

No.1 Short News
న్యూస్ రీడర్ తాళ్లూరు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోయారు. అత్యధికంగా ఇవాళ ఏపీలోని మన్యం జిల్లా వీరఘట్టంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 42.6, ప్రకాశం జిల్లా పెద్దారవీడు, నంద్యాల జిల్లా గోనవరంలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణలోని భద్రాద్రి, ఆదిలాబాద్లో 42 డిగ్రీలు, కొమురంభీంలో 41.8, మెదక్లో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
View More
Local Updates
18 Mar 2025 13:19 PM


No.1 Short News
న్యూస్ రీడర్ తాళ్లూరుప్రకాశం జిల్లాలో 90 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
ప్రకాశం జిల్లాలో 90 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ సోమవారం తెలిపారు. కందులకు 45 కొనుగోలు కేంద్రాలు, శనగలకు 36 కొనుగోలు కేంద్రాలు, మినుములకు 10 కొనుగోలు కేంద్రాలను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయుటకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ క్రాప్లో కంది, శనగ, మినుములు నమోదైన రైతులు 2 రోజులలో సీఎం యాప్లో తమ పేర్లను రైతు సేవా కేంద్రాలలో నమోదు చేసుకోవాలన్నారు.
View More
Local Updates
18 Mar 2025 10:35 AM


No.1 Short News
Newsreadపడమర లక్ష్మీపురంలో పోలేరమ్మ తిరుణాల కార్యక్రమంలో పాల్గొన్న డా|| గొట్టిపాటి లక్ష్మీ
ఈరోజు దొనకొండ మండలం, పడమర లక్ష్మీపురం గ్రామంలో పోలేరమ్మ తిరుణాల మహోత్సవ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ దంపతులు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించి పోలేరమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమంలో దొనకొండ మండలం మరియు పడమర లక్ష్మీపురంలో గ్రామం లోని వివిద హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు, టిడిపి, జనసేన, బిజెపి కూటమి శ్రేణులు, నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
View More
Local Updates
17 Mar 2025 19:22 PM


No.1 Short News
న్యూస్ రీడర్ తాళ్లూరుజరుగుమల్లి: నాలుగు పొగాకు బ్యారన్లు దగ్ధం
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని రామచంద్రపురంలో సోమవారం ప్రమాదవశాత్తు పక్క పక్కనే ఉన్న 4 పొగాకు బ్యారన్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ.45లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో వెంకటరావు, ఆదిలక్ష్మి, ఆదేమ్మ, మాలకొండయ్య, శ్రీనివాసరావు, మురళి, రామారావు, వెంకటేశకు చెందిన బ్యారన్లు దగ్ధమయ్యాయి. గ్రామస్థుల సమాచారం మేరకు టంగుటూరు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
View More
Local Updates
17 Mar 2025 17:48 PM


No.1 Short News
Newsreadప్రజా చైతన్యంతో నే పరిశుభ్రత సాధ్యం, ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట - డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.
స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం దర్శి పట్టణంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ రెవిన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి ప్రజా భాగస్వామ్యంతో సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడవద్దు, గుడ్డ సంచులు, జ్యూట్ బ్యాగ్ లు వాడాలి అంటూ అవగాహన అవగాహన ర్యాలీలో కల్పించారు. పట్టణం లోని దుకాణాలకు వెళ్లి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దంటూ దుకాణదారులకు అవగాహన కల్పించా రు. డా|| గొట్టిపాటి లక్ష్మీ పాటు టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు, దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య గారు, దర్శి మండల MRO శ్రవణ్ కుమార్, దర్శి మునిసిపల్ కమిషన్ మహేష్, అధికారులు, కూటమి శ్రేణులు ఉన్నారు. ప్రభుత్వం ప్రతి నెల మూడో శనివారం చేపట్టే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. పట్టణంలోని పౌరులందరూ రాజకీయాలకతీతంగా, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, యువత మహిళలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం అయ్యారు
View More
Local Updates
15 Mar 2025 13:02 PM


No.1 Short News
Newsreadలీడర్: ఇది కదా అసలైన నాయకత్వం, నేనున్నా అనే భరోసా..
ఇప్పటిదాకా నాయకులని చూశాం, వారి పరిధులను చూశాం, కానీ ప్రజల తో మమేకమై, దర్పం ప్రదర్శించకుండా, అతి సాధారణ నైజాన్ని కూడా చూపించే అసలు సిసలు బాధ్యతాయుత నాయకురాలు దర్శి నియోజకర్గ టీడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అనడానికి ఈ చిత్రం ఉదాహరణ గా చెప్పవచ్చు.తన హోదా, పదవి, స్థాయిని పక్కనబెట్టి సాటి మహిళ బాధను పంచుకుంటున్న ఈ చిత్రం దర్శి ప్రజల హృదయాలను ఆకర్షించింది అని చెప్పుకోవచ్చు.
View More
Local Updates
04 Mar 2025 22:37 PM


No.1 Short News
న్యూస్ రీడ్ - తూర్పు గంగవరంవివాహ రిసెప్సన్ శుభకార్యక్రమం లో పాల్గొన్న టిడిపి యువనాయకులు Dr. కడియాల లలిత్ సాగర్
ఈరోజు దర్శి పట్టణం, ఆర్యవైశ్య కళ్యాణ మండపం లో వడ్డమాని శ్రీనివాస శాస్త్రీ - శ్రీమతి వెంకట నాగ భారతి కుమారుని వివాహ రిసెప్సన్ కార్యక్రమం లోని వధువారులు చి|| సత్య భరద్వాజ శర్మ, చి||ల||సౌ|| లలిత ఆశీర్వదించి, వివాహ శుభాకాంక్షలు తెలియజేసిన టిడిపి యువనాయకులు Dr. కడియాల లలిత్ సాగర్ వారితో పాటు టిడిపి సీనియర్ నాయకులు కలువకొలను చంద్ర శేఖర్ , దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య , దారం సుబ్బారావు ,సుంకర రాఘవరెడ్డి రెడ్డి తదితర నాయకులు ఉన్నారు.
View More
Local Updates
04 Mar 2025 08:24 AM


No.1 Short News
T Maheshగోరంట్ల గుంతల మయంగా వానవోలు రహదారి
శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం వానవోలు పంచాయతీలో గుంతలమయంగా వానవోలు రహదారి
గోరంట్ల మండలంలోని గోరంట్ల నుంచి ఉగ్గురాంపల్లి వానవోలు రోడ్డు గుంతలు ఏర్పడి చాలా అధ్వానంగా ఉందని గ్రామస్థులు తెలిపారు. ఈ రోడ్డుపై ఆటోలు రాక తాటిమాకులపల్లె, బాచన్నపల్లి ఉగ్గురాంపల్లి, పెట్లకుంటపల్లి, ఎముకల గుట్లపల్లి ప్రజలు గోరంట్ల వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
View More
Local Updates
04 Mar 2025 08:23 AM


No.1 Short News
న్యూస్ రీడ్ - తూర్పు గంగవరంభారతదేశ మొదటి ముస్లిం మహిళా మంత్రి మాసుమా బేగం వర్ధంతి వేడుకలు
ప్రపంచ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా తాళ్ళూరు మండలం తూర్పు గంగవరంలో దరిశి రోడ్డునందుగల స్థానిక మజీద్ కు సమీపంలో వున్న HP పెట్రోల్ బంకు ఆవరణలో, ముందుగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ మాసం ఆరంభ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(సమైక్యాంధ్రప్రదేశ్) మొట్టమొదటి మహిళా మంత్రిగా పనిచేసి,భారత దేశంలోనే మొట్టమొదటి ముస్లిం మహిళా మంత్రిగా పనిచేసి, భారత దేశ చరిత్రలో చిరస్తాయిగా నిలిచిన మసూమా భేగం వర్ధంతి సందర్భంగా, IRCS(ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ)ఎగ్జికూటివ్ మెంబర్ మరియు మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ఈమె చిత్రపటానికి పూలమాల వేసి,పుష్పాంజలి ఘటించి ఘనమైన నివాళులు అర్పించారు.ఈమె తొలి మహిళా సాంఘీక సంక్షేమ శాఖ మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా ముస్లిం మైనారిటీ వర్గాలవారికి ఎనలేని సేవలందించారని ఈమె చేసిన సేవలను కొనియాడారు.ఈ మె 1952లో,1957లో రెండుసార్లు శాసన సభ్యులుగా ఎన్నికై, ఒకసారి శాసనసభ ఫ్లోర్ లీడరుగాను,ఇంకోసారి మంత్రిగానూ సేవలందించారని తెలిపారు.ఈమె ప్రముఖ సంఘసేవకురాలు సరోజినీనాయుడు శిష్యురాలిగా వుండి మంచి సంఘసేవకురాలిగా పేరుప్రఖ్యాతులు గఢించారని కపురం శ్రీనివాసరెడ్డి ఈమె సేవాతత్పరతను గురించి సవివరంగా వివరించారు. ఈ కార్య క్రమానికి ముస్లిం సంధానీ,మీరావలి, సైదా, వలి,అశోక్ బాబు,చిన్న, రవి తదితరులు పాల్గొన్నారు.
View More
Local Updates
03 Mar 2025 10:19 AM


No.1 Short News
గంగాధర్,అదిలాబాద్ జిల్లాఆదిలాబాద్ జిల్లా ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో పవర్ శిక్షణ తరగతులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్టీసి ప్రయాణ ప్రాంగణంలో గత కొద్ది రోజుల నుండి పవర్ శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి, శిక్షణలో భాగంగా ఆర్టీసిలోని అన్ని శ్రేణులకు చెందినటువంటి ఉద్యోగులను సైతం ఈ శిక్షణలో భాగస్వామ్యం చేసి ఆర్టీసీ అభివృద్ధికి అడుగులు వేస్తుందని ఆదిలాబాద్ ఆర్టీసి డిపో మేనేజర్ కల్పనా తెలిపారు, తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏం.డి వి. సి. సజ్జనర్ ఆదేశాల మేరకు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్టీసీ రిజినల్ మేనేజర్ సొలొమాన్ ఈ సందర్బంగా తెలిపారు
View More
Local Updates
03 Mar 2025 09:54 AM


No.1 Short News
జాషువా - కొండేపి రిపోర్టర్కొండపి: మీ వ్యాపార, రాజకీయ ప్రకటనలకు సరైన వేదిక న్యూస్ రీడ్ యాప్
మీ వ్యాపారం అభివృద్ధి కోసం, ఆన్లైన్ లో ప్రమోషన్స్ చేయడానికి మంచి సర్వీస్ కోసం ఎదురుచూస్తున్నరా.. ?
అయితే మీకోసమే న్యూస్ రీడ్ లేటెస్ట్ షార్ట్ న్యూస్ యాప్ అందుబాటులో ఉంది .ఈ యాప్ రెండు తెలుగు రాష్ట్రాల నుండి అత్యధిక ప్రజాదరణ కలిగి ఉంది. మీ వాణిజ్య ప్రకటన లు న్యూస్ రీడ్ యాప్ లో చాలా తక్కువ ధరకే ఈజీగా మిరే పబ్లిసిటీ చేసుకునే అవకాశం న్యూస్ రీడ్ యాప్ అందిస్తుంది. ఈ యాప్ లో మీరు .. అతి తక్కువ ధరకే ప్రమోషన్స్ చేసుకోవచ్చు తాజా సమాచారం కోసం అయిన , వ్యాపార ప్రకటనల కోసం అయిన తెలుగు రాష్ట్రాల ప్రజల సరైన ఎంపిన న్యూస్ రీడ్ లేటెస్ట్ షార్ట్ న్యూస్ యాప్ , ఫోన్:
న్యూస్ రీడ్ - 8247828640
View More
Local Updates
27 Feb 2025 13:00 PM


No.1 Short News
DR Local News - Chiralaఈపురుపాలెం లో మహాశివరాత్రి సందర్భంగా ప్రభ వైభవం గా ఊరేగింపు జరిగినది
బాపట్ల జిల్లా, చీరాల మండలం, ఈపూరుపాలెం గ్రామంలో ఈ రోజు రాత్రి బాల కోటేశ్వర స్వామి వారి భక్త బృందం సీతారాంపేట, ఈపూరుపాలెం గ్రామం వారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా అతి వైభవంగా *ప్రభ* ఊరేగింపు జరిగినది. ఈ ఊరేగింపులో మహిళామ తల్లుల హారతుల సేవ, కోలాట ప్రదర్శ న అత్యద్భుతముగా జరిగినది.
ఈ సందర్భంగా హిందూ చైతన్య వేదిక జిల్లా సహ సంయోజక్ బండారు జ్వాలా నరసింహo *సత్సంగం* చేయుచూ 400 సంవత్సరాల క్రితం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి సన్నిధిలో మొట్టమొదటిసారిగా ప్రభల ఊరేగింపు జరిగినదని, అలాగే భారతదేశంలో సనాతన ధర్మం వర్ధిల్లుటకు ప్రధానంగా మహిళామ తల్లులే కారణమని కాబట్టి ఇటువంటి ఊరేగింపులు, హారతుల సేవలు, కోలాట ప్రదర్శనలు, భజనలు..... హిందూ ధర్మ పరిరక్షణ, హిందూ సమాజ ఐక్యతకు ఏర్పాటు చేసినవని కావున కుల మతాలకతీతంగా సనాతన ధర్మ ఐక్యత కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని తద్వారా మన భరతభూమిని విశ్వ గురు స్థానంలో నిలపాల్సిన బాధ్యత మనందరిదని మాట్లాడుట జరిగినది.
ఈ ఊరేగింపులో మహిళామ తల్లులు, బాలబాలికలు, గ్రామ ప్రజలు, కమిటీ పెద్దలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు
భవదీయ
బండారు జ్వాలా నరసింహo
జిల్లా సహ సంయోజక్
హిందూ చైతన్య వేదిక. చీరాల
బాపట్ల జిల్లా
View More
Local Updates
27 Feb 2025 07:57 AM


No.1 Short News
DR Local News - Chiralaచీరాలలో శ్రీ గోనందుల కళ్యాణం
చీరాలలో శ్రీ గోనందుల కళ్యాణం
సాయంత్రం 5 గంటలకు 26-02-2025 బుధవారం
మహాశివరాత్రి సందర్భముగా
శ్రీ గోనందుల కళ్యాణం మరియు శ్రీ గోమయ గణపతి, గోమయ గౌరి సహిత శ్రీ నాగలింగ లఘు ప్రతిష్ఠ పూజ మరియు హోమ కార్యక్రమముల ఆహ్వానము
హోమ కార్యక్రమం నిర్వహించువారు :
గోఉవవాసుకులు శ్రీ సురభిదాసు బిరుదాంకితులు బ్రహ్మశ్రీ కుందుర్తి మహికిరణ్ శర్మగారు, హైదరాబాదు.
వేదిక : శ్రీ సరస్వతి శిశుమందిరం, రామమందిరం వీధి, చీరాల.
నిర్వహించువారు చీరాల గో సేవా సమితి
View More
Local Updates
26 Feb 2025 15:51 PM


No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ నేడు తెలంగాణ భవన్ కు బిఅరెస్ అధినేత కేసీఆర్
నేడు తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
మధ్యాహ్నం 2:00 కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం
అన్ని జిల్లాల నుండి ఈ సమావేశానికి 400 మంది పార్టీ కీలక నేతలకు ఆహ్వానం
పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీబీ డిసిఎంఎస్ చైర్మన్లు, జెడ్పీ మాజీ చైర్మన్ లను ఆహ్వానం
ఈ భేటీలో పార్టీని సంస్థగతంగా బలోపేతం చేయడంపై చేపట్టాల్సిన కార్యకలాపాలపై కేసీఆర్ చర్చ
బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుండడంతో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించే ఆలోచనలో కేసీఆర్
రుణమాఫీ, రైతు భరోసా, లగచర్ల భూ పోరాటం, హైడ్రా ఆగడాలపై ఉద్యమం, రైతు ఆత్మహత్యలపై, ఆటో కార్మికుల సమస్యలపై అధ్యయన కమిటీలు
గురుకుల విద్యార్థుల ఆత్మహత్యల సమస్యలపై పోరాటం
పార్టీ క్యాడర్, సోషల్ మీడియా కార్యకర్తల టార్గెట్ గా ప్రభుత్వం పెడుతున్న కేసులపై పోరాటం
వివిధ కీలక అంశాలపై భవిష్యత్తు పార్టీ నిర్ణయంపై కేసీఆర్ క్యాడర్ కు దిశా నిర్దేశం చేయనున్నారు
View More
Local Updates
19 Feb 2025 11:39 AM


No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ కంట్రోల్ తప్పిన కమాండ్ కంట్రోల్ సెంటర్
కంట్రోల్ తప్పిన కమాండ్ కంట్రోల్ సెంటర్
తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో భద్రతా వైఫల్యం
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి టాస్క్ ఫోర్స్ పోలీసునంటూ 3 సార్లు వచ్చి వెళ్ళి, రూ.2.82 లక్షలు కాజేసిన గుర్తు తెలియని వ్యక్తి
ఇటీవల తెలంగాణ సెక్రటేరియట్ లోకి 4 సార్లు నకిలీ ఉద్యోగుల పేరిట గుర్తు తెలియని వ్యక్తులు రావడం ఘటనలు మరువక ముందే అత్యంత ప్రతిష్టాత్మకమైన, కట్టుదిట్టమైన భద్రత ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ అంటూ 3 సార్లు వచ్చి వెళ్ళిన దుండగుడు
నిందితుడు ఐసీసీసీకి ఎదురుగా ఉన్న నిలోఫర్ కేఫ్ లో కూకట్ పల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జ్ఞానసాయి ప్రసాద్ అనే వ్యక్తిని కలిసి, తాను టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ హరిజన గోవర్ధన్ అని నమ్మించాడు
హోటల్ వ్యాపారంలో లాభాలు ఉంటాయని చెప్పి జ్ఞానసాయి ప్రసాద్ దగ్గర రూ.2.82 లక్షలు వసూలు చేశాడు.
దుంగడుగు తన ముందు పలుమార్లు ఐసీసీసీ నుండి బయటకు రావడంతో, అతను నిజంగానే టాస్క్ ఫోర్స్ అధికారి అని జ్ఞానసాయి ప్రసాద్ నమ్మి మోసపోయాడు.
అసలు నిజం తెలిసాక బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు
రేవంత్ రెడ్డితో పాటు అనేక మంది మంత్రులు కీలక సమావేశాలు ఏర్పాటు చేసుకునే ప్రాంగణంలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించడం, భద్రతా వలయం నడుమ ఉండే ఐసీసీసీలోకి దుండగుడు వెళ్లడంపై భద్రతా వ్యవస్థకు అవమానం అని విమర్శలు వస్తున్నాయి.
View More
Local Updates
19 Feb 2025 10:28 AM


No.1 Short News
Newsreadదర్శి లో ఘనంగా ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ముఖ్య అతిధిగా కపురం
ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను దర్శి లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ ఒంగోలు గిత్తలతో, మార్కాపురం పలకలతో, బౌద్ధ స్థూపాలతో, గ్రానైట్ తో తీర ప్రాంతం తో, ఎందరో స్వతంత్ర సమరయోధులు నడిచిన నేల ప్రకాశం జిల్లా అని జిల్లా గొప్పతనాన్ని చాలా చక్కగా వివరించారు.
View More
Local Updates
03 Feb 2025 18:49 PM


No.1 Short News
Newsreadఇంటింటికీ తిరిగి పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్న డా|| గొట్టిపాటి లక్ష్మి
నేడు దర్శి మండలం, లంకోజనపల్లి గ్రామం లో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరిగి పెన్షన్ పంపిణీ చేసిన దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డా|| గొట్టిపాటి లక్ష్మీ . వారితో పాటు టిడిపి యువనాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ , మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు , రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి , దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య , అధికారులు మరియు వివిద హోదాల్లో ఉన్న ప్రముఖ సీనియర్ నాయకులు ఉన్నారు.
View More
Local Updates
01 Feb 2025 16:55 PM


No.1 Short News
Newsreadఉత్తమ మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ అవార్డు గ్రహీత రవికుమార్ ను సత్కరించిన కపురం.
ప్రకాశం జిల్లా ఉత్తమ మోటారు వెహికిల్ Inspector గా, కలెక్టర్ మరియూ ఎస్పీ చేతులమీదుగా అవార్డు గ్రహీత అయిన దరిశి మోటార్ వెహికిల్ Inspector రవికుమార్ , దరిశి పురప్రముఖులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి, మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్, అందరివాడు కపురం శ్రీనివాస రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి, విధినిర్వహణలో అంకితభావంతో పనిచేసి జిల్లా అధికారుల మన్ననలుపొంది ప్రభుత్వం,ప్రజలందరి మన్ననలు,ఆశీస్సులు పొంది అవార్డును సొంతంచేసికొన్న MVI రవికుమార్ ని శాలువాతో మరియూ ఫ్లవర్ బొకేతో ఘనంగా సన్మానించడం జరిగింది.
View More
Local Updates
01 Feb 2025 16:46 PM
You are offline
Please check your internet connection.
Close