AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. స్వామి వారి దర్శనానికి 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 70,824 మంది భక్తులు దర్శించుకోగా 25,674 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ.3.84 కోట్లు సమకూరింది.
కళారంగంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కృషికి యూకే ప్రభుత్వం రేపు ఆయనను సన్మానించనుంది. 'లైఫ్లైమ్ అచీవ్మెంట్ అవార్డు'ను మెగాస్టార్కు యూకే పార్లమెంట్ ప్రదానం చేయనుంది. ఈ క్రమంలో ఆయన లండన్ చేరుకోగా అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. గత ఏడాది ఆయన్ను పద్మవిభూషణ్ అవార్డు, ఏఎన్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం వరించిన సంగతి తెలిసిందే.
గుంటూరు: 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన
గుంటూరులోని హిందూ కాలేజీ హై స్కూల్ లో 10వ తరగతి పరీక్షలను ఏర్పాటు చేసిన అధికారులు. పరీక్ష కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేవని ఆందోళన.
పరీక్షా కేంద్రం వద్ద హాల్ టికెట్స్ నెంబర్స్, రూమ్ నెంబర్స్ సరిగా లేవని విద్యార్థుల ఆందోళన.అధికారులు పరీక్ష కేంద్రాల వద్ద క్లాస్ రూములకు తాళాలు కూడా తీయలేదని విద్యార్థుల తల్లిదండ్రులు గగ్గోలు.
కనీస సౌకర్యాలు లేవని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్న అధికారులు.
దర్శి: ఆపద సమయంలో మహిళల రక్షణకు శక్తి టీమ్ ఏర్పాటు
ప్రతి మహిళ, చిన్నారుల రక్షణ,భద్రత మొదట ప్రాధాన్యత అని, ఆపదలో ఉన్న వారిని రక్షించడమే లక్ష్యంగా శక్తి టీమ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని దర్శి డిఎస్పీ బి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మహిళలు భద్రత,రక్షణకు ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన శక్తి యాప్ ద్వారా ఆపద సమయంలో మహిళలు,బాలికలు రక్షించేందుకు తక్షణమే స్పందించి చేరుకునేందుకు వీలుగా దర్శి సబ్ డివిజన్ పరిధిలో శక్తి బృందం ఏర్పాటు చేశారు. ఈ బృందం లో ఒక ఎస్సై, ముగ్గురు మేల్ కానిస్టేబుల్స్, ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్, ఇంకా మద్దతు గా సబ్ డివిజన్ లో వున్న ఉమెన్ పీసీ లందరూ సపోర్ట్ గా వుంటారని తెలిపారు.ఎవరికైనా, ఎప్పుడైనా ఏదైనా ఆపద ఎదురైతే శక్తి యాప్ లో ఆప్షన్స్ ను ఉపయోగించి రక్షణ పొందవచ్చునని దర్శి డీఎస్పీ తెలిపారు.
కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. కానీ అందరికీ మాంసాహారం సరిపడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భిణులు ఎక్కువగా నాన్ వెజ్ తినకూడదు. ఇందులో ఉండే కొవ్వు, కొలెస్ట్రాల్ వీరికి హానికరం. గుండె జబ్బులు, షుగర్ ఉన్నవారు కూడా ఇది తినకపోవడమే బెటర్. ఇందులో ఉండే సోడియం రక్తపోటును పెంచుతుంది. అలర్జీ, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం ఉన్నవారు నాన్ వెజ్ తింటే జీర్ణ సమస్యలు వస్తాయని అంటున్నారు.
ఒంగోలు జి.జి.హెచ్ లో కలెక్టర్ తమీం అన్సారియా ఆకస్మిక పరిశీలన...
అది... జిల్లా కేంద్రమైన ఒంగోలులోని ప్రధానమైన ప్రభుత్వ ఆసుపత్రి. శనివారం రాత్రి సుమారు 10:30 గంటలకు ఒక కారు ఈ ఆసుపత్రిలోకి వచ్చింది. కారు దిగిన ఒక మహిళ నేరుగా క్యాజువాలిటి వార్డులోకి వెళ్లారు. చికిత్స పొందటానికి కాదు.... అక్కడ ఉన్న వారికి చికిత్స అందుతున్న తీరును పరిశీలించడానికి వెళ్లిన ఆ మహిళను చూసిన సిబ్బంది ఆశ్చర్యపోయారు ! కారణం... వచ్చినది సాధారణ మహిళ కాదు !.. జిల్లా కలెక్టర్ !!. ఔను.... ఒంగోలు జి.జి.హెచ్. (రిమ్స్) లో వైద్య సేవలు అందుతున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించడం కోసం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.తమీమ్ అన్సారియా ఈ ఆకస్మిక తనిఖీ చేశారు. క్యాజువాలిటీతో పాటు గైనిక్ వార్డు, రేడియాలజీ సెక్షన్లను కలెక్టర్ పరిశీలించారు. క్యాజువాలిటీ వార్డులో వాస్తవంగా విధులు నిర్వహించాల్సిన సీనియర్ వైద్యులు ఆ సమయంలో లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు వైద్య సేవలు అందుతున్న తీరును, వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఎక్స్ రే, సిటీ , ఎంఆర్ఐ స్కాన్ కోసం వచ్చిన వారికి ఎప్పుడు చేస్తున్నారు, ఎప్పుడు రిపోర్టులు ఇస్తున్నారు, తదితర వివరాలను కూడా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. స్కానింగ్ చేయడంలో రోగులను ఇబ్బంది పెట్టేలా జాప్యం చేస్తే సహించబోనని ఆమె హెచ్చరించారు.
సుమారు 11:45 గంటల వరకు ఆసుపత్రిలో గడిపిన కలెక్టర్... పలువురు రోగులతోనూ, వారి బంధువులతోనూ ప్రత్యేకంగా మాట్లాడారు. పారిశుద్ధ్యం సరిగా లేదని పలువురు చెప్పగా కలెక్టర్ కూడా స్వయంగా చూశారు. పారిశుద్ధ్య నిర్వహణ, వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని వైద్యులను, సిబ్బందిని హెచ్చరించారు.
సీసీ ఫుటేజ్..మంచినీళ్లు కావాలని అడిగి మంగళ సూత్రం దొంగలించిన దొంగ
హైదరాబాద్ - KBHBలో టెంపుల్ బస్టాప్ సమీపంలోని ఓ ఇంటి వద్ద ముగ్గు వేస్తున్న మహిళని మంచినీళ్లు ఇవ్వమని అడిగి తన మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు గొలుసును ఎత్తుకొని వెళ్లిన దొంగ. ఘటనపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
అమరావతి: జర్నలిస్టుల అక్రిడేషన్ కాల పరిమితిని మరో మూడు నెలల పాటు పొడిగింపు. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. గతంలో ఇచ్చిన అక్రిడేషన్ గడువు 28వ తేదీ(రేపటి)తో ముగుస్తోంది. దీంతో మే నెల 31 వరకు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ
రెడ్డిపల్లి లో పండగపూట విషాదం,ఇద్దరు మృతి ఒకరికి తీవ్రగాయాలు
సత్యసాయి జిల్లా రొద్దం మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు మువకులు రాత్రి సమయంలో లేపాక్షి కి జబర్ధస్త్ టీం ను చూడడానికి బైకులో బయలు దేరారు మార్గం మధ్యలో దొమ్మితిమర్రి గ్రామం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది ప్రమాద వివరాలు తెలియాల్సి ఉంది వారిలో చరణ్ తిరుమలేష్ అనే ఇద్దరు యువకులు చనిపోయినారు ,భరత్ అనే యువకుడు తీవ్రగాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు
Kurichedu town TDP senior leaders, Mandala TDP general secretary Gandham Gurunatham died of heart attack...
కురిచేడు మండల టీడిపి సీనియర్ నాయకులు, మండల టీడిపి ప్రధాన కార్యదర్శి గంధం గురునాధం గుండెపోటు తో మరణించారు.
కాలువ లో యువకుడి గల్లంతు: యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన గొట్టిపాటి లక్ష్మి
దర్శి నుండి కురిచేడు వెళ్తున్న గొట్టిపాటి లక్ష్మీ కురిచేడు రోడ్ లోని సాగర్ కెనాల్ వద్ద దర్శి మండలం, వెంకటాచలం పల్లి పంచాయతీ పరిది లోని నడింపల్లి గ్రామానికి చెందిన 17సం||రాల పుప్పాల వీరనారాయణ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయిన విషయం అక్కడ గుమికుడి ఉన్న ప్రజలను చూసి ఆగి విషయం తెలుసుకొని వెంటనే దర్శి DSP బి. లక్ష్మీనారాయణ, దర్శి SI మురళి ని ఫోన్ లో సంప్రదించి గజ ఈతగాళ్ళను పిలిపించాలని, వీలైనంత త్వరగా ఈ కుర్రాడి ఆచూకీ తెలియజేయాలనీ ఆదేశించి వీరనారాయణ కి ఏమి అవ్వదని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు.
నెల్లిమర్ల తహసిల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం
విజయనగరం జిల్లా
నెల్లిమర్ల తహసీల్దార్ కార్యాలయం
వద్ద రైతు ఆత్మహత్యాయత్నం
వీఆర్వో రూ. 3 లక్షల లంచం డిమాండ్ చావే దిక్కంటూ తహసీల్దార్ కార్యాలయం వద్దే పురుగులు మందు తాగేందుకు యత్నం..
దర్శి లోని కురిచేడు రోడ్లో గల సాగర్ కాలువలో నడింపల్లికి చెందిన యువకుడు చెప్పులు టోపీ బైక్ కాలువ కట్ట పక్కన ఉంచి తాను కాలువలోకి దూకినట్లుగా సమాచారం. దూకిన అనంతరం నీటిలో కొట్టుకుపోవడం జరిగిందని సమాచారం, పూర్తి వివరాలు తెలియాల్సి వుంది
భరతమాతను మొగల్ సంకెళ్ళ నుంచి విడిపించిన యోధుడు శివాజీ - తిండి నారాయణ రెడ్డి
ఈరోజు దర్శి లో పొదిలి రోడ్ లోని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు తిండి నారాయణరెడ్డి ఇంటి వద్ద ఛత్రపతి శివాజీ జయంతి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తిండి నారాయణరెడ్డి మాట్లాడుతూ భరతమాతను మొగలుల సంకెళ్ల నుండి విడిపించి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన మేరునగ ధీరుడు అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో అమరేశ్వర రావు చెరుకూరి అనిల్ కుమార్ అడుసుమల్లి సాంబయ్య తిండి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు
విశాఖపట్నం కేజీహెచ్లో ఒక మహిళ మృతి
ఏపీలో జీబీస్ వైరస్ కారణంగా విశాఖపట్నం ప్రకాశం జిల్లాలకు చెందిన మహిళలు మరణించడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 59 కేసులు నమోదైనట్లు సమాచారం. అయితే 14 మందే చికిత్స పొందుతున్నారు. ఇది అంటువ్యాధి కాకపోయినా వెంటనే వైద్యం అందకపోతే ఒళ్లంతా వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే ఆస్పత్రిలో చేరాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలంటున్నారు.
రాష్ట్ర సవరణ బిల్లుకు వ్యతిరేకంగా గొప్ప నిరసన ర్యాలీ జరిగింది. రాష్ట్ర మైనారిటీ నాయకుడు సయ్యద్ సమి హుస్సేని, ముస్లిం ఐక్యవేదిక నాయకులు కలెక్టర్కు, మంత్రి నారాయణను వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ వక్స్ ఆస్తులను దోచుకోవాలని కుట్ర చేస్తోందని, ముస్లింలను ఆర్థికంగా దెబ్బతీయడానికే బిల్లు తెచ్చిందని ఆరోపించారు. వక్స్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, కేంద్రం తన నిరంకుశ వైఖరి మార్చుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ వక్స్ ఆస్తుల రక్షణకై ముస్లిం మైనారిటీలు, ప్రజాస్వామ్య ప్రియులు రోడ్డుపై వస్తారని హెచ్చరించారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఏపీ పోలీసులు ఇవాళ ఉదయం అరెస్టు చేశారు. అనంతరం వల్లభనేని వంశీని గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగురోడ్డు మీదుగా విజయవాడకు తరలిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో భాగంగానే ఆయన్ను పోలీసులు అరెస్టుచేసినట్లు సమాచారం. మరోవైపు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో వంశీని ఏపీ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వంశీని ఏ కేసులో అరెస్టు చేశారనే విషయంపై విజయవాడ వెళ్లిన తరువాత పోలీసులు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
తాళ్ళూరు మండలంలోని బొద్దికూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత ప్రభుత్వం నాడు-నేడు పథకం క్రింద ఏర్పాటు చేసిన రూ.5 లక్షల విలువైన వాటర్ ప్లాంట్ మొరాయించింది . అప్పుడు మూణ్ణాళ్ల ముచ్చట గా పనిచేసి తర్వాత మొరాయించింది. ఎన్నిసార్లు రిపేర్ చేయించినా ఉపయోగం లేదు, ప్రస్తుతం పని చేయటం లేదు. వాటర్ , విద్యార్థుల త్రాగునీటి అవసరాలను తీర్చే ఏర్పాటు చేయాలని ఎస్.ఎం.సి సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం
27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై బీజేపీ జెండా
12 ఏళ్ల ఆమ్ఆద్మీ పార్టీ పాలనకు పుల్స్టాప్
ఓటమిపాలైన పలువురు ఆప్ అగ్ర నేతలు
మూడోసారి కూడా ఖాతా తెరవని కాంగ్రెస్.
నకరికల్లు-అద్దంకి నార్కెట్ పల్లి రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పాత కంప్యూటర్ల సామానులతో హైదరాబాద్ వైపు వెళుతున్న ఓ లారీ ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు మరొకరిని స్థానిక వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
నాగర్ కర్నూల్ చారకొండ లో త్రివ ఉద్రిక్తత చిన్నారిని సైతం జిప్ లో బలవంతంగా ఎక్కిస్తున్న పోలీసులు
బిగ్ బ్రేకింగ్ న్యూస్ :నాగర్ కర్నూల్ జిల్లా చారకొండలో తీవ్ర ఉద్రిక్తత
నిరసన చేస్తున్న చిన్న పాపను సైతం పోలీసు వాహనాల్లో తరలిస్తున్న పోలీసులు. జడ్చర్ల-కోదాడ 167 వ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా బైపాస్ రోడ్డు కోసం చారకొండలో 29 ఇండ్లను కూలగొట్టడానికి సిద్ధం అయిన అధికారులు
పోలీసు బలగాలతో జేసిబిలతో వచ్చిన అధికారులు. బైపాస్ కోసం మా ఇండ్లు కూలగొట్టొద్దు అని బాధిత కుటుంబాలు నిరసనలు చేస్తున్నారు
మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల/ కళాశాలలో నిన్న రాత్రి పదో తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి.. డీజే సౌండ్ బాక్స్ లను ఏర్పాటు చేశారు.ఈ క్రమంలో మరిపెడ మండలం తానం చర్ల శివారు సపావట్ తండాకు చెందిన సీఈసీ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని సపావట్ రోజా (16).. వేదికపై డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.వెంటనే తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు రోజాను మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు
ముగిసిన దిల్ రాజు విచారణ
ఐటీ అధికారులు అడిగిన డాక్యుమెంట్లను, బ్యాంక్ స్టేట్మెంట్లను సబ్మిట్ చేసినట్టు సమాచారం
రెండు గంటలపాటు సాగిన విచారణ
అందుబాటులో ఉండాలని, ఎప్పుడు పిలిచినా రావాలని కోరిన ఐటీ అధికారులు
కూడవెళ్లి వాగులోకి కాళేశ్వరం నీళ్లు - ఆనందంలో రైతులు
కూడవెళ్లి వాగులోకి కాళేశ్వరం నీళ్లు.. ఆనందంలో రైతులు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కొడకండ్ల వద్ద అధికారులు నీళ్లు విడుదల చేయడంతో తుజాల్ పూర్ చెక్ డ్యాంకు నీళ్లు చేరాయి
కూడవెళ్లి వాగులోకి పంటలు ఎండిపోయే సమయంలో కాళేశ్వరం నీళ్లు రావడంతో, రైతులు హర్షం వ్యక్తం చేశారు -
అమెరికా నుంచి భారత్కు అక్రమవలసదారుల విమానం
సీ-17 మిలటరీ ఎయిర్క్రాఫ్ట్లో భారతీయులను వెనక్కి పంపుతున్న అమెరికా
మొత్తం 205 మందితో టెక్సాస్ నుంచి బయలుదేరిన విమానం
సుమారు 18 వేల మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్టు గుర్తింపు
డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా వరుసగా అందరినీ వెనక్కి పంపేందుకు ఏర్పాట్లు
సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కన్నీళ్లు పెట్టించి దృశ్యాలు
సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కన్నీళ్లు పెట్టించే దృశ్యాలు
చారకొండలో ఇల్లు కూల్చేస్తుంటే భోరున విలపిస్తున్న వృద్ధ దంపతులు
తమకు ఉన్న గూడు కూల్చేస్తే ఎలా బ్రతకాలంటూ పోలీసులను వేడుకున్న వృద్ధ దంపతులు - news credits by Telugu Scribe
భారతీయులను వెనక్కి పంపుతున్న అమెరికా
అమెరికా నుంచి భారత్కు అక్రమవలసదారుల విమానం
సీ-17 మిలటరీ ఎయిర్క్రాఫ్ట్లో భారతీయులను వెనక్కి పంపుతున్న అమెరికా
మొత్తం 205 మందితో టెక్సాస్ నుంచి బయలుదేరిన విమానం
సుమారు 18 వేల మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్టు గుర్తింపు
డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా వరుసగా అందరినీ వెనక్కి పంపేందుకు ఏర్పాట్లు
అక్రమంగా నివసించేవారి విషయంలో అమెరికాకు సహకరిస్తున్న భారత ప్రభుత్వం -news credits by Telugu Scribe
రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై మృతి
జగిత్యాల - గొల్లపల్లి మండలంలో , చిల్వకోడూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగి ఎస్సై శ్వేత మృతి
సెల్ఫ్ డ్రైవింగ్ లో వస్తూ చెట్టును ఢీ కొట్టిన ఎస్సై శ్వేత కారు, అక్కడికక్కడే మృతి చెందిన ఎస్సై శ్వేత
, జగిత్యాల ఎస్పీ ఆఫీస్ లో అటాచ్గా ఉన్న ఎస్సై శ్వేత -news credits by Telugu Scribe
పల్లె దావఖానలు ఒక్క పూటకే పరిమితం
కామారెడ్డి జిల్లాలో అధికారుల పర్యవేక్షణ లేక రోజంతా పేదలకు వైద్యాన్ని అందించే పల్లె దావఖానలు మధ్యాహ్నం 1 గంటలకే ముసివేస్తున్నారు
మహుబూబాబాద్ జిల్లా నరసింహులుపేట మండలం జయపురం 2 గంటలకే మూసివేసిన పల్లె దావాఖాన
రాజన్న సిరిసిల్ల జిల్లా పల్లె దావఖానల్లో తీవ్ర మందుల కొరత ఉంది
గత ప్రభుత్వంలో అద్భుతంగా రోజంతా నడిచిన దావఖానలు ఒక్కపూట నడవడం ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు - News Credits By Telugu Scribe
శంకర్ దాదా MBBS సినిమా స్టైల్ లో రాత్రికి రాత్రే ఆసుపత్రి మార్పు
శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో లాగా రాత్రికి రాత్రే ప్రభుత్వ హాస్పిటల్ పేరు మార్పు!
కొడంగల్ మెడికల్ కాలేజ్ కోసం తాండూరు ఆసుపత్రికి కొడంగల్ పేరు
ఇదేం విచిత్రం అంటూ ఫ్లెక్సీ చింపేసిన స్థానికులు
వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి కొడంగల్ జనరల్ ఆసుపత్రిగా పేరు మారుస్తూ సోమవారం రాత్రి ఫ్లెక్సీ కట్టడంతో కలకలం
ప్రవేశద్వారానికి ఉన్న బోర్డుపై 'ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి- కొడంగల్' అంటూ ఫ్లెక్సీ కట్టడాన్ని నిలదీసిన స్థానికులు
ఆసుపత్రి వర్గాల నుంచి సరైన సమాచారం లేకపోవడం, ఫ్లెక్సీ కడుతున్న గుత్తేదారు దురుసుగా మాట్లాడడంతో స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని ఫ్లెక్సీని చించేశారు
ఇదీ అసలు కథ
గత ప్రభుత్వంలో జిల్లాకో మెడికల్ కాలేజ్ నిర్మాణంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజీను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి తన సొంత నియోజవర్గం కొడంగల్ కు మార్చుకున్నారు.
దీనికి అనుబంధంగా 220 పడకల ఆసుపత్రిని చూపించాల్సి ఉండగా మరో వారంలో ఢిల్లీ నుంచి జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) బృందం కొడంగల్ కు తనిఖీ నిమిత్తం రానుంది.
వారికి చూపించేందుకు తాండూరులోని 200 పడకల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి పేరును కొడంగల్ జనరల్ ఆసుపత్రిగా మారుస్తూ సోమవారం రాత్రి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. -news credit's by Telugu Scribe
ఐటీ అధికారుల ఎదుట హాజరైన FDC చైర్మైన్, నిర్మాత దిల్ రాజు
గత వారం దిల్ రాజు ఇంట్లో నాలుగు రోజుల పాటు సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు
సోదాల అనంతరం వ్యాపారాలకు సంబంధించిన వివరాలు తీసుకురావాలని దిల్ రాజుకు నోటీసులు
సినిమాల నిర్మాణం, ఎగ్జిబిషన్ లాభాల వ్యవహారంపై ఐటీ అధికారుల ఆరా - news credits by Telugu Scribe
నల్గొండ బీజేపీలో వర్గపోరు
నాగం వర్షిత్ రెడ్డిని రెండోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేసినందుకు బీజేపీ సీనియర్ నాయకుల అసంతృప్తి
పార్టీని మేనేజ్ చేసి పదవి తెచ్చుకున్నాడని.. అధ్యక్షుడిని మార్చకపోతే పార్టీ కార్యాలయం గడప కూడా తొక్కమని హెచ్చరించిన బీజేపీ సీనియర్లు
గొడవకి సంబంధం లేని వృద్ధుడిని లాక్కెళ్తున్న పోలీసులు
మినిస్టర్ క్యార్టర్స్ వద్ద ఉద్రిక్తత
రోడ్డు పక్కన నిల్చున్న వృద్ధుడిని అరెస్ట్ చేసి లాక్కెళ్తున్న పోలీసులు
సర్ నాకు ఏం తెల్వదని కాళ్లు పట్టుకున్నా కూడా కనికరించకుండా లాక్కెళ్తున్న పోలీసులు
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున రెబల్ అభ్యర్థి నామినేషన్
ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ వేసిన ఆదిలాబాద్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ
ఆ స్థానానికి నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన పార్టీ అధిష్టానం
ఇప్పటికే తన స్థానాన్ని వేరే అభ్యర్థికి ప్రకటించడంపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి - NEWS CREDITS TELUGU SCRIBE
బ్రేకింగ్ న్యూస్
మినిస్టర్ క్వార్టర్స్లోకి దూసుకెళ్లిన వీఆర్ఏలు.. అడ్డుకుంటున్న పోలీసులు
పోలీసులకు, వీఆర్ఏలకు మధ్య తోపులాట
ఉద్రిక్తంగా మారిన పరిస్థితి
రైల్వే బడ్జెట్ లో ఏపీ కి రికార్డ్ స్థాయి లో కేటాయింపులు
రైల్వే బడ్జెట్లో ఏపీకి రికార్డు స్థాయిలో కేటాయింపులు
ఏపీకి రూ. 9417 కోట్లు కేటాయించిన కేంద్రం
తెలంగాణకు రూ.5337 కోట్లు కేటాయించినట్లు ప్రకటించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ - Video Credits Telugu Scribe
అవ్వి నా భార్య , నా గల్ ఫ్రెండ్ కి సంబంధించిన వీడియోస్ - మస్తాన్ సాయి
అవి నా భార్య.. నా గర్ల్ ఫ్రెండ్ వీడియోలు - మస్తాన్ సాయి
కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు
2017లో హనీమూన్కు వెళ్లినప్పుడు తీసుకున్న వీడియోలు అవి
ఇప్పుడు ఉన్న హార్డ్ డిస్క్లో లావణ్యకు సంబంధించిన యాంటీ ఎవిడెన్స్ ఉన్నాయి
వాటిని మాయం చేసేందుకు లావణ్య హార్డ్ డిస్క్ ను దొంగిలించింది -మస్తాన్ సాయి - News Credits Telugu Scribe
ఢిల్లీ ఇలా అవడానికి కారణం ఎవరు?? పదేళ్లు ఎవరు పరిపాలించారు??
ఎప్పుడో 1995లో పాడుబడిపోయిన హైదరాబాద్ మాదిరి ఢిల్లీ తయారైందిఅదే పదేళ్లు డబల్ ఇంజన్ సర్కారు అధికారంలో ఉండి ఉంటే వాషింగ్టన్ ను తలదన్నేలా ఢిల్లీ తయారయ్యేది.. - ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ కొస్తే చాలా బాధ కలుగుతుంది
పలు జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమించిన తెలంగాణ బీజేపీ
హైదరాబాద్ అధ్యక్షుడిగా లంక దీపక్ రెడ్డి
భూపాల్ పల్లి అధ్యక్షుడిగా నిశిధర్ రెడ్డి
కామారెడ్డి అధ్యక్షుడిగా నీలం చిన్న రాజులు
హనుమకొండ అధ్యక్షుడిగా కొలను సంతోష్ రెడ్డి
వరంగల్ అధ్యక్షుడిగా గంట రవికుమార్
నల్లగొండ అధ్యక్షుడిగా నాగం వర్షిత్ రెడ్డి
జగిత్యాల అధ్యక్షుడిగా రాచకొండ యాదగిరి బాబు
అయోధ్యలో అమానుష ఘటన భాగవతం వినడానికి ఇంటినుండి వెళ్లి తిరిగి ఇంటికి రాని 22 ఏండ్ల దళిత యువతి
ఆమె మృతదేహాన్ని సమీప కాలువలో అత్యంత దారుణమైన స్థితిలో గుర్తింపు
కాళ్ళు చేతులు విరగొట్టడమే కాకుండా కళ్ళు పీకేసి, మర్మావయాల్లో కర్ర దూర్చినట్టు ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు
ఈ దుర్ఘటనపై మీడియాతో మాట్లాడుతూ బాధితురాలికి న్యాయం జరగకపోతే ఎంపీ పదవకి రాజీనామా చేస్తా అంటూ కంటతడి పెట్టిన ఫజియాబాద్ ఎంపీ అవధేశ్
SC, ST అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న వారికి సుప్రీంకోర్టు చెంపపెట్టు
SC, ST వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా, ప్రజాక్షేత్రంలో బహిరంగంగా దూషించినట్టు నిరూపించాలని సుప్రీంకోర్టు సృష్టం చేసింది. రక్షణ కోసం తెచ్చిన ఈ చట్టాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని, సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో నకిలీ కేసులు తగ్గుతాయని నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.
శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలం బాపనపల్లి వద్ద కియాకు సంబంధించిన వేస్ట్ మెటీరియల్కు గుర్తుతెలియని వ్యక్తులు గురువారం నిప్పు పెట్టారు. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశం జనావాసాలకు దూరంగా ఉండటంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు అన్నారు. అగ్ని కీలకలు అదుపు చేయడానికి ప్రయత్నించిన సాధ్యం కాలేదని స్థానికులు అన్నారు.
ఒక ఫెయిల్యూర్ & అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి చంద్రబాబు - బూచేపల్లి హాట్ కామెంట్స్
గురువారం మధ్యాహ్నం ఒంగోలు లో జరిగిన మీడియా సమావేశం లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై బూచేపల్లి విమర్శలు గుప్పించారు. చరిత్ర లో చంద్రబాబు ఒక ఫెయిల్యూర్, అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి గా మిగిలిపోనున్నారని, పవన్ కళ్యాణ్ ఎన్నికల కు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, మీరు కాపులకు ఇచ్చిన హామీ ఒక్కటైనా చేశారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కూటమి నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. ఈ క్రమంలోనే 'తల్లికి వందనం' పథకం అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పథకం అమలుపై ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లికి వందనం పథకం మే నుంచి అమలు కాబోతుందని తెలిపారు. విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయాన.. రాష్ట్రంలో విద్యా శాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. దీని ద్వారా బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15000 అందనున్నాయి.
విమానం, హెలికాప్టర్ ఢీ.. నదిలో నుంచి 18 మృతదేహాల వెలికితీత
వాషింగ్టన్ లోని ఎయిర్ పోర్టులో ల్యాండయ్యే క్రమంలో పీఎస్ఏ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఆర్మీకి చెందిన హెలికాప్టర్ ను ఢీ కొట్టింది. దీంతో గాల్లోనే రెండు ముక్కలైన విమానం పోటోమాక్ నదిలో పడిపోయింది. హెలికాప్టర్ కూడా నిట్టనిలువుగా నదిలో పడిందని అధికారులు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది.ఘటనలో నదిలో నుంచి 18 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు.ప్రమాద సమయంలో విమానంలో సిబ్బంది సహా 64 మంది, ఆర్మీ హెలికాప్టర్ లో ముగ్గురు సైనికులు ఉన్నారని చెప్పారు.
శ్రీ గౌతమి లో ఫుడ్ పాయిజన్ కాలేదు తేల్చి చెప్పిన DMHO...
ఈనెల 26, 27 న దర్శి పట్టణం లోని అద్దంకి రోడ్ లో గల శ్రీ గౌతమి విద్యాసంస్థల లో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకల అనంతరం, మరుసటి రోజు ఉదయం ముగ్గురు విద్యార్థులకు జ్వరం రాగా దర్శి లోని ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు.. ఈలోపు ఫుడ్ పాయిజన్ జరిగిందని వార్తలు షికార్లు చేసాయి, ఈ క్రమంలో DMHO వారు క్యాంపస్ కి విచ్చేసి పరిసరాలను పరిశీలించారు, విద్యార్థులకు వైద్య పరీక్షలను నిర్వహించగా ఇవి సాధారణ వాతావరణ మార్పుల వల్ల జలుబు, జ్వరం వచ్చినదనీ, భయపడాల్సిన విషయం ఏమీ లేదని తేల్చి చెప్పడంతో పుకార్లకు చెక్ పడింది. అలాగే ఈ కాలం లో వచ్చే వ్యాధుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అర్బన్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి కళ్లు చెదిరే ఆస్తులు.. జాతీయ స్థాయిలో చర్చ
తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పై మరోసారి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఆ పార్టీ తాజాగా విడుదల చేసిన ఆడిట్ రిపోర్టే దీనికి కారణం. గతేడాది మార్చి 31 నాటికి బీఆర్ఎస్ పార్టీకి ఏకంగా రూ.1,618 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఈ రిపోర్టు వెల్లడించింది. 2023–24 లో బీఆర్ఎస్ కు వచ్చిన విరాళాలు, బ్యాంకు వడ్డీ కలిపి రూ.685.5 కోట్లు. అయితే, ఇదే పీరియడ్ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అందుకున్న విరాళాలు రూ.289 కోట్లు మాత్రమే. దీనిని బట్టి బీఆర్ఎస్ పార్టీ ఆదాయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా, పార్టీ ఆస్తులు, విరాళాలు, నిర్వహణ ఖర్చులకు సంబంధించి బీఆర్ఎస్ ఆడిట్ రిపోర్టును కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. ఈ రిపోర్టులో వెల్లడించిన ప్రకారం బీఆర్ఎస్ పార్టీ ఆస్తుల వివరాలు
ఎనికేపాడులో జాతీయ రహదారి పక్కన జనసేన నాయకుడు టంకశాల సుబ్బారావు ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగా, మహాత్మా గాంధీ విగ్రహాలు ఏర్పాటు చేశారు. అయితే రూరల్ మండల జనసేన అధ్యక్షుడు పొదిలి దుర్గారావుతో కొంతమంది జనసేన నాయకులు ఈ విగ్రహాలతో పాటు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా విగ్రహాలను ఆవిష్కరిద్దామన్న అభిప్రాయంలో ఉన్నారు. ఈ విషయంపై జనసేనలోని రెండు వర్గాల మధ్య కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి.