Select Location
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడర్ తాళ్లూరు
రేపు భూమిపై అడుగుపెట్టనున్న సునీతా విలియమ్స్
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ రేపు భూమి మీదకు రానున్నారు. మరో ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్తో కలిసి ఉదయం 3.27 నిమిషాలకు భూమిపైకి చేరుకుంటారని నాసా ప్రకటించింది. వీరు ప్రయాణించే వ్యోమనౌక ఫ్లోరిడా తీరానికి చేరువలో గల సాగర జలాల్లో దిగుతుందని వివరించింది. భారత కాలమానం ప్రకారం ఈ రోజు ఉ. 8:15 గంటలకు వీరి యాత్ర ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
View More
Latest News
18 Mar 2025 14:55 PM
0
3
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడర్ తాళ్లూరు
SC వర్గీకరణ.. మిశ్రా కమిషన్ నివేదికకు క్యాబినెట్ ఆమోదం
AP: SC వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై TDLPలో ఎస్సీ ఎమ్మెల్యేలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చర్చించారు. జిల్లాను ఒక యూనిట్గా వర్గీకరణ చేయాలని స్పష్టం చేశారు. కొత్త జిల్లాలకు కుదరకపోతే ఉమ్మడి జిల్లాలను యూనిట్గా తీసుకోవాలన్నారు. సరైన డేటా లేనందున 2011 జనాభా ప్రాతిపదికన వర్గీకరణకు MLAలు అంగీకారం తెలిపారు.
View More
Latest News
18 Mar 2025 14:54 PM
0
3
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడర్ తాళ్లూరు
నేడు శ్రీవారి అర్జితసేవా టికెట్ల కోటా విడుదల
శ్రీవారి ఆర్జిత సేవకు సంబంధించి జూన్ నెల టికెట్ల లక్కీడీప్ కోటాను TTD ఈరోజు ఉదయం 10గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు భక్తులు నమోదు చేసుకోవచ్చు. డిప్లో టికెట్లు దక్కిన భక్తులు ఈ నెల 20-22 తేదీల మధ్యలో పేమెంట్ పూర్తి చేసి టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇక 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, మధ్యాహ్నం గదుల కోటాను విడుదల చేయనుంది.
View More
Latest News
18 Mar 2025 13:18 PM
0
4
Newsread Image

No.1 Short News

Umar Fharooq
ఈరోజు తాళ్లూరు మండలంలో 10 వ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు
ఈరోజు 10 వ తరగతి పరీక్షలు మొదలు కావున తాళ్లూరు మండలంలోని అన్ని పరీక్ష కేంద్రాలలో కలిపి 818 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉడగా 808 మంది విద్యార్థులు హాజరు కాగా 10 మంది విద్యార్థులు మాత్రం పరీక్షా కేంద్రాలకు హాజరు కాలేదు.
View More
Latest News
17 Mar 2025 17:02 PM
0
14
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడర్ తాళ్లూరు
ఫేక్ పాస్పోర్టు, వీసాతో ప్రవేశిస్తే 7 ఏళ్లు జైలు, ఫైన్!
సరికొత్త ఇమ్మిగ్రేషన్ బిల్లును పార్లమెంటు ఆమోదిస్తే దేశంలోకి అక్రమంగా ప్రవేశించేవారికి చుక్కలు కనిపించడం ఖాయమే. ఫేక్ పాస్పోర్టు లేదా వీసాతో దేశంలోకి ప్రవేశించేవారు, ఉండేవారు, విడిచివెళ్లే వారు గరిష్ఠంగా ఏడేళ్లు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అలాగే రూ. 10 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఎయిర్లైన్స్, షిప్స్ ముందస్తుగా ప్రయాణికులు, స్టాఫ్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
View More
Latest News
17 Mar 2025 14:57 PM
0
12
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడర్ తాళ్లూరు
BREAKING: మోదీ పాడ్కాస్ట్ షేర్ చేసిన ట్రంప్
ప్రధాని నరేంద్రమోదీపై US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి అభిమానం చాటుకున్నారు. US పాడ్కాస్టర్, AI పరిశోధకుడు లెక్స్ ఫ్రైడ్మన్కు ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూ వీడియోను తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో షేర్ చేశారు. మూడు గంటల నిడివి ఉన్న ఈ పాడ్కాస్ట్లో RSSతో అనుబంధం, భారత్కు నిర్వచనం, సంస్కృతి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ పాలన సహా అనేక అంశాలపై మోదీ తన అభిప్రాయాలు పంచుకున్నారు.
View More
Latest News
17 Mar 2025 14:57 PM
0
11

No.1 Short News

Newsread
ప్రకాశం జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు.
ఒంగోలులోని రామ్ నగర్ లో ఉన్న మున్సిపల్ పాఠశాలలో పరీక్షల కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పరీక్ష కేంద్రంలోని ఏర్పాట్లపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా 183 కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.
View More
Latest News
17 Mar 2025 14:23 PM
2
13
Newsread Image

No.1 Short News

Umar Fharooq
దీక్ష చేపట్టిన వైద్య ఆరోగ్యశాఖ
బాపట్ల డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయం వద్ద దీక్ష చేపట్టిన యద్దనపూడి మండలం వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది.. సంఘీభావం తెలిపిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్, ప్రజా సంఘాలు.
View More
Latest News
17 Mar 2025 14:21 PM
0
9
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బీర్కూర్ : తాత్కాలిక నివాసం ఏర్పాటు కోసం వినతిపత్రం అందించిన బీజేపీ నాయకులు
అందరికీ నమస్కారం బీర్కూర్ గ్రామo లో నివాసం ఉంటున్న పిడుగు సాయవ్వ w/o గంగారాం, పిడుగు శాంతవ్వ w/0 బాబయ్య, పిడుగు గంగవ్వ మూడు కుటుంబాలు పోయిన నెల 27 వ తేదీన వారి మూడు ఇళ్లు విద్యుత్ ప్రమాదం తో ఇళ్లు పూర్తి గా కాలి పోవడం జరిగింది పూర్తి స్థాయిలో అస్తి నష్టం వాటిల్లింది వారికి ఉన్నడానికి ఇళ్లు కూడా లేదు కావున వారి కుటుంబానికి తక్షణ సాయం చేయాలి వారికి వెంటనే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అప్పటికి వరకు ఉండడానికి వారికి తాత్కాలికంగా నివాసం ఉండడానికి స్థావరం ఏర్పాటు చేయాలి లేక పోతే బీర్కూర్ గ్రామo లో నిర్మించిన ఉన్న డబుల్ బెడ్ రూమ్ లో 3 ఇళ్ల నీ వాళ్లకు ఇవ్వాలి అని ఈ రోజు బిజెపి శాఖా ఆధ్వర్యంలో బాధితుల తో కలిసి తహసీల్దార్ గారికి వినతిపత్రం అందజేయాడం జరిగింది బాధితుల కు పూర్తిస్థాయిలో న్యాయం చేసేవారకు పోరాటం చేస్తామని బిజెపి మండల అధ్యక్షులు నాగేళ్ల సాయి కిరణ్ అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు నాగేళ్ల సాయి కిరణ్, మండల ప్రధాన కార్యదర్శి యోగేష్, బిజెపి సీనియర్ నాయకులు హన్మాoడ్లు, నూకల రాము, రాజు, సాయిబాబా, బస్వరాజు, ఆవారి శంకర్, కార్యకర్తలు పాల్గొన్నారు
View More
Latest News
17 Mar 2025 14:10 PM
0
11
Newsread Image

No.1 Short News

Umar Fharooq
10 వ తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్
10 వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు అందరూ మంచి మార్కులు సాధించాలని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ( APTF ) తాళ్లూరు మండల శాఖ ఆల్ ది బెస్ట్ చెప్పటం జరిగింది.
View More
Latest News
17 Mar 2025 12:42 PM
0
13
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడర్ తాళ్లూరు
చంద్రయాన్-5 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
చంద్రుడిపై పరిశోధనలు చేపట్టే చంద్రయాన్-5 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. చంద్రయాన్-2లో 25 KGల బరువు ఉన్న రోవర్ 'ప్రజ్ఞాన్'ను జాబిల్లిపైకి తీసుకెళ్లగా, చంద్రయాన్-5లో 250 కేజీల రోవర్ను తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ ప్రయోగాన్ని జపాన్ సాయంతో నిర్వహిస్తామన్నారు. ఇక జాబిల్లిపై ఉన్న మట్టి నమూనాలను తీసుకొచ్చేందుకు 2027లో చంద్రయాన్-4 మిషన్ను ప్రయోగిస్తామని చెప్పారు.
View More
Latest News
17 Mar 2025 12:42 PM
0
13
Newsread Image

No.1 Short News

Umar Fharooq
10 వ తరగతి పరీక్ష కేంద్రాలు 2025 తాళ్లూరు మండలం
SSC EXAMS 2025 TALLUR MANDAL 1.VKGHS TALLUR 2.C.NO.---57043 3.Total students -173 4.CS.Name. P.Anjali. ----------------------------------------- 1.Saraswathi HS 2.C.NO.---57044 3.Total students -140 4.CS.Name-B.RamaRao ------------------------------------- 1.BK padu A.Centre 2.C.NO.---57062 3.Total students -130 4.CS.Name-YSR Prasad. ------------------------------------- 1.BK padu B.Centre 2.C.NO.---57063 3.Total students -120 4.CS.Name-M.Ramana Reddy. ------------------------------------- 1.ZP East Gangavaram 2.C.NO.---57180 3.Total students -162 4.CS.Name-B. Srinivasa Rao. -------------------------------- 1.Jahnavi HS East Gangavaram 2.C.NO.---57181 3.Total students -100 4.CS.Name-N.Venkateswarlu
View More
Latest News
17 Mar 2025 12:42 PM
0
12
Newsread Image

No.1 Short News

Umar Fharooq
చలివేంద్రాన్ని ప్రారంభించిన బాపట్ల ఎమ్మెల్యే
బాపట్ల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద చండ్రపాటి సత్యనారాయణ - రంగనాయకమ్మ గార్ల జ్ఞాపకార్థం వారి కుమారుడు చండ్రపాటి వెంకట రామమోహన్ రావు (రాంబాబు) - ఉదయలక్ష్మి ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు,ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బూర్లె రామసుబ్బారావు,జిట్టా శ్రీనివాసరావు,ఆర్.టి.సి డిపో మేనేజర్ శ్రీమన్నారాయణ,ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొత్తమాసు సత్యనారాయణ,వక్కల గడ్డ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
View More
Latest News
17 Mar 2025 12:41 PM
0
12
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడర్ తాళ్లూరు
ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లోనే రూ.24 కోట్లు
హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన 'కోర్టు' మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.24.4 కోట్లు వసూలు చేసినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ప్రేక్షకులు బ్లాక్బస్టర్ తీర్పు ఇచ్చారని పేర్కొంది. రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి, శివాజీ కీలక పాత్రలు పోషించారు. మరోవైపు ఈ మూవీ యూఎస్ఏలో 600K డాలర్లు రాబట్టిందని సినీ వర్గాలు తెలిపాయి.
View More
Latest News
17 Mar 2025 11:41 AM
0
11
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడర్ తాళ్లూరు
రంజాన్ సెలవు ఎప్పుడంటే?
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ క్యాలెండర్ ప్రకారం మార్చి 31న రంజాన్ సెలవు ఉంది. రంజాన్ హాలిడేలో ఏదైనా మార్పులు చోటు చేసుకుంటే సాంఘిక శాస్త్రం పరీక్షలో మార్పు చేయనున్నారు. అంటే మార్చి 31 లేదా ఏప్రిల్ 1న నిర్వహిస్తామని ప్రభుత్వం ఇదివరకే తెలిపింది. అటు తెలంగాణలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.
View More
Latest News
17 Mar 2025 09:50 AM
0
8
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడర్ తాళ్లూరు
మీపై నమ్మకం ఉంచుకోండి: సీఎం చంద్రబాబు
AP: రేపటి నుంచి టెన్త్ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. 'పరీక్షలు మీ విద్యా ప్రయాణంలో ఓ కీలకమైన మైలురాయి. దృష్టి కేంద్రీకరించి కష్టపడి పని చేయండి. మీ సమయాన్ని తెలివిగా వినియోగించుకోండి. మీపై మీకు నమ్మకం ఉంటే విజయం వెంటాడుతుందని గుర్తుంచుకోండి' అని ట్వీట్ చేశారు.
View More
Latest News
16 Mar 2025 22:35 PM
0
16
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడర్ తాళ్లూరు
గోద్రా అల్లర్లపై అది తప్పుడు ప్రచారం: మోదీ
గుజరాత్ గోద్రా అల్లర్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద అల్లర్లుగా పేర్కొనడం అనేది తప్పుడు ప్రచారమని తెలిపారు. 2002 తర్వాత 22 ఏళ్లలో గుజరాత్లో పెద్ద అల్లరి జరగలేదని, ఆ రాష్ట్రం శాంతియుతంగా ఉందని చెప్పారు. ఆ సమయంలో కేంద్రంలో తమ ప్రత్యర్థులు అధికారంలో ఉండటంతో తమపై వచ్చిన ఆరోపణలను నిలబెట్టాలని చూశారన్నారు. అయితే న్యాయవ్యవస్థ తమను నిర్దోషులుగా తేల్చిందని పేర్కొన్నారు.
View More
Latest News
16 Mar 2025 22:35 PM
0
14
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడర్ తాళ్లూరు
భూ ఆక్రమణ కేసుల విచారణ వేగవంతం చేయాలి: కలెక్టర్
భూ అక్రమాలపై నమోదైన కేసుల విచారణ వేగవంతం చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరు తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, అడిషనల్ ఎస్పీ నాగేశ్వర రావులతో కలసి భూ అక్రమాలపై నమోదైన కేసుల విచారణ పురోగతిపై సమీక్షించారు.
View More
Latest News
16 Mar 2025 22:34 PM
0
14
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బీర్కూర్ లో ఎమ్మెల్యే జగదీశ్వర్ దిష్టి బొమ్మ దహనం
ఈ రోజు బీర్కూర్ మండల కేంద్రం కామప్ప చౌరస్తా లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలను చేసిన brs mla జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేసినారు జగదీశ్వర్ రెడ్డి శాసన సభా సభ్యత్వాన్ని రద్దు చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్త కాపు కాంత్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు బొయిని శంకర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ యమ రాములు సనేపూ గంగారాం మండల ఉప అధ్యక్షులు గొండ్లా శీను ex mpp రఘు ex mptc సందీప్ ex కోప్షన్ mptc అరిఫ్ మార్కెట్ కమిటీ మెంబర్ గొండ్ల రాజు శశికాంత్ మున్నూరు కపు సురేష్ యమ చిన్న రాములు సాయిబాబా కిరణ్ హైమద్ జావేద్ కుబ్బుష్ అశోక్ గంగారాం పాల్గొన్నారు
View More
Latest News
16 Mar 2025 22:31 PM
0
12
Newsread Image

No.1 Short News

Umar Fharooq
తాళ్లూరు మండలంలోని విద్యార్థుల చేత హోలీ పండుగ సందర్భంగా అవగాహన కార్యక్రమంలో
ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ( APTF ) వారు తాళ్లూరు మండలంలోని విద్యార్థుల చేత హోలీ పండుగ సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరి జీవితం ఆనందకరంగా ఇంద్రథనస్సుల ఉండాలని కోరుకుంటూ హోలీ శుభాకాంక్షలతో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ( APTF ) తాళ్లూరు మండల శాఖ గౌరవ అధ్యక్షులు పోలంరెడ్డి సుబ్బారెడ్డి, అధ్యక్షులు గండూరి నాగరాజు , ప్రధాన కార్యదర్శి నారిపెద్ది శ్రీనివాసరావు మరియు మండల కమిటీ,ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
View More
Latest News
15 Mar 2025 14:51 PM
2
25
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
కార్ ప్రమాదం జరిగిన బీజేపీ కార్యకర్తలకు ఆర్థిక సహాయం
ఈరోజు బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ మండలం లో చీకడపల్లి గ్రామం మరియు అంబం గ్రామలల్లో బీజేపీ కార్యకర్తల ను పరామర్శించడానికి రుద్రూర్ మండల కమిటీ పిలుపు మేరకు బాన్సువాడ నియోజకవర్గం నాయకులు NRI కోనేరు శశాంక్ గారు రావడం జరిగింది చీకడపల్లి గ్రామం లో ఇటీవల బీజేపీ కార్యకర్తలకు కార్ ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో చీకడపల్లి గ్రామ బూత్ అధ్యక్షుల భార్య మరియు కుమారుడికి మరియు రుద్రూర్ మండల బీజేపీ ఉపాధ్యక్షులు గుడిసె ప్రభాకర్ కి గాయాలు అయ్యాయి వారి ఇద్దరిని కోనేరు శశాంక్ గారు 25 కేజీ ల బియ్యము మరియు ఒకొక్కరికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది మరియు అంబం గ్రామం లో నిన్న అనుకోకుండా జరిగిన అగ్ని ప్రమాదం లో ఇద్దరి ఇంటి పెద్దలు లేని మహిళల ఇల్లులు అగ్ని ప్రమాదానికి గురి కావడం జరిగింది ఈ విషయం అంబం గ్రామ బీజేపీ కార్యకర్తలు కోనేరు శశాంక్ గారికి తెలియజేయండి జరిగింది కోనేరు శశాంక్ గారు వారిని కలిసి పరామర్శించి దైర్యం చెప్పి వారి రొండు కుటుంబాలకి 25 కేజీ ల బియ్యము ఒక్కొక్క కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ కార్యక్రమం లో బాన్సువాడ నియోజకవర్గం కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, నసురుల్లాబాద్ మండల అధ్యక్షులు సున్నం సాయిలు, ప్రధాన కార్యదర్శి లు ఏముల గజేందర్, వడ్ల సాయినాథ్, ఈ గంగాధర్ మరియు కుర్లెపు గంగాధర్, రేపల్లి సాయిప్రసాద్,శానం బాలాజీ మరియు బూత్ అధ్యక్షులు మరియు బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
View More
Latest News
15 Mar 2025 14:50 PM
1
35
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
గుండెపోటుకు చైనా వ్యాక్సిన్
గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్ను నివారించడానికి చైనా వ్యాక్సిన్ను రూపొందించింది. రక్తనాళాలు గట్టిపడడం, రక్తవాహికల్లో రక్త ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడడానికి కారణమయ్యే ప్లేక్స్ ఏర్పడడాన్ని ఈ నానో వ్యాక్సిన్ నిరోధిస్తుంది. నాన్జింగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చైనా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా 'కాక్టైల్' రూపంలో ఈ నానో వ్యాక్సిన్ను రూపొందించాయి.
View More
Latest News
15 Mar 2025 13:11 PM
0
18
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బీర్కూర్ లో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం
బీర్కూర్ లో జనసేన నాయకులు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు , గ్రామ యువత , నాయకులు , ఫ్యాన్స్ వచ్చి కేట్ కట్ చేసి , బాణసంచా కాల్చుతు, సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సాయి , రాజు , పవన్ , ప్రవీణ్ , సాయి రాజా , మొదలగు నాయకులు పాల్గొన్నారు
View More
Latest News
14 Mar 2025 20:59 PM
3
35
Newsread Image

No.1 Short News

Umar Fharooq
10th Exams నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం
తాళ్లూరు మండలంలో 10th Class పబ్లిక్ పరీక్షలు 6 సెంటర్లలో మొత్తము 825 మంది విద్యార్థులు 17.03.2025 నుండి Exams వ్రాయ బోవుచున్నారు. వీరికి సంబందించి Rooms లో వెంటిలేషన్,ఫ్యాన్స్, Benches ,Drinking water, Toilet Facilities మొదలగు ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రభుత్యం Exams నిర్వహణకు Chief Suptd లను,Departmental Officers ను మరియు ఇన్విజిలేటర్ ను నియమించడం జరిగింది.. Meos.G..సుబ్బయ్య మరియు L. సుధాకర రావు.
View More
Latest News
14 Mar 2025 20:58 PM
0
25
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బీర్కూర్ లో ఘనంగా హొలీ పండగ సంబరాలు
బీర్కూర్లో హోలీ పండుగ సంబరాలు కామారెడ్డి జిల్లా బీర్కూర్ లో హోలీ పండుగ సంబరాలు పాలుపంచుకున్న బీర్కూర్ గంగపుత్ర సంఘం సభ్యులు నాయకులు.ఈరోజు హోలీ పండగ పురస్కరించుకొని బీర్కూర్ గంగపుత్ర సంఘం సభ్యులు గ్రామంలో హోలీ పండగను ఘనంగా జరుపుకోవడం జరిగింది.ఈ పండుగ సందర్భంగా పురస్కరించుకొని గంగపుత్ర యూత్ సీనియర్ నాయకులు నర్రా సాయిలు చెవుల మైస బోయి మిద్దింటి సంతోష్ లింగురం జనశక్తి రిపోర్టర్ రవి పోచయ్య సంతు బీర్కూర్ మరియు కుటుంబ సభ్యులందరికీ ఈ హోలీ పండుగను గంగపుత్ర సభ్యులు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది.
View More
Latest News
14 Mar 2025 19:31 PM
1
18
Newsread Image

No.1 Short News

Umar Fharooq
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ
ఒంగోలు ప్రకాశం భవనం ఆవరణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దళిత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డా. బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి.ఈ కార్యక్రమంలో ఒంగోలు,సంతనూతలపాడు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్,బి.ఎన్. విజయకుమార్, ఒంగోలు నగర పాలక సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి గంగాడ సుజాత, దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రం, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దళిత ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
View More
Latest News
14 Mar 2025 16:48 PM
0
15
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బీర్కూర్ లో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
బీర్కూర్ మండల కేంద్రంలో గ్రామ యువకులు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నరు ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు పవన్ కళ్యాణ్ , ఫ్యాన్స్ పాల్గొననున్నారు
View More
Latest News
14 Mar 2025 16:48 PM
0
11
Newsread Image

No.1 Short News

Newsread
మంత్రి గొట్టిపాటి తో దొనకొండ అభివృద్ది గురించి చర్చించిన కపురం
2004 నుండి 2024 వరకూ 5 దఫాలుగాఎమ్మెల్యే గా విజయం సాధించి,హ్యాట్రిక్ ఎమ్మెల్యే గా వుండి,2024 జూన్ 12 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖామాత్యులుగా ప్రమాణస్వీకారం చేసి, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి హోదాలో ప్రప్రధమంగా, పవిత్రమైన శింగరకొండలోని పుణ్య క్షేత్రమైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఉత్సవాలను ప్రారంభించుటకు రాష్ట్ర మంత్రి హోదాలో మొదటిసారిగా వచ్చిన తరుణంలో, తన ఆప్త మిత్రులైన రాష్ట్ర విద్యుత్ శాఖామాత్యులు గొట్టిపాటి రవికుమార్ గారిని, ప్రకాశం జిల్లా (IRCS) ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జికూటివ్ మెంబర్ మరియు మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి ఆలయ ఉత్సవాలలో భాగంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను కపురం శ్రీనివాసరెడ్డి మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా కపురం శ్రీనివాసరెడ్డి, చిరకాల మిత్రుడైన గొట్టిపాటి తో మట్లాడుతూ...., ఆంధ్రరాష్ట్రం లోనే ప్రకాశం జిల్లా దొనకొండ పరిసర ప్రాంతంలో కొన్నివేల ఎకరాలు ప్రభుత్వ భూములు వున్నాయని, ఈ ప్రాంతాన్ని సోలార్ హబ్బు గా ఏర్పాటుచేయబోతున్నట్లు రాష్ట్ర శాసనసభలో మీ ద్వారా ప్రకటించడం చలా మేము చాలా గర్వించదగిన సందర్భమనీ, గతంలో ఈ ప్రాంతంలో ఆసియా ఖంఢంలోనే అతిపెద్ద ఎరోనాటికల్ ప్రాజెక్టు ను ఏర్పాటుచేయాలని చాలా సువిశాలమైన భూముల కేటాయింపుకై చాలా సార్లు సర్వేలు నిర్వహించారని, ఇవన్నీ తుదిరూపంలోకి వచ్చేదశలో, అంతర్జాతీయ పారిశ్రామికధిగ్గజాలకు మౌళిక వసతులలో భాగంగా, 1932 ప్రాంతంలో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 137 ఎకరాల విస్తీర్ణమైన దొనకొండ విమానాశ్రయాన్ని పలుమార్లు(AAI) ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు పలుమార్లు సర్వే చేసి, ఎలాంటి పురోగతికి నోచుకోలేదని, ఈసారీ ఏవిధంగా మీరు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్న సోలార్ హబ్ తోపాటుగా,అంతర్జాతీయ ఏరోనాటికల్ ప్రాజెక్టుకు నిర్మాణానికి ముఖ్యమంత్రి ని ఒప్పించి,బ్రిటీష్ గవర్నమెంటులో ఒక వెలుగు వెలిగిన దొనకొండకు మీ చొరవతో పూర్వ వైభవాన్ని తీసుకురావాలని,పేరుప్రఖ్యాతులున్న చందవరం భౌధ్ధస్తూపాలను అభివృధ్ధి చేసి,దొనకొండను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా చేసే విధంగా, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో కొత్తపట్నం సముద్ర తీరం నుండి ఒంగోలు,చీమకుర్తి,తూర్పుగంగవరం,దరిశి వయా దొనకొండ మీదుగా తోకపల్లి,కుంట జంక్షన్,దోర్నాల మీదుగా సుప్రసిధ్ధ శైవక్షేత్రమైన శ్రీశైలం వరకు అధిక వ్యయంతో, కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వాములుగా వున్న ఈ శుభతరుణంలో కొత్తపట్నం సాగర తీరంనుండి శ్రీశైలపుణ్య క్షేత్రం వరకు పర్యాటక రహదారి ని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి చొరవ తీసుకునేవిధంగా చేసి దొనకొండకు, దరిశి ప్రాంతానికీ పుర్వవైభవాన్ని తీసుకురావడానికి ప్రధాన దోహదకారిగా వుంటారని మా ప్రాంత ప్రజానీకం వెయ్యికళ్ళతో మీ సేవకోసం ఎదురుచూస్తున్నారని ఆప్త మిత్రులైన రాష్ట్ర మంత్రి గొట్టిపాటికి ఆలయంలోని ఉత్సవాల విరామ సమయంలో అన్నీ విషయాలను సవివరంగా వివరించానని, దానకి నావైపునుండి సంపూర్ణంగా మద్దత్తునిచ్చి, వీటిని నెరవేర్చేందుకు నావంతు శక్తివంచన లేకుండా వీటి అమలుకు గట్టిగా కృషిచేస్తానని మంత్రి గొట్టిపాటి మాటిచ్చారని కపురం శ్రీనివాసరెడ్డి తెలియజేశారు.
View More
Latest News
13 Mar 2025 19:27 PM
3
104
Newsread Image

No.1 Short News

Umar Fharooq
బొద్దికూరపాడు లో క్లస్టర్ కాంప్లెక్స్
తాళ్లూరు మండలంలోని బొద్దికూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలు బుధవారం జరిగాయి.ప్రాథమికోన్నత,ఉన్నత పాఠశాలల్లోని సెకండరీ గ్రేడ్,సబ్జెక్టు ఉపాధ్యాయులకు సమావేశాలు జరిగాయి. సమావేశాలలో బోధనా పాఠ్యాంశాల గురించి, విద్యార్థుల ప్రగతి గురించి, పరీక్షల గురించి చర్చించడం జరిగింది. సమావేశాలలో స్థాన విలువల గురించి గండూరి నాగరాజు ఉపాధ్యాయుడు తయారుచేసిన టిఎల్ఎం గురించి వివరణ ఉపాధ్యాయులను ఆకట్టుకుంది.కార్యక్రమంలో క్లస్టర్ కాంప్లెక్స్ చైర్మన్ P సుబ్బారావు,కన్వీనర్ K శేషు, సి ఆర్ పి ,పులి మారుతి, మండల ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్ వెంకాయమ్మ ,శేషు, కరీం,ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
View More
Latest News
13 Mar 2025 19:21 PM
0
22
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: విధి నిర్వహణ లో ప్రతిభ కనపరిచిన వారికి ప్రశంశాపత్రాలు.
విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన దర్శి సీఐ వై రామారావు, ముండ్లమూరు ఎస్సై నాగరాజు, దర్శి ఎస్సై మురళి, తాళ్లూరు ఎస్సై మల్లికార్జున, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్ మహేష్, మరియాబాబు, కిరణ మహేష్, ఐటి కోర్ కానిస్టేబుల్ బ్రహ్మం, హోంగార్డులు ఖాసీం, ఖాసి రాజు లను జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి వారికి ప్రశంస పత్రాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో అందజేశారు.
View More
Latest News
12 Mar 2025 21:11 PM
4
94
Newsread Image

No.1 Short News

Umar Fharooq
బూచేపల్లి శివ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం
ఒంగోలు లో యువత పోరు కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్ తమీమ్ అన్సారి గారికి వినతి పత్రం అందజేసిన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి.ఒంగోలు పార్లమెంట్ ఇంఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,ప్రకాశం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ,ఎర్ర గొండ పాలెం MLA టి.చంద్ర శేఖర్,మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్,మాజీ MLA లు అన్నా రాంబాబు,కుందూరు నాగార్జున,జంకె వెంకట రెడ్డి,ఆదేన్న,ఒంగోలు ఇంఛార్జి చుండూరు రవి,కనిగిరి ఇంఛార్జి దద్దాల నారాయణ,వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు కుప్పం ప్రసాద్,రెడ్డి కార్పొరేషన్ మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి,కాకుమాను రాజశేఖర్,కటారి శంకర్, పీడీసిసి బ్యాంక్ మాజీ ఛైర్మెన్ బన్నీ, పాల్గొన్నారు.
View More
Latest News
12 Mar 2025 21:10 PM
0
19
Newsread Image

No.1 Short News

Newsread
వందేళ్ల నాటి తమ పూర్వీకుల ఇంటికి కొత్త రూపునిచ్చిన నటుడు మురళీమోహన్
ప్రముఖ నటుడు మురళీమోహన్ తమ పూర్వీకులు వందేళ్ల క్రితం నిర్మించిన ఇంటిని పునరుద్ధరించారు. ఏలూరు జిల్లాలోని చాటపర్రులో ఉన్న ఈ పురాతన భవంతిని అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. ఈ పునరుద్ధరణ ద్వారా రాబోయే 50-60 సంవత్సరాల వరకు భవనం చెక్కుచెదరకుండా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇది మురళీ మోహన్ తాత గారు నిర్మించిన ఇల్లు.
View More
Latest News
12 Mar 2025 15:51 PM
6
29
Newsread Image

No.1 Short News

Newsread
ఏపీ హైకోర్టులో పోసానికి ఎదురుదెబ్బ
సీఐడీ పీటీ వారెంట్‌కు బ్రేక్ వేయాలన్న పోసాని కృష్ణమురళి ప్రయత్నం విఫలమైంది. ఆయన దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. సీఐడీ పీటీ వారెంట్ ను రద్దు చేయాలన్న ఆయన విజ్ఞప్తిని ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. హైకోర్టు నిర్ణయంతో పోసాని తీవ్ర నిరాశకు గురయ్యారు.
View More
Latest News
12 Mar 2025 15:47 PM
0
17
Newsread Image

No.1 Short News

Umar Fharooq
బూచేపల్లి శివ ఆధ్వర్యంలో ఘనంగా YSR CP పార్టీ ఆవిర్భావ వేడుకలు
నేడు YSR CP పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావున దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఒంగోలులోని పార్టీ కార్యాలయం నందు YSR CP పార్టీ జెండాను ఆవిష్కరించి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరిపారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఓటమికి వంగిపోకుండా విజయానికి పొంగి పోకుండా ప్రజలకు కార్యకర్తలకు అనుక్షణం అండగా ఉంటూ దూసుకుపోతున్న YSR CP పార్టీ 15 వా వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రజలకు కార్యకర్తలకు అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
View More
Latest News
12 Mar 2025 15:45 PM
0
17
Newsread Image

No.1 Short News

Umar Fharooq
నౌకరీ దో - నషా నహి
ఆంధ్ర ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఆద్వర్యంలో జరిగిన నౌకరీ ధొ- నషా నహి కార్యక్రమంలో అల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ భాను చిభ్,ఆంధ్ర ప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లక్కరాజు రామ రావు,యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ మమత నాగి రెడ్డి తో కలిసి పాల్గొనడం జరిగింది. ఎన్నికల హామిళలో ఇచ్చిన ఉద్యోగ హామీలను,నిరుద్యోగ భృతి మరియు ఆంధ్ర రాష్ట్రంలో డ్రగ్స్ విపరీతంగా సరఫరా జరుగుతున్న కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అని ప్రభుత్వం మీద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో, కైపు వెంకటకృష్ణా రెడ్డి,అసంఘటిత కార్మికుల ,ఉద్యోగుల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చైర్మన్ ,దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, పాల్గొనడం జరిగింది.
View More
Latest News
12 Mar 2025 14:58 PM
0
15
Newsread Image

No.1 Short News

Newsread
ఒంగోలు లో యువత పోరు కార్యక్రమం
ఒంగోలు లో యువత పోరు కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్ తమీమ్ అన్షారియ కి వినతి పత్రం అందజేసిన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి.
View More
Latest News
12 Mar 2025 14:38 PM
0
16
Newsread Image

No.1 Short News

Umar Fharooq
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంలో కుకింగ్ ఏజెన్సీ ఇబ్బందులు
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంలో ఎగ్ ఫ్రై, ఫ్రైడ్ ఎగ్, ఎగ్ కర్రీ, చిక్కి, నాలుగు కూరగాయలతో కర్రీతోపాటు సాంబారు తయారీతో ప్రతిరోజు రోజుకు ఒక రకం తో విద్యార్థులు తినటానికి చాలా బాగుంటుంది.
View More
Latest News
12 Mar 2025 14:35 PM
0
14
Newsread Image

No.1 Short News

Rasul.Sk
నిఘా నీడలో గ్రామాలు
ముండ్లమూరు మండలం లోని గ్రామాలలో సీసీ కెమెరాలును ఎస్ఐ వై నాగరాజు ఏర్పాటు చేయించారు. గ్రామాలలో దాతలు సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎస్సై తెలిపారు. అద్దంకి, దర్శి రోడ్లలో ప్రధాన కూడలిలో గ్రామాలలో ఎంట్రన్స్ లో, గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కెమెరాలు ఏర్పాటు వలన ప్రతి ఒక్కరి కదలిక గమనించవచ్చునని, కొంతమేర నేరాలు తగ్గుతాయని ఎస్ఐ నాగరాజు తెలిపారు.
View More
Latest News
12 Mar 2025 14:07 PM
0
15
Newsread Image

No.1 Short News

Rasul.Sk
చీటింగ్ కేసు నమోదు
ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామానికి చెందిన బిజ్జం సుబ్బారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాళ్లూరు మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన మాజీ ఐటిసి ఉద్యోగి దారం నాగార్జున్ రెడ్డి అనే వ్యక్తి 2023 సంవత్సరంలో బిజ్జం సుబ్బారెడ్డికి వ్యవసాయ పనిముట్లు అయినా ట్రాక్టర్ ,ట్రక్కులు, రోటవేటర్స్ మొదలగునవి సబ్సిడీ ద్వారా ఇప్పిస్తానని చెప్పి , నమ్మించి,అతని వద్ద సుమారు 08 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుని, ఫిర్యాదికి సదరు వ్యవసాయ పనిముట్లు అయినా ట్రాక్టర్స్ , ట్రక్కు,రోటవేటర్ మొదలైన వస్తువులు ఇవ్వకుండా మరియు అతని డబ్బులు అతనికి ఇవ్వకుండా మోసం చేసినట్లు అదే విధంగా చుట్టుపక్కల మండలాల్లో ఉన్న వ్యవసాయదారు లను ఇదేవిధంగా నమ్మించి మోసం చేసి ,వారి వద్ద డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదు ఇవ్వగా సదరు ఫిర్యాదు పై ముండ్లమూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.
View More
Latest News
12 Mar 2025 14:06 PM
1
15
Newsread Image

No.1 Short News

కపురం శ్రీనివాసరెడ్డి
దరిశి గురుకుల పాఠశాల పై శ్రధ్ధచూపండి.
ఈ రోజు దరిశి నగర పంచాయతీ పరిధిలోని ఎన్నెస్పీ కాలనీలోని డాక్టర్ అంబేద్కర్ సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మరియు కళాశాల ప్రాంగణంలో 50 శెంట్ల (అర ఎకరా)స్థలాన్ని ఇంకా ఇప్పటివరకూ ఎవరి ఆధీనంలో లేకుండా గురుకుల పాఠశాలకు అప్పచెప్పకుండా ఎందుకు పాఠశాల మద్య ఉంటారని విషయాన్ని, ప్రకాశం జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జికూటివ్ మెంబర్ మరియు మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి ఈ రోజు ఒంగోలు ప్రకాశం భవనంలో కలిసి, గురుకుల పాఠశాల బాగోగుల గురించి చర్చించే దానిలో భాగంగా, పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు అనుభవిస్తున్న తీరు,తలిదండ్రుల పర్యవేక్షణకు దూరంగావుండి గురుకులంలో విద్యనభ్యసించడానికి వచ్చిన చిన్నారులను అన్నీ తామేనని విద్యార్థుల గురుతరమైన పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న గురువులందరూ అనుభవిస్తున్న వ్యధను కలెక్టర్ తమీమ్ అన్సారియా కు పూసగుచ్చినట్లు వివరించానని కపురం శ్రీనివాస రెడ్డి అన్నారు.ఎన్నెస్పీ కాలనీలో ఈ గురుకుల పాఠశాలే గాకుండా,దూరదర్శన్ కేంద్రం,ఎంపీపి స్కూల్,ఫైర్ స్టేషన్లలో,ఇండోర్ స్టేడియం,డీఎస్పీ ఆఫీసు మరియు వ్యవసాయ సహాయ సంచాలకుల కార్యాలయాలు ఉన్నాయి.అన్నీ కార్యాలయాలు బాగున్నప్పటికీ, ఏ క్లారిటీ లేక విద్యార్థుల పరీక్షల సమయంలో విష సర్పాలతో భయాందోళనకు గురవుతున్నారని కలెక్టర్ కు తెలిపానని తెలియజేశారు.
View More
Latest News
11 Mar 2025 22:20 PM
2
35
Newsread Image

No.1 Short News

Umar Fharooq
వెంకటసుబ్బారెడ్డి కి శుభాకాంక్షలు
తాళ్లూరు మండల YSRCP పార్టీ అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన తూము వెంకట సుబ్బారెడ్డి గుంటిగంగా భవాని అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షులని శాలువా , పూలమాలతో సత్కరించారు. ఈకార్యక్రమంలో గుంటిగంగా భవాని దేవస్థానం మాజీ ఛైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావు , భీమిరెడ్డి,నాగమల్లేశ్వరరెడ్డి,అడ్వకేట్ , మండల SC సెల్ అధ్యక్షులు పునూరి దేవదానం , లక్కవరం ఎంపీటీసీ కొటేసు, పునూరి చిన్న నాగరాజు,వైసీపీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
View More
Latest News
10 Mar 2025 14:10 PM
0
38
Newsread Image

No.1 Short News

Umar Fharooq
తాళ్లూరు మండలంలోని వెలుగు కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ కార్యక్రమం
తాళ్లూరులోని వెలుగు కార్యాలయంలో ఏపిఎం దేవరాజు అధ్యక్షత వహిస్తూ మహిళా దినోత్సవ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపిపి,శ్రీనివాసరావు మాట్లాడుతూ వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మహిళలు మానసికంగా ఎంతో దృఢమైన వారని ఆయన అన్నారు. ఏపిఎం దేవరాజు మాట్లాడుతూ గృహంలోనే కాకుండా ఉద్యోగ,వ్యాపార రంగాలలో ముందంజ వేస్తున్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ టిడిపి మండల అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ ఇల్లాలు ఇంటికి వెలుగు అయితే మహిళలు దేశానికే వెలుగునిస్తున్నారని వివిధ రంగాలలో విశేష సేవలు అందిస్తున్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి,కొండారెడ్డి, జడ్పిటిసి మారం వెంకారెడ్డి, ఎంఈఓ సుబ్బయ్య, ఎడమ కంటి శ్రీనివాస్ రెడ్డి, గీతాంజలి స్కూల్ కరస్పాండెంట్ యాతం శ్రీనివాసరెడ్డి, నీటి సంఘం అధ్యక్షుడు శివనాగిరెడ్డి, ప్రకృతి వ్యవసాయ కోఆర్డినేటర్ నరసింహులు, మండల సమైక్య అధ్యక్షురాలు ఎం సుజాత, ఏపిఎం దేవరాజు, ఈసీలు మోహన్ రావు, సుచేంద్ర,అకౌంటెంట్ కుమారి,వివో ఏలు గ్రామ సంఘ అధ్యక్షురాలు పాల్గొనడం జరిగింది.
View More
Latest News
09 Mar 2025 17:25 PM
1
54
Newsread Image

No.1 Short News

Umar Fharooq
ఎ బి సి స్కూల్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం
తాళ్లూరు మండలం లో ఎబీసీ హైస్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. అనంతరం కరస్పాండెంట్ టి.శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన సభను నిర్వహించారు. కరస్పాండెంట్ మాట్లాడుతూ సమాజంలో విద్యార్థులకు తీర్చిదిట్టటంతో తల్లుల పాత్ర కీలకమని ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను గౌరవిస్తూ ఉన్నత స్థితికి తీసుకురావాలని కోరారు. ప్రధానోపాధ్యాయుడు కె వెంకటేశ్వర రావు మాట్లాడుతూ సమాజం అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పటంలో ఎంతో ఓర్పు, నేర్పు, ఔదార్యం ప్రదర్శిస్తారని అన్నారు. డైరెక్టర్ కాలేషా బాబు మాట్లాడుతూ ప్రకృతిలో పురుషులకు ముందు ఆమె ఉందని ప్రతి ఇంగ్లీషు పదంలో ఉన్న అక్షరాలతో ఉదాహరణలో వివరించారు. విజేతలైన ఉపాధ్యాయులు సుజాత లకు, ఉదయలక్ష్మిలకు బహుమతులు అందించారు.
View More
Latest News
09 Mar 2025 16:40 PM
0
30
Newsread Image

No.1 Short News

Umar Fharooq
ఏపీ డీజీపీ ఆఫీసులో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ఏపీ డీజీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా ఏపీ డీజీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా సాధికారతతోనే సమాజం అభ్యున్నతి వైపు పయనించింది. వివిధ రంగాలలో మహిళలు ప్రగతి పథంలో ముందుకు పయనిస్తున్నారు. సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలలో విజేతలకు సీమా గుప్తా చేతులు మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్, గుప్తా ఆర్ధాంగి సీమా గుప్తా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ ఐజిపి రాజకుమారి,డిఐజి కమ్యూనికేషన్స్ ఎన్ ఎస్ జే లక్ష్మి,డిసీపీ సరిత, డీజీపీ కార్యాలయంలోని ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగినులు పాల్గొన్నారు.
View More
Latest News
08 Mar 2025 11:51 AM
0
44
Newsread Image

No.1 Short News

Umar Fharooq
మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
మహిళలందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలుతో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ( APTF ) తాళ్లూరు మండల శాఖ గౌరవ అధ్యక్షులు పొలం రెడ్డి సుబ్బారెడ్డి, అధ్యక్షులు గుండూరి నాగరాజు, ప్రధాన కార్యదర్శి నారిపెద్ది శ్రీనివాసరావు, మండల కమిటీ.
View More
Latest News
08 Mar 2025 11:45 AM
0
39
Newsread Image

No.1 Short News

Umar Fharooq
పశువుల భీమా పథకాన్ని సద్వినియోగపరుచుకోవాలి
ఒంగోలు జిల్లాలోని తమ పశువులకు పోషకులు బీమా చేయించుకోవాలని పశుసంవర్థకశాఖ జిల్లా అధికారి (డీఏహెచ్వో) డాక్టర్ బేబీరాణి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.ఒకసారి బీమా ప్రీమియం చెల్లిస్తే మూడేళ్ల వరకు వర్తించేలా చర్యలు తీసుకున్నారని ఆమె అన్నారు.పశువులు మృత్యువాత పడిన సమయంలో పరిహారం అందుతుందని తెలిపారు.ఒక్క పశువుకు రూ.15వేలకు రూ.960 ప్రీమియం ఉందని ప్రభుత్వ వాటా రూ.768, రైతు వాటా రూ.192 చెల్లించాలన్నారు.రూ.30వేల బీమాకు ప్రీమియం రూ.1,920 ఉండగా ప్రభుత్వవాటా రూ.1,536, రైతు వాటా రూ.384, గేదెలు, మేకలు ప్రీమియం రూ.375 ఉండగా ప్రభుత్వ వాటా రూ.300, రైతు వాటా రూ.75 చె ల్లించాల్సి ఉంటుందన్నారు. రైతులందరూ ఈ బీమా పథకాన్ని సద్వినియోగ పరచుకోవాలని ఆమె చెప్పడం జరిగింది.అయితే జిల్లాకు మొదటి విడతలో రూ.18లక్షల రాయితీని గత ఏడాది ఆగస్టులోనే ప్రభుత్వం విడుదల చేయగా ప్రస్తుతం రూ.16 లక్షలు విడుదల చేసిందనీ ఆమె అన్నారు.
View More
Latest News
08 Mar 2025 11:44 AM
0
32
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌హిళ‌లంద‌రికీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మ‌హిళలు బాగుంటేనే ఆ కుటుంబం, రాష్ట్రం, దేశం బాగుంటుందని తెలిపారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారన్న నానుడి ఉందని అన్నారు. ఆ నానుడిని నమ్ముతూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టామన్నారు. మన ప్రభుత్వ కాలంలో మ‌హిళల అభ్యున్నతి, సాధికార‌తకు పెద్దపీట వేస్తూ పాల‌న చేశామని పేర్కొన్నారు. అన్నిరంగాల్లో మహిళలను ప్రోత్సహించి, దాదాపు 32కు పైగా ప‌థ‌కాల‌ ద్వారా వారికి భ‌రోసా క‌ల్పించామని, నామినేటెడ్ ప‌ద‌వులు, ప‌నుల్లో 50 శాతం కేటాయిస్తూ తొలిసారిగా చ‌ట్టం చేశామని వివరించారు. గిరిజ‌న‌, ద‌ళిత మ‌హిళ‌ల‌ను డిప్యూటీ సీఎం, హోంమంత్రి లాంటి పెద్ద ప‌ద‌వుల‌తో గౌర‌వించామని పేర్కొన్నారు. మహిళల భద్రత, రక్షణ కోసం దిశ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌వేశ‌పెట్టామని జగన్ పేర్కొన్నారు.
View More
Latest News
08 Mar 2025 10:29 AM
0
28
Newsread Image

No.1 Short News

Umar Fharooq
10 వ తరగతి విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
ఈ నెల 17 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 6.49 లక్షలమంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం 3,450 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాబట్టి విద్యార్థులు ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి,అక్కడి నుంచి తిరిగి ఇంటికి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చంటూ ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు.
View More
Latest News
08 Mar 2025 09:43 AM
0
23
Newsread Image

No.1 Short News

Umar Fharooq
తాళ్లూరు మండలంలోని రామభద్రపురంలో రీ సర్వేపై రైతులకు అవగాహన
తాళ్లూరు మండలంలో రామభద్రాపురంగ్రామాన్ని మోడల్పైలట్ రీసర్వే గ్రామంగా ఎంపికచేసిఇటీవల జరిగిన రీసర్వేపై అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ సంజీవరావు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న రైతులందరికీ సర్వే జరిగే ముందు నోటీసులు ఇవ్వడం జరిగిందని చెప్పారు. రెవెన్యూ సిబ్బంది రైతుల సమక్షంలోనే భూములకొలతలను తీయటం జగిందన్నారు. రికార్డుల ఆధారంగా భూమిలో ఉన్న హక్కుదారుని వివరాలు పూర్తిగా నమోదు చేయటం జరిగిందన్నారు.రీసర్వే జరిగినందున ఏవైనా అభ్యంతరాలు,స మస్యలు వుంటే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకొని వస్తే పరిశీలించి సమస్య పరిష్కరించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో డీటీప్రశాంత్,మండల సర్వేయర్ వై.శ్రీనివాసరావు,విఆర్వోలు చంద్రశేఖర్ రావు,కాశీంబీ,రమణారెడ్డి,వి లేజ్ సర్వేయర్ లు భవానీ,మల్లిఖార్జున తదితరులు పాల్గొన్నారు.
View More
Latest News
08 Mar 2025 09:42 AM
1
24
Newsread Image

No.1 Short News

Umar Fharooq
మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
తల్లిగా,భార్యగా,చెల్లిగా,అక్కగా,ప్రతి కుటుంబంలో ఉంటూ ఆ కుటుంబాన్ని చక్కదిద్దడంలో వారికి వారే సాటి, సాధారణ విద్యార్థి నుండి గర్భిణీ వరకు.. ఐఏఎస్,ఐపీఎస్,ఎమ్మెల్యేలు,ఎంపీలు,ప్రధాన మంత్రులు,కేంద్ర మంత్రులు,రాష్ట్ర మంత్రులు,జడ్జిలు,డిఎస్పీలు,ఎస్సైలు,ఇలా వివిధ సామాజిక సేవలలో రాణిస్తున్న మహిళల పాత్ర ఎనలేనిది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిద రంగాలలో సామాజిక సేవలలో రాణిస్తున్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తునను. ఇట్లు: మీ సాదిక్ బి ఎస్ ఆర్ న్యూస్ దర్శి
View More
Latest News
08 Mar 2025 08:50 AM
1
25
View Latest Short News
You are offline
Please check your internet connection.
Close

Find News

News Categories

  • All Categories
  • Jobs
  • Latest News
  • Motivation
  • Crime News
  • Local Ads
  • Entertainment
  • Local Updates
  • Sports News
  • Education
  • Business Promotions
  • Politics
  • Breaking News
  • Install App
    ALL
    | newsread.in

    Install App

    Install App
    Cancel