Select Location
Newsread Image

No.1 Short News

Newsread
బీహార్ లో బిజెపి గెలుపుపై దర్శి లో సంబరాలు
ఈరోజు భారతీయ జనతా పార్టీ బీహార్లో ఘన విజయం సాధించిన సందర్భంగా దర్శి పట్టణం స్థానిక బిజెపి నాయకులు బాణసంచాలు పేల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిజెపి నాయకులు ఏపీ రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ మాడపాకుల శ్రీనివాసులు మాట్లాడుతూ ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో బీహార్లో సునామి సృష్టించారని రాబోవు స్థానిక ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో గాని భారతీయ జనతా పార్టీ హవా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు తిండి నారాయణ రెడ్డి, మండల అధ్యక్షుడు కాకర్లనాగసాయి, జిల్లా కార్యవర్గ సభ్యుడు అచ్యుత గురువర్ధన్ రావు, పట్టణ అధ్యక్షులు వల్లభ వరపు అమరేశ్వర రావు అచ్యుత్ శరత్ బచ్చు అనిల్ యువమోర్చా నాయకులు అనిల్, జనసేన నాయకులు పాపారావు, శివ కోటా చారి కార్యకర్తలు పాల్గొన్నారు.
View More
Latest News
14 Nov 2025 20:09 PM
1
22
Newsread Image

No.1 Short News

Newsread
ఏపీలో స్థానిక ఎన్నికలు.. కీలక అప్డేట్?
ఏపీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు సంబంధించిన సందడి మొదలైంది. నవంబర్ 15వ తేదీలోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురణ, ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాల్సి ఉందని ఇటీవల SEC తెలిపారు. నవంబర్ 30 లోగా పోలింగ్ కేంద్రాల ఖరారు, ఈవీఎంల సన్నాహాలు పూర్తి చేసి, డిసెంబర్ 15లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని SEC యోచన చేస్తోంది. 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి, అదే నెలలో ఫలితాలు ప్రకటించేందుకు SEC ప్రణాళిక సిద్ధం చేసిందని సమాచారం.
View More
Latest News
14 Nov 2025 20:03 PM
0
36
Newsread Image

No.1 Short News

Newsread
చిల్డ్రన్స్ డే వేడుకల్లో విద్యార్థులతో దర్శి సీఐ, ఎస్సై.
చిల్డ్రన్స్ డే వేడుకల సందర్భంగా, ప్రకాశం దర్శి పోలీసులు దర్శి పట్టణంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్‌ను సందర్శించారు. వారితో బాలల దినోత్సవ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవసరమైన నోట్‌బుక్లు, రైటింగ్ ప్యాడ్లు, పెన్నులు మరియు స్వీట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో దర్శి సీఐ శ్రీ వై. రామారావు, ఎస్సై శ్రీ ఎం. మురళి మరియు సిబ్బంది పాల్గొన్నారు. వారు విద్యార్థులతో స్నేహపూర్వకంగా మసలుకుని, వారి భవిష్యత్తు లక్ష్యాలపై మార్గదర్శకత్వం అందించారు. సుమారు 60 మంది విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్లు, నోట్ బుక్స్, స్వీట్లు పంచి వారికి ఆనందాన్ని పంచారు.
View More
Latest News
14 Nov 2025 19:52 PM
0
25
Newsread Image

No.1 Short News

Newsread
పేదల గృహప్రవేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గం, దేవగుడిపల్లెలో పేదల గృహ ప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ముందుగా లబ్ధిదారు హేమలత కుటుంబంతో కలిసి గృహ ప్రవేశం చేశారు. అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గృహ ప్రవేశం సందర్భంగా హేమలత, ఆమె భర్త ఈశ్వర్‌కు నూతన వస్త్రాలు బహుకరించారు. మరో లబ్ధిదారు షేక్ ముంతాజ్ బేగం నివాసానికి సీఎం వెళ్లారు. గృహప్రవేశం అనంతరం నమాజ్‌లో పాల్గొన్నారు. ముంతాజ్ బేగం కుటుంబ సభ్యులకు కూడా సీఎం నూతన వస్త్రాలు అందించారు.
View More
Latest News
12 Nov 2025 19:25 PM
0
31
Newsread Image

No.1 Short News

Newsread
ఇమామ్ మౌజన్ల గౌరవ వేతనాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 12 నెలల ఇమామ్ & మౌజ్జన్ గౌరవ వేతనాల కొరకు 90 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది
View More
Latest News
12 Nov 2025 18:30 PM
0
24
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి లో మెడికల్ కాలేజీ ల ప్రవేటీకరణ కు వ్యతిరేకంగా వైకాపా ర్యాలీ
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా దర్శి లో స్థానిక ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పొదిలి రోడ్డులోని వైఎస్ఆర్సిపి కార్యాలయం నుండి గడియార స్తంభం వరకు ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహశీల్దార్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలోవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
View More
Latest News
12 Nov 2025 18:25 PM
0
33
Newsread Image

No.1 Short News

Newsread
పక్కా గృహాల భూమి పూజ కార్యక్రమంలో డా||గొట్టిపాటి లక్ష్మి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ – ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 క్రింద 54 మంది లబ్ధిదారులకు పక్కా గృహమూల మంజూరు ఉత్తర్వుల పంపిణీ & భూమి పూజ కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా|| లక్ష్మీ మాట్లాడుతూ ప్రతి పేదవాడి ఇంటి కల నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. అభివృద్ధి–సంక్షేమం రెండు కళ్ళ వలె కలిసి నడుస్తున్నాయని, వైసిపి అవినీతి పాలనకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.
View More
Latest News
12 Nov 2025 18:08 PM
0
38
Newsread Image

No.1 Short News

Newsread
ఒంగోలు లో ఘనంగా నేషనల్ మైనారిటీ డే వేడుకలు
ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు దేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రివర్యులు కీర్తిశేషులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నేషనల్ మైనార్టీస్ డే సందర్భంగా ఒంగోలు నగరంలోని అబుల్ కలాం ఆజాద్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా BJMC రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆల్ ఇండియా పోర్ట్ ట్రాస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా , BJMC ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, షేక్ సిద్ధాంబీ , BJMC ప్రకాశం జిల్లా అధ్యక్షులు పఠాన్ సాజీద్ ఖాన్, BJMC రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉప్పుగుండూరి వెంకటేశ్వరరావు, కరాటే కోచ్ షేక్ కరీముల్లా మరియు ముస్లిం సోదరులు తదితరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా షేక్ ఖలీఫాతుల్లా బాషా మాట్లాడుతూ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి విద్యారంగ అభివృద్ధికి పాటుపడిన మహోన్నత వ్యక్తి మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ అన్నారు. దేశ స్వతంత్రం కోసం ఆనాడు త్యాగాలు చేసిన వ్యక్తులలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఒక వ్యక్తి అని, ఆయన జీవితాంతం దేశ అభివృద్ధి కోసం పాటుపడ్డారని తెలిపారు. కార్మికులతో పాటు ప్రజలందరూ ముఖ్యంగా మన మైనార్టీ సోదరులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లి పేద విద్యార్థుల విద్యాభ్యాసం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
View More
Latest News
11 Nov 2025 18:39 PM
1
23
Newsread Image

No.1 Short News

Newsread
డిప్యూటీ స్పీకర్ RRR తో డాక్టర్ గొట్టిపాటి భేటీ
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో దర్శి టీడీపీ ఇన్ ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గుంటూరు jkc కాలేజీ ఆడిటోరియంలో శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యులు బోడేపూడి వెంకట సుబ్బారావు అభినందన కార్యక్రమంలో అతిధిగా గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన డిప్యూటీ స్పీకర్ RRR తో కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో పరిస్థితులు తదితర అంశాలపై చర్చించారు.
View More
Latest News
07 Nov 2025 19:56 PM
1
48
Newsread Image

No.1 Short News

Newsread
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ
మెడికల్ కాలేజీల ప్రవేటీకరణ కు వ్యతిరేక కార్యక్రమం కోసం ఒంగోలు 44,45 డివిజన్ నందు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి , ఒంగోలు ఇంచార్జ్ చుండూరు రవి తదితరులు ఉన్నారు.
View More
Latest News
06 Nov 2025 21:29 PM
1
111
Newsread Image

No.1 Short News

Newsread
మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ.
మెడికల్ కాలేజీల ప్రవేటీకరణ కు వ్యతిరేక కార్యక్రమం కోసం ఒంగోలు 44,45 డివిజన్ నందు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి , ఒంగోలు ఇంచార్జ్ చుండూరు రవి తదితరులు ఉన్నారు.
View More
Latest News
06 Nov 2025 21:27 PM
0
34
Newsread Image

No.1 Short News

Newsread
న్యూయార్క్ సిటీకి తొలి ముస్లిం మేయర్!
జోహ్రాన్ మమ్దానీ 2025 న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో గెలుపొందారు. 34 ఏళ్ల డెమోక్రటిక్ సోషలిస్ట్ అభ్యర్థిగా, అయన ఆండ్రూ క్యూమో (స్వతంత్ర అభ్యర్థి)ను ఓడించి, 50.3% ఓట్లతో గెలిచారు. మమ్దానీ న్యూయార్క్ సిటీ చరిత్రలో మొదటి ముస్లిం మేయర్ మరియు ఆధునిక కాలంలో మొదటి ఇమ్మిగ్రెంట్ మేయర్.
View More
Latest News
06 Nov 2025 11:44 AM
0
30
Newsread Image

No.1 Short News

Newsread
తెలుగు రాష్ట్రాల్లో ఆగని బస్సు ప్రమాదాలు
పార్వతి మన్యం జిల్లాలో ప్రమాదానికి గురైన మరో బస్సు.మంటల్లో ఒడిశా ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధం.పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ఘటన.ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దింపిన డ్రైవర్.తప్పిన ప్రాణపాయం, మంటల్లో పూర్తిగా దగ్ధమైన బస్సు.విశాఖపట్నం నుంచి జైపూర్ వెళ్తున్న బస్సు అని సమాచారం.
View More
Latest News
06 Nov 2025 11:28 AM
0
35
Newsread Image

No.1 Short News

Newsread
కార్తీక పౌర్ణమి మహిళల కోలాటం లో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
కార్తీక పౌర్ణమి సందర్భంగా తాళ్లూరు మండలం, తురకపాలెం గ్రామం లో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన మహిళల కోలాటం ప్రదర్శన లో ముఖ్య అతిధులు గా దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - లలిత్ సాగర్ పాల్గొన్నారు. ఈసందర్బంగా కోలాటం ప్రదర్శించి న 40 మంది మహిళలకు డా|| లక్ష్మీ చీరలు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమం లో తురకపాలెం గ్రామ టిడిపి నాయకులు, తాళ్లూరు మండలం లోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.
View More
Latest News
05 Nov 2025 22:33 PM
1
48
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
టీడీపీ ఓడిపోదు..! మళ్లీ మళ్లీ పవర్ లోకి వస్తాం..! చంద్రబాబులో అంత కాన్ఫిడెన్స్‌కి కారణమేంటి..
వస్తామ్. మళ్లీ మళ్లీ పవర్‌లోకి వస్తాం. అసలు టీడీపీ ఓడిపోదు. రాసి పెట్టుకోండి. గెలుపు మనదే. ప్రభుత్వంలో ఉండేది కూడా టీడీపీనే. ఇది సీఎం చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలతో చెబుతున్న మాట ఇది. పవర్‌పై బాబు ధీమా వెనుక ప్లానేంటి? రాబోయే ఎన్నికలకు..ఫ్యూచర్‌ పాలిటిక్స్‌కు చంద్రబాబు దగ్గర ఉన్న అస్త్రాలేంటి? అంత గట్టిగా ఓడిపోబోమని చెప్పడానికి కారణమేంటి? ఏపీలో పవర్ షిఫ్లింగ్‌ సిస్టమ్‌ నడుస్తోంది. విభజన తర్వాత ఒకసారి టీడీపీ అధికారంలోకి వస్తే నెక్స్ట్ టైమ్‌ జగన్‌ పవర్‌లోకి వచ్చారు. తర్వాత మొన్నటి ఎన్నికల్లో కూటమి ల్యాండ్ స్లైడ్‌ విక్టరీతో ఏపీని పాలిస్తోంది. రాబోయే ఎన్నికల కోసం ఇటు కూటమి..అటు వైసీపీ ఎవరి అస్త్రాలు వాళ్లు రెడీ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే విపక్షంలో ఉన్న వైసీపీ 2029లో అధికారం తమదేనని ధీమాగా ఉంది. సీఎం చంద్రబాబు మాత్రం టీడీపీ ఎప్పటికీ ఓడదంతే అంటున్నారు.చంద్రబాబు మాటల్లో ఏదో పెద్ద ప్లానే ఉందన్న టాక్.. చంద్రబాబు నోట ఆ మాట వచ్చిందంటే ఆశామాషీ కాదు. ఎందుకంటే గ్రౌండ్‌ లెవల్ పరిస్థితులకు భిన్నంగా బాబు ఎప్పుడూ మాట్లాడరు. పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్‌లో నెగెటీవ్ అంశాల మీదే ఎక్కువ డిస్కస్ చేస్తారు. అలాంటిది టీడీపీకి ఓటమే ఉండదన్నట్లుగా బాబు..పార్టీ నాయకులతో చెప్పడం చూస్తుంటే ఏదో పెద్ద ప్లానే ఉందన్న టాక్ వినిపిస్తోంది. టీడీపీ ఓడిపోదు..ఇక నుంచి వచ్చే జరిగే ప్రతీ ఎన్నికలోనూ గెలిచి తీరుతుందని అన్నారట చంద్రబాబు. ఒకటి రెండు సార్లు కాదు అనేక సార్లు టీడీపీ గెలిచేలా చూస్తున్నామని చెప్పారు. ఒకే పార్టీ అధికారంలో ఉంటేనే ఏపీ అభివృద్ధి సాధ్యమని..ప్రజలు కూడా అలానే స్పందించేలా పార్టీ సమాయత్తం అవుతోందని బాబు చెప్పుకొస్తున్నారు. ఈసారి అధికారంలోకి వచ్చాక..చంద్రబాబు ప్లానింగ్..అడ్మినిస్ట్రేషన్ అంతా మారిపోయింది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుంచే ఎమ్మెల్యేల పనితీరు మీద ఆరా తీయడం మొదలు పెట్టారు. ప్రభుత్వం మీద ఎక్కడా నెగెటివిటీ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమస్యలు..ఇచ్చి హామీలు ఇలా అన్నింటిని పూర్తిగా అవగాహన చేసుకున్న బాబు 2024 ఎన్నికల తర్వాత మాత్రం వైసీపీకి ఏ మాత్రం చాన్స్ ఇవ్వకుండానే వ్యూహాలు అమలు చేస్తున్నారు. అటు పాలన, ఇటు పార్టీ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా మెయింటెన్ చేస్తున్నారు. కీలక స్కీమ్స్‌ అన్నీ ఒక్కొక్కటిగా అమలు.. బాబు అంటే అభివృద్ధి మంత్రమేనని.. సంక్షేమ పథకాలు, పేదలకు ఉచితాలు ఇవ్వరంటూ ఉన్న ప్రచారానికి చెక్‌ పెట్టి..సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. అన్నదాత సుఖీభవ, పెన్షన్లు, తల్లికి వందనం, వాహనమిత్ర ఇలా కీలక స్కీమ్స్‌ అన్నీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ..కూటమి పట్టు సడలకుండా ముందుకెళ్తున్నారు. రాబోయే ఎన్నికల్లోనే కాదు మరో 15ఏళ్ల పాటు కూటమిగానే ఉంటామని చెబుతున్నారు. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే ఉంటాయనేది చంద్రబాబు, పవన్ చెబుతున్న మాట. మరోవైపు వైసీపీ ఇంకా దూకుడు పెంచినట్లుగా కనిపించట్లేదన్న టాక్ వినిపిస్తోంది. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ లీడర్లతో పాటు జగన్ కూడా పెద్దగా జనాల్లోకి రావడం లేదన్న చర్చ ఉంది. పైగా విపక్షంలో వైసీపీ ఒంటరిగా ఉంది. 2024లో కూటమి దాదాపుగా 60శాతం ఓటు షేర్‌ను రాబట్టింది. ఇందులో ఏ కొంత తగ్గినా కొన్ని సీట్లు తగ్గుతాయే తప్ప అధికారం కోల్పోయేంత సీన్ ఉండదని లెక్కలు వేసుకుంటున్నారట చంద్రబాబు.గెలుపు మీద ధీమాగా ఉంటూనే వైసీపీని ఎక్కడా లైట్ తీసుకోవడం లేదు చంద్రబాబు. సమయం, సందర్భం దొరికిన ప్రతీసారి..మీటింగ్‌ ఏదైనా డయాస్ మరేదైనా జగన్‌ను, వైసీపీ పాలనను కార్నర్ చేస్తూనే ఉన్నారు. సేమ్‌టైమ్‌ అక్రమాలు, అవినీతి చేశారంటూ వైసీపీ లీడర్లకు ఒకరి తర్వాత మరొకరికి ఉచ్చు బిగిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ లీడర్లంతా గప్‌ చుప్‌ అయిపోయి..మీడియా ముందుకు రావడానికి కూడా ఆలోచిస్తున్నారట. ఇక రాజకీయంగా వైసీపీ 2019కు ముందున్నంత పటిష్టంగా ఉందా లేదా? ఏ నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ స్ట్రాంగ్‌గా ఉంది? అందుకు విరుగుడు ఏంటి? అంటూ ఇప్పటి నుంచే గ్రౌండ్‌ వర్క్ నడిపిస్తున్నారట చంద్రబాబు. జగన్ పాలనను జనాలు ఒకసారి చూసారు కాబట్టి ఆ పార్టీకి ప్రజల నుంచి అంత ఆదరణ దక్కకపోవచ్చన్న లెక్కల్లో ఉందట కూటమి. ఇలా తనదైన మంత్రాంగంతో..ఏపీ పొలిటికల్‌ గేమ్‌లో బాబు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకునే టీడీపీదే విజయం అన్నట్లుగా బాబు చెప్పినట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. బాబు ధీమానే నిజం కాబోతోందా? ఫ్యూచర్ పాలిటిక్స్‌ ఎప్పుడు ఎటు వైపు తిరుగుతాయో చూడాలి.
View More
Latest News
05 Nov 2025 20:22 PM
0
44
Newsread image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
ఏపీలో కొత్త జిల్లాలు.. మంత్రివర్గ ఉపసంఘం కీలక భేటీ..
ఏపీలో జిల్లాల పునర్విభజనపైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపైన మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, రామానాయుడు, హోంమంత్రి అనిత, బీసీ జనార్ధన్ రెడ్డి హాజరయ్యారు. మంత్రులు సత్యకుమార్ యాదవ్, నారాయణ వర్చువల్ గా పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మంత్రివర్గ ఉప సంఘం చర్చిస్తోంది. దీనిపై నిర్ణయం తీసుకుని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నారు
View More
Latest News
05 Nov 2025 20:22 PM
0
40
Newsread Image

No.1 Short News

Newsread
తుఫాన్‌ నష్టాలపై కలెక్టర్‌కి నివేదిక సమర్పించిన డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి
తుఫాన్‌ బీభత్సంతో ధ్వంసమైన రహదారులు, కాలువల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేయాలని దర్శి టిడిపి ఇన్‌ఛార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి జిల్లా కలెక్టర్‌ రాజబాబును కోరారు.ఒంగోలు కలెక్టర్‌ కార్యాలయంలో యువనేత డాక్టర్‌ కడియాల లలిత్‌ సాగర్‌తో కలిసి ఆమె తుఫాన్‌ కారణంగా జరిగిన ఆస్తి, పంటనష్టాలపై నివేదిక అందజేశారు. కలెక్టర్‌ సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దర్శి ప్రాంతంలో విపత్తును సమర్థంగా ఎదుర్కొన్న అధికారుల కృషిని డాక్టర్‌ లక్ష్మి ప్రశంసించారు.
View More
Latest News
05 Nov 2025 19:53 PM
0
22
Newsread Image

No.1 Short News

Newsread
అల్పపీడనం.. మళ్ళీ భారీ వర్షాలు
ఈరోజు తూర్పు, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వానలు పడతాయని, కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని APSDMA పేర్కొంది.
View More
Latest News
03 Nov 2025 09:04 AM
0
46
Newsread Image

No.1 Short News

Newsread
Kaanipaakam : సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసంలిండర్ పేలి ఇల్లు ధ్వంసం
కాణిపాకం....చిత్తూరు జిల్లా సిలిండర్ పేలి ఇల్లు ద్వంసం. చిన పాపమ్మ అనే మహిళ గాయాలు. కాణిపాకం లోని హరిజనవాడలో ఘటన. బుధవారం ఉదయం వంట రూమ్ లో స్టవ్ ముట్టించగా పేలిన సిలిండర్. సిలిండర్ పేలడంతో చిన్న పాపమ్మ బట్టలకు నిప్పంటుకోవడంతో తీవ్ర గాయాలు. చికిత్స నిమిత్తం స్థానికుల సహాయంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ప్రమాద ఘటనపై విచారిస్తున్న కానిపాకం పోలీసులు.
View More
Latest News
29 Oct 2025 12:59 PM
0
61
Newsread image

No.1 Short News

Newsread
ఉల్లగల్లు లో తుఫాన్ ఎఫెక్ట్: ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు
ముంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా రాత్రి నుంచి కురిసిన వర్షానికి ఉల్లగల్లులోని ప్రధాన రహదారిలో మురుగు కాలువల నిర్వహణ సరిగా లేనందున వర్షపు నీరంతా నిలిచి ఇళ్లలోకి చేరింది. సాధారణ వర్షపాతానికి కూడా ఈ వీధిలో వర్షపు నీరు నిలువ ఉంటుంది అలాంటిది ఇలాంటి తీవ్రమైన తుఫానులలో ఇంకా ఎంత నీరు చేరబోతోందని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రధాన రహదారిలో గల డ్రైనేజీలో చెత్తను తొలగిస్తే ఈ సమస్య ఉండదని ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన చెత్త నిలువ ఉండటం వల్ల నీరు ఎటు పోకుండా రోడ్లలో నిలిచిపోయి ఉంటుందని స్థానికులు వాపోతున్నారు.
View More
Latest News
29 Oct 2025 07:50 AM
1
42
Newsread Image

No.1 Short News

Newsread
తుఫాను వేళ కురిచేడు మండలంలో పర్యటించిన డా||గొట్టిపాటి లక్ష్మి
మొంథా తుఫాన్ ప్రభావంతో కురిచేడు మండలంలోని వీరయపాలెం పంచాయతీ పరిధిలోని వెంగాయపాలెం ఎన్ఎస్పీ కాలనీలో పొలాల నుండి నీరు ఆర్ & బి రోడ్డుపైకి చేరిన నేపథ్యంలో, డా|| గొట్టిపాటి లక్ష్మీ గారు స్వయంగా ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్ & బి డీఈ గోపికృష్ణ, సంబంధిత అధికారులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని డా|| లక్ష్మీ గారు అధికారులకు సూచించారు.
View More
Latest News
28 Oct 2025 19:36 PM
0
63
Newsread Image

No.1 Short News

Newsread
కందుకూరు: భారీ వర్షాల ప్రభావంతో రాళ్ల వాగు ఉధృతి
మంగళవారం తెల్లవారుజాము నుంచి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గుడ్లూరు మండలం పొట్లూరు–గుడ్లూరు మధ్య రాళ్లవాగు వంతెనపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. ప్రజలు ఆ మార్గం గుండా ప్రయాణించవద్దని ఎస్ఐ వెంకట్రావు హెచ్చరిక జారీ చేశారు. దీంతో కందుకూరు–కావలి రహదారి పై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాగులు, వంతెనలు దాటే ప్రయత్నాలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు.
View More
Latest News
28 Oct 2025 19:19 PM
0
60
Newsread Image

No.1 Short News

Newsread
ఏపీ లోని రైల్వే ప్రాజెక్టుల పురోగతి పై ముఖ్యమంత్రి సమీక్ష.
రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పనుల పురోగతిపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రూ.33,630 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉన్నాయి. కొత్త రైల్వేలైన్లు, అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి, రైల్వే ఓవర్, అండర్ బ్రిడ్జిల నిర్మాణాలకు సంబంధించి రైల్వేశాఖకు ప్రతిపాదనలు పంపడం, నడికుడి-శ్రీకాళహస్తి, గుంటూరు- గుంతకల్, గుణదల ముస్తాబాద్ బైపాస్, రాయదుర్గ్- తుముకూరు మధ్య రైల్వేలైన్ ప్రాజెక్టుల పురోగతి సమీక్షలో ప్రస్తావనకు వచ్చాయి. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి శ్రీ బీసీ జనార్ధన్ రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులు, దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీ సంజయ్ శ్రీవాస్తవ, తూర్పు, దక్షిణ కోస్తా రైల్వే అధికారులు పాల్గొన్నారు.
View More
Latest News
27 Oct 2025 20:03 PM
0
63
Newsread Image

No.1 Short News

BSR NEWS
కిడ్నాపైన బాలుడి జాడను గంటలో చేదించిన గుంటూరు పోలీసులు
పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని RTC కాలనీకి చెందిన షేక్.షాఫిఉల్లా నిన్న(ది.26.10.2025) మద్యాహ్నం సుమారు 01:00 గంట నుండి తన మూడు(03) సంవత్సరాల బాబు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, వెంటనే సీఐ వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో Cr.No. 319/2025 u/s 140(2) BNS of Old Guntur సెక్షన్ కింద కిడ్నాప్ కేసు నమోదు చేసి, సదరు విషయాన్ని గౌరవ జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపీఎస్ కి తెలియపరచి, ఆయన ఈ కేసుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, తక్షణమే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముమ్మర గాలింపు చేపట్టాలని ఆదేశించగా, కేసు దర్యాప్తు చేపట్టడం జరిగింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాబుని కిడ్నాప్ చేసినాహులను ఈ రోజు ఉదయం 08.00 గంటలకి గుంటూరు బస్టాండ్ వద్ద అరెస్ట్ చేసి ఆమె వద్ద నుండి బాబుని సురక్షితంగా రక్షించి, అతని తల్లిదండ్రులకు అప్పగించడమైనది.నిందితురాలైన షకీలాని రిమాండ్ నిమిత్తం కోర్ట్ కి హాజరుపరచడమైంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... సకాలంలో పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల త్వరితగతిన చర్యలు తీసుకోగలిగామని, తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత పట్ల జాగ్రత్త వహించాలని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత మరియు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా మీ పిల్లలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. తమ బిడ్డ అపహరణకు గురైన వెంటనే ఆందోళనతో, భయంతో ఉన్న సమయంలో కేవలం గంటల వ్యవధిలోనే వారి బాబునీ తల్లి దండ్రులు రక్షించి,అప్పగించారని పాత గుంటూరు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో పాత గుంటూరు పోలీసులు చూపిన ప్రత్యేక చొరవ, చేసిన ప్రయత్నాలు వెలకట్టలేనివని, మా బిడ్డను సురక్షితంగా రక్షించిన పోలీసు శాఖకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని తల్లిదండ్రులు పేర్కొన్నారు. బాబును రక్షించుటలో అత్యంత ప్రతిభ కనపరిచిన ఈస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ ని, పాత గుంటూరు సిఐ-కె.వెంకట ప్రసాద్ ని , యస్.ఐ-యన్.సి. ప్రసాద్ మరియు సిబ్బంది HC నూరుద్దీన్ ,PC రాజశేఖర్ లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినారు.
View More
Latest News
27 Oct 2025 19:22 PM
0
55
Newsread image

No.1 Short News

Irfan Deoband
امام شعبی رحمہ اللہ (١٠٣ھ) کے سامنے ایک شخص کا ذکر ہوا کہ وہ بڑا عالم ہے۔ فرمایا: ”اس پر علم کی خوبصورتی نظر نہیں آتی۔“ پوچھا گیا : ”علم کی خوبصورتی کیا ہے؟“ فرمایا : ”سکینت؛ جب کسی کو سکھائے تو زور زبردستی نہ کرے، اور جب کوئی اسے سکھائے تو اپنی شان کے خلاف محسوس نہ کرے۔“ 📙 - (حلية الأولياء لأبي نعيم : ٣٢٣/٤)
امام شعبی رحمہ اللہ (١٠٣ھ) کے سامنے ایک شخص کا ذکر ہوا کہ وہ بڑا عالم ہے۔ فرمایا: ”اس پر علم کی خوبصورتی نظر نہیں آتی۔“ پوچھا گیا : ”علم کی خوبصورتی کیا ہے؟“ فرمایا : ”سکینت؛ جب کسی کو سکھائے تو زور زبردستی نہ کرے، اور جب کوئی اسے سکھائے تو اپنی شان کے خلاف محسوس نہ کرے۔“ 📙 - (حلية الأولياء لأبي نعيم : ٣٢٣/٤)
View More
Latest News
25 Oct 2025 06:31 AM
6
42
Newsread Image

No.1 Short News

Newsread
కర్నూలు లో బస్సు ప్రమాదానికి కారణం ఇదే..
కర్నూలు: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఘోర ప్రమాదానికి గురై కాలి బూడిదైన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనకు ప్రధాన కారణం శివశంకర్ అనే యువకుడు రాంగ్ రూట్‌లో బైక్‌పై రావడమే అని తేలింది. కర్నూలు సిటీ, ప్రజానగర్‌కు చెందిన శివశంకర్ (బైకర్), అర్థరాత్రి 2 గంటల 30 నిమిషాల సమయంలో తన పల్సర్ బైక్‌పై హైవేపై రాంగ్ రూట్‌లో వచ్చి బస్సును ఢీకొట్టాడు. అక్టోబర్ 24 శుక్రవారం శివశంకర్‌కు పెళ్లి చూపులు ఉండగా, అంతకు ముందు రోజు అర్థరాత్రి 20 కిలోమీటర్ల దూరంలోని చిన్నటేకూరుకు అతను ఎందుకు వెళ్ళాడనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. బైక్‌తో ఢీకొట్టిన తర్వాత శివశంకర్ ఎగిరి దూరంగా పడ్డాడు. కానీ బైక్ బస్సు కిందికి వెళ్లి ఇరుక్కుంది. బస్సు సుమారు 300 మీటర్లు బైక్‌ను లాక్కెళ్లడంతో రోడ్డుపై స్పార్క్ (మంట) పుట్టింది. దీనికి తోడు డీజిల్ ట్యాంక్ లీక్ అవడంతో మంటలు భారీగా బస్సుకు అంటుకున్నాయి. ఏసీ బస్సు అద్దాలు మూసి ఉండటంతో, ప్రయాణికులు పొగ, మంటలు కమ్ముకుని ఊపిరాడక 19 మంది సజీవ దహనం అయ్యారు. బైకర్ శివశంకర్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
View More
Latest News
25 Oct 2025 06:30 AM
0
45
Newsread Image

No.1 Short News

Newsread
గోల్డ్ ప్రియుల కొంపముంచిన ట్రంప్.. ఇవాళ్టి బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. కారణాలు ఇవే.
బంగారం ప్రియులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాకిచ్చాడు. నిన్న (శుక్రవారం) బంగారం ధర భారీగా తగ్గింది.. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతుండటంతో రాబోయే రోజుల్లోనూ గోల్డ్ రేటు తగ్గబోతుందని నిపుణులు అంచనా వేశారు. అయితే, తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో మళ్లీ బంగారం ధరకు రెక్కలొచ్చాయి. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 550 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ.500 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఔన్సు బంగారంపై 57డాలర్లు పెరిగింది. దీంతో మళ్లీ ఔన్సు గోల్డ్ 4వేలు దాటింది. తాజాగా.. 4,017 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధరసైతం భారీగా పెరిగింది. కిలో వెండిపై ఇవాళ కూడా రూ.3వేలు పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.2లక్షలకు చేరువులో ఉంది
View More
Latest News
11 Oct 2025 10:30 AM
1
77
Newsread Image

No.1 Short News

Newsread
రైల్వే ప్రయాణికులకు గమనిక.. నేటి నుంచి వారం రోజుల పాటు 32 రైళ్ల రద్దు
డోర్నకల్-పాపటపల్లి మార్గంలో మూడో రైల్వే లైన్ మరమ్మతు పనుల కారణంగా పలు రైళ్ల రాకపోకలపై ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు ఏకంగా 32 రైళ్లను రద్దు చేస్తున్నట్లు, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయడంతో పాటు రీషెడ్యూల్ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ మార్పులు నేటి నుంచి 18వ తేదీ వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. రద్దయిన రైళ్ల జాబితాలో పలు కీలక సర్వీసులు ఉన్నాయి. విశాఖపట్నం-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్, స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్‌సిటీ, పూరి-ఓకా ద్వారకా ఎక్స్‌ప్రెస్‌తో పాటు డోర్నకల్-కాజీపేట, విజయవాడ-డోర్నకల్ మధ్య నడిచే మెమో ప్యాసింజర్ రైళ్లు కూడా ఉన్నాయి. రైళ్ల రద్దుతో పాటు కొన్ని ప్రధాన రైళ్లను అధికారులు రీషెడ్యూల్ చేశారు. ఆదిలాబాద్-తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 13, 16, 17 తేదీల్లో గంటన్నర ఆలస్యంగా బయలుదేరనుంది. అదేవిధంగా, విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు 15, 16, 18 తేదీల్లో గంటన్నర ఆలస్యంగా ప్రయాణిస్తాయని తెలిపారు. సికింద్రాబాద్-గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 14 నుంచి 18 వరకు కాజీపేట-గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేశారు. ఈ రైలు కేవలం సికింద్రాబాద్-కాజీపేట మధ్య మాత్రమే నడుస్తుందని అధికారులు స్పష్టం చేశారు.
View More
Latest News
11 Oct 2025 10:20 AM
0
81
Newsread Image

No.1 Short News

Newsread
నకిలీ మద్యం కేసు.. రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ.. ఎవరి పేర్లు బయటకు వస్తాయో?
ఏపీలో సంచలనం రేపిన ములకలచెరువు నకిలీ మద్యం కేసులో పోలీసులు దర్యాఫ్తును వేగవంతం చేశారు. ఈ కేసులో కింగ్ పిన్ జనార్ధన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సౌతాఫ్రికా నుంచి విజయవాడ వస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు గన్నవరం ఎయిర్ పోర్టులో కాపు కాసి జనార్దన్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు జనార్ధన్ రావును గన్నవరం విమానాశ్రయం నుంచి రహస్య ప్రదేశానికి తరలించారు పోలీసులు. అక్కడ అతడిని విచారిస్తున్నారు. కాగా, జనార్ధన్ రావు నోరు విప్పితే మరికొందరు నాయకుల పేర్లు బయటికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.నకిలీ మద్యం తయారీ కేసులో నిందితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇప్పటివరకు 23మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
View More
Latest News
10 Oct 2025 22:58 PM
0
87
Newsread Image

No.1 Short News

Newsread
సామాన్యుడి నుండి అసామాన్య శక్తి గా చంద్రబాబు 15 ఏళ్ల జైత్రయాత్ర
సామాన్యునిగా రాజకీయాల్లోకి వచ్చి సంక్షోభాలను ఎదుర్కొని ముందుచూపు అభివృద్ధి సంక్షేమాలను చిరునామాగా మార్చుకొని ముఖ్యమంత్రిగా 15 ఏళ్ళ జైత్ర యాత్ర చేసిన స్పూర్తి ప్రదాత చంద్రబాబు నాయుడు కి హార్దిక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన అభివృద్ధి గురించి ఆమె konni😄 విషయాలు చెప్పుకొచ్చారు. అవి ఏంటంటే... చంద్రబాబు చేసిన అభివృద్ధి గురించిహైదరాబాదును సైబరాబాద్‌గా మార్చి, ఐటీ హబ్‌గా అభివృద్ధి చేశారు. HITEC City, Cyber Towers, Genome Valley, Outer Ring Road వంటి ప్రాజెక్టులు ఆయన విజన్‌ ఫలితం. Microsoft, Infosys, Wipro, Google వంటి దిగ్గజ కంపెనీలను ఆహ్వానించి యువతకు వేలాది ఉద్యోగాల అవకాశాలు కల్పించారు. జన్మభూమి కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయిలో ప్రజా భాగస్వామ్య అభివృద్ధి ప్రారంభించారు. ఇంకుడు గుంటలు ,వర్షాజల సేకరణ, మైక్రో ఇరిగేషన్ పద్ధతులు ప్రవేశపెట్టి నీటి యాజమాన్యంలో కొత్త దారులు చూపారు. రైతులకు రైతు బజార్‌లు, e-Seva సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చి, వ్యవసాయ యాంత్రీకరణ, సాంకేతికతతో ముడివేశారు. పరిపాలనలో పారదర్శకత సాంకేతికతకు నాంది పలికారు. e-Governance, రియల్ టైమ్ గవర్నెన్స్, CM డాష్‌బోర్డ్ వంటి వ్యవస్థల ద్వారా ప్రతి శాఖపై ప్రత్యక్ష పర్యవేక్షణ చేశారు. అధికారుల పనితీరుకు బాధ్యతను నిర్ధారించే విధానాలు అమలు చేశారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో విశేష ప్రగతి సాధించారు. హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రణాళిక ఆయన కాలంలోనే ప్రారంభమైంది. అమరావతి రాజధాని నగర రూపకల్పనకు బ్లూప్రింట్ సిద్ధం చేశారు. రోడ్లు, విద్యుత్, నీటి సదుపాయాలు ప్రతి జిల్లాలో విస్తరించారు. విద్య, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్శిటీ, APSSDC ద్వారా యువతకు ఉపాధి అవకాశాల కోసం శిక్షణ అందించారు. ఇంగ్లీష్ మాధ్యమ పాఠశాలలు, డిజిటల్ క్లాస్‌రూమ్స్, వర్చువల్ లెర్నింగ్ పద్ధతులు ప్రవేశపెట్టారు. పెట్టుబడులు ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్‌ను ముందు వరుసలో నిలిపారు. CII Partnership Summits ద్వారా దేశ, విదేశ పెట్టుబడులను తీసుకొచ్చారు. Kia Motors, Amaravati Start-up Zone, Google Fiber Project వంటి ప్రాజెక్టులను ప్రారంభించారు. Vision 2020 ద్వారా విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పరిశ్రమ, సాంకేతిక రంగాలలో దీర్ఘకాల ప్రణాళికను రూపొందించారు. ప్రజా సేవలకు ఆకస్మిక తనికీలు, ప్రజల వద్దకు పాలన, మీ సేవ వంటి పారదర్శక వ్యవస్థలను ప్రవేశపెట్టారు. లంచం రహిత పరిపాలనకు మార్గం సుగమం చేశారు. జాతీయ స్థాయిలో అనేక సార్లు ఉత్తమ ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు. ప్రపంచ ఆర్థిక వేదిక Davos కు ఆహ్వానించబడిన తొలి భారతీయ ముఖ్యమంత్రి కావడం ఆయన నాయకత్వ ప్రతిభకు నిదర్శనం. నారా చంద్రబాబు గారి నాటి స్వప్నం విజన్ 2020 నిజమైంది, నేడు విజన్ 2047 కి శరవేగంగా అడుగులు పడుతున్నాయి.
View More
Latest News
10 Oct 2025 21:56 PM
1
45
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
SP Vidyasagar Naidu: సరైన పద్ధతి కాదు.. మాజీ మంత్రి పేర్ని నానిపై ఎస్పీ సీరియస్..
మాజీ మంత్రి పేర్ని నానిపై ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సీరియస్ అయ్యారు. సీఐపై పేర్ని నాని వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరించిన నానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల మెడికల్ కాలేజ్ వద్ద జరిగిన నిరసన కేసులో కొంత మందికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నామని ఎస్పీ చెప్పుకొచ్చారు. అందులో భాగంగా A8గా ఉన్న మేకల సుబ్బన్న అనే వ్యక్తిని కూడా స్టేషన్‌కు పిలిపించి విచారించినట్లు పేర్కొన్నారు. సుబ్బన్నను విచారిస్తున్న సమయంలో పేర్ని నాని గ్రూపుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చారని చెప్పారు.
View More
Latest News
10 Oct 2025 21:26 PM
1
35
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
ఇంజినీరింగ్‌ కాలేజీ నుంచి కోటి రూపాయలు కాజేసిన దుండగులు
హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌ మెట్‌ పరిధిలోని బ్రిలియంట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో భారీ దొంగతనం జరిగింది. కాలేజీ నుంచి దుండగులు రూ.కోటికి పైగా నగదును ఎత్తుకెళ్లారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కళాశాల పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజీని సేకరించి, నిందితుల కోసం చర్యలు చేపట్టారు. చోరీకి కారణాలు, నిందితుల కదలికలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
View More
Latest News
10 Oct 2025 21:23 PM
0
36
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి లో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
ఈరోజు వాల్మీకీమహర్షి జయంతిని, దరిశిలోని స్థానిక పొదలిరోడ్డులోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర హాస్టల్ ఆవరణలో ఘనంగా జరుపుకున్నారు.ముందుగా ఈ కార్యక్రమంలో వాల్మీకీ మహర్షికి పూలమాల వేసి,పుష్పాంజలి ఘటించి ఘనమైన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది గడ్డి శ్రీనివాసులు ,మానవత స్వచ్ఛంద సేవాసంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి కపురం శ్రీనివాసరెడ్డి,ఉపాధ్యాయులు ఉప్పుటూరి సురేష్ బాబు, మీనిగ శ్రీనివాసులు, ఎన్వీ.బాలసుబ్రమణ్యం,హాస్టల్ సిబ్బంది,విద్యార్థులు పాల్గొని మిఠాయిలు పంచుకున్నారు.
View More
Latest News
07 Oct 2025 19:28 PM
0
58
Newsread Image

No.1 Short News

Newsread
డీజే లకు అనుమతి తప్పనిసరి: దర్శి సీఐ వై రామారావు
దర్శి ముండ్లమూరు తాళ్లూరు మండలాల పరిధిలో ఫంక్షన్లకు తిరునాళ్లకు ఏదైనా ఇతర కార్యక్రమాలకు ఎవరైనా మైకు సిస్టం వాడే సమయంలో డీజే లకు అనుమతి లేదని దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రామారావు చెప్పడం జరిగింది. డీజే లను అధిక సంఖ్యలో వాడటం వల్ల ఆ శబ్దాలకు ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు, వృద్ధులు, గుండె జబ్బు సమస్యలు ఉన్నవారు కూడా చనిపోవడం జరుగుతోంది. కావున ఎవరైనా ఎలాంటి ఫంక్షన్లు, ఉత్సవాలు తిరునాళ్లు అలాగే మీటింగులు జరుపుకోవాలని ఉంటారో వారు ఖచ్చితంగా స్థానిక ఎస్సై ద్వారా సబ్ డివిజనల్ పోలీస్ అధికారికి పర్మిషన్ అప్లై చేసుకోవాలి. పర్మిషన్ పొందిన వారు మైకు లేదా ఏదైనా సౌండ్ బాక్స్ లు పరిమిత సంఖ్యలో మాత్రమే వాడుతూ సౌండ్ మించకుండా ఉండేలా చూసుకోవాలి. అలాకాకుండా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించిన ట్లయితే అటువంటి వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రామారావు తెలియజేశారు.
View More
Latest News
07 Oct 2025 19:15 PM
1
64
Newsread Image

No.1 Short News

Newsread
Darsi: దీన్ దయాల్ ఉపాధ్యాయ 110 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
ఈరోజు దర్శి లో బీజేపీ పార్టీ ఆఫీసు నందు జనసంఘ వ్యవస్థాపకులు పూజ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 110 జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ ఇన్చార్జి మాడపాకుల శ్రీనివాసులు మాట్లాడుతూ సమాజంలో అట్టడుగులో ఉన్న వ్యక్తికి తొలి ప్రభుత్వ ప్రయోజనం చేకూరాలని అంతోదయ ప్రేరణలో భారత సమగ్ర అభివృద్ధికైకృషిచేసిన స్ఫూర్తిదాత ఏకాత్మే మానవత వాదంగా ప్రవచించి అంత్యోదయ విధానాన్ని రూపొందించిన ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించిన బిజెపికి పటిష్ట పునాదులు వేసిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ అని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో దర్శి పట్టణ అధ్యక్షుడు వల్లభ వరపు అమరేశ్వర రావు, మాడపాకుల నారాయణమ్మ , వెంకటసుబ్బయ్య, అచ్యుత గురువర్ధన్ రావు, అనిల్ పాల్గొన్నారు
View More
Latest News
25 Sep 2025 14:37 PM
1
67
Newsread Image

No.1 Short News

Newsread
ఎరువుల దుకాణాలపై తనిఖీలు – యూరియా నిల్వలు గుర్తించిన ప్రకాశం పోలీసులు
ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, పోలీసులు జిల్లాలోని ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో యూరియా నిల్వలు గుర్తించారు. రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. అక్రమంగా నిల్వలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాల రక్షణలో భాగంగా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ప్రకాశం పోలీసులు తెలిపారు.
View More
Latest News
24 Sep 2025 08:28 AM
0
41
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
పోతాంగల్ : దహన సంస్కారాల నిమిత్తం సేవా దృక్పథం తో ఆర్థిక సహాయం..
పోతాంగల్ గ్రామం లో కొంతల నాగయ్య అనే వ్యక్తి మరణించడం తో అంత్యక్రియలకు తగిన ఆర్థిక సహాయం కొరకు గంట్ల రాజు అనే యువకుడు సామాజిక సేవకుడు డాక్టర్ సీతాలే రమేష్ గారికి సహాయం కోరగా, 13,500/- రూపాయలు డబ్బులు విరాళంగా సేకరించి కొంతల నాగయ్య అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో సామాజిక సేవకుడు సితాలే రమేష్ తొ పాటుగా మేకల పీరజి,మేధారి దశరథ్ ,మంగలి విశ్వనాథ్, గంట్ల రాజు,B సాయిలు,k.నాగేషం,వీరయ్య, కొంతల పిరాజీ మరియు గ్రామ యువకులు పాల్గొన్నారు.
View More
Latest News
11 Sep 2025 13:40 PM
0
62
Newsread Image

No.1 Short News

Newsread
జ్వరాల నేపథ్యంలో దర్శి ప్రభుత్వ ఆసుపత్రి పరిశీలించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో జ్వరాలు అధికంగా ఉన్న సీజన్లలో రోగులకు అందుతున్న సేవలపై దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ దృష్టి సారించి గురువారం ఉదయం ఆసుపత్రి ఆవరణను పరిశీలించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఇన్ పేషెంట్లు, ఔట్ పేషెంట్ల వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ వైద్యశాల సూపర్నెంట్ డాక్టర్లు వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారా లేదా అని ఆరా తీశారు.ఆస్పత్రిలో వైద్య సేవలపై డాక్టర్ లక్ష్మి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో CI రామారావు గారు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు తదితరులు ఉన్నారు.
View More
Latest News
11 Sep 2025 13:20 PM
0
50
Newsread Image

No.1 Short News

Newsread
మద్యం కుంభకోణం కేసుతో జగన్ కు మతి పోయింది: గొట్టిపాటి లక్ష్మి
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ ను దర్శి టీడీపీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి తీవ్రంగా విమర్శించారు. తండ్రి వయసున్న చంద్రబాబు మీద పదే పదే చావాలి, కాల్చి చంపాలి, బావిలో దూకి చావాలి, వయస్సు అయిపోయింది రేపో మాపో పోతాడు లాంటి సిగ్గులేని వ్యాఖ్యలు మానాలనీ రాజకీయం కోసం బాబాయిని చంపి, ఆస్తుల కోసం తల్లిని, చెల్లిని కోర్టులకు లాగిన నీచ రాజకీయ నాయకుడు దేశంలోనే జగన్ ఒక్కడే అన్నారు. జగన్ లాంటి వ్యక్తులకు రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో స్థానం లేదు, అధికారం నుండి ప్రజలు మట్టుబెట్టినా బుద్ధి రాలేదు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న సంక్షేమ అభివృద్ధిలకు ఓర్వలేక ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడు. జగన్ మొసలి కన్నీరు నమ్మే స్థితిలో రైతులు లేరు. కౌలు రైతులు ఆత్మహత్యలలో దేశంలోనే 2వ స్థానంలో ఆంధ్రాను తీసుకెళ్లిన రైతు ద్రోహి జగన్అన్నారు. జగన్ ప్రభుత్వ హయాం కంటే లక్ష టన్నుల ఎక్కువ యూరియా కూటమి ప్రభుత్వం అందిస్తుంది అనీ, 2022లో కృత్రిమ ఎరువుల కొరత సృష్టించి నల్ల మార్కెట్ నడిపి రైతు భరోసా కేంద్రాలను దోపిడి కేంద్రాలుగా చేసిన దోపిడి దొంగ జగన్ అన్నారు. నకిలీ విత్తనాలు, సొసైటీల కుంభకోణాలు, రైతు ఇన్సూరెన్స్ ఎగవేత, పంట నష్టం ఎగవేత, ధాన్యం డబ్బులు ఎగవేత ఒక్కటి కాదు అన్ని రకాలుగా రైతుని వ్యవసాయ రంగాన్ని నాశనం చేసిన జగన్ రైతుల మీద కపట ప్రేమ చూపటం హాస్యాస్పదం అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బడుగు బలహీన వర్గాల నేత, కింజరాపు అచ్చెన్నాయుడు మీద జగన్ చేసిన అనుచిత వ్యాఖలకు క్షమాపణ చెప్పాలి, సిగ్గు లేని రాజకీయాలు, ఫ్యాక్షన్ పనులు, ఫ్యాక్షన్ మనస్థత్వం వదలాలనీ, జగన్ అహంకారపు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు.
View More
Latest News
10 Sep 2025 21:44 PM
1
47
Newsread Image

No.1 Short News

Newsread
కనిగిరి: ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరు
వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎరువుల కొరతపై అన్నదాత పోరు కార్యక్రమం కనిగిరి లో రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించి అనంతరం RDO ఆఫీస్ లో రైతులు పడుతున్న ఇబ్బందులపై వినతి పత్రం అందజేసిన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి,ప్రకాశం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ,కనిగిరి ఇంచార్జ్ దద్దాల నారాయణ, కనిగిరి నియోజకవర్గ పరిశీలకులు కె.ఆదెన్న ,రాష్ట్ర రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బన్నీ , రైతులు, పార్టీ నాయకులు, మహిళా నేతలు కార్యకర్తలు,అభిమానులు,
View More
Latest News
09 Sep 2025 14:18 PM
0
66
Newsread Image

No.1 Short News

Newsread
ఇమామ్ మౌజనులకు గౌరవ వేతనాలు అమలు చేయాలని డిమాండ్: గులాం రసూల్
ఇమామ్, మోజన్ లకు గౌరవ వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించిన వైసిపి రాష్ట్ర కార్యదర్శి షేక్ గులాం రసూల్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పట్టణ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ముస్లిం మైనారిటీలు.. వైసిపి రాష్ట్ర కార్యదర్శి షేక్ గులాం రసూల్ కామెంట్స్.. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు ఇమామ్, మోజన్ లకు గౌరవ వేతనాల కోసం పోరాటం చేపట్టాం.. కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీల విషయంలో ద్వంద వైఖరి అవలంబిస్తుంది.. వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఇమామ్, మోజన్ లకు గౌరవ వేతనాలు అమలు చేయటం జరిగింది.. కరోనా వైరస్ విపత్తు సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో ఇమామ్, మోజన్ లకు గౌరవ వేతనాలు అందజేసి ఆదుకున్నారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమామ్, మోజన్ లకు గౌరవ వేతనాలు అమలు చేయకుండా ముస్లిం మైనార్టీలను చిన్నచూపు చూస్తుంది.. ఎలాంటి ఉపాధి లేకుండా కేవలం ఆధ్యాత్మికంగా ఇమామ్, మోజన్లు జీవనం సాగిస్తున్నారు.. ముస్లిం మైనారిటీల పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనారిటీలకు రక్షణ లేకుండా పోయింది.. బిజెపి కను సన్నల్లో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది.. ముస్లిం మైనారిటీ మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన బుర్కా ను హేళన చేసే విధంగా భాష్యం విద్యాసంస్థల్లో ఓ పురుషుడికి బుర్కా ధరించి అవహేళన చేసే విధంగా నృత్యాలు చేపించడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం.. తక్షణమే భాష్యం రామకృష్ణ స్పందించి ముస్లిం సమాజానికి క్షమాపణలు చెప్పాలి.. లేనిపక్షంలో భాష్యం విద్యా సంస్థల ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తాం..అని హెచ్చరించారు.
View More
Latest News
08 Sep 2025 23:27 PM
2
68
Newsread Image

No.1 Short News

Newsread
ఏపీ నాటక అకాడమీ కార్పొరేషన్ డైరెక్టర్ గా బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి నియామకం
ఏపి నాటక అకాడమీ కార్పొరేషన్ డైరెక్టర్ గా తాళ్లూరు మండల మాజీ టిడిపి అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి ని నియమించినందుకు శనివారం డా|| లక్ష్మీ నివాసం వద్ద దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కి, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ కి, టిడిపి సీనియర్ నాయకులు కడియాల రమేష్ లను శాలువాలు, పూలమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమం లో బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి తో పాటు తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, మండల టిడిపి అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర రెడ్డి, మండలం లోని వివిద హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు ఉన్నారు.
View More
Latest News
06 Sep 2025 17:44 PM
1
71
Newsread Image

No.1 Short News

Newsread
నిడమర్రులో రాష్ట్ర సెర్ప్ స్ట్రీనిధి మహిళ బ్యాంక్ విజిలెన్స్ టీమ్ పర్యటన
ఏలూరు జిల్లా నిడమర్రు మండలం చిననిండ్రకొలను వీఓలో రాష్ట్ర సెర్ప్ స్ట్రీనిధి మహిళ బ్యాంక్ విజిలెన్స్ టీమ్ శనివారం పర్యటించింది. జిల్లాలో వరుసగా 10 మండలాల్లో నిర్వహిస్తున్న పరిశీలనలో భాగంగా ఈ పర్యటన జరిగింది.విజిట్ సందర్భంగా 24-25, 25-26 సంవత్సరాల స్ట్రీనిధి లోన్ డాక్యుమెంట్లు, SHG తీర్మానాలు పరిశీలించబడ్డాయి. ప్రత్యేకంగా 49 మంది స్ట్రీనిధి లోన్ సభ్యుల ఖాతాల్లోకి లోన్ అమౌంట్లు సరిగా జమయ్యాయా లేదా అన్న విషయాన్ని వెరిఫై చేశారు. సభ్యురాళ్లతో ప్రత్యక్షంగా మాట్లాడి — 1. తీసుకున్న రుణం, 2. ప్రస్తుతం కొనసాగిస్తున్న జీవనోపాధి, 3. చెల్లించవలసిన వాయిదాలు, 4. ఇప్పటివరకు చెల్లించిన వాయిదాల స్థితి వంటి అంశాలను పరిశీలించారు. అదేవిధంగా స్ట్రీనిధి లోనింగ్ మరియు బ్యాంక్ లింకేజీ మధ్య తేడాలను వివరించారు. స్ట్రీనిధి రుణాల వడ్డీ రేటు తక్కువగా (92 పైసలు), సురక్ష ఇన్సూరెన్స్ కలిగివుండటం, ప్రాసెసింగ్ ఛార్జీలు లేకపోవడం, 24 గంటల్లో లోన్ మంజూరు అవ్వడం వంటి ప్రయోజనాలు ఉన్నాయని సభ్యులకు తెలియజేశారు. స్ట్రీనిధి విజిలెన్స్ ఆఫీసర్ కృష్ణం నాయుడు మాట్లాడుతూ — ప్రతి నెలలో స్ట్రీనిధి రుణాలు తీసుకున్న గ్రూపుల రికవరీలను సిబ్బంది తప్పనిసరిగా వెరిఫై చేయాలి. రాష్ట్రంలో ఇతర ఏ బ్యాంక్ కూడా ఇవ్వని విధంగా ఒక్కో గ్రూప్‌కి రూ.5 లక్షల వరకు రుణాలు స్ట్రీనిధి మహిళా బ్యాంక్ అందిస్తోంది. గ్రామాల్లో ఆర్థిక క్రమశిక్షణ పెంపుదల కోసం, ఇంకా మెరుగైన మార్పుల కోసం ఈ విజిట్లు కొనసాగుతున్నాయి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్ట్రీనిధి AGM చెన్న కేశవులు, ఏరియా మేనేజర్ నరేంద్ర, APM ఎం. రత్నకుమార్, క్లస్టర్ CC ఆర్. గౌరీశంకర్, వీఓఏ చొక్కాకుల లక్ష్మీ, క్లస్టర్ వీఓఏలు మరియు రుణాలు పొందిన సభ్యులు పాల్గొన్నారు.
View More
Latest News
06 Sep 2025 17:41 PM
3
52
Newsread Image

No.1 Short News

Newsread
రాష్ట్రంలో ఉర్దూ భాష లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారా ? సయ్యద్ సలావుద్దీన్
మాతృభాషలో విద్యను అభ్యసించడం ఆయా వర్గాల యొక్క హక్కు. ఆ హక్కును గత ప్రభుత్వం కాలరాస్తున్నదని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వంలోని పెద్ద పెద్ద నాయకులు గగ్గోలు పెట్టినారు అని ప్రముఖ సంఘ సేవవాకులు ముస్లిం స మైక్యా వేదిక రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ సలావుద్దీన్ పత్రికా ముఖముగా ప్రభుత్వాన్ని మరియు రాష్ట్ర విద్యాధికారులను అడుగుతున్నారు. ఆ నాయకులు ఆయా విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు అండగా నిలుస్తామని ప్రగల్ఫాలు పలికినారు. చాలామంది తల్లిదండ్రులు విద్యావేత్తలు మేధావులు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టినారు. ఫలితంగా గత ప్రభుత్వము ఉర్దూ మధ్యమ పాఠశాలల జోలికి రాలేదు. అవి ఉర్దూ మాధ్యమంలోనే కొనసాగుతున్నాయి. మరి ప్రస్తుత ప్రభుత్వం దానికి విరుద్ధంగా ఎందుకు చేస్తున్నది? జిల్లాల ఉప విద్యాశాఖాధికారులు ఉర్దూ మాధ్యమ పాఠశాలకు వెళ్లి, అక్కడి విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉర్దూ భాషను తక్కువ చేసి చూపుతూ, ఉర్దూ భాషలో చదువుకుంటే ఉద్యోగాలు రావని, ఉన్నత విద్యను చదవలేరని వారిలో ఉర్దూ భాష పట్ల నెగటివ్ భావాలను పెంపొందిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం. అదేవిధంగా జిల్లా ఉప విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులకు మౌఖిక ఆదేశాలిస్తూ తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేసి అందులో ఉర్దూ మాధ్యమం అవసరం లేదు ఇంగ్లీష్ మద్యంలోకి మార్చాలని రెజిల్యూషన్స్ పాస్ చేయించి పంపించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీనినేను ఖరాఖండిగా ఖండిస్తున్నానని సలావుద్దీన్ పత్రిక ముఖముగా ప్రకటించినారు. కావున ప్రభుత్వము మరియు విద్యాశాఖ అధికారులు ఇలాంటి ప్రయత్నాలు ఇకనైనా మానుకోవాలని ఉర్దూ మాధ్యమం పాఠశాలలను అదేవిధంగా మైనర్ విభాగపు పాఠశాలను యధా విధంగా కొనసాగించాలని గట్టిగా కోరుతున్నాను. లేనిపక్షంలో ఉద్యమం నడిపించ వలసి వస్తుందని సంఘసేవకులు, ముస్లిం సమైక్యా వేదిక రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ సలవుద్దీన్ గారు ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసినారు ఈ కార్యక్రమంలో ముస్లిం సమైక్యవేదిక రాయలసీమ ఇంచార్జ్ షేక్ అలీషేర్, గోల్డ్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు
View More
Latest News
04 Sep 2025 15:56 PM
1
83
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి లో హోరెత్తిన మహిళాలోకం..ఆకట్టుకున్న గొట్టిపాటి లక్ష్మి ప్రసంగం
స్త్రీ - శక్తి పథకం విజయోత్సవ సభకు దర్శి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి మహిళలు వేలాదిగా తరలివచ్చారు. ఎంతో ఉత్సాహపూరిత వాతావరణం లో మహిళలు చేయి చేయి కలిపి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారికి అభినందనలు తెలుపుతూ నారీ లోకం శక్తి పథకానికి జేజేలు పలికారు. ఆర్ అండ్ బి బంగ్లా ప్రాంగణమంతా మహిళలతో కిక్కిరిసిపోయింది. కనీవిని ఎరుగని రీతిలో మహిళా స్త్రీ శక్తి ఏమిటో నిరూపించారు. నారీ లోకం దర్శికి కదులుచింది. మహిళలు దండుగా చంద్రన్నకు అండగా కూటమి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉన్నామంటూ నినదించారు. కొందరు మహిళా నాయకుల ప్రసంగాలు ఆసక్తిగా మారాయి. మహిళలు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రసంగాన్ని మహిళలందరూ అధ్యంతం ఆసక్తిగా విన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున హాజరైన మహిళామ తల్లులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
View More
Latest News
26 Aug 2025 14:57 PM
0
110
Newsread Image

No.1 Short News

Vijaya Chandra
సోమిరెడ్డి పల్లె సహకార సొసైటీ బ్యాంకు చైర్మన్ గా యల్లటూరి సాంబశివరెడ్డి
కడప జిల్లా ఆగష్టు 22 బ్రహ్మంగారి మఠం సహకార కమిటీ సొసైటీ సంఘం చైర్మన్ గా యల్లటూరు సాంబశివారెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు ఈ సంధర్బంగా యల్లటూరు సాంబశివరెడ్డి మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో సహకార సొసైటీ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు, అనంతరం సాంబశివారెడ్డి మాట్లాడుతూ తనను నమ్మీ సొసైటీ బ్యాంకు చైర్మన్ గా, పదవీ బాధ్యతలు ఇచ్చిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కు రుణపడి ఉంటానని మండలంలోని ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని తెలియజేశారు అనంతరం సాంబశివారెడ్డి మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ను పూలమాలతో ఘనంగా సన్మానించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన బి. మఠం టిడిపి మండల అధ్యక్షులు బి. మఠం మండల నాయకులు కలిసి సొసైటీ బ్యాంక్ చైర్మన్ యల్లటూరు సాంబశివరెడ్డిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమం లో బి. మఠం టిడిపి మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి మైదుకూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎపి రవీంద్ర, మరియు టిడిపి మండల యువ నాయకులు కానాల మల్లికార్జున రెడ్డి, పూజ శివ యాదవ్,సుధాకర్, లగసాని గంగరాజు, టిడిపీ కార్యకర్తలు మస్తాన్, పుటాల శివ యాదవ్, పెరుగు నాగేంద్ర,గుజ్జు రామాంజనేయులు, నాగిపోగు మధు, చంద్ర ఓబుల నాయుడు, సూరి, రామాంజనేయులు తదితరులు పాల్గొనడం జరిగింది.
View More
Latest News
22 Aug 2025 08:20 AM
1
96
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి లో 18 మంది ట్రై సైకిల్స్ అందచేసిన డా|| గొట్టిపాటి లక్ష్మి
దర్శి మార్కెట్ యాడ్ లోని రైతు సంబర సభ అనంతరం దర్శి నియోజకవర్గం లోని 18 మంది విభిన్న ప్రతిభా వంతులు లకు ట్రే సైకిల్స్ దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ సొంత నిధులతో పంపిణిచేసారు. డా|| లక్ష్మీ తో పాటు మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి. పాపారావు , రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి , టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య తదితర ముఖ్య నాయకులు ఉన్నారు.
View More
Latest News
17 Aug 2025 12:07 PM
0
85
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి లో స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన డా|| గొట్టిపాటి లక్ష్మి
దర్శి గడియార స్థంభం వద్ద శనివారం సాయంత్రం స్త్రీ శక్తి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో డా గొట్టిపాటి లక్ష్మీ ప్రారంభించారు.అనంతరం స్త్రీ శక్తి ఉచిత ఆర్టీసీ బస్ లో మహిళలను ఉత్సహ పరుస్తూ అందరితో సరదాగా మాట్లాడుతూ దర్శి నుండి శంకరాపురం గ్రామం వరకు ప్రయాణం చేసారు. ఈ సందర్భంగా డా లక్ష్మీ మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం మహిళలలో మరింత భరోసా పెంచుతుందన్నారు.మహిళలకు ఆర్ధికంగా ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ఎంతో మేలు చేస్తుందన్నారు. స్త్రీ శక్తి పథకం వల్ల ముఖ్యంగా విద్యార్థులు ఉద్యోగాలు చేసుకునే మహిళలు స్వయం ఉపాధి చేసుకునే మహిళా శ్రామికులు పై భారం తగ్గుతుందన్నారు. కనీసం నెలకు ఒక్కొక్క మహిళ 1500 నుండి 2000 వరకు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మన ప్రభుత్వం సూపర్ సిక్స్ లో ప్రతి పథకాన్ని అమలు చేసి ప్రజా ప్రభుత్వంగా ముందుకు వెళుతుందన్నారు. టిడిపి అంటేనే మహిళలను గౌరవించే పార్టీ ఆనాడు ఎన్టీఆర్ ఈనాడు మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు మహిళల సాధికార కోసం ఆస్తిలో సమాన హక్కు కోసం అనేక చట్టాలను తెచ్చిన ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం. మహిళల కోసం ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 15 నెలలవుపే సూపర్ సిక్స్ పథకంలో ఒకటైన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని నిన్న మహిళలకు అంకితం చేసి మహిళలకు ఆనందాన్ని కలిగించారు. దాదాపు ఈ పథకానికి 1950 కోట్లు ఖర్చు చేస్తూ మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు ప్రయాణాన్ని పల్లె వెలుగులతో పాటు ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా వీటిని అమలు చేస్తున్నారు. అయితే మహిళలు భద్రతతో జాగ్రత్తలు వహిస్తూ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని డా లక్ష్మి కోరారు.మన అవసరాలకు సరిపడా ఆర్టీసీ బస్సులను వినియోగించుకుని మన కూటమి ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్లాలని కోరారు. ప్రజా కూటమి ప్రభుత్వాన్ని మహిళలందరూ ఆదరించి జేజేలు పలకాలి అని పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో అక్క చెల్లి తల్లి అందరూ చంద్రన్నను కుటుంబ పెద్దగా చూస్తున్నారని ఈ పథకం ఒక స్వర్ణాంధ్ర పథకంగా ఆమె కొనియాడారు.
View More
Latest News
16 Aug 2025 20:13 PM
2
65
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి లో హర్ ఘర్ తిరంగా యాత్ర చేపట్టిన బేజేపీ నాయకులు
ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ఆదేశాల ప్రకారం దరిశి రూరల్ మండలాధ్యక్షుడు నాగసాయి పట్టణ అధ్యక్షుడు అమరేశ్వర రావు యువమోర్చా నాయకుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో దర్శి లోని గంగవరం రోడ్డు నుంచి అద్దంకి NSP కాలనీ వరకు భారతీయ జనతా పార్టీ నాయకులు విద్యార్థులతో జాతీయ జెండాలు చేతపట్టి వందేమాతరం భారత్ మాతాకీ జై అని నినాదాలు ఇస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి దర్శి నియోజకవర్గ కన్వీనర్ మాడపాక శ్రీనివాసులు, గురువర్దన్ రావు, బచ్చు అనిల్, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
View More
Latest News
13 Aug 2025 18:10 PM
0
74
Newsread Image

No.1 Short News

Newsread
మాధవ్.. ముందు జిన్నా టవర్ చరిత్ర తెలుసుకుని మాట్లాడు..గులాం రసూల్
బీజేపీ నేత మాధవ్ పై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్ హాట్ కామెంట్స్ రెండు రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గుంటూరు వేదికగా ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా వివాదస్పద వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు.. గుంటూరులోని జిన్నా టవర్ పేరు మారుస్తా అంటూ చేసిన వ్యాఖ్యలు బాధాకరం.. మాధవ్ ముందు జిన్నా చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుటుంది.. కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. స్వాతంత్ర్య కోసం చేసిన పోరాటంలో అనేక పోరాటాలు చేసి అక్రమ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని జిన్నా బయటకు తీసుకువచ్చారు.. వైసీపీ ప్రభుత్వంలో అన్ని మతాల పెద్దలను పిలిచి వివాదాలకు తావు లేకుండా జిన్నా టవర్ వద్ద జాతీయ చిహ్నాన్ని ఎగరవేయడం జరిగింది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి లేదంటే గుంటూరు మిర్చి ఘాటు చూపిస్తాం.. బీసీ కులానికి చిందిన రమేష్ యాదవ్ పై దాడులు జరిగితే ఆ విషయాన్ని పట్టించుకోలేదు.. కనీసం ఖండించలేదు.. అసలు గాడ్ సే ని ప్రేమించేది బీజేపీనే.. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిలో 70 శాతం ముస్లింలు ఉన్నారు.. దేశంతో పాటు గుంటూరు జిల్లాలో అనేక బ్రిటిష్ కట్టడాలు ఉన్నాయి, వాటిని కూడా కలుస్తారా..? బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి.. అదేవిధంగా స్వాతంత్ర సమరయోధులకు గుర్తుగా దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా గేట్ పై స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల పేర్లను లిఖించటం జరిగిందని వాటిలో అధిక శాతం ముస్లిం వీరుల పేర్లే ఉన్నాయని వాటిని కూడా దమ్ముంటే కూల్చి చూపించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆబిద్ మహమూద్ మాజీ కార్పొరేటర్ అప్సర్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు సైదా మిర్చి యార్డ్ మాజీ డైరెక్టర్ మున్వాగ్ లీగల్ సెల్ నెంబర్ లియాకత్ అలీ వైఎస్ఆర్సిపి సీనియర్ మైనార్టీ నాయకులు ఫిర్దోస్ అహ్మద్ గార్లు తదితరులు పాల్గొన్నారు.
View More
Latest News
07 Aug 2025 20:24 PM
1
103
View Latest Short News
😔
Oops! You're offline.
It looks like you've lost your internet connection.
Please check your network and try again.

Find News

News Categories

  • All Categories
  • Jobs (7)
  • Latest News (801)
  • Motivation (11)
  • Crime News (25)
  • Local Ads (39)
  • Entertainment (15)
  • Local Updates (217)
  • Sports News (12)
  • Education (13)
  • Business Promotions (1)
  • Politics (67)
  • Breaking News (97)
  • Install App
    ALL
    | newsread.in

    Newsread
    For better experience and daily news update.
    Download our app from play store.