Select Location
Newsread Image

No.1 Short News

Newsread
సిపిఆర్ చేసి ప్రాణం కాపాడిన కనిగిరి సీఐ షేక్ ఖాజావలి
కనిగిరి కాస్మోపాలేట్ క్లబ్ నందు టెన్నిస్ ఆడుతున్న కనిగిరి పిఎసిఎస్ అధ్యక్షులు అద్దంకి రంగబాబు అకస్మాత్తుగా కళ్ళు తిరిగి కిందపడిపోయారు. అదే సమయంలో అక్కడే టెన్నిస్ ఆడుతున్న కనిగిరి సీఐ ఖాజావలి ఈ ఘటనను గమనించి వెంటనే స్పందించారు. ప్రాథమిక వైద్య పరమైన చర్యగా సిపిఆర్ ( కార్డియోపల్మనరీ రిససిటేషన్) చేయటంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనను చూసిన సభ్యులు మరియు టెన్నిస్ పక్కనే ఉన్న కాస్మోపాలిటీ సభ్యులు మరియు టెన్నిస్ క్రీడాకారులు మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ తన కారులో వెంటనే అందరు కలిసి సమీపoలోని హాస్పిటల్ నందు చేర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ సరైన సమయంలో తీసుకురావడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. ఇలానే ప్రతి ఒక్కరు సి పి ఆర్ పి పైఅవగాహన కలిగి ఉండాలని డాక్టర్ కిరణ్ తెలిపారు. కనిగిరి సీఐ షేక్ ఖాజావలి మాట్లాడుతూ త్వరలో జర్నలిస్టుల అందరితో సమావేశం ఏర్పాటు చేసి అందరికీ సిపిఆర్ మీద అవగాహన కల్పిస్తానని ,ఎవరైనా కానీ ప్రాణాపాయ పరిస్థితిలో ఉంటే ఆ సమయంలో సి పి ఆర్ చేసి ప్రాణాపాయం పరిస్థితులను నుండి కాపాడవచ్చు అని సిఐ ఖాజావలి తెలిపారు.
View More
Local Updates
12 Oct 2025 07:25 AM
1
102
Newsread Image

No.1 Short News

Newsread
ముస్లిం ల మీద కక్ష్య సాధింపు తగదు: షమ్షీర్
కన్పూర్లో మొన్న జరిగిన మిలాదున్నబి సందర్భంగా ఐ లవ్ మొహమ్మద్ పోస్టర్లు వేసినందుకు పోలీసులు పోస్టర్ వేసిన వాళ్ళను తీసుకువెళ్లి అరెస్ట్ చేయటం జరిగింది . ముస్లిం అనే ప్రతిఒక్కరు మా ప్రవక్త అయినా ముహమ్మద్ గారిని మేము అమితంగా ప్రేమిస్తాం . కేవలం ముస్లీమ్స్ మీద కక్ష సాధింంపు చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం రానున్న రోజుల్లో తీవ్రంగా బాధ పడే రోజులు దెగ్గర్లోనే ఉన్నాయి . ప్రకాశం జిల్లా ముస్లిం మైనారిటీ చైర్మన్ గా దీనిని నేను కండిస్తున్నాను. వారి వారి మతాలను కులాలను గౌరవించు కొని ప్రేమించుకునే హాక్కు అందరికి మన రాజ్యాంగం మనకు కలిపించింది . ఐ లవ్ యూ ముహమ్మద్ అనటంలో ఎం తప్పుందో .అది ఏమైనా నేరమా మీ అంతరాత్మలను పర్సిలించుకోండి . ఐ లవ్ యూ ముహమ్మద్ .
View More
Local Updates
29 Sep 2025 07:38 AM
1
101
Newsread Image

No.1 Short News

Newsread
వినుకొండ: సాయి డిగ్రీ కళాశాలపై కఠిన చర్యలు తీసుకోవాలి: గులాం రసూల్
వినుకొండలోని సాయి డిగ్రీ కళాశాల నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో ముస్లిం సమాజపు సంప్రదాయాలను అవమానపరిచేలా, అసభ్యత కలిగిన అంశాలను చేర్చడం తీవ్రంగా ఖండనీయమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు... స్థానిక జిన్నాటవర్‌ సెంటర్‌లోని గులాం రసూల్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యా సంస్థలు విద్యార్థులకు జ్ఞానం, సంస్కారం, నైతిక విలువలు బోధించాల్సిన ప్రదేశాలు కాగా, ఆ ప్రాంగణాన్ని ఒక మత సమాజంపై దూషణకు వేదికగా మార్చడం అత్యంత బాధాకరమని ఆయన విమర్శించారు.. ఈ సందర్భంగా గులాం రసూల్ మాట్లాడుతూ, ఇలాంటి ఘటనలు ఒక్కసారి జరిగి ఆగిపోవడం లేదు. గతంలో గుంటూరు జిల్లాలోని భాష్యం విద్యాసంస్థల్లోనూ ముస్లిం సంప్రదాయాలపై అసభ్యకర ప్రదర్శనలు నిర్వహించారు. ఇప్పుడు మళ్లీ వినుకొండలోని సాయి డిగ్రీ కళాశాలలో అదే విధమైన ఘటన జరగడం ద్వారా యాజమాన్యం యొక్క నిజమైన ఉద్దేశ్యం బయటపడింది. ఇది విద్యార్థుల మధ్య సామాజిక వైరం రగిల్చే ప్రయత్నం, సమాజ శాంతిని భంగపరిచే చర్య్ఙ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక విద్యా సంస్థలో మతానికి వ్యతిరేకంగా ఈ విధమైన కార్యక్రమాలు ప్రోత్సహించడం కేవలం నిర్లజ్జకరమైన చర్య మాత్రమే కాకుండా, దేశ రాజ్యాంగం హామీ ఇచ్చిన మత స్వేచ్ఛ, మతపరమైన గౌరవానికి విరుద్ధమని గులాం రసూల్ హెచ్చరించారు. ఇలాంటి చర్యలతో సమాజంలో విభేదాలు పెరిగి, యువతలో విషపూరిత ఆలోచనలకు కారణమవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాల యాజమాన్యం తక్షణమే క్షమాపణ చెప్పి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే విద్యార్థులు, ముస్లిం సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా, ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని చిన్నచూపు చూడకుండా వెంటనే జోక్యం చేసుకొని, కళాశాల యాజమాన్యంపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా వాతావరణాన్ని దెబ్బతీసేలా, మతానికి అవమానం కలిగించేలా ప్రవర్తించే వారికి శిక్ష తప్పదనే బోధ కలగాలంటే, సంబంధిత కళాశాలపై కేసు నమోదు చేసి, అవసరమైతే సంస్థ గుర్తింపును రద్దు చేసేంత కఠిన చర్యలు తీసుకోవాల్ఙి అని గులాం రసూల్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు...
View More
Local Updates
28 Sep 2025 19:38 PM
1
65
Newsread Image

No.1 Short News

Newsread
రాష్ట్రంలో బాలకృష్ణను మించిన సైకో మరొకరు లేరు: గులాం రసూల్
సినీ నటుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణను మించిన సైకో రాష్ట్రంలో మరొకరు లేరని ఆయనకు ఇప్పటికే మెంటల్ సర్టిఫికెట్ కూడా ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్ ఫైర్ అయ్యారు. అసలు జనంలోకి వస్తే సైకోలా వ్యవహరించేదెవరో అందరికీ తెలుసని బాలకృష్ణ పై ఆయన మండిపడ్డారు. వైయస్ జగన్ పై బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా గులాబ్ రసూల్ మాట్లాడుతూ బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది ఎమ్మెల్యే బాలకృష్ణ మనసులో ఏదో బాధ ఉన్నట్లు ఉంది అని అన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి ఇచ్చే ప్రాధాన్యత తనకు ఇవ్వటం లేదన్న బాధ, లేకపోతే మరేదో ఉందని దానివల్లే నిండు అసెంబ్లీలో సైకో అనే పదం బాలకృష్ణ చెబుతున్నారని అసలు సైకో బాలకృష్ణ కే సరిపోతుందని అన్నారు. బెల్లంకొండ సురేష్ మీద కాల్పులు జరిపిన కేసులో మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుని ఆ కేసు నుండి బయటపడిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు . నందమూరి బాలకృష్ణ మానసిక స్థితి సరిగా లేదని ఆయన వెంటనే ఆసుపత్రిలో చూపించుకోవడం మంచిదని అన్నారు. వైయస్ జగన్ ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రజల హృదయాల్లో నిజమైన నాయకుడిగా ఉన్నారని బాలకృష్ణ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది అని గులాం రసూల్ హెచ్చరించారు.
View More
Local Updates
26 Sep 2025 10:43 AM
1
94
Newsread Image

No.1 Short News

Newsread
ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబుతో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి భేటీ
నూతనంగా కలెక్టర్ గా నియమితులైన ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గురువారం తాళ్లూరు ఎంపీపీ ఆఫీస్ నందు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజబాబు ని పూల మొక్క అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ సమస్యలపై డాక్టర్ లక్ష్మీ కలెక్టర్ తో కొద్దిసేపు చర్చించారు.... ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దర్శి పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీల అమలు ముందుకు తీసుకువెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ తో చర్చించారు.. దర్శి లో గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటన సందర్బంగా డా|| గొట్టిపాటి లక్ష్మీ దర్శి పట్టణంలో వాటర్ స్కీం ఫిల్టర్ బెడ్ల సమస్య CM కి తెలియజేయగా... వాటర్ స్కీం ఫిల్టర్ బెడ్ల నిర్మాణానికి మూడున్నర కోట్ల నిధులు మంజూరైనట్లు ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీ కి తెలిపారు. దీనిపై డాక్టర్ లక్ష్మీ ముఖ్యమంత్రి చంద్రబాబు కి, కలెక్టర్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వెంటనే పనులు ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించడం ఎంతో శుభ పరిణామం అన్నారు. దర్శి పట్టణంలో ఫిల్టర్ బెడ్లను నిర్మాణం పూర్తి చేస్తే తాగునీటి సమస్య కొంతవరకు పరిష్కారం అవుతుందన్నారు. అదేవిధంగా గ్రామాలకు తాగునీరు వెళ్లే ఫిల్టర్ బెడ్ రూమ్ కూడా త్వరలో పూర్తి చేయాలని కలెక్టర్ కి డాక్టర్ లక్ష్మి విన్నవించారు. తూర్పు వీరాయపాలెం గ్రామంలో బ్రిడ్జి నిర్మాణం చివరిదిశ పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తూర్పు వీరాయపాలెం గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, పట్టాల పంపిణీ, రోడ్డు నిర్మాణం పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. డిగ్రీ కాలేజీ నిర్మాణం, ఆర్టీసీ బస్టాండ్ పునర్నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాల పై కలెక్టర్ గారితో గారితో చర్చించారు. దర్శి లో యోగ డే సందర్బంగా అధ్యాపకులు, విద్యార్థుల కోరికమేరకు దర్శి ప్రభుత్వ హై స్కూల్ - జూనియర్ కళాశాల లో ఫ్లోరిగ్ సమస్య ని కలెక్టర్ తెలియజేయగ త్వరలో సమస్యను పరిషరించాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ పనులు తిరిగి ప్రారంభించుట, • గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంతో కొండ వైపు రోడ్డు పాడైందని వెంటనే తిరిగి నిర్మించాలని డాక్టర్ లక్ష్మీ కలెక్టర్ ను కోరగా హైవే అధికారుల తో మాట్లాడి వెంటనే రోడ్డు నిర్మించాలని హైవే అధికారులను కలెక్టర్ ఆదేశించారు. • అదేవిధంగా రైతులు పంట సాగు కోసం తూముల వద్ద పైపులు పూడి పోయాయని డా|| లక్ష్మీ కోరగా వెంటనే వాటిని కూడా పునర్నిర్మించాలని కలెక్టర్ ఆదేశించారు. • ఎస్సీ కాలనీలకు రోడ్ల నిర్మాణం, తదితర సమస్యల గురించి కలెక్టర్ తో సుదీర్ఘంగా చర్చించారు. దర్శి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం లో తాళ్లూరు మండల ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు మేడం వెంకటేశ్వర్ రెడ్డి మరియు మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
View More
Local Updates
25 Sep 2025 15:28 PM
1
60
Newsread Image

No.1 Short News

Newsread
ప్రకాశం: నేరాల నివారణకు పహారా, FINS సిస్టమ్ తో పటిష్ట నిఘా
ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు జిల్లా వ్యాప్తంగా కఠిన పహారా నిర్వహిస్తున్నారు. Fingerprint Identification Networking System (FINS) ఆధారంగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, అక్కడ ఎటువంటి నేరాలు జరగకుండా పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులపై విచారణ చేసి వారి వివరాలను FINS సిస్టమ్‌లో ధృవీకరిస్తున్నారు. ప్రతి పట్టణం, గ్రామంలో ముఖ్యమైన ప్రదేశాలు, హాట్‌స్పాట్‌లలో పోలీసు బృందాలు గస్తీ తిరుగుతూ శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నాయి. క్రైమ్ కంట్రోల్‌లో ఆధునిక టెక్నాలజీని వాడుతూ ప్రజల భద్రతను ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు. పోలీసుల క్రమమైన పర్యవేక్షణ వల్ల నేరగాళ్లకు తావులేకుండా నిరంతర భద్రతా వాతావరణం ఏర్పడుతోంది. ప్రకాశం పోలీసుల హెచ్చరిక: నేరాలకు పాల్పడే వారిపై ఎటువంటి కనికరము ఉండదు. కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు. ప్రజలకు విజ్ఞప్తి: సమాజ శాంతి భద్రత కోసం పోలీసులకు సహకరించండి. అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించవలసిందిగా తెలియచేశారు.
View More
Local Updates
25 Sep 2025 15:03 PM
0
65
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి:
ప్రతి ఒక్కరు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దర్శి ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని పరిమళ పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో దర్శి మండల పరిధిలోని అంగన్ వాడి సూపర్ వైజర్ లు అంగన్ వాడి కార్యకర్తలతో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా వారి వారి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రస్తుతం వర్షాలకు సంభవించే అంటూ వ్యాధులను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రత పాటించాలన్నారు. వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ వేడిచేసిన మంచినీళ్లు త్రాగాలని సూచించారు. అంటు వ్యాధులు ప్రబల కుండా ఆరోగ్యశాఖ వారు ఇచ్చే సూచనలు తప్పకుండా పాటించాలని ఆశ వర్కర్లకు సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి సూపర్ వైజర్ లు ఆర్. ఆనందలత, రమాదేవి, మండలంలోని అందరూఅంగన్ వాడి కార్యకర్తలు ఐసిడిఎస్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
View More
Local Updates
25 Sep 2025 14:46 PM
2
50
Newsread Image

No.1 Short News

Newsread
సోషల్ మీడియాలో లేనిపోనివి ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు: ప్రకాశం ఎస్పీ
ప్రజలు, ప్రజా ప్రతినిధులపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా ఇతరులపై నిరాధారమైన ఆరోపణలు చేయడం, వాట్సాప్ గ్రూపులు, ఇన్‌స్టాగ్రామ్ వంటివి వాడుకొని అసభ్యంగా వ్యాఖ్యానించడం పట్ల పోలీసులు తీవ్ర దృష్టి సారించారని తెలిపారు. మహిళలపై, ఇతరులపై కించపరిచే రీతిలో వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, కులం-మతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టడం లాంటి చర్యలపై కఠిన చర్యలు తప్పవన్నారు. సోషల్ మీడియా వేదికలపై పోలీస్ శాఖ నిరంతర నిఘా పెట్టి వ్యవహరిస్తోందని ఎస్పీ గారు తెలిపారు. సమాజాన్ని కలవరపెట్టేలా కాకుండా, వాస్తవాలను తెలుసుకున్న తర్వాతనే సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేయాలని ప్రజలకు సూచించారు. యువత సోషల్ మీడియాను మంచి కోసమే వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.
View More
Local Updates
24 Sep 2025 07:02 AM
1
41
Newsread Image

No.1 Short News

Newsread
తెలంగాణ: GHMC కమిషనర్ కి వినతి పత్రం అందజేసిన మీర్ హాదీ అలీ
రంగారెడ్డి జిల్లా ఈస్ట్ జోన్ జిహెచ్ఎంసి పరిధిలోని హయత్ నగర్ లో గల సత్యనారాయణ కాలనీ లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని 1, 2, 4, 5 రోడ్లు మరీ దారుణంగా ఉన్నాయని ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రోడ్లు అధ్వానం గా తయారయ్యాయని ఈ ప్రాంతంలో దర్గా, మస్జిద్ లకు అధిక సంఖ్యలో వస్తున్న ప్రజలు ఈ రోడ్లతో ఇబ్బందులు పడుతున్నారని త్వరగా రోడ్లు నిర్మాణం చేపట్టాలని ఆయన జిహెచ్ఎంసి ఈస్ట్ జోన్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటివ్ కు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ మీర్ హాదీ అలీ వినతిపత్రం అందజేశారు, త్వరలోనే రోడ్ల నిర్మాణానికి కావలసిన నిధులు ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నం చేస్తామని ఆయన భరోసాని ఇచ్చారు.
View More
Local Updates
24 Sep 2025 06:26 AM
1
31
Newsread Image

No.1 Short News

Newsread
వలేటి వెంకట్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన గొట్టిపాటి లక్ష్మీ, లలిత్ సాగర్
ఆదివారం రాత్రి ముండ్లమూరు మండలం, ఉల్లగళ్లుగ్రామం లో వినాయక నిమజ్జనం సందర్బంగా టిడిపి యూనిట్ ఇంచార్జ్ వలేటి వెంకటేశ్వర్లు మృతి చెందగా విషయం తెలుసుకున్న దర్శి టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గార్లు సోమవారం ఉల్లగల్లు గ్రామానికి వెళ్లి వలేటి వెంకటేశ్వర్లు భౌతిక కాయానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి, తెలుగుదేశం పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందని తెలియజేసారు. డా|| లక్ష్మీ తో పాటు మండల టిడిపి అధ్యక్షులు కూరపాటి శ్రీను, మండలం లోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు, ఉల్లగల్లు గ్రామ టిడిపి నాయకులు, కూటమి శ్రేణులు ఉన్నారు.
View More
Local Updates
01 Sep 2025 19:16 PM
0
78
Newsread Image

No.1 Short News

Newsread
ప్రకాశం జిల్లా మానవత స్వచ్ఛంద సేవాసంస్థ ప్రధాన కార్యదర్శిగా కపురం శ్రీనివాసరెడ్డి.
ఈరోజు పొదిలి లోని మానవత స్వచ్ఛంద సేవాసంస్థ నూతన కార్యాలయ భవన ప్రారంభోత్సవానికి మానవత సంస్థ వ్యవస్థాపకుడు ఎన్.రామచంద్రారెడ్డి విచ్చేసిన శుభసందర్భంలో భాగంగా.., ప్రకాశం జిల్లా మానవత స్వచ్ఛంద సేవాసంస్థ నూతన కార్యవర్గ సభ్యులచే సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో,ఇప్పటివరకు దరిశి మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్ గా పనిచేస్తున్న కపురం శ్రీనివాసరెడ్డిని ప్రకాశం జిల్లా మానవత సంస్థకు ప్రధాన కార్యదర్శిగా, జిల్లాలోని 10 శాఖల మానవతా మూర్తులందరిచేత ఏకగ్రీవంగా ఎన్నుకోబడి ఈరోజు కపురం శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కపురం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..., సేవ చేయాలన్న ఆలోచన బలంగా వుండబట్టే సుధీర్గ రాజకీయాలను సైతం పూర్తిగా వదులుకొని ఈ సంస్థచెంతకు రావడం జరిగిందని, సేవ చేస్తే దేనిలోదక్కని ఆత్మసంత్రుప్తి దీనిలో దొరుకుతుందని, మానవుని ఆయుష్ పెరుగుతుందని కపురం శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రసంగించారు.
View More
Local Updates
17 Aug 2025 17:59 PM
0
92
Newsread Image

No.1 Short News

Newsread
జగన్ ను కలిసిన వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ని తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి తనను వైస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు గులాం రసూల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు.
View More
Local Updates
06 Aug 2025 06:13 AM
2
93
Newsread Image

No.1 Short News

Newsread
జర్నలిస్టు’కు డెఫినేషన్ ఇచ్చిన సీఎం రేవంత్
ఆవారాగా రోడ్ల మీద తిరుగుతూ, తిట్లు తిడుతూ, అసభ్యకరంగా మాట్లాడేవాడు జర్నలిస్ట్ అని సీఎం రేవంత్ రెడ్డి కొత్త డిఫినేషన్ ఇచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తన వ్యాఖ్యలతో వివాదానికి తెరలేపారు. యూట్యూబ్ జర్నలిస్టులపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తూ, వారిని అవమానించేలా మాట్లాడారు. “ఆవారాగా రోడ్ల మీద తిరుగుతూ, తిట్లు తిడుతూ, అసభ్యంగా మాట్లాడేవాడు ‘జర్నలిస్ట్’ అనే ముసుగుతో సోషల్ మీడియాలో అందరిపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు” అని రేవంత్ వ్యాఖ్యానించారు
View More
Local Updates
01 Aug 2025 16:02 PM
0
75
Newsread Image

No.1 Short News

Newsread
గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న దర్శి సీఐ & ఎస్సై.
దర్శి: ఈరోజు మోడల్ స్కూల్ లో దర్శి సీఐ మరియు ఎస్ఐ విద్యార్థులతో ముచ్చటిస్తూ చదువు జీవితాన్ని మార్చే ఒక శక్తివంతమైన ఆయుధమని, చదువుకోవడం ద్వారానే సమాజంలో మంచి వ్యక్తులుగా ఎదుగుతారని, విద్యార్థి దశలోనే మీ లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలని, అలాగే ఈ వయసులో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, మాదక ద్రవ్యాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అపరిచితులను నమ్మొద్దని, ఏదైనా అనుమానస్పదంగా అనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియచేయాలని తెలిపారు.
View More
Local Updates
24 Jul 2025 21:14 PM
0
122
Newsread Image

No.1 Short News

Newsread
ఏపీకి భారీ వర్ష సూచన.. 2 రోజులు కుండపోత వానలు.. పిడుగులు పడే ప్రమాదం..!
ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు ఉత్తరాంధ్రలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు వానలు పడే అవకాశం ఉందన్నారు.
View More
Local Updates
24 Jul 2025 21:08 PM
0
91
Newsread Image

No.1 Short News

Newsread
విద్యార్థులే దేశ భవిష్యత్తు: దర్శి సిఐ రామారావు
దర్శి మోడల్ స్కూల్ లో దర్శి సిఐ రామారావు, దర్శి ఎస్ఐ మురళి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు, ఈ సందర్భంగా వ్యక్తిగత భద్రత, మానసిక ఆరోగ్యం, భవిష్యత్తు లక్ష్యాలపై కీలక విషయాలను వివరించారు, విద్యార్థులే దేశ భవిష్యత్తు అని విద్యార్థులు సరిగ్గా ఎదిగితే సమాజం పురోగమిస్తుందనీ, చదువులోనే కాకుండా నైతిక విలువల్లో కూడా ముందుండాలని వారు సూచించారు.
View More
Local Updates
24 Jul 2025 20:35 PM
0
90
Newsread Image

No.1 Short News

Newsread
గుర్రం జాషువా రచనలు దేశానికి ఆదర్శం: శాస్త్రవేత్త వరప్రసాద్
దర్శి: ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్రదళితసేన, ప్రజా సంఘాలఆధ్వర్యంలో మహాకవి గుర్రం జాషువా54వర్ధంతిసభ కవలకుంట్ల గోవిందప్రసాద్ మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులు ఎంపీపీ గొల్లపాటి సుధారాణి ఆచార్యరంగ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త వరప్రసాద్, ఎంఈఓ రమాదేవి మాట్లాడుతూ గుర్రం జాషువా రచనలకు అప్పటి ప్రభుత్వాలు గండభేరన్యపేరణ్యం తొడిగి రచనలకు పట్టాభిషేకం చేసిన ఘనత గుర్రం జాషువాకు దక్కిందని ఈ సందర్భంగా కొనియాడిన్నారు. ఈ కార్యక్రమంలో సంఘసేవకులు జీవి రత్నం, రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గం గర్నపూడి ప్రేమ్ కుమార్, ఎమ్మార్పీఎస్ దర్శి నియోజకవర్గం ఇంచార్జ్ గoధం ఇర్మియ కొర్రలు తప్పిట డేవిడ్ తదితరులు పాల్గొన్నారు
View More
Local Updates
24 Jul 2025 18:42 PM
0
73
Newsread Image

No.1 Short News

Newsread
రామచంద్రాపురం లో చంద్రన్న పచ్చదనం కార్యక్రమం
చంద్రన్న పచ్చదనం కార్యక్రమం లో భాగంగా, మొక్కలు పంపిణీ కార్యక్రమం, దర్శి మండలం, రామ చంద్ర పురం గ్రామంలో,షేక్ 2nd ఖాసీం,నగరికంటి బుజ్జి బాబు ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రకాశం జిల్లా మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ మాట్లాడుతూ, అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ కు మనమందరం తోడ్పాటు అందించాలి అని సురేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పచ్చదనం లో నిండి పోవాలని అన్నారు. చెట్ల వలన కలప కాయల, ఆహారం ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అన్నారు. కార్బన్ డయాక్సైడ్ తగ్గించి ఆక్సిజన్ పెంచడం చెట్లు వలనే సాధ్యం అని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో నారా చంద్రబాబు నాయుడు కృషి అభినందనీయం అని ఆయన తోడ్పాటు గా మనమందరం కూడా మొక్కలు నాటి రక్షించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖాసీం వలి, నాగర్ సాహెబ్, మొదలగు వారు పాల్గొన్నారు.
View More
Local Updates
20 Jul 2025 16:37 PM
3
64
Newsread Image

No.1 Short News

Newsread
బాధల్లో ఉన్న వారిని అక్కున చేర్చుకోవడమే మానవత సంస్థ ధ్యేయం: కపురం
దరిశిలోని స్థానిక లంకోజనపల్లిరోడ్ నందు నివాసముండే మూలే కుమారి ఇటీవల భర్త కీ.శే.మూలే రఘురామిరెడ్డి గారిని కోల్పోయి, ఇద్దరు అమ్మాయిలతో కుటుంబ పోషణ భారమై హోటల్స్ నందు సర్వర్ గా పనిచేస్తూ తన ఇద్దరు పిల్లల్ని చదివించలేక,కుటుంబ భారం మోయలేక ఇబ్బంది పడుతున్నది. ఆమె పరిస్థితిని యాదృచ్ఛికంగా చూసి చలించిపోయిన దరిశి మానవత స్వచ్ఛంద సేవాసంస్థ సభ్యులు మానవతా ధృక్పదంతో వారిని పిలిపించి పిల్లల చదువులు కొనసాగించుటకు,వారి అవసరాల కొరకు మానవత సంస్థ తరుపున 5000/-రూపాయలు, దాతల సహకారంతో 10516/- రూపాయలు వెరసి ₹.15516/- (పదిహేనువేల ఐదువందల పదహారు)రూపాయలను మానవత స్వచ్ఛంద సేవాసంస్థ ఛైర్మన్ దేవతి వరప్రసాద్,వైస్ ఛైర్మన్ వాకా జనార్దరెడ్డి,జిల్లా డైరెక్టర్ కపురం శ్రీనివాసరెడ్డి, కన్వీనర్ ధనిరెడ్డి వెంకటరెడ్డి, అధ్యక్షులు చీదెళ్ళ బసవయ్య,ప్రధాన కార్యదర్శి గొర్రెపాటి వేణు,కన్వీనర్ ధనిరెడ్డి వెంకటరెడ్డి, కోశాధికారి చింతా తిరుపతిరెడ్డి, A.గణేష్, SK.ఖాదర్ మస్తాన్,P.పెద్దిరాజు,CH.రోషారావు,J.సుశీల,R.రామకోటిరెడ్డి,L.వెంకటేశ్వర రెడ్డి,SNCH.సుబ్బారావు,N.వెంకటరావులు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
View More
Local Updates
20 Jul 2025 16:34 PM
3
81
Newsread Image

No.1 Short News

Newsread
మానవత సంస్థ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం
దరిశి పట్టణంలో, గత సంవత్సరం మానవత స్వచ్ఛంద సేవాసంస్థను ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్.రామచంద్రారెడ్డి ఆధ్వర్యాన స్థాపించడం జరిగింది. నేటికి సంవత్సరం అయిన సందర్భంగా నేడు నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమం డి.వెంకటరెడ్డి అధ్యక్షతన, ముఖ్య అతిధులుగా సీహెచ్సీ మెడికల్ అధికారి సుమన్,ఎమ్యీవోలు రఘురామయ్య, రమాదేవి,ఆ సంస్థ జల్లా పరిశీలకులు యల్లమందారెడ్డి సంస్థనుద్దేశించి ప్రసంగించారు. ఈ సమావేశంలో ముందుగా, ఇప్పటివరకూ కన్వీనరుగా వ్యవహరించిన కపురం శ్రీనివాసరెడ్డిని, ప్రస్తుత మరియూ కొత్త పాలకమండలి సభ్యులందరూ సభాముఖంగా యావన్మంది సమక్షంలో ఏకగ్రీవంగా మానవత సంస్థ ప్రకాశం జిల్లా డైరెక్టర్ గా ఎంపిక చేయడం జరిగింది. తదుపరి నూతన కార్యవర్గ సభ్యులచే సంస్థ పరిశీలకులు యల్లమందారెడ్డి అందరిచేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముందుగా నటరాజ నృత్యకళా నిలయం వారిచే చిన్నారులచే సనాతన సాంప్రదాయాలను గౌరవిస్తూ కూచిపూడి నృత్య ప్రదర్శన చేసి అందరినీ అలరించారు. నూతన కమిటీలో చైర్మన్ దేవతి ప్రసాదు, కో చైర్మన్ వాకా జనార్ధన్ రెడ్డి, కన్వీనర్ దనిరెడ్డి వెంకటరెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చీదెళ్ళ బసవయ్య, సహాధ్యక్షులు అడపాల గణేష్, ప్రధాన కార్యదర్శి గొర్రెపాటి వేణు,కోశాధికారి చింతా తిరుపతిరెడ్డి వున్నారు. గౌరవ అధ్యక్షుడిగా రాజేశ్వర్ రెడ్డి, ఈసీ మెంబర్లుగా కార్యవర్గ మస్తాన్,ఎన్వీ సుబ్బారెడ్డి,జే.సుశీలమ్మ,రోషారావు,వాసుదేవరెడ్డి,అన్నవరపు వెంకటేశ్వర్లు,మస్తాన్ నాయక్, మోషే,శేషారావు,ఎసెన్స్ సుబ్బారావు,జైహింద్ రెడ్డి, లీగల్ అడ్వైజరీ కమిటీ చీఫ్ గడ్డి శ్రీనివాసులు(లాయర్),మీడియా ప్రతినిధుల సంఘం తరుపున ఆర్.రామకోటిరెడ్డి లు ఉన్నారు.
View More
Local Updates
17 Jul 2025 16:06 PM
7
73
Newsread Image

No.1 Short News

Newsread
ఇంటింటికి విద్యుత్తు కూటమి ప్రభుత్వ ద్వేయం: డాక్టర్ కడియాల లలిత్ సాగర్.
విద్యుత్ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం సోలార్ విద్యుత్ గుర్తించి గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ సహకారంతో ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ను అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం లో భాగంగా ప్రతి ఇంటికి సౌర విద్యుత్తు ఏర్పాటు చేసుకోవాలని టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ కోరారు. బుధవారం దర్శి లోని తన నివాసంలో ఏర్పాటుచేసిన సోలార్ సౌరశక్తి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి ఇంట్లో విద్యుత్తు ఖర్చును తగ్గించుకోవచ్చని ఆయన తెలిపారు. విద్యుత్ సౌరశక్తి పలకల ఏర్పాటుకు ప్రభుత్వం 25% సబ్సిడీస్తుందని మిగిలిన మొత్తం రుణం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. మీ ఇంటి అవసరాలకు వాడుకొని మిగిలిన విద్యుత్తును అమ్ముకొని కూడా లాభం పొందవచ్చు అన్నాను. 25 ఏళ్ల పాటు విద్యుత్తును వాడుకునే అవకాశం ఉందని ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం డా || లలిత్ గారితో పాటు మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, సోలార్ ప్లాంట్ ELLVIN ENERGY కంపెనీ MD విజయ భాస్కర్, విద్యత్ శాఖా DE శ్రీనివాస్ దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు, నియోజకవర్గం లోని మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్లు, యూనిట్ & బూత్ ఇంచార్జి లు, వివిధ హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
View More
Local Updates
16 Jul 2025 20:12 PM
2
69
Newsread Image

No.1 Short News

Newsread
AP Forest Department: ఏపీ అటవీశాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఈ క్రమంలో భాగంగా, తాజాగా అటవీ శాఖలో ఖాళీగా ఉన్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ నెల 16 నుంచి ఆగస్టు 5 వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ పోస్టులకు దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://psc.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
View More
Local Updates
15 Jul 2025 07:50 AM
1
87
Newsread Image

No.1 Short News

Newsread
దేశంలో పెరిగిపోతున్న పెళ్ళికాని వారి సంఖ్య
దేశంలో పెళ్లికాని యువత సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఉన్నత విద్య, ఉద్యోగాలు, వ్యక్తిగత నిర్ణయాలు వంటి కారణాల వల్ల వివాహాలు ఆలస్యమవుతున్నాయి. యుక్త వయసు జనాభాలో 51.1 శాతం మంది పెళ్లి చేసుకోలేదని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో పురుషులు 56.3 శాతం, మహిళలు 45.7 శాతంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో 47.5 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 43.7 శాతం పెళ్లికాని వారు ఉన్నారని జనాభా లెక్కల విభాగం వెల్లడించింది.
View More
Local Updates
15 Jul 2025 07:40 AM
1
54
Newsread Image

No.1 Short News

DR Local News - Chirala
కన్నుల పండుగగా జరిగిన పౌర్ణమి సాగర హారతి: బంగారు బాబు
బాపట్ల జిల్లా,చీరాల మండలం,వాడరేవు గ్రామం (సముద్ర తీర ప్రాంతం) నందు గల ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా సాగర తీరాన ఆషాడ పౌర్ణమి, గురు పౌర్ణమి మరియు వ్యాస పౌర్ణమి సందర్భంగా కన్నుల పండుగగా, అత్యంత వైభవో పేతంగా సామూహిక పౌర్ణమి సాగర హారతి కార్యక్రమాన్ని హిందూ చైతన్య వేదిక చీరాల నియోజకవర్గ ప్రమఖ్ డాక్టర్ తాడివలస దేవరాజు ఆధ్వర్యంలో అర్చక స్వాములు మరియు వేద పండితులు కారంచేటి నగేష్ కుమార్, విట వెంకటేష్, కార్తీక్ శర్మ, సుధాకర్ శర్మ గార్ల మంత్రోచ్ఛారణతో స్పటిక శివలింగానికి పంచామృతాలతో అభిషేకం, మంత్ర పుష్పం మరియు సామూహిక సాగర హారతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి హిందూ చైతన్య వేదిక ప్రత్యేక ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా బాపట్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు బంగారు బాబు గారు, కొండారెడ్డి గారు, అనిల్ గారు పాల్గొని వీరి చేతుల మీదుగా అభిషేకం, సాగర హారతిని నిర్వహించుట జరిగినది. ఈ సందర్భంగా.... బిజెపి బాపట్ల జిల్లా అధ్యక్షులు బంగారు బాబు గారు మాట్లాడుతూ.... సముద్రం నుండి ఎటువంటి ప్రమాదాలు వాటిల్లకుండా, సముద్రం యొక్క అనుగ్రహం మన అందరిపై ఉండాలని కోరుకుంటూ సముద్ర హారతి ఇవ్వటం అనేది చాలా మంచి కార్యక్రమం అని తెలియజేశారు. టెంపుల్ టూరిజం బాగా అభివృద్ధి సాధిస్తుందని, సాగర హారతి మొదలు పెట్టిన తర్వాత వాడరేవు హైవే పనులు త్వరిత గతిన జరుగుతున్నాయని, హిందూ చైతన్య వేదిక నాయకులు ఈ కార్యక్రమం చక్కగా చేస్తున్నందుకు అభినందనీయమని వారిని ప్రశంసించటం జరిగినది. హిందూ చైతన్య వేదిక బాపట్ల జిల్లా సంయోజక్ బండారు జ్వాలా నరసింహo గారు గురు పౌర్ణమి గురించి వివరించుట జరిగినది. సాగర హారతి నిర్వాహకులు డాక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ శివానుగ్రహంతో ఎంతో విజయవంతంగా ప్రతి పౌర్ణమికి సాగర హారతి చీరాల వాడరేవులో ఎంతో వైభవంగా జరుగుతుందని , త్వరలో మరకత శివ లింగం తో అభిషేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు . ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న హిందూ సంఘాలకు మరియు చీరాల శాసనసభ్యులు ఎం ఎం కొండయ్య గారికి, పోలీస్ సిబ్బంది వారికి, వాడరేవు పంచాయతీ సిబ్బందికి , భజన బృందం వారికి, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామ కృష్ణ,మనోహర్ రెడ్డి,మణి కుమార్, భవానీ, సుధ, మున్నం శ్రీనివాస్ రెడ్డి , దామిశెట్టి శ్రీనివాస్ గుప్తా, వెంకటేశ్వర రెడ్డి, పిక్కి రాంబాబు , కోటి శ్రీను , జంపాల చిట్టి బాబు, సున్నం శ్రీనివాస్,సతీష్ వులిచి, మూర్తి జొన్న, పిక్కి నారాయణ, గోలి సాంబశివ రావు, బుర్ల సాంబశివరావు ,తడవర్తి చంద్ర , రాజేష్ ,డాక్టర్ సబరి , గుమ్మ బాలాజీ, ఆర్ఎస్ఎస్ నాయకులు, విశ్వహిందూ పరిషత్ నాయకులు, హిందూ చైతన్య వేదిక వాడరేవు గ్రామ ధార్మిక జట్టు సభ్యులు శ్రీనివాసులు రెడ్డి, వాడరేవు టిడిపి నాయకులు మరియు గ్రామ పెద్దలు, ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.
View More
Local Updates
11 Jul 2025 11:14 AM
1
103
Newsread Image

No.1 Short News

Newsread
పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం శుభ్రమైన ఆహారాన్ని అందించాలి
దర్శి పురపాలక సంఘం అద్దంకి రోడ్డులో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను దళిత,ప్రజా సంఘాలనాయకులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా నవ్యాంధ్ర మాదిగ చర్మ, డప్పు కళాకారుల పోరాటసంఘం రాష్ట్రవ్యవస్థాపకఅధ్యక్షులు కవలకుంట్ల గోవిందప్రసాద్ మాదిగ, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు జూపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులపాఠశాలలో పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారని విద్యార్థులకుతగిన మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలని, అన్నారు. త్రాగునీటి సౌకర్యం విద్యార్థులకు కల్పించాలని, పరిసరాలు పరిశుభ్రంగాఉంచాలని, వంట రూము అపరిశుభ్రత లేకుండా తగిన జాగ్రత్తలుతీసుకోవాలని, వారు తెలిపారు. విద్యార్థులకుఅందించే మెనూ అద్దంకిఏజెన్సీనుండి కూరగాయలు, కోడిగుడ్లు, సరఫరా విషయంలో, తగిన జాగ్రత్తలుతీసుకొని, దర్శి నుండి ఏజెన్సీఏర్పాటు చేయాలని, ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు, అనంతరం అక్కడ వండిన వంటలను రుచిచూసి సంతృప్తి చెందారు. విద్యార్థులకు ఆహార పదార్థాలను వేస్ట్ చేయకుండా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘసేవకులు జి.వి రత్నం రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గం అధ్యక్షులు గర్నెపూడి ప్రేమ్ కుమార్ గర్నిపూడి యాకోబు తదితరులు పాల్గొన్నారు.
View More
Local Updates
09 Jul 2025 20:29 PM
1
102
Newsread Image

No.1 Short News

Newsread
పిట్ట కొంచెం.. కూత ఘనం.. 17 నెలల చిన్నారి ట్యాలెంట్‌ కి నోబెల్ బహుమతి
ప్రకాశం జిల్లా, ఒంగోలు పట్టణంలోని సత్యనారాయపురంకి చెందిన అంబటి ఖశ్వి అనే చిన్నారి ఒక సంవత్సరం ఐదు నెలల (17 నెలలు) వయస్సులోనే 24 వేర్వేరు కేటగిరీలలో 650కి పైగా ఇంగ్లీష్ పదాలను మాట్లాడగలగడం ద్వారా నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్న అంబటి ఖశ్వి (17 నెలలు) ను ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ A.R. దామోదర్, అంబటి ఖశ్వి ను ప్రత్యేకంగా అభినందించారు. ఇది చిన్నారుల విభాగంలో ప్రపంచస్థాయిలో అత్యుత్తమ రికార్డుగా గుర్తింపు పొందింది. గతంలో ఉన్న రికార్డును నాలుగు సంవత్సరాల మూడు నెలల చిన్నారి 300 పదాలు మాట్లాడిన ఘనతను అంబటి కాశ్వీ అధిగమించడం విశేషం. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అంబటి ఖశ్వి ప్రపంచవ్యాప్తంగా ఒక అరుదైన ఘనతను సాధించిందని, కేవలం జిల్లాకే కాకుండా రాష్ట్రానికి కూడా గర్వకారణమని, చిన్న వయస్సులోనే ఇటువంటి మేధస్సు ప్రదర్శించడం అద్భుతమైన విషయమన్నారు. చిన్నారిలో తెలివితేటలు, ప్రతిభను గుర్తించాలన్నారు. ఈ విజయం సాధించడంలో కుటుంబ సభ్యుల సహకారం, మార్గదర్శకత ఎంతో ముఖ్యమైనదని జిల్లా ఎస్పీ కొనియాడారు. జిల్లా పోలీస్ శాఖ తరఫున అంబటి ఖశ్వి భవిష్యత్తు మరింత వెలుగులు చిమ్మాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాప తల్లిదండ్రులు సాయికుమార్, ప్రణతి, కుటుంబ సభ్యులు శివాజీ గణేష్, కోటేశ్వరమ్మ పాల్గొన్నారు.
View More
Local Updates
08 Jul 2025 22:19 PM
1
106
Newsread Image

No.1 Short News

Newsread
చంద్రన్న పచ్చదనం–భాష్యం స్కూల్లో మొక్కలు పంపిణీ చేసిన పరిటాల సురేష్
చంద్రన్న పచ్చదనం కార్యక్రమం లో భాగంగా, గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ ఆదేశాల తో, గురువు అచ్చెన్నాయుడు ఆసీస్సులతో, దర్శి భాష్యం స్కూల్, నందు టీడీపీ ప్రకాశం జిల్లా మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ ఏర్పాటు చేసిన మొక్కలను దర్శి అగ్రికల్చర్ AO k.రాధ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏవో K .రాధ మాట్లాడుతూ పిల్లలందరూ గ్రీన్స్ లీడర్ గా ఎదగాలి అని , ప్రకృతి, చెట్లు పర్యావరణ కు తొలి మెట్లు అని పిల్లల తో అన్నారు. కరోనా సమయంలో ఆక్సీజన్ అందక చాలా మంది చనిపోయినారు అని, అదే మన ఇంటి ఆవరణ లో చెట్లు ఉంటే ఆక్సిజన్ అందేది అని వివరించారు. చెట్లు పెంచడం వల్ల కాయలు పండ్లు, నీడ అన్ని దొరుకుతాయి అని సురేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జగదీష్,స్మైలీ, సుజాత, సుకన్య, సరస్వతి, అశోక్,రావులపల్లి ఉపాధ్యాయులు, స్టాఫ్ పాల్గొన్నారు..
View More
Local Updates
07 Jul 2025 20:18 PM
1
79
Newsread Image

No.1 Short News

Newsread
తొలి ఏకాదశి శుభాకాంక్షలు పోస్టర్ మీకోసం
Local Updates
06 Jul 2025 06:58 AM
2
54
Newsread Image

No.1 Short News

Kumar Darla
కౌలు రైతులకు భూ యజమానులు సహకరించాలి..
దళిత బహుజన రిసోర్స్ సెంటర్ (DBRC)-ప్రకాశం జిల్లా ముండ్లమూరు తేది :04-07-25 భూ యజమానులు, కౌలు భూములు సాగు చేస్తున్న రైతులకు సహకరించాలి- ముండ్లమూరు తహసిల్దార్ ఎల్ లక్ష్మీనారాయణ ----------------@---------------- రాష్ట్ర ప్రభుత్వం భూ యజమానులు నష్టపోకుండా పంట సాగు దారుల చట్టం -2019 చట్టం ద్వారా వారికి ఎలాంటి నష్టం జరగకుండా చట్టంలో సవరణ చేసినందున భూ యజమానులు కౌలు రైతులకు పంట సాగు ధ్రువీకరణ పత్రాలు వచ్చే లాగున సహకరించలని ముండ్లమూరు తహసిల్దార్ ఎల్ లక్ష్మీనారాయణ తెలియజేశారు. శుక్రవారం మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో వంట సాగు సాగుదారుల ధ్రువీకరణ చట్టం ప్రచారోద్యమం వాహనం ను ప్రారంభోత్సవ కార్యక్రమం ఆయన మాట్లాడినారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ రీజినల్ కో-ఆర్డినేటర్ దార్లకోటేశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కౌలు రైతుల పంట సాగు దారుల గ్రామస్థాయిలో భూ యజమానుల వద్ద నుండి సాగు చేస్తున్న కౌలు భూముల సాగుపై మాత్రమే కౌలు రైతుకు హక్కు ఉంటుంది, భూమిపై కాదని ఈ విషయాన్ని భూ యజమానులు గుర్తుతెరిగి కౌలు రైతులకు సహకరించాలని తెలిపారు. తదుపరి ప్రచార వాహనం ద్వారా ముండ్లమూరు, పసుపుగల్లు, వేముల బండ, రమణారెడ్డి పాలెం, ఈదర, భీమవరం, ఉమామహేశ్వరపురం, పోలవరం గ్రామాలలో కౌలు రైతుల ప్రచారోద్యమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలలో ఆయా గ్రామ సచివాలయ, గ్రామరెవిన్యూ అధికారులు,వ్యవసాయ సహాయకులు, కౌలు రైతులు పాల్గొన్నారు.
View More
Local Updates
04 Jul 2025 18:01 PM
3
68
Newsread Image

No.1 Short News

Kumar Darla
దర్శి లో ఆడపిల్లలను వేధించే వారిపై నిఘా పెట్టడం జరిగింది.
దర్శి : సర్కిల్ ఇన్స్పెక్టర్ వై. రామారావు దర్శి లో సాయంత్రం వేళలో స్కూల్లో కాలేజీలో నుంచి వస్తున్న ఆడపిల్లలను కొంతమంది ఆకతాయిలు ఆటపట్టించడం జరుగుతుందని వారిపై దరిశి సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రామారావు నిఘా పెట్టామని తెలియజేశారు. నిన్న సాయంత్రం ఇద్దరిని ఆకతాయిలను పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్లి కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది. దర్శి లో రెండు డ్రోన్లు సహాయంతో ఎల్లప్పుడూ మా పర్యవేక్షణ జరుగుతూ ఉంటుంది అని ఆయన తెలియజేశారు.
View More
Local Updates
04 Jul 2025 17:58 PM
0
79
Newsread Image

No.1 Short News

Kumar Darla
కౌలు రైతులకు భూ యజమానులు సహకరించాలి
దర్శి ;దళిత బహుజన రిసోర్స్ సెంటర్ దర్శి ఏరియా కోఆర్డినేటర్ గుంటూరు నాగమణి అధ్యక్షతన పంట సాగుదారుల చట్టంపై ప్రచార ఉద్యమ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలోదర్శి మండల కార్యాలయం నుండి రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ టి శ్రీనివాసరావు గారు ప్రారంభించారు మండలంలో జరగనున్న ఈ ప్రచారోద్యమ కార్యక్రమం కౌలు కార్డుల పైన ప్రతి కౌలు రైతుకు అవగాహన కల్పించి ఈ చట్టంపై భూ యజమానులకు ఉన్న అపోహలను తొలగించుటకు భూ యజమానులు నష్టపోకుండా పంట సాగుదారుల చట్టం- 2019 ప్రకారం యజమానులకు ఎలాంటి నష్టం జరగకుండా చట్టంలో సవరణ చేసినందున భూ యజమానులు కౌలు రైతులకు పంట సాగు ధ్రువీకరణ పత్రాలు వచ్చే విధంగా సహకరించాలని రీసర్వ్ డిప్యూటీ తహసిల్దార్ శ్రీనివాసరావు గారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ మరియు సీనియర్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు తదుపరి పోతవరం పంచాయతీ శివారు ప్రాంతమైన తిమ్మాయిపాలెం గ్రామం మరియు తానం చింతల గ్రామాలలో అలాగే తూర్పు చవటపాలెం గ్రామంలో రైతు సేవ కేంద్రాల వద్ద అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దర్శి ఏరియా కోఆర్డినేటర్ నాగమణి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కౌలు రైతుల పంట సాగుదారులు గ్రామస్థాయిలో భూ యజమానుల వద్ద నుండి సాగు చేస్తున్న కౌలు భూముల సాగుపై మాత్రమే కౌలు రైతుకు హక్కు ఉంటుంది భూమిపై కాదనే విషయాన్ని భూ యజమానులు తెలుసుకొని కౌలు రైతులకు సహకరించాలని కోరారు పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీ బ్యాంకు రుణాలు పొందడానికి కౌలు కార్డు ఉపయోగపడుతుందని రాష్ట్రంలో 32 లక్షలకు పైగా కవులు రైతులు ఉన్నారని రాధాకృష్ణన్ రిపోర్టు ఆధారంగా వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుని వారు ఉన్నారని రాష్ట్రంలో 75% ఆత్మహత్యలు జరుగుతున్న వారిలో మూడు వంతులు కౌలు రైతులు ఉన్నారని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి వీఆర్వోలు అగ్రికల్చర్ అసిస్టెంట్లు భాగస్వాములయ్యారు
View More
Local Updates
03 Jul 2025 11:09 AM
2
80
Newsread Image

No.1 Short News

Newsread
కరెంట్ షాక్ తో మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించిన బూచేపల్లి
ముండ్లమూరు మండలం వేములబండ గ్రామములో కరెంట్ షాక్ తో మృతి చెందిన ఆవుల గౌతం పార్థివ దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మనోధర్యం కల్పించారు.
View More
Local Updates
01 Jul 2025 12:55 PM
0
55
Newsread Image

No.1 Short News

Newsread
రాష్ట్రంలో ఈ పది జాతీయ రహదారుల విస్తరణ - డీపీఆర్‌ తయారీకి కేంద్రం ఆదేశాలు
988 కిలోమీటర్ల విస్తరణకు డీపీఆర్‌ తయారీకి కేంద్రం ఆదేశాలు - 2025-26 వార్షిక ప్రణాళికలో చేర్చిన మోర్త్‌ కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు 380 కిలోమీటర్ల NH-216ని నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఇందులో కత్తిపూడి నుంచి కాకినాడ వరకు 27 కిలోమీటర్లు ఇప్పటికే నాలుగు వరుసలుగా ఉంది. దీనిని ఆరు వరుసలు చేయనున్నారు. మిగిలిన భాగం ప్రస్తుతం రెండు వరుసలు ఉండగా నాలుగు వరుసలుగా విస్తరిస్తారు. కర్నూలు నుంచి నంద్యాల, కడప, రాయచోటి, పీలేరు, చిత్తూరు మీదుగా తమిళనాడులోని రాణీపేట వరకు ఉన్న NH-40ని కడప నుంచి చిత్తూరు జిల్లాలోని రంగంపేట క్రాస్‌ వరకు 148 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరించనున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలోని కొడికొండ చెక్‌పోస్ట్‌ నుంచి సిర వరకు 99 కిలోమీటర్లు 4వరుసలు చేస్తారు. ఏపీ, కర్ణాటక సరిహద్దు నుంచి కదిరి, ముదిగుబ్బ మీదుగా అనంతపురం వరకు 86 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరిస్తారు. ఇందులో కదిరి, ముదిగుబ్బల వద్ద బైపాస్‌లు కూడా ఉన్నాయి. పలమనేరు నుంచి కుప్పం మీదుగా తమిళనాడులోని కృష్ణగిరి సరిహద్దు వరకు 97 కిలోమీటర్ల
View More
Local Updates
29 Jun 2025 19:58 PM
0
43
Newsread Image

No.1 Short News

Newsread
ఏపీలోని రేషన్ కార్డుదారులకు షాక్.. ఈసారి కూడా కందిపప్పు సరఫరా లేనట్లే!
అమరావతి : ఏపీలోని రేషన్ కార్డుదారులకు బ్యాడ్ న్యూస్. వచ్చే నెల జూలై లోనూ రేషన్ కార్డుదారులకు కందిపప్పు అందేలా కనిపించడం లేదు. జులై నెలకు సంబంధించి నిత్యావసరాలు ఇప్పటికే చేరుకోగా ఈసారి కూడా కందిపప్పు సరఫరా లేదని అధికారులు చెప్తున్నారు. 2025 మార్చి నెల నుంచి ఏపీలో కందిపప్పు పంపిణీ ఆగిపోయింది. మార్కేట్లో కిలో కందిపప్పు ధర రూ.120 నుంచి రూ.160 వరకూ పలుకుతోంది. రేషన్ దుకాణాల్లో తక్కువ ధర (రూ.67)కే లభించే కందిపప్పు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
View More
Local Updates
29 Jun 2025 14:32 PM
0
39
Newsread Image

No.1 Short News

Newsread
ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు.
ఏపీ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ 100 నుంచి 300 పడకల స్థాయి మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించబోతున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో 100 పడకల మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో 3,300 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల ఏర్పాటుకు కేంద్రం రూ.1,095 కోట్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం పట్ల ప్రజల్లో సంతృప్తి స్థాయి 8 నుంచి 14% దాకా పెరిగిందన్నారు.
View More
Local Updates
29 Jun 2025 14:23 PM
0
74
Newsread Image

No.1 Short News

Newsread
ఈ రాజ్ కుమార్ అన్నం కాదు లంచం మెక్కుతాడు.
ఆదిలాబాద్ మున్సిపల్ అకౌంట్స్ ఆఫీసర్ జాయిన్ అయ్యి పది నెలలే ఇంకా ఉద్యోగం కన్ఫర్మ్ కాలేదు ఇప్పటికే ఎంత మెక్కేసాడో మొన్న 15 లంచం తీసుకొంటూ ACB కి చిక్కేశాడు. ఇలాంటి వారి ఉద్యోగం పీకెయ్యాలి పెన్షన్ ఆపేయాలి ఆస్తి సీజ్ చెయ్యాలి ప్రైవేట్ ఉద్యోగం కూడా రాకుండా చెయ్యాలి బొక్కలో వెయ్యాలి. ఈ పోస్ట్ షేర్ చేసి లంచం తీసుకొనే ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి కింద తడిసేడట్టు చెయ్యాలి మనం .
View More
Local Updates
29 Jun 2025 14:15 PM
0
43
Newsread Image

No.1 Short News

Newsread
విజయవాడలో రూ.300 కోట్ల భారీ మోసం
పెట్టుబడుల పేరుతో విజయవాడలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. లక్ష రూపాయల పెట్టుబడికి రూ.6 వేల వడ్డీ చెల్లిస్తామని మోహిత్ ట్రేడింగ్ కంపెనీ పలువురిని ఆశ పెట్టి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసింది. మొత్తం 1200 మంది నుంచి రూ.300 కోట్లు వసూలు చేసింది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి సంస్థ ఎండీ వెంకట్ ఆదిత్యను అదుపులోకి తీసుకున్నారు.
View More
Local Updates
29 Jun 2025 14:09 PM
0
46
Newsread Image

No.1 Short News

Newsread
బెంగుళూరు టు గుంటూరు డ్రగ్స్ రవాణా–స్మగ్లర్ల అరెస్ట్
చిలకలూరిపేట: బెంగుళూరు నుండి గుంటూరుకు అక్రమంగా డ్రగ్స్ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను చిలకలూరిపేట రూరల్ సీఐ బి. సుబ్బానాయుడు ఈరోజు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 25 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితులు చల్లా గోపి (23), తండ్రి లేట్ కోటేశ్వరరావు, వడ్డెర కులం, చిరునామా డి. నం. 5-64-34, 2/19వ లైను, బ్రాడీపేట, గుంటూరు టౌన్ మరియు షేక్ ఫారుక్ (29), తండ్రి షాకీర్, ముస్లిం కులం, చిరునామా చెక్కల బజార్, సంగడిగుంట, గుంటూరు టౌన్ గా గుర్తించారు.నిందితులను అరెస్ట్ చేసిన అనంతరం, వారిని రిమాండ్‌కు పంపినట్లు చిలకలూరిపేట రూరల్ సీఐ బి. సుబ్బానాయుడు తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
View More
Local Updates
28 Jun 2025 21:06 PM
1
75
Newsread Image

No.1 Short News

Newsread
కార్పస్ ఫండ్ చెక్కులను పోలీస్ కుటుంబ సభ్యులకు అందించిన గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్
ది.17.04.2025 తేదిన అనారోగ్యంతో మరణించిన ఏఆర్ కానిస్టేబుల్ G.వీరయ్య సతీమణి సౌజన్య లక్ష్మీ గారికి మరియు రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ది.21.04.2025 తేదీన మరణించిన ఏఆర్ కానిస్టేబుల్ K.క్రాంతి కుమార్ సతీమణి శ్రీమతి K. ప్రవీణ గారికి కపోలీస్ శాఖా తరపున అదనపు కార్పస్ ఫండ్ నిధి ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.100,000/- చొప్పున రూ.2,00,000/-- రూపాయలను ఎస్పీ చేతుల మీదుగా గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ ఏవో శ్రీ అద్దంకి. వెంకటేశ్వర రావు గారు అందజేయడం జరిగింది. మరణించిన పోలీస్ కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ భరోసా కల్పించారు.
View More
Local Updates
28 Jun 2025 19:32 PM
1
40
Newsread Image

No.1 Short News

Newsread
సోషల్ మీడియా క్లోనింగ్ అకౌంట్ల తో జర భద్రం
Local Updates
28 Jun 2025 16:55 PM
0
59
Newsread Image

No.1 Short News

Newsread
మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర.. వారంరోజుల్లో ఎంత తగ్గిందో తెలుసా..? ఏపీ, తెలంగాణలో ఇవాళ్టి ధరలు ఇలా..
Gold Rate: బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. గత వారం రోజుల క్రితం వరకు రికార్డు స్థాయి ధరలను నమోదు చేసిన బంగారం.. క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య వివాదం సర్ధుమణగడంతోపాటు.. అమెరికా, చైనా దేశాల మధ్య టారిఫ్ వార్ విషయంలో ఇరు దేశాలు వెనక్కు తగ్గడంతో గోల్డ్ రేటు క్రమంగా తగ్గుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వచ్చే వారం రోజుల్లో బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 930 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 850 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్స్ గోల్డ్ 40 డాలర్లు తగ్గి.. 3,293 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇదిలాఉంటే.. గడిచిన వారం రోజుల్లో గోల్డ్ రేటు సుమారు రూ.5వేలు తగ్గింది. మరోవైపు.. వెండి ధర కూడా తగ్గింది.
View More
Local Updates
27 Jun 2025 12:32 PM
2
115
Newsread Image

No.1 Short News

Newsread
జగన్ పరిస్థితి ఏంటి? కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది? రెంటపాళ్ల ఎపిసోడ్‌ లో నెక్ట్స్ ఏం జరగబోతోంది..
జగన్‌ పర్యటనలో కొందరు ప్లకార్డులు ప్రదర్శించడం..ఆ తర్వాత మాటల యుద్ధం..కార్యకర్త మరణంపై బయటికొచ్చిన వీడియోతో..వారం రోజులుగా రెంటపాళ్ల టూర్‌ చర్చ కంటిన్యూ అవుతూనే ఉంది. ఆయన టూర్‌ ముగిసి వారం అయింది. అయినా డైలీ అదే హాట్ టాపిక్‌గా ఉంటోంది. రోజుకో డెవలప్‌మెంట్‌..విమర్శకు, ప్రతి విమర్శ..అంతకు మించి కేసులు, నోటీసులు, కారు సీజ్‌తో..పొలిటికల్ హీట్ నెక్స్ట్‌ లెవల్‌కు చేరుకుంది. వైసీపీ అధినేత ఏకంగా కోర్టు మెట్లెక్కారు. అటు జగన్‌ సెక్యూరిటీ, భద్రతకు ఢోకా లేదంటూ..పెద్ద షాకే ఇస్తుంది ప్రభుత్వం. రెంటపాళ్ల ఎపిసోడ్‌ ఎటువైపు టర్న్ తీసుకోబోతోంది? కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది? జగన్‌ను విచారణకు పిలుస్తారా? పోలీసులు వెహికల్‌ సీజ్‌ చేశారంటే..వాట్‌ నెక్స్ట్? అధికారం మారిన వన్‌ ఇయర్‌లోనే ఏపీ పాలిటిక్స్‌ రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. కూటమి వర్సెస్ వైసీపీ పాలిటిక్స్‌లో..ఏదో ఒక టాపిక్‌ హెడ్‌లైన్‌గా ఉంటూనే ఉంది. లేటెస్ట్‌గా గుంటూరు జిల్లా రెంటపాళ్ల జగన్ పర్యటన ఏపీ రాజకీయాల్లో పెను దుమారం లేపింది. టూర్‌కు అనుమతి లేదంటూనే సెక్యూరిటీ విషయంలో సర్కార్ జాగ్రత్తలు తీసుకుంది. అయినా జగన్‌ పర్యటనలో కొందరు ప్లకార్డులు ప్రదర్శించడం..ఆ తర్వాత మాటల యుద్ధం..కార్యకర్త మరణంపై బయటికొచ్చిన వీడియోతో..వారం రోజులుగా రెంటపాళ్ల టూర్‌ చర్చ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ ఇష్యూలో ఇప్పటికే వైసీపీ అధినేత జగన్‌తో పాటు ఆయన డ్రైవర్‌, పలువురు ఫ్యాన్ పార్టీ లీడర్లను నిందితులుగా చేరుస్తూ కేసులు పెట్టారు పోలీసులు. జగన్‌ డ్రైవర్‌ను అరెస్ట్ చేయగా..సింగయ్య మృతి కేసులో ఏ2గా ఉన్న జగన్‌కు నోటీసులు ఇచ్చారు. ఇదే సమయంలో..జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా సింగయ్య మృతి కేసు విచారణలో భాగమంటూ..పోలీసులు వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కేసులు, విచారణలు ఫేస్‌ చేయక తప్పదా..? మరోవైపు రెంటపాళ్ల టూర్‌పై రచ్చ నడుస్తుండగానే జగన్‌పై మరో కేసు నమోదైంది. గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై పోలీసులు కొత్త కేసు పెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉన్నప్పటికీ వైసీపీ నేతలు అనుమతి లేకుండా వచ్చి హడావుడి చేశారనేది ఫిర్యాదు.!. ఇదే సమయంలో..మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే యార్డులో జగన్‌ రాజకీయ ప్రసంగాలు చేశారనేది కూడా అభ్యంతరం ఉంది. ఆ కేసు అలా ఉండగానే సింగయ్య మృతి కేసులో జగన్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలంటూ సూచించారు. అయితే ఈ కేసుపై జగన్‌తో సహా నిందితులుగా ఉన్నవారంతా ఏపీ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్ వేశారు. ఈ పరిస్థితుల్లో న్యాయస్థానం తీర్పు ఎలా ఉండబోతుంది..కేసులు, విచారణలు ఫేస్‌ చేయక తప్పదా..అనేది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు మాజీ సీఎంగా తనకు సరైన భద్రత ఇవ్వడం లేదని జగన్ ఆరోపిస్తున్నారు. దీనిపై ఆయన న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. అయితే జగన్‌ అలిగేషన్స్‌కు కౌంటర్ ఇస్తున్నారు కూటమి నేతలు. రెంటపాళ్ల పర్యటనకు అనుమతి లేకున్నా వందల మంది పోలీసులతో సెక్యూరిటీ కల్పించామని..వైసీపీ క్యాడర్ రెచ్చిపోయినా పోలీసులు సంయమనంతో ఉన్నారని రివర్స్ అటాక్ చేస్తోంది కూటమి సర్కార్.
View More
Local Updates
26 Jun 2025 09:34 AM
2
4
Newsread Image

No.1 Short News

Newsread
సచివాలయంలోని తన చాంబర్ లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి లోకేష్
అమరావతిః కేబినెట్ భేటీ అనంతరం సాయంత్రం సచివాలయం నాలుగో బ్లాక్ లోని తన చాంబర్ కు వచ్చిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. తన కోసం వేచి ఉన్న సామాన్యులను కలిశారు. వివిధ సమస్యలపై తన చాంబర్ కు వచ్చిన దాదాపు 150 మందిని కలుసుకున్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి వినతిని పరిశీలించిన మంత్రి లోకేష్.. త్వరితగతిన సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తానని వారికి హామీ ఇచ్చారు. దీంతో వారంతా ఆనందంగా వెనుదిరిగారు.
View More
Local Updates
24 Jun 2025 23:13 PM
1
3
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: పార్టీల ప్రతినిధులతో ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి సమావేశం.
ఎన్నికల సంబంధించి దర్శి నియోజకవర్గ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి వారి అధ్యక్షతన 9-6-2025 న ఉదయం 11 గంటలకు దర్శి తహశిల్దార్ వారి కార్యాలయం నందు అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి మరియు దర్శి తాసిల్దార్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కలిగి ఉండాలని తెలిపారు. అలాగే మరణించిన వారిని ఫారం-7 ద్వారా తొలగించాలని,చిరునామా మార్పు అయినవారు వారు ఫారం-8 ద్వారా అప్లై చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధికారులు టి. దేవ ప్రసాద్, అఫ్రోజ్ మరియు వివిధ పార్టీలకు చెందిన నాయకులు ,పుల్లలచెరువు సత్యనారాయణ,మారెళ్ళ వెంకటేశ్వర్లు,టి బాబూరావు, మాడపాకుల శ్రీనివాసరావు, యస్ పౌలేసు, పి చిరంజీవి పాల్గొన్నారు.
View More
Local Updates
22 Jun 2025 07:08 AM
4
4
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
దిగువమెట్ట వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న యువకులను ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముండ్లమూరు మండలం ఈదర గ్రామానికి చెందిన రామాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
View More
Local Updates
13 Jun 2025 21:10 PM
0
1
Newsread image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తాళ్లూరులో వరి పంటల పరిశీలన
తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరం, సోమవరపాడు, దారంవారిపాలెం గ్రామాలలో సోమవారం ఏవో ప్రసాదరావు పర్యటించారు. వర్షానికి తడిసిన వరి ఓదెలను ఆయన పరిశీలించారు. కోసిన వరి పొలాల్లో నీరు నిల్వ ఉంచకుండా బయటకి పంపించాలని రైతులకు సూచించారు. నివేదికను మండల, జిల్లా కార్యాలయాలకు తెలపాలని అన్నారు. అకాల వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
View More
Local Updates
20 May 2025 22:35 PM
0
1
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తాళ్లూరు ఎంపీడీవో సూచనలు
తాళ్లూరులో ఎంపీడీవో దార హనుమంతరావు మంగళవారం సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఉద్యోగులు షుగర్, బీపీ వంటి వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం ఫిజియోథెరపిస్ట్ వెంకటరమణ ఆయా వ్యాధులు రావడానికి గల కారణాలు, వాటి నివారణ చర్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
View More
Local Updates
20 May 2025 22:35 PM
0
1
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
నాపై ఎన్ని దాడులు చేసినా.. నన్నెవరూ ఆపలేరు - డా|| గొట్టిపాటి లక్ష్మి
బుధవారం బొట్లపాలెంలో జరిగిన తిరుణాలలో దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, యువ నాయకులు కడియాల లలిత్ సాగర్ హాజరయ్యారు, ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలపై గొట్టిపాటి లక్ష్మీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈనాటి వరకు ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని, కుల రాజకీయాలు మత రాజకీయాలు వర్గ రాజకీయాలు చేయటానికి రాలేదని, గతంలో ఇదే బొట్లపాలెంలో ఎన్నికలకు ముందు తన మీదకి కర్రలతో కత్తులతో దాడికి వచ్చారని, ఈ సంఘటన తను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. మహిళ అనికూడా చూడకుండా అరాచకంగా ప్రవర్తించారని, అయినా కూడా ఇక్కడున్న మహిళలు పెద్దలు తనతోనే ఉన్నారని, ఎన్ని దాడులు చేసినా ఎన్ని అరాచకాలు సృష్టించిన నన్నెవరూ ఆపలేరు అని నేను అభివృద్ధి కోసం పని చేస్తున్నానని, ఓడినా గెలిచినా దర్శి లోనే ఉంటానని దర్శి ప్రజల కోసమే పని చేస్తున్నాననిని దర్శి అభివృద్ధి కోసమే అడుగులు వేస్తున్నానని అన్నారు.
View More
Local Updates
08 May 2025 09:43 AM
2
4
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
భారత్ మాతా కీ జై అంటూ గర్జించిన దర్శి తహశిల్దార్ శ్రావణ్ కుమార్
దర్శి పట్టణంలోని గడియార స్థంభం వద్ద దర్శి తహశీల్దారు వారి సమక్షములో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిచర్యగా భారత ఆర్మీ జరిపినటువంటి ఆపరేషన్ సిందూర్ చర్యలో పాల్గొన్న సైనికులకు అభినందనలు తెలియజేయ కార్యక్రమము జరిగినది. ఈ కార్యక్రమంలో భారత ఆర్మీ ప్రతి చర్యను ప్రశంసించిన దర్శి తహసీల్దార్ భారత్ మాతా కీ జై అంటూ నిందించి యువతలో ఉత్సాహాన్ని నింపారు.
View More
Local Updates
08 May 2025 03:06 AM
1
2
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
ఆపరేషన్ సింధూర్ ఒక చారిత్రాత్మక ఘట్టం - డా|| గొట్టిపాటి లక్ష్మి
ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వానికి మన కూటమి ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించిందని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ బుధవారం ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. పహల్గాం లో నరమేధానికి ప్రతీకారంగా భారత్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో 9 ఉగ్ర పోస్టులను ధ్వంసం చేయడంపై డాక్టర్ లక్ష్మీ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ వందేమాతరం భారత్ మాతాకు జై అంటూ కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి జేజేలు పలకాలని మన టిడిపి పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆమె వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్ర మూకులను అంతం చేసేందుకు ఈ చర్య తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , యువనేత లోకేష్ బాబు ఇటీవల జరిగిన అమరావతి సభలో కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి మోడీ కి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నేడు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రస్తావరాలను చుట్టుముట్టి ధ్వంసం చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. కులమతాలకు అతీతంగా యావత్ భారతదేశం మోడీ తీసుకునే నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు ప్రకటిద్దాం అన్నారు. భారత సైన్యానికి మనమందరం అండగా ఉందాం. ధైర్యంగా నిలబెడదాం. భారత్ మాతాకీ జై వందేమాతరం.
View More
Local Updates
07 May 2025 17:06 PM
0
2
View Latest Short News
😔
Oops! You're offline.
It looks like you've lost your internet connection.
Please check your network and try again.

Find News

News Categories

  • All Categories
  • Jobs (7)
  • Latest News (802)
  • Motivation (11)
  • Crime News (25)
  • Local Ads (39)
  • Entertainment (15)
  • Local Updates (217)
  • Sports News (12)
  • Education (13)
  • Business Promotions (1)
  • Politics (67)
  • Breaking News (97)
  • Install App
    ALL
    | newsread.in

    Newsread
    For better experience and daily news update.
    Download our app from play store.