image

No.1 Short News

Vijaya Chandra
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంలో రేపు గురుపూజ మహోత్సవ కార్యక్రమం
కడప జిల్లా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో రేపు అనగా10.07.2025 గురువారం గురుపూజ మహోత్సవాలు ఘనంగా జరగనున్నట్లు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఎనిమిదో తరం మనవడు శ్రీ వెంకటాద్రి స్వాములవారు తెలిపారు. ఈ గురుపూజ మహోత్సవాలకు స్వామి వారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ ఉత్సవాలు ఆలయ ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ , మఠం మేనేజర్ ఈశ్వరయ్య ఆచారి ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు తెలిపారు
View More
Latest News
09 Jul 2025 10:56 AM
0
89
Newsread Image

No.1 Short News

Newsread
ముండ్లమూరు: పోలవరం లో పోలీసుల దాడి 10 మంది అరెస్ట్.
ప్రకాశం జిల్లా: ముదురుతున్న అసాంఘిక కార్యకలాపాలను అరికట్టే లక్ష్యంతో, జిల్లా పోలీస్ శాఖ విస్తృత చర్యలు చేపడుతోంది. ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్, మార్గదర్శకత్వంలో, ముండ్లమూరు మండలంలోని పోలవరం గ్రామంలో నిర్వహించిన ఆకస్మిక దాడిలో జూదం ఆడుతున్న 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దాడి సమయంలో వారి వద్ద నుంచి రూ.10,190/- నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయినవారిపై సంబంధిత నేర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, మరింత విచారణ కొనసాగుతోంది. పోలీసు అధికారులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు ఎలాంటి అవకాశం ఇవ్వమని, ఇటువంటి చర్యలు ఇంకా కఠినంగా కొనసాగిస్తామని తెలిపారు.జనసామాన్యులు తమ పరిసరాల్లో జరుగుతున్న అనుమానాస్పద కార్యకలాపాల గురించి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
View More
Breaking News
09 Jul 2025 07:27 AM
1
68
Newsread Image

No.1 Short News

Newsread
పిట్ట కొంచెం.. కూత ఘనం.. 17 నెలల చిన్నారి ట్యాలెంట్‌ కి నోబెల్ బహుమతి
ప్రకాశం జిల్లా, ఒంగోలు పట్టణంలోని సత్యనారాయపురంకి చెందిన అంబటి ఖశ్వి అనే చిన్నారి ఒక సంవత్సరం ఐదు నెలల (17 నెలలు) వయస్సులోనే 24 వేర్వేరు కేటగిరీలలో 650కి పైగా ఇంగ్లీష్ పదాలను మాట్లాడగలగడం ద్వారా నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్న అంబటి ఖశ్వి (17 నెలలు) ను ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ A.R. దామోదర్, అంబటి ఖశ్వి ను ప్రత్యేకంగా అభినందించారు. ఇది చిన్నారుల విభాగంలో ప్రపంచస్థాయిలో అత్యుత్తమ రికార్డుగా గుర్తింపు పొందింది. గతంలో ఉన్న రికార్డును నాలుగు సంవత్సరాల మూడు నెలల చిన్నారి 300 పదాలు మాట్లాడిన ఘనతను అంబటి కాశ్వీ అధిగమించడం విశేషం. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అంబటి ఖశ్వి ప్రపంచవ్యాప్తంగా ఒక అరుదైన ఘనతను సాధించిందని, కేవలం జిల్లాకే కాకుండా రాష్ట్రానికి కూడా గర్వకారణమని, చిన్న వయస్సులోనే ఇటువంటి మేధస్సు ప్రదర్శించడం అద్భుతమైన విషయమన్నారు. చిన్నారిలో తెలివితేటలు, ప్రతిభను గుర్తించాలన్నారు. ఈ విజయం సాధించడంలో కుటుంబ సభ్యుల సహకారం, మార్గదర్శకత ఎంతో ముఖ్యమైనదని జిల్లా ఎస్పీ కొనియాడారు. జిల్లా పోలీస్ శాఖ తరఫున అంబటి ఖశ్వి భవిష్యత్తు మరింత వెలుగులు చిమ్మాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాప తల్లిదండ్రులు సాయికుమార్, ప్రణతి, కుటుంబ సభ్యులు శివాజీ గణేష్, కోటేశ్వరమ్మ పాల్గొన్నారు.
View More
Local Updates
08 Jul 2025 22:19 PM
1
93
Newsread Image

No.1 Short News

Newsread
ఏసీబీకి చిక్కిన డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్..
ఫిర్యాదిధారునికి చెందిన ఒక కంపెనీకి జి.ఎస్.టి. రిజిస్ట్రేషన్ చేసి నెంబరును పొందడానికి గల ప్రక్రియను ప్రాసెస్ చేయడానికి ఫిర్యాదుధారుని నుండి రూ.8,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన హైదరాబాద్‌లోని మాధాపూర్‌ ప్రాంతపు ఉప రాష్ట్ర పన్నుల అధికారి - ఎం. సుధ..
View More
Crime News
08 Jul 2025 21:24 PM
0
82
Newsread Image

No.1 Short News

Newsread
నిషేధిత పొగాకు విక్రయం, నిల్వ, రవాణాపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు
విద్యా సంస్థల సమీపంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులపై కఠిన చర్యలు:ప్రకాశం జిల్లా ఎస్పీ A.R. దామోదర్. మాదకద్రవ్యాల నిర్మూలనకై.. ప్రకాశం పోలీస్ అడుగులు. మాదకద్రవ్యాల నిర్మూలన, ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా, ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తును కాపాడే దిశగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్, ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కలిసి పాఠశాలలు, కళాశాలలు (ఇంజినీరింగ్ కాలేజీలు) పరిసరాలలో గంజాయి మరియు నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయం, నిల్వ, రవాణాపై సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల నిషేధ చట్టం (COTPA) ప్రకారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో భాగంగా అనుమానిత కిరాణా షాపులు, బడ్డీ కొట్లు, కిళ్లీ షాపులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మాదక ద్రవ్యాలపై కఠిన చర్యలతో పాటు విద్యార్థులకు మరియు స్థానిక ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల సమీపంలోని కిరాణా దుకాణాలు, పాన్ షాపులు, ఇతర వ్యాపార కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారి పై COTPA చట్టం ప్రకారం, అలాగే గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల విక్రయం, నిల్వ, రవాణా చేసిన వారిపై NDPS చట్టం కింద కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు తెలిపారు. పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, విద్యార్థులలో అవగాహన పెంపొందించడంపైనా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా జిల్లాలోని వివిధ పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. మాదకద్రవ్యాలు మరియు పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక మరియు చట్టపరమైన దుష్ప్రభావాలను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మాదకద్రవ్యాలు మరియు గంజాయి ఉచ్చు నుండి యువతను రక్షించడం మనందరి సామాజిక బాధ్యత. పాఠశాలలు, కళాశాలల పరిసరాలను ఈ చెడు వ్యసనాల నుండి దూరంగా ఉంచటం, విద్యార్థుల భవిష్యత్తును రక్షించడం మనందరి బాధ్యతన్నారు. యువతను పాడు చేసే మత్తు పదార్థాలు, పొగాకు ఉత్పత్తుల నిల్వలు కలిగి ఉన్న, అక్రమంగా వాటిని విక్రయాలు జరిపిన ఏ మాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. విద్యార్థులలో అవగాహన పెంపొందించడానికీ కృషి చేస్తున్నామన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్లలపై దృష్టి పెట్టి వారికి సరైన మార్గదర్శనం ఇవ్వాలని, మాదకద్రవ్యాలు లేని ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలు, నిషేధిత పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన సమాచారం ఉన్నట్లయితే పోలీసులకు వెంటనే తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ప్రకాశం జిల్లా పోలీసులు ఈ ప్రత్యేక డ్రైవ్‌ను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తూ, జిల్లాను మాదకద్రవ్యాలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.
View More
Latest News
08 Jul 2025 21:06 PM
1
67
Newsread Image

No.1 Short News

Newsread
ఏపీ హజ్ కమిటీ చైర్మన్ హాసన్ బాషా ను మర్యాదపూర్వకంగా కలిసిన సయ్యద్ మెహతాజ్ బేగం
విజయవాడ, జూలై 8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ భాష ని విజయవాడలోని హజ్ హౌస్‌ నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి సయ్యద్ మెహతాజ్ బేగం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా సయ్యద్ మెహతాజ్ బేగం మాట్లాడుతూ, రాష్ట్రంలోని హాజీబంధువుల కోసం హసన్ భాష చేస్తున్న అద్భుత సేవలు, సమన్వయం, మరియు సమగ్ర దృక్పథం ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తోందని పేర్కొన్నారు. హజ్ యాత్రికులకు సౌకర్యవంతమైన వసతి, భద్రత, రవాణా, వైద్య సదుపాయాల కల్పనలో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతుండటంపై కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కడపలోని హజ్ హౌస్ ను వినియోగంలోకి తీసుకురావాలని మరియు హజ్ యాత్రకు వెళ్ళే హాజీలకు విజయవాడ పాయింట్ గా సూచించాలని ఆమె కోరారు, హసన్ భాషా సానుకూలంగా స్పందించి ఈ విషయాలను నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకొని వెళ్లి కడప హజ్ హౌస్ వినియోగంలోకి తీసుకుని వచ్చేదానికి అదేవిధంగా విజయవాడను ఎమ్బర్కేషన్ పాయింట్గా సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పారు... అదేవిధంగా, హజ్ కమిటీ చైర్మన్‌గా హసన్ భాష చేస్తున్న సేవలకు గుర్తింపుగా, ఆయనకు సత్కారం జరిపి, శాలువాతో సన్మానించడం జరిగింది. భవిష్యత్తులోనూ హజ్ యాత్రికుల కోసం మరిన్ని అభివృద్ధి చర్యలు తీసుకోవాలని ఆమె తెలియజేశారు.
View More
Latest News
08 Jul 2025 20:52 PM
2
76
Newsread Image

No.1 Short News

Newsread
గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ సేవ్ క్యాంపస్ ప్రారంభం
ఆపరేషన్ సేవ్ క్యాంపస్ జోన్ కార్యక్రమం ప్రారంభం.విద్యా సంస్థల పరిసరాల్లో మత్తు పదార్థాల రహిత వాతావరణం కోసం పోలీస్ చర్యలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు, ఈగల్ ఐజీ ఆకె రవికృష్ణ మార్గనిర్దేశనలో,గుంటూరు జిల్లా పోలీస్ అధికారి సతీష్ కుమార్ నేతృత్వంలో ఆపరేషన్ సేవ్ క్యాంపస్ జోన్ అనే ప్రత్యేక డ్రైవ్‌ను 08.07.2025 తేదీ నుండి 12.07.2025 తేదీ వరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు(ది.08.07.2025) జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు తమ స్టేషన్ల పరిధిలోని స్కూల్స్, కాలేజీలకు 100 మీటర్ల దూరంలో ఉన్న షాపులు, బడ్డీ కొట్టులు, కిరాణా దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లు, గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలపై దృష్టి సారించారు. అనుమానిత విక్రయదారులపై తగిన విధంగా చర్యలు తీసుకొని, ఇకపై మత్తు పదార్థాలు అమ్మకుండా స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. యువత భవిష్యత్తును నాశనం చేసే మత్తు పదార్థాల విక్రయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించము. పాఠశాలలు, కాలేజీల సమీపంలో ఈ తరహా చట్ట విరుద్ధ కార్యకలాపాలపై నిరంతరం ప్రత్యేక దాడులు కొనసాగుతాయి.ఎవరైనా మత్తు పదార్థాలు నిల్వ చేసినా, విక్రయించినా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. విద్యాసంస్థల పరిసరాలలోని షాపుల యజమానులు తమ సామాజిక బాధ్యతను గుర్తించి ఈ షాపులో సిగరెట్లు మరియు మత్తు పదార్థాలు అమ్ముబడవు అనే బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు, కాలేజీల యాజమాన్యం వారు తమ పిల్లల ప్రవర్తన మరియు నడవడికపై పర్యవేక్షణ కొనసాగించాలని కోరారు. ఎవరి పిల్లలైనా మత్తు పదార్థాలకు బానిసలుగా మారినట్టు తెలిసినట్లయితే, వెంటనే మీ దగ్గరలోని పోలీస్ వారికి సమాచారం అందించాలని, వీరిని డీ-అడిక్షన్ కేంద్రాలకు తరలించి అవసరమైన మార్గదర్శనం అందిస్తామని తెలిపారు. పోలీసు శాఖ మత్తు రహిత సమాజ నిర్మాణం కోసం కట్టుబడి పని చేస్తోందని, ప్రజలు ఈ లక్ష్య సాధనలో పూర్తి సహకారం అందించాలని ఎస్పీ గారు కోరారు.
View More
Latest News
08 Jul 2025 20:46 PM
0
91
Newsread Image

No.1 Short News

Vijaya Chandra
దళితుల భూ సమస్యలను పరిష్కరించాలి సిపిఐ
ఏళ్ల తరబడి తిరిగిన సమస్య పరిష్కరించని రెవెన్యూ అధికారులు సిపిఐ మండల కార్యదర్శి పెద్దుల్లపల్లి ప్రభాకర్ మండలంలోని సోమిరెడ్డి పల్లె పంచాయతీలోని నరసన్న పల్లె, చౌదరివారిపల్లె పంచాయతీలోని గుండపురం గ్రామాల ఎస్సీ మాదిగలకు భూములు చూపడం లో రెవెన్యూ అధికారులు విఫలమయ్యారని భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ మండల కార్యదర్శి పెద్దుల్లపల్లి ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక తహశీల్దార్ కు బాధితులతో కలిసి అర్జీ లు ఇవ్వడం జరిగింది.
View More
Latest News
08 Jul 2025 18:02 PM
2
64
Newsread Image

No.1 Short News

Vijaya Chandra
కడప జిల్లా సమీక్ష కమిటీ సమావేశం లో పాల్గొన్న ఎమ్మెల్యే పుట్టా
కడప కలెక్టరేట్ నందు జిల్లా ఇంచార్జి మినిస్టర్ సవిత మరియు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో సహచర జిల్లా ఎమ్మెల్యే లు మరియు జిల్లా ఉన్నతాధికారులతో కలిసి సమావేశంలో లో పాల్గొన్న మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్.
View More
Latest News
08 Jul 2025 17:04 PM
1
63
Newsread Image

No.1 Short News

Vijaya Chandra
థాంక్యూ ఎమ్మెల్యే సార్
మైదుకూరు మున్సిపాలిటీ 12వ వార్డు ఇంచార్జీ అక్బర్ ఆధ్వర్యంలో 12వ వార్డు గానుగ వీధి నందు గత అయిదు సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ వీధి స్తంభాలకు మెయిన్ లైన్ లేకపోవడం వల్ల హై ఓల్టేజ్ వచ్చినప్పుడు విద్యుత్ ఉత్పత్తిలో అంతరాయం ఉండేది.. ప్రస్తుతం ఆ సమస్యకు పరిష్కారదిశగా ఈ రోజు విద్యుత్ అధికారులు మెయిన్ లైన్ లాగడం జరిగింది. ఎప్పటినుండో ఉన్నటువంటి ఈ సమస్యకు పరిష్కారం చూపించినందుకు వీధి ప్రజలు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కు వార్డు ఇంచార్జీ అక్బర్ గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది.
View More
Latest News
08 Jul 2025 16:10 PM
2
49
Newsread Image

No.1 Short News

Vijaya Chandra
పర్యావరణాన్ని రక్షించుకోవాలి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్
ఖాజీపేట మండలం పత్తూరు గ్రామపంచాయతీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నందు మంజూరైన పండ్లతోటల మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటి అందరూ పర్యావరణాన్ని రక్షించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దివిజా సంపతి, ఏపీడీ సుబ్బా రెడ్డి, ఖాజీపేట మండల ప్రజాప్రతినిధులు, ఏపీఓ చంద్రశేఖర్, ఉపాధి హామీ సిబ్బంది, పత్తూరు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు._
View More
Latest News
08 Jul 2025 12:43 PM
1
90
Newsread Image

No.1 Short News

Vijaya Chandra
జననేతకు నివాళులు కరువు
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో దివంగత నేత రాజశేఖరరెడ్డి 76 వ జయంతి సందర్భంగా మండలంలో నివాళులర్పించే నాయకుడే లేడని వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేమంటే మేమని ఎగబడి నాయకులు కేకులు కట్ చేయడం, పూలదండలు వేయడం పోటీపడి చేసేవారు. వైసీపీ పార్టీ ప్రతిపక్షంలోకి రాగానే పట్టించుకోవడం కూడా కరువైపోయిందని అధికారం ఉంటేనే అభిమానం ఉంటుందా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాయకులు ఎవరి స్వార్థం వాళ్లు చూసుకోవడమే తప్ప మహానేతకు కనీసం నివాళులు అర్పించే నాయకులు లేరా అంటూ సెటైర్లు వేస్తున్నారు.
View More
Politics
08 Jul 2025 12:17 PM
1
87
Newsread Image

No.1 Short News

Newsread
మార్కాపురం: ఘనంగా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు
ఈ రోజు వై యస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు మార్కాపురం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి . ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా మైనారిటీ డిపార్ట్ మెంట్ చైర్మన్ అబ్దుల్ షంషీర్ మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ కాని 108 మరియు 104 కిలో 2 బియ్యం పధకం, మరియు ఫీజు రియంబర్స్ మెంట్, అలాగే ముస్లిమ్స్ కు 4% రిజర్వేషన్ పేద వాళ్లకు ఇందిరమ్మ గృహాలు ఇలాంటి ఎన్నో పధకాలు ప్రెవశపెట్టిన మహానుభావుడని ఆయనను స్మరించటం మన బాధ్యత అని అన్నారు . మళ్ళీ ఆరోజు లు రావాలి అంటే రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలని అలాగే రాష్టం లో షర్మిల రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని ఆశించారు . ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు రెహానా, జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాని, జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి మహబూబ్ వలి, మార్కాపూర్ టౌన్ అధ్యక్షుకు ఇమ్రాన్, తర్లు పాడు పట్టణ అధ్యక్షులు హుస్సన్, యూసుఫ్ తదితర అభిమానులు పాలొన్నారు .
View More
Latest News
08 Jul 2025 12:06 PM
2
74
Newsread Image

No.1 Short News

Vijaya Chandra
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పండ్ల మొక్కలు నాటే కార్యక్రమం
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం రేకులకుంట పంచాయతీ వాంపల్లి చెరువు గ్రామంలోని నాగిపోగు సుధాకర్, నాగిపోగు చంద్రశేఖర్ రైతుల పొలంలో పండ్ల మొక్కలు నాటిన టిడిపి మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి EXMPP మాలేపాటి సుబ్బారావు మరియు ఉపాధిహామీ ఏపీఓ హరికృష్ణ ,టెక్నికల్ అసిస్టెంట్ రేణుక, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్ ల ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది
View More
Latest News
08 Jul 2025 11:57 AM
4
79
Newsread Image

No.1 Short News

Vijaya Chandra
మా పోల్లాల్లోకి దారి ఇవ్వండి రైతుల ఆవేదన
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం నాగిశెట్టిపల్లె పంచాయతీలోని రైతులు తమ పొలాల్లోకి వెళ్లడానికి దారి ఇవ్వండి అంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దిరశవంచపొలం నాగి శెట్టి పల్లె పొలం మధ్యలో కొంతమేర ప్రభుత్వ బంజరు భూమి ఉండేదని దాని గుండానే మా పొలాల్లోకి వెళ్లే వారమని కొంతమంది నాయకులు ఆ భూమిని ఆక్రమించుకొని తమ పొలాల్లోకి దారి లేకుండా చేశారని రైతులు ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే గాని ప్రభుత్వాధికారులు గాని స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు
View More
Latest News
08 Jul 2025 10:13 AM
1
96
Newsread Image

No.1 Short News

Newsread
Job Oriented Courses For Women's
Education
07 Jul 2025 21:35 PM
0
101
View Latest Short News
😔
Oops! You're offline.
It looks like you've lost your internet connection.
Please check your network and try again.

Find News

News Categories

  • All Categories
  • Jobs (7)
  • Latest News (717)
  • Motivation (10)
  • Crime News (21)
  • Local Ads (37)
  • Entertainment (15)
  • Local Updates (194)
  • Sports News (12)
  • Education (11)
  • Business Promotions (1)
  • Politics (65)
  • Breaking News (97)
  • Install App
    ALL
    | newsread.in

    Newsread
    For better experience and daily news update.
    Download our app from play store.