Select Location
Newsread Image

No.1 Short News

DR Local News - Chirala
కన్నుల పండుగగా జరిగిన పౌర్ణమి సాగర హారతి: బంగారు బాబు
బాపట్ల జిల్లా,చీరాల మండలం,వాడరేవు గ్రామం (సముద్ర తీర ప్రాంతం) నందు గల ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా సాగర తీరాన ఆషాడ పౌర్ణమి, గురు పౌర్ణమి మరియు వ్యాస పౌర్ణమి సందర్భంగా కన్నుల పండుగగా, అత్యంత వైభవో పేతంగా సామూహిక పౌర్ణమి సాగర హారతి కార్యక్రమాన్ని హిందూ చైతన్య వేదిక చీరాల నియోజకవర్గ ప్రమఖ్ డాక్టర్ తాడివలస దేవరాజు ఆధ్వర్యంలో అర్చక స్వాములు మరియు వేద పండితులు కారంచేటి నగేష్ కుమార్, విట వెంకటేష్, కార్తీక్ శర్మ, సుధాకర్ శర్మ గార్ల మంత్రోచ్ఛారణతో స్పటిక శివలింగానికి పంచామృతాలతో అభిషేకం, మంత్ర పుష్పం మరియు సామూహిక సాగర హారతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి హిందూ చైతన్య వేదిక ప్రత్యేక ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా బాపట్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు బంగారు బాబు గారు, కొండారెడ్డి గారు, అనిల్ గారు పాల్గొని వీరి చేతుల మీదుగా అభిషేకం, సాగర హారతిని నిర్వహించుట జరిగినది. ఈ సందర్భంగా.... బిజెపి బాపట్ల జిల్లా అధ్యక్షులు బంగారు బాబు గారు మాట్లాడుతూ.... సముద్రం నుండి ఎటువంటి ప్రమాదాలు వాటిల్లకుండా, సముద్రం యొక్క అనుగ్రహం మన అందరిపై ఉండాలని కోరుకుంటూ సముద్ర హారతి ఇవ్వటం అనేది చాలా మంచి కార్యక్రమం అని తెలియజేశారు. టెంపుల్ టూరిజం బాగా అభివృద్ధి సాధిస్తుందని, సాగర హారతి మొదలు పెట్టిన తర్వాత వాడరేవు హైవే పనులు త్వరిత గతిన జరుగుతున్నాయని, హిందూ చైతన్య వేదిక నాయకులు ఈ కార్యక్రమం చక్కగా చేస్తున్నందుకు అభినందనీయమని వారిని ప్రశంసించటం జరిగినది. హిందూ చైతన్య వేదిక బాపట్ల జిల్లా సంయోజక్ బండారు జ్వాలా నరసింహo గారు గురు పౌర్ణమి గురించి వివరించుట జరిగినది. సాగర హారతి నిర్వాహకులు డాక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ శివానుగ్రహంతో ఎంతో విజయవంతంగా ప్రతి పౌర్ణమికి సాగర హారతి చీరాల వాడరేవులో ఎంతో వైభవంగా జరుగుతుందని , త్వరలో మరకత శివ లింగం తో అభిషేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు . ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న హిందూ సంఘాలకు మరియు చీరాల శాసనసభ్యులు ఎం ఎం కొండయ్య గారికి, పోలీస్ సిబ్బంది వారికి, వాడరేవు పంచాయతీ సిబ్బందికి , భజన బృందం వారికి, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామ కృష్ణ,మనోహర్ రెడ్డి,మణి కుమార్, భవానీ, సుధ, మున్నం శ్రీనివాస్ రెడ్డి , దామిశెట్టి శ్రీనివాస్ గుప్తా, వెంకటేశ్వర రెడ్డి, పిక్కి రాంబాబు , కోటి శ్రీను , జంపాల చిట్టి బాబు, సున్నం శ్రీనివాస్,సతీష్ వులిచి, మూర్తి జొన్న, పిక్కి నారాయణ, గోలి సాంబశివ రావు, బుర్ల సాంబశివరావు ,తడవర్తి చంద్ర , రాజేష్ ,డాక్టర్ సబరి , గుమ్మ బాలాజీ, ఆర్ఎస్ఎస్ నాయకులు, విశ్వహిందూ పరిషత్ నాయకులు, హిందూ చైతన్య వేదిక వాడరేవు గ్రామ ధార్మిక జట్టు సభ్యులు శ్రీనివాసులు రెడ్డి, వాడరేవు టిడిపి నాయకులు మరియు గ్రామ పెద్దలు, ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.
View More
Local Updates
11 Jul 2025 11:14 AM
0
61
Newsread Image

No.1 Short News

Newsread
పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం శుభ్రమైన ఆహారాన్ని అందించాలి
దర్శి పురపాలక సంఘం అద్దంకి రోడ్డులో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను దళిత,ప్రజా సంఘాలనాయకులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా నవ్యాంధ్ర మాదిగ చర్మ, డప్పు కళాకారుల పోరాటసంఘం రాష్ట్రవ్యవస్థాపకఅధ్యక్షులు కవలకుంట్ల గోవిందప్రసాద్ మాదిగ, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు జూపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులపాఠశాలలో పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారని విద్యార్థులకుతగిన మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలని, అన్నారు. త్రాగునీటి సౌకర్యం విద్యార్థులకు కల్పించాలని, పరిసరాలు పరిశుభ్రంగాఉంచాలని, వంట రూము అపరిశుభ్రత లేకుండా తగిన జాగ్రత్తలుతీసుకోవాలని, వారు తెలిపారు. విద్యార్థులకుఅందించే మెనూ అద్దంకిఏజెన్సీనుండి కూరగాయలు, కోడిగుడ్లు, సరఫరా విషయంలో, తగిన జాగ్రత్తలుతీసుకొని, దర్శి నుండి ఏజెన్సీఏర్పాటు చేయాలని, ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు, అనంతరం అక్కడ వండిన వంటలను రుచిచూసి సంతృప్తి చెందారు. విద్యార్థులకు ఆహార పదార్థాలను వేస్ట్ చేయకుండా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘసేవకులు జి.వి రత్నం రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గం అధ్యక్షులు గర్నెపూడి ప్రేమ్ కుమార్ గర్నిపూడి యాకోబు తదితరులు పాల్గొన్నారు.
View More
Local Updates
09 Jul 2025 20:29 PM
1
89
Newsread Image

No.1 Short News

Newsread
పిట్ట కొంచెం.. కూత ఘనం.. 17 నెలల చిన్నారి ట్యాలెంట్‌ కి నోబెల్ బహుమతి
ప్రకాశం జిల్లా, ఒంగోలు పట్టణంలోని సత్యనారాయపురంకి చెందిన అంబటి ఖశ్వి అనే చిన్నారి ఒక సంవత్సరం ఐదు నెలల (17 నెలలు) వయస్సులోనే 24 వేర్వేరు కేటగిరీలలో 650కి పైగా ఇంగ్లీష్ పదాలను మాట్లాడగలగడం ద్వారా నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్న అంబటి ఖశ్వి (17 నెలలు) ను ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ A.R. దామోదర్, అంబటి ఖశ్వి ను ప్రత్యేకంగా అభినందించారు. ఇది చిన్నారుల విభాగంలో ప్రపంచస్థాయిలో అత్యుత్తమ రికార్డుగా గుర్తింపు పొందింది. గతంలో ఉన్న రికార్డును నాలుగు సంవత్సరాల మూడు నెలల చిన్నారి 300 పదాలు మాట్లాడిన ఘనతను అంబటి కాశ్వీ అధిగమించడం విశేషం. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అంబటి ఖశ్వి ప్రపంచవ్యాప్తంగా ఒక అరుదైన ఘనతను సాధించిందని, కేవలం జిల్లాకే కాకుండా రాష్ట్రానికి కూడా గర్వకారణమని, చిన్న వయస్సులోనే ఇటువంటి మేధస్సు ప్రదర్శించడం అద్భుతమైన విషయమన్నారు. చిన్నారిలో తెలివితేటలు, ప్రతిభను గుర్తించాలన్నారు. ఈ విజయం సాధించడంలో కుటుంబ సభ్యుల సహకారం, మార్గదర్శకత ఎంతో ముఖ్యమైనదని జిల్లా ఎస్పీ కొనియాడారు. జిల్లా పోలీస్ శాఖ తరఫున అంబటి ఖశ్వి భవిష్యత్తు మరింత వెలుగులు చిమ్మాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాప తల్లిదండ్రులు సాయికుమార్, ప్రణతి, కుటుంబ సభ్యులు శివాజీ గణేష్, కోటేశ్వరమ్మ పాల్గొన్నారు.
View More
Local Updates
08 Jul 2025 22:19 PM
1
91
Newsread Image

No.1 Short News

Newsread
చంద్రన్న పచ్చదనం–భాష్యం స్కూల్లో మొక్కలు పంపిణీ చేసిన పరిటాల సురేష్
చంద్రన్న పచ్చదనం కార్యక్రమం లో భాగంగా, గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ ఆదేశాల తో, గురువు అచ్చెన్నాయుడు ఆసీస్సులతో, దర్శి భాష్యం స్కూల్, నందు టీడీపీ ప్రకాశం జిల్లా మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ ఏర్పాటు చేసిన మొక్కలను దర్శి అగ్రికల్చర్ AO k.రాధ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏవో K .రాధ మాట్లాడుతూ పిల్లలందరూ గ్రీన్స్ లీడర్ గా ఎదగాలి అని , ప్రకృతి, చెట్లు పర్యావరణ కు తొలి మెట్లు అని పిల్లల తో అన్నారు. కరోనా సమయంలో ఆక్సీజన్ అందక చాలా మంది చనిపోయినారు అని, అదే మన ఇంటి ఆవరణ లో చెట్లు ఉంటే ఆక్సిజన్ అందేది అని వివరించారు. చెట్లు పెంచడం వల్ల కాయలు పండ్లు, నీడ అన్ని దొరుకుతాయి అని సురేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జగదీష్,స్మైలీ, సుజాత, సుకన్య, సరస్వతి, అశోక్,రావులపల్లి ఉపాధ్యాయులు, స్టాఫ్ పాల్గొన్నారు..
View More
Local Updates
07 Jul 2025 20:18 PM
1
74
Newsread Image

No.1 Short News

Newsread
తొలి ఏకాదశి శుభాకాంక్షలు పోస్టర్ మీకోసం
Local Updates
06 Jul 2025 06:58 AM
2
51
Newsread Image

No.1 Short News

Kumar Darla
కౌలు రైతులకు భూ యజమానులు సహకరించాలి..
దళిత బహుజన రిసోర్స్ సెంటర్ (DBRC)-ప్రకాశం జిల్లా ముండ్లమూరు తేది :04-07-25 భూ యజమానులు, కౌలు భూములు సాగు చేస్తున్న రైతులకు సహకరించాలి- ముండ్లమూరు తహసిల్దార్ ఎల్ లక్ష్మీనారాయణ ----------------@---------------- రాష్ట్ర ప్రభుత్వం భూ యజమానులు నష్టపోకుండా పంట సాగు దారుల చట్టం -2019 చట్టం ద్వారా వారికి ఎలాంటి నష్టం జరగకుండా చట్టంలో సవరణ చేసినందున భూ యజమానులు కౌలు రైతులకు పంట సాగు ధ్రువీకరణ పత్రాలు వచ్చే లాగున సహకరించలని ముండ్లమూరు తహసిల్దార్ ఎల్ లక్ష్మీనారాయణ తెలియజేశారు. శుక్రవారం మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో వంట సాగు సాగుదారుల ధ్రువీకరణ చట్టం ప్రచారోద్యమం వాహనం ను ప్రారంభోత్సవ కార్యక్రమం ఆయన మాట్లాడినారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ రీజినల్ కో-ఆర్డినేటర్ దార్లకోటేశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కౌలు రైతుల పంట సాగు దారుల గ్రామస్థాయిలో భూ యజమానుల వద్ద నుండి సాగు చేస్తున్న కౌలు భూముల సాగుపై మాత్రమే కౌలు రైతుకు హక్కు ఉంటుంది, భూమిపై కాదని ఈ విషయాన్ని భూ యజమానులు గుర్తుతెరిగి కౌలు రైతులకు సహకరించాలని తెలిపారు. తదుపరి ప్రచార వాహనం ద్వారా ముండ్లమూరు, పసుపుగల్లు, వేముల బండ, రమణారెడ్డి పాలెం, ఈదర, భీమవరం, ఉమామహేశ్వరపురం, పోలవరం గ్రామాలలో కౌలు రైతుల ప్రచారోద్యమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలలో ఆయా గ్రామ సచివాలయ, గ్రామరెవిన్యూ అధికారులు,వ్యవసాయ సహాయకులు, కౌలు రైతులు పాల్గొన్నారు.
View More
Local Updates
04 Jul 2025 18:01 PM
3
64
Newsread Image

No.1 Short News

Kumar Darla
దర్శి లో ఆడపిల్లలను వేధించే వారిపై నిఘా పెట్టడం జరిగింది.
దర్శి : సర్కిల్ ఇన్స్పెక్టర్ వై. రామారావు దర్శి లో సాయంత్రం వేళలో స్కూల్లో కాలేజీలో నుంచి వస్తున్న ఆడపిల్లలను కొంతమంది ఆకతాయిలు ఆటపట్టించడం జరుగుతుందని వారిపై దరిశి సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రామారావు నిఘా పెట్టామని తెలియజేశారు. నిన్న సాయంత్రం ఇద్దరిని ఆకతాయిలను పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్లి కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది. దర్శి లో రెండు డ్రోన్లు సహాయంతో ఎల్లప్పుడూ మా పర్యవేక్షణ జరుగుతూ ఉంటుంది అని ఆయన తెలియజేశారు.
View More
Local Updates
04 Jul 2025 17:58 PM
0
75
Newsread Image

No.1 Short News

Kumar Darla
కౌలు రైతులకు భూ యజమానులు సహకరించాలి
దర్శి ;దళిత బహుజన రిసోర్స్ సెంటర్ దర్శి ఏరియా కోఆర్డినేటర్ గుంటూరు నాగమణి అధ్యక్షతన పంట సాగుదారుల చట్టంపై ప్రచార ఉద్యమ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలోదర్శి మండల కార్యాలయం నుండి రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ టి శ్రీనివాసరావు గారు ప్రారంభించారు మండలంలో జరగనున్న ఈ ప్రచారోద్యమ కార్యక్రమం కౌలు కార్డుల పైన ప్రతి కౌలు రైతుకు అవగాహన కల్పించి ఈ చట్టంపై భూ యజమానులకు ఉన్న అపోహలను తొలగించుటకు భూ యజమానులు నష్టపోకుండా పంట సాగుదారుల చట్టం- 2019 ప్రకారం యజమానులకు ఎలాంటి నష్టం జరగకుండా చట్టంలో సవరణ చేసినందున భూ యజమానులు కౌలు రైతులకు పంట సాగు ధ్రువీకరణ పత్రాలు వచ్చే విధంగా సహకరించాలని రీసర్వ్ డిప్యూటీ తహసిల్దార్ శ్రీనివాసరావు గారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ మరియు సీనియర్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు తదుపరి పోతవరం పంచాయతీ శివారు ప్రాంతమైన తిమ్మాయిపాలెం గ్రామం మరియు తానం చింతల గ్రామాలలో అలాగే తూర్పు చవటపాలెం గ్రామంలో రైతు సేవ కేంద్రాల వద్ద అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దర్శి ఏరియా కోఆర్డినేటర్ నాగమణి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కౌలు రైతుల పంట సాగుదారులు గ్రామస్థాయిలో భూ యజమానుల వద్ద నుండి సాగు చేస్తున్న కౌలు భూముల సాగుపై మాత్రమే కౌలు రైతుకు హక్కు ఉంటుంది భూమిపై కాదనే విషయాన్ని భూ యజమానులు తెలుసుకొని కౌలు రైతులకు సహకరించాలని కోరారు పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీ బ్యాంకు రుణాలు పొందడానికి కౌలు కార్డు ఉపయోగపడుతుందని రాష్ట్రంలో 32 లక్షలకు పైగా కవులు రైతులు ఉన్నారని రాధాకృష్ణన్ రిపోర్టు ఆధారంగా వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుని వారు ఉన్నారని రాష్ట్రంలో 75% ఆత్మహత్యలు జరుగుతున్న వారిలో మూడు వంతులు కౌలు రైతులు ఉన్నారని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి వీఆర్వోలు అగ్రికల్చర్ అసిస్టెంట్లు భాగస్వాములయ్యారు
View More
Local Updates
03 Jul 2025 11:09 AM
2
74
Newsread Image

No.1 Short News

Newsread
కరెంట్ షాక్ తో మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించిన బూచేపల్లి
ముండ్లమూరు మండలం వేములబండ గ్రామములో కరెంట్ షాక్ తో మృతి చెందిన ఆవుల గౌతం పార్థివ దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మనోధర్యం కల్పించారు.
View More
Local Updates
01 Jul 2025 12:55 PM
0
54
Newsread Image

No.1 Short News

Newsread
రాష్ట్రంలో ఈ పది జాతీయ రహదారుల విస్తరణ - డీపీఆర్‌ తయారీకి కేంద్రం ఆదేశాలు
988 కిలోమీటర్ల విస్తరణకు డీపీఆర్‌ తయారీకి కేంద్రం ఆదేశాలు - 2025-26 వార్షిక ప్రణాళికలో చేర్చిన మోర్త్‌ కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు 380 కిలోమీటర్ల NH-216ని నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఇందులో కత్తిపూడి నుంచి కాకినాడ వరకు 27 కిలోమీటర్లు ఇప్పటికే నాలుగు వరుసలుగా ఉంది. దీనిని ఆరు వరుసలు చేయనున్నారు. మిగిలిన భాగం ప్రస్తుతం రెండు వరుసలు ఉండగా నాలుగు వరుసలుగా విస్తరిస్తారు. కర్నూలు నుంచి నంద్యాల, కడప, రాయచోటి, పీలేరు, చిత్తూరు మీదుగా తమిళనాడులోని రాణీపేట వరకు ఉన్న NH-40ని కడప నుంచి చిత్తూరు జిల్లాలోని రంగంపేట క్రాస్‌ వరకు 148 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరించనున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలోని కొడికొండ చెక్‌పోస్ట్‌ నుంచి సిర వరకు 99 కిలోమీటర్లు 4వరుసలు చేస్తారు. ఏపీ, కర్ణాటక సరిహద్దు నుంచి కదిరి, ముదిగుబ్బ మీదుగా అనంతపురం వరకు 86 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరిస్తారు. ఇందులో కదిరి, ముదిగుబ్బల వద్ద బైపాస్‌లు కూడా ఉన్నాయి. పలమనేరు నుంచి కుప్పం మీదుగా తమిళనాడులోని కృష్ణగిరి సరిహద్దు వరకు 97 కిలోమీటర్ల
View More
Local Updates
29 Jun 2025 19:58 PM
0
39
Newsread Image

No.1 Short News

Newsread
ఏపీలోని రేషన్ కార్డుదారులకు షాక్.. ఈసారి కూడా కందిపప్పు సరఫరా లేనట్లే!
అమరావతి : ఏపీలోని రేషన్ కార్డుదారులకు బ్యాడ్ న్యూస్. వచ్చే నెల జూలై లోనూ రేషన్ కార్డుదారులకు కందిపప్పు అందేలా కనిపించడం లేదు. జులై నెలకు సంబంధించి నిత్యావసరాలు ఇప్పటికే చేరుకోగా ఈసారి కూడా కందిపప్పు సరఫరా లేదని అధికారులు చెప్తున్నారు. 2025 మార్చి నెల నుంచి ఏపీలో కందిపప్పు పంపిణీ ఆగిపోయింది. మార్కేట్లో కిలో కందిపప్పు ధర రూ.120 నుంచి రూ.160 వరకూ పలుకుతోంది. రేషన్ దుకాణాల్లో తక్కువ ధర (రూ.67)కే లభించే కందిపప్పు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
View More
Local Updates
29 Jun 2025 14:32 PM
0
37
Newsread Image

No.1 Short News

Newsread
ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు.
ఏపీ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ 100 నుంచి 300 పడకల స్థాయి మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించబోతున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో 100 పడకల మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో 3,300 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల ఏర్పాటుకు కేంద్రం రూ.1,095 కోట్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం పట్ల ప్రజల్లో సంతృప్తి స్థాయి 8 నుంచి 14% దాకా పెరిగిందన్నారు.
View More
Local Updates
29 Jun 2025 14:23 PM
0
72
Newsread Image

No.1 Short News

Newsread
ఈ రాజ్ కుమార్ అన్నం కాదు లంచం మెక్కుతాడు.
ఆదిలాబాద్ మున్సిపల్ అకౌంట్స్ ఆఫీసర్ జాయిన్ అయ్యి పది నెలలే ఇంకా ఉద్యోగం కన్ఫర్మ్ కాలేదు ఇప్పటికే ఎంత మెక్కేసాడో మొన్న 15 లంచం తీసుకొంటూ ACB కి చిక్కేశాడు. ఇలాంటి వారి ఉద్యోగం పీకెయ్యాలి పెన్షన్ ఆపేయాలి ఆస్తి సీజ్ చెయ్యాలి ప్రైవేట్ ఉద్యోగం కూడా రాకుండా చెయ్యాలి బొక్కలో వెయ్యాలి. ఈ పోస్ట్ షేర్ చేసి లంచం తీసుకొనే ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి కింద తడిసేడట్టు చెయ్యాలి మనం .
View More
Local Updates
29 Jun 2025 14:15 PM
0
43
Newsread Image

No.1 Short News

Newsread
విజయవాడలో రూ.300 కోట్ల భారీ మోసం
పెట్టుబడుల పేరుతో విజయవాడలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. లక్ష రూపాయల పెట్టుబడికి రూ.6 వేల వడ్డీ చెల్లిస్తామని మోహిత్ ట్రేడింగ్ కంపెనీ పలువురిని ఆశ పెట్టి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసింది. మొత్తం 1200 మంది నుంచి రూ.300 కోట్లు వసూలు చేసింది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి సంస్థ ఎండీ వెంకట్ ఆదిత్యను అదుపులోకి తీసుకున్నారు.
View More
Local Updates
29 Jun 2025 14:09 PM
0
46
Newsread Image

No.1 Short News

Newsread
బెంగుళూరు టు గుంటూరు డ్రగ్స్ రవాణా–స్మగ్లర్ల అరెస్ట్
చిలకలూరిపేట: బెంగుళూరు నుండి గుంటూరుకు అక్రమంగా డ్రగ్స్ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను చిలకలూరిపేట రూరల్ సీఐ బి. సుబ్బానాయుడు ఈరోజు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 25 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితులు చల్లా గోపి (23), తండ్రి లేట్ కోటేశ్వరరావు, వడ్డెర కులం, చిరునామా డి. నం. 5-64-34, 2/19వ లైను, బ్రాడీపేట, గుంటూరు టౌన్ మరియు షేక్ ఫారుక్ (29), తండ్రి షాకీర్, ముస్లిం కులం, చిరునామా చెక్కల బజార్, సంగడిగుంట, గుంటూరు టౌన్ గా గుర్తించారు.నిందితులను అరెస్ట్ చేసిన అనంతరం, వారిని రిమాండ్‌కు పంపినట్లు చిలకలూరిపేట రూరల్ సీఐ బి. సుబ్బానాయుడు తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
View More
Local Updates
28 Jun 2025 21:06 PM
1
72
Newsread Image

No.1 Short News

Newsread
కార్పస్ ఫండ్ చెక్కులను పోలీస్ కుటుంబ సభ్యులకు అందించిన గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్
ది.17.04.2025 తేదిన అనారోగ్యంతో మరణించిన ఏఆర్ కానిస్టేబుల్ G.వీరయ్య సతీమణి సౌజన్య లక్ష్మీ గారికి మరియు రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ది.21.04.2025 తేదీన మరణించిన ఏఆర్ కానిస్టేబుల్ K.క్రాంతి కుమార్ సతీమణి శ్రీమతి K. ప్రవీణ గారికి కపోలీస్ శాఖా తరపున అదనపు కార్పస్ ఫండ్ నిధి ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.100,000/- చొప్పున రూ.2,00,000/-- రూపాయలను ఎస్పీ చేతుల మీదుగా గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ ఏవో శ్రీ అద్దంకి. వెంకటేశ్వర రావు గారు అందజేయడం జరిగింది. మరణించిన పోలీస్ కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ భరోసా కల్పించారు.
View More
Local Updates
28 Jun 2025 19:32 PM
1
37
Newsread Image

No.1 Short News

Newsread
సోషల్ మీడియా క్లోనింగ్ అకౌంట్ల తో జర భద్రం
Local Updates
28 Jun 2025 16:55 PM
0
59
Newsread Image

No.1 Short News

Newsread
మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర.. వారంరోజుల్లో ఎంత తగ్గిందో తెలుసా..? ఏపీ, తెలంగాణలో ఇవాళ్టి ధరలు ఇలా..
Gold Rate: బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. గత వారం రోజుల క్రితం వరకు రికార్డు స్థాయి ధరలను నమోదు చేసిన బంగారం.. క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య వివాదం సర్ధుమణగడంతోపాటు.. అమెరికా, చైనా దేశాల మధ్య టారిఫ్ వార్ విషయంలో ఇరు దేశాలు వెనక్కు తగ్గడంతో గోల్డ్ రేటు క్రమంగా తగ్గుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వచ్చే వారం రోజుల్లో బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 930 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 850 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్స్ గోల్డ్ 40 డాలర్లు తగ్గి.. 3,293 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇదిలాఉంటే.. గడిచిన వారం రోజుల్లో గోల్డ్ రేటు సుమారు రూ.5వేలు తగ్గింది. మరోవైపు.. వెండి ధర కూడా తగ్గింది.
View More
Local Updates
27 Jun 2025 12:32 PM
2
113
Newsread Image

No.1 Short News

Newsread
జగన్ పరిస్థితి ఏంటి? కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది? రెంటపాళ్ల ఎపిసోడ్‌ లో నెక్ట్స్ ఏం జరగబోతోంది..
జగన్‌ పర్యటనలో కొందరు ప్లకార్డులు ప్రదర్శించడం..ఆ తర్వాత మాటల యుద్ధం..కార్యకర్త మరణంపై బయటికొచ్చిన వీడియోతో..వారం రోజులుగా రెంటపాళ్ల టూర్‌ చర్చ కంటిన్యూ అవుతూనే ఉంది. ఆయన టూర్‌ ముగిసి వారం అయింది. అయినా డైలీ అదే హాట్ టాపిక్‌గా ఉంటోంది. రోజుకో డెవలప్‌మెంట్‌..విమర్శకు, ప్రతి విమర్శ..అంతకు మించి కేసులు, నోటీసులు, కారు సీజ్‌తో..పొలిటికల్ హీట్ నెక్స్ట్‌ లెవల్‌కు చేరుకుంది. వైసీపీ అధినేత ఏకంగా కోర్టు మెట్లెక్కారు. అటు జగన్‌ సెక్యూరిటీ, భద్రతకు ఢోకా లేదంటూ..పెద్ద షాకే ఇస్తుంది ప్రభుత్వం. రెంటపాళ్ల ఎపిసోడ్‌ ఎటువైపు టర్న్ తీసుకోబోతోంది? కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది? జగన్‌ను విచారణకు పిలుస్తారా? పోలీసులు వెహికల్‌ సీజ్‌ చేశారంటే..వాట్‌ నెక్స్ట్? అధికారం మారిన వన్‌ ఇయర్‌లోనే ఏపీ పాలిటిక్స్‌ రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. కూటమి వర్సెస్ వైసీపీ పాలిటిక్స్‌లో..ఏదో ఒక టాపిక్‌ హెడ్‌లైన్‌గా ఉంటూనే ఉంది. లేటెస్ట్‌గా గుంటూరు జిల్లా రెంటపాళ్ల జగన్ పర్యటన ఏపీ రాజకీయాల్లో పెను దుమారం లేపింది. టూర్‌కు అనుమతి లేదంటూనే సెక్యూరిటీ విషయంలో సర్కార్ జాగ్రత్తలు తీసుకుంది. అయినా జగన్‌ పర్యటనలో కొందరు ప్లకార్డులు ప్రదర్శించడం..ఆ తర్వాత మాటల యుద్ధం..కార్యకర్త మరణంపై బయటికొచ్చిన వీడియోతో..వారం రోజులుగా రెంటపాళ్ల టూర్‌ చర్చ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ ఇష్యూలో ఇప్పటికే వైసీపీ అధినేత జగన్‌తో పాటు ఆయన డ్రైవర్‌, పలువురు ఫ్యాన్ పార్టీ లీడర్లను నిందితులుగా చేరుస్తూ కేసులు పెట్టారు పోలీసులు. జగన్‌ డ్రైవర్‌ను అరెస్ట్ చేయగా..సింగయ్య మృతి కేసులో ఏ2గా ఉన్న జగన్‌కు నోటీసులు ఇచ్చారు. ఇదే సమయంలో..జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా సింగయ్య మృతి కేసు విచారణలో భాగమంటూ..పోలీసులు వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కేసులు, విచారణలు ఫేస్‌ చేయక తప్పదా..? మరోవైపు రెంటపాళ్ల టూర్‌పై రచ్చ నడుస్తుండగానే జగన్‌పై మరో కేసు నమోదైంది. గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై పోలీసులు కొత్త కేసు పెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉన్నప్పటికీ వైసీపీ నేతలు అనుమతి లేకుండా వచ్చి హడావుడి చేశారనేది ఫిర్యాదు.!. ఇదే సమయంలో..మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే యార్డులో జగన్‌ రాజకీయ ప్రసంగాలు చేశారనేది కూడా అభ్యంతరం ఉంది. ఆ కేసు అలా ఉండగానే సింగయ్య మృతి కేసులో జగన్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలంటూ సూచించారు. అయితే ఈ కేసుపై జగన్‌తో సహా నిందితులుగా ఉన్నవారంతా ఏపీ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్ వేశారు. ఈ పరిస్థితుల్లో న్యాయస్థానం తీర్పు ఎలా ఉండబోతుంది..కేసులు, విచారణలు ఫేస్‌ చేయక తప్పదా..అనేది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు మాజీ సీఎంగా తనకు సరైన భద్రత ఇవ్వడం లేదని జగన్ ఆరోపిస్తున్నారు. దీనిపై ఆయన న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. అయితే జగన్‌ అలిగేషన్స్‌కు కౌంటర్ ఇస్తున్నారు కూటమి నేతలు. రెంటపాళ్ల పర్యటనకు అనుమతి లేకున్నా వందల మంది పోలీసులతో సెక్యూరిటీ కల్పించామని..వైసీపీ క్యాడర్ రెచ్చిపోయినా పోలీసులు సంయమనంతో ఉన్నారని రివర్స్ అటాక్ చేస్తోంది కూటమి సర్కార్.
View More
Local Updates
26 Jun 2025 09:34 AM
2
1
Newsread Image

No.1 Short News

Newsread
సచివాలయంలోని తన చాంబర్ లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి లోకేష్
అమరావతిః కేబినెట్ భేటీ అనంతరం సాయంత్రం సచివాలయం నాలుగో బ్లాక్ లోని తన చాంబర్ కు వచ్చిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. తన కోసం వేచి ఉన్న సామాన్యులను కలిశారు. వివిధ సమస్యలపై తన చాంబర్ కు వచ్చిన దాదాపు 150 మందిని కలుసుకున్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి వినతిని పరిశీలించిన మంత్రి లోకేష్.. త్వరితగతిన సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తానని వారికి హామీ ఇచ్చారు. దీంతో వారంతా ఆనందంగా వెనుదిరిగారు.
View More
Local Updates
24 Jun 2025 23:13 PM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: పార్టీల ప్రతినిధులతో ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి సమావేశం.
ఎన్నికల సంబంధించి దర్శి నియోజకవర్గ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి వారి అధ్యక్షతన 9-6-2025 న ఉదయం 11 గంటలకు దర్శి తహశిల్దార్ వారి కార్యాలయం నందు అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి మరియు దర్శి తాసిల్దార్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కలిగి ఉండాలని తెలిపారు. అలాగే మరణించిన వారిని ఫారం-7 ద్వారా తొలగించాలని,చిరునామా మార్పు అయినవారు వారు ఫారం-8 ద్వారా అప్లై చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధికారులు టి. దేవ ప్రసాద్, అఫ్రోజ్ మరియు వివిధ పార్టీలకు చెందిన నాయకులు ,పుల్లలచెరువు సత్యనారాయణ,మారెళ్ళ వెంకటేశ్వర్లు,టి బాబూరావు, మాడపాకుల శ్రీనివాసరావు, యస్ పౌలేసు, పి చిరంజీవి పాల్గొన్నారు.
View More
Local Updates
22 Jun 2025 07:08 AM
4
1
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
దిగువమెట్ట వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న యువకులను ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముండ్లమూరు మండలం ఈదర గ్రామానికి చెందిన రామాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
View More
Local Updates
13 Jun 2025 21:10 PM
0
1
Newsread image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తాళ్లూరులో వరి పంటల పరిశీలన
తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరం, సోమవరపాడు, దారంవారిపాలెం గ్రామాలలో సోమవారం ఏవో ప్రసాదరావు పర్యటించారు. వర్షానికి తడిసిన వరి ఓదెలను ఆయన పరిశీలించారు. కోసిన వరి పొలాల్లో నీరు నిల్వ ఉంచకుండా బయటకి పంపించాలని రైతులకు సూచించారు. నివేదికను మండల, జిల్లా కార్యాలయాలకు తెలపాలని అన్నారు. అకాల వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
View More
Local Updates
20 May 2025 22:35 PM
0
1
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తాళ్లూరు ఎంపీడీవో సూచనలు
తాళ్లూరులో ఎంపీడీవో దార హనుమంతరావు మంగళవారం సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఉద్యోగులు షుగర్, బీపీ వంటి వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం ఫిజియోథెరపిస్ట్ వెంకటరమణ ఆయా వ్యాధులు రావడానికి గల కారణాలు, వాటి నివారణ చర్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
View More
Local Updates
20 May 2025 22:35 PM
0
1
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
నాపై ఎన్ని దాడులు చేసినా.. నన్నెవరూ ఆపలేరు - డా|| గొట్టిపాటి లక్ష్మి
బుధవారం బొట్లపాలెంలో జరిగిన తిరుణాలలో దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, యువ నాయకులు కడియాల లలిత్ సాగర్ హాజరయ్యారు, ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలపై గొట్టిపాటి లక్ష్మీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈనాటి వరకు ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని, కుల రాజకీయాలు మత రాజకీయాలు వర్గ రాజకీయాలు చేయటానికి రాలేదని, గతంలో ఇదే బొట్లపాలెంలో ఎన్నికలకు ముందు తన మీదకి కర్రలతో కత్తులతో దాడికి వచ్చారని, ఈ సంఘటన తను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. మహిళ అనికూడా చూడకుండా అరాచకంగా ప్రవర్తించారని, అయినా కూడా ఇక్కడున్న మహిళలు పెద్దలు తనతోనే ఉన్నారని, ఎన్ని దాడులు చేసినా ఎన్ని అరాచకాలు సృష్టించిన నన్నెవరూ ఆపలేరు అని నేను అభివృద్ధి కోసం పని చేస్తున్నానని, ఓడినా గెలిచినా దర్శి లోనే ఉంటానని దర్శి ప్రజల కోసమే పని చేస్తున్నాననిని దర్శి అభివృద్ధి కోసమే అడుగులు వేస్తున్నానని అన్నారు.
View More
Local Updates
08 May 2025 09:43 AM
2
1
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
భారత్ మాతా కీ జై అంటూ గర్జించిన దర్శి తహశిల్దార్ శ్రావణ్ కుమార్
దర్శి పట్టణంలోని గడియార స్థంభం వద్ద దర్శి తహశీల్దారు వారి సమక్షములో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిచర్యగా భారత ఆర్మీ జరిపినటువంటి ఆపరేషన్ సిందూర్ చర్యలో పాల్గొన్న సైనికులకు అభినందనలు తెలియజేయ కార్యక్రమము జరిగినది. ఈ కార్యక్రమంలో భారత ఆర్మీ ప్రతి చర్యను ప్రశంసించిన దర్శి తహసీల్దార్ భారత్ మాతా కీ జై అంటూ నిందించి యువతలో ఉత్సాహాన్ని నింపారు.
View More
Local Updates
08 May 2025 03:06 AM
1
1
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
ఆపరేషన్ సింధూర్ ఒక చారిత్రాత్మక ఘట్టం - డా|| గొట్టిపాటి లక్ష్మి
ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వానికి మన కూటమి ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించిందని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ బుధవారం ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. పహల్గాం లో నరమేధానికి ప్రతీకారంగా భారత్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో 9 ఉగ్ర పోస్టులను ధ్వంసం చేయడంపై డాక్టర్ లక్ష్మీ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ వందేమాతరం భారత్ మాతాకు జై అంటూ కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి జేజేలు పలకాలని మన టిడిపి పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆమె వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్ర మూకులను అంతం చేసేందుకు ఈ చర్య తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , యువనేత లోకేష్ బాబు ఇటీవల జరిగిన అమరావతి సభలో కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి మోడీ కి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నేడు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రస్తావరాలను చుట్టుముట్టి ధ్వంసం చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. కులమతాలకు అతీతంగా యావత్ భారతదేశం మోడీ తీసుకునే నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు ప్రకటిద్దాం అన్నారు. భారత సైన్యానికి మనమందరం అండగా ఉందాం. ధైర్యంగా నిలబెడదాం. భారత్ మాతాకీ జై వందేమాతరం.
View More
Local Updates
07 May 2025 17:06 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
న్యూస్ రీడ్: జన్మదిన శుభాకాంక్షలు
దర్శి ప్రజల ఆశా దీపం, ఎందరో యువతులకు ఆదర్శం, కృషి, పట్టుదల, ఆత్మ స్థైర్యం కి మారుపేరు, దర్శి కి మార్గదర్శి, దర్శి నియోజకవక వర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి మాతృమూర్తి కి న్యూస్ రీడ్ యాప్ యాజమాన్యం తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
View More
Local Updates
05 May 2025 12:04 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
మచిలీపట్నంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త ముస్లిం వధూవరుల పరిచయ వేదిక
ఈరోజు మచిలీపట్నం లోని MR ఫంక్షన్ హాల్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త ముస్లిం వధూవరుల పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి మొత్తం 150 మంది కి పైగా వధూవరులు విచ్చేసి వారి ప్రొఫైల్ పరిచయకార్యక్రమంలో పాల్గొన్నారు. MR ఫంక్షన్ హాల్ అధినేత దాదా గారి ఆద్వర్యం లో LED స్క్రీన్స్ మీద వధూవరుల ప్రొఫైల్ ను ప్రదర్శించి ప్రత్యేక ఆకర్షణ తెచ్చారు. ఈ కార్యక్రమం ప్రతి మూడు నెలలకు ఒకసారి చేసే ఆలోచన చేస్తున్నట్లు నిర్వాహకులు దాదా కుమార్తె, అల్లుడు మతీన్ తెలిపారు.
View More
Local Updates
04 May 2025 18:39 PM
6
60
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసినందుకు హర్షం వ్యక్తం చేసిన పలు ప్రజాసంఘాల నాయకులు..
గత 30 సంవత్సరముల సుదీర్ఘ పోరాటం ద్వారా సాధించుకున్న ఏబిసిడి వర్గీకరణ అమలు ను మాదిగ జాతి తో పాటు 58 ఉపకులాలు జాతి ప్రజలు వినియోగించుకోవాలని పలువురు వక్తలు కోరారు. ముందుగా స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణములో గల అంబేద్కర్ విగ్రహం నుండి దర్శి నియోజకవర్గంలోని మాదిగ జాతి ఉద్యోగులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రజా సంఘాలకు చెందిన నాయకులు డప్పు వాయిద్యాలతో ర్యాలీగా బయలుదేరి గడియార స్తంభం వద్ద మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేయటం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు గత 30 సంవత్సరాలలో జరిగినటువంటి సుదీర్ఘ పోరాటంలో ఆటు పోట్లను అనుభవించారని ఎందరో విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేశారని వారి త్యాగాల ఫలితమే నేటి వర్గీకరణ రావడానికి కారణమన్నారు. ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ ఫలాలను మాదిగ జాతి తో పాటు ఉపకులాలలోని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకునే దిశగా ఉండాలని భక్తులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి దర్శి నియోజకవర్గ మాదిగ ఉద్యోగుల సంఘం నాయకులు నేరెళ్ల జాన్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా జాతీయ మాదిగ ఉద్యోగ సంఘం ఉపాధ్యక్షులు బొంత ఏసుదాసు. ప్రకాశం జిల్లా మాదిగ ఉద్యోగ సంఘం నాయకులు తాళ్లూరి ఆల్ఫ్రెడ్. తాళ్లూరి శేషు. నూనె పాల్ గాంధీ. రిటైర్డ్ ఎస్సై దారి వేముల ఎలీషా. కేసనపల్లి కోటేశ్వరరావు. ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుంటు పోలయ మాదిగ. నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవలకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ. మాదిగ విద్యార్థి సంఘ నాయకులు రాచపూడి కరుణానిధి. కంభం పాటి జోసెఫ్ మాదిగ. ఎమ్మార్పీఎస్ నాయకులు రాజపూడి మోషే. గూడూరి నాగమల్లేశ్వరరావు. పలువురు డప్పు కళాకారులు ఎమ్మార్పీఎస్. ఎం ఈ ఎఫ్. పలు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు
View More
Local Updates
26 Apr 2025 22:35 PM
3
1
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తూర్పు గంగవరం సర్పంచికి రూ.5,00,000 అందజేత
తూర్పు గంగవరం సర్పంచ్ నాగమణి భర్త సుధాకర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. టీడీపీ సభ్యత్వం కలిగిన సుధాకర్కు, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ రూ.5,00,000 చెక్ను శుక్రవారం సర్పంచ్ నాగమణికి అందించారు. అలాగే తన పిల్లలకి తోడుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోపిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి (చందన), ఉప సర్పంచ్ యత్తపు కాశిరెడ్డి పాల్గొన్నారు.
View More
Local Updates
25 Apr 2025 11:57 AM
1
1
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తూర్పు గంగవరంలో ముస్లింల ప్రచారం
తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలోని మర్కస్ మసీద్ పరిధిలో ముస్లిం సోదరులు మంగళవారం ప్రచారం చేశారు. ముస్లిం సోదరులందరూ ఏకం కావాలని, వక్స్ చట్ట సవరణకు నిరసనగా దర్శిలో బుధవారం నిర్వహించే ర్యాలీలో ముస్లిం సోదరులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు ఫజల్, అబ్దుల్ కరీం, మదర్ వలి, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
View More
Local Updates
23 Apr 2025 23:21 PM
0
1
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తాళ్లూరు మండలంలో వైన్ షాపులు బంద్
తాళ్లూరు మండలంలో వైన్ షాపులు బుధవారం బంద్ నిర్వహించినట్లు వైన్స్ సిండికేట్ సభ్యులు తెలిపారు. సిండికేట్ సభ్యుల కథనం మేరకు.. ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆయన హత్యకు నిరసనగా మద్యం షాపులు బంద్ చేసినట్లు తెలిపారు. అలానే హంతకులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరారు.
View More
Local Updates
23 Apr 2025 23:20 PM
0
1
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
బొద్దికూరపాడు విద్యార్థికి 570 మార్కులు
తాళ్లూరు మండలం బొద్దికూరపాడు జిల్లా ఉన్నత పాఠశాల విద్యార్థి విష్ణువర్ధన్ రెడ్డి 10వ తరగతి ఫలితాల్లో సత్తా చాటాడు. 600కు గాను 570 మార్కులు సాధించి ప్రభుత్వ స్కూళ్ల మండల టాపర్గా నిలిచాడు. టీచర్లు అతడిని అభినందించారు.
View More
Local Updates
23 Apr 2025 23:20 PM
0
1
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
వీరయ్య చౌదరి ఒంటిపై 53 కత్తిపోట్లు: CM
వీరయ్య చౌదరి లాంటి నేతను కోల్పోవడం చాలా బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. అమ్మనబ్రోలులో ఆయన మాట్లాడుతూ.. 'నారా లోకేశ్, అమరావతి రైతుల పాదయాత్రలో వీరయ్య కీలకంగా ఉన్నారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నా. వీరయ్య ఒంటిపై 53 కత్తిపోట్లు ఉన్నాయి. ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టను. ఎక్కడ దాక్కున్నా లాక్కొని వస్తా' అని సీఎం హెచ్చరించారు.
View More
Local Updates
23 Apr 2025 23:20 PM
0
1
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తాళ్లూరు: 'నీటితొట్టెలను వేగంగా పూర్తి చేయాలి'
తాళ్లూరు మండలంలోని పలు గ్రామాల్లో నిర్మిస్తున్న నీటితొట్టెలను APD లలిత కుమారి పరిశీలించారు. 16 పంచాయతీల్లో 6 నీటితొట్టెలు పూర్తి చేయగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నట్లు తెలిపారు. వీటిని వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో FAS, TAS, BFT, ECలు పాల్గొన్నారు.
View More
Local Updates
23 Apr 2025 23:20 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
వక్ఫ్ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిన దర్శి.
ప్రకాశం జిల్లా దర్శిలో ముస్లింలు కొత్తగా అమల్లోకి వచ్చిన వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలంలోని ముస్లింలు ప్రవాహంగా మారి దర్శిని జనసముద్రంగా మార్చారు. వక్ఫ్ వ్యతిరేక నినాదాలతో దర్శి దద్దరిల్లింది. పార్టీలకు అతీతంగా వారి ఉనికి కోసం ముస్లింలు చేస్తున్న ఈ ర్యాలీ తో దర్శి గడియారం స్తంభం గడగడలాడిపోయింది. గంగవరం రోడ్డులోని మర్కస్ మస్జిద్ నుండి గడియార స్తంభం మీదుగా కురిచేడు రోడ్ లోని అక్సా మజీద్ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో ముస్లిం మహిళలు సోదరులు ప్లకార్డులతో నల్లజెండాలతో నల్ల రిబ్బన్లతో ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని దీనిని మేమంతా వ్యతిరేకిస్తున్నామని శాంతియుతంగా నిరసన తెలుపుతూ 150 అడుగుల జాతీయ జెండాతో భారతదేశం జిందాబాద్ భారతీయులంతా ఒక్కటే హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ భారతదేశంపై తమకున్న ప్రేమను జాతీయ జెండాలతో ప్రదర్శించి నిరూపించుకున్నారు. దేశవ్యాప్తంగా ముస్లింల ఆస్తులపై తీసుకువచ్చిన ఈ చట్టం ద్వారా తమ ధర్మ సంబంధమైన మస్జిదులు మదర్సాలు, తమ స్మశానాలు స్థలాలని కోల్పోయే ప్రమాదం ఉందని, రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను మతానికి సంబంధించిన ప్రాథమిక హక్కులను వ్యతిరేకించే ఈ చట్టం రద్దు చేసేంతవరకు దేశవ్యాప్తంగా శాంతియుత పోరాటాలు చేస్తూనే ఉంటామని నినాదాలు చేశారు.
View More
Local Updates
23 Apr 2025 21:18 PM
1
1
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
రెడ్ కలర్ బైక్ ను దొంగతనం చేశారు..
హయి ఫ్రెండ్స్... నా పేరు ఉదయ్ కుమార్... వీడియోగ్రాఫర్ 2... 16 ໖໖ 2025 ໖ 09:45 10:45 సమయం లో ఒంగోలు లోని కర్నూల్ రోడ్డు నందు గల కూరపాటి కాంప్లెక్స్ ముందు పార్క్ చేసిన నా బైక్ AP 39SC 4664 నెంబర్ గల పాల్సార్ 125cc రెడ్ కలర్ బైక్ ను దొంగతనం చేశారు... రెడ్ అండ్ బ్లాక్ కలర్ సిట్... హెడ్ లైట్ మీద UKCaptures అని మరియు లోగో.... బ్యాక్ సిట్ సైడ్ డోము ల మీద UKCaptures అని స్టిక్కర్లు వుంటాయి ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ ఎవరైనా చూస్తే దయచేసి నాకూ తెలియ చేయమని కోరుతున్నారు మీ ఉదయ్ కుమార్ 9652020050 ఒంగోలు
View More
Local Updates
22 Apr 2025 20:29 PM
0
2
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
అమెరికాలో కుంద్రురు యువకుడు మృతి
ఉమ్మడి ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలోని కుందుర్రుకి చెందిన బోడేపూడి రాజబాబు కుమారుడు అవినాశ్ అమెరికాలో మృతి చెందాడు. ఏప్రిల్ 13న అమెరికాలో బ్రెయిన్ స్ట్రోక్తో అవినాశ్ మరణించాడు. ప్రస్తుతం వారి కుటుంబం గుంటూరులో ఉంటుండగా.. శనివారం మృతదేహాన్ని అమెరికా నుంచి తీసుకువచ్చి గుంటూరులోనే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కాగా అవినాశ్కు నెల క్రితమే వివాహమైంది.
View More
Local Updates
21 Apr 2025 17:02 PM
0
1
Newsread Image

No.1 Short News

DR Local News - Chirala
మే 4 వా తేదీన ఉచిత నాయి బ్రాహ్మణ వివాహ వేదిక
నాయి బ్రాహ్మణ వివాహ వేదికను వినియోగించుకోండి ఒంగోలులో పద్మావతి ఫంక్షన్ హాల్ లో మే 4వ తారీకు ఆదివారం జరుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ ఉద్యోగుల ,సాంస్కృతిక ,సంక్షేమ సంఘం ఒంగోలు వారిచే 5 ఉచిత వివాహ పరిచయ వేదికను వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన డాక్టర్ హైమ సుబ్బారావు మరియు డాక్టర్ తాడివలస దేవరాజు. చీరాల హైమ హాస్పిటల్ ఆవరణలో ఉచిత వివాహ వేదిక కరపత్రాన్ని ప్రారంభించిన డాక్టర్ హైమ సుబ్బారావు మరియు డాక్టర్ తాడివలస దేవరాజు ఈ సందర్భంగా డాక్టర్ సుబ్బారావు డాక్టర్ దేవరాజు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా మూడు వేల మందికి పైగా ఉచితంగా వివాహ వేదిక ద్వారా వివాహాలు చేసినటువంటి వివాహ పరిచయ వేదిక నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ వధూవరుల కోసం ఎదురుచూస్తున్నటువంటి తల్లిదండ్రులు మరియు వాళ్ళ పిల్లలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కన్వీనర్ నాదెండ్ల రాఘవ మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాల నుండి గత ఐదు సంవత్సరాలుగా ఎంతోమంది ఈ వివాహ వేదిక కార్యక్రమంలో పాల్గొంటున్నారని , నాయి బ్రాహ్మణ తల్లిదండ్రులకు వధూవరుల పరిచయం మాది, నిర్ణయం మీది అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉచిత వివాహ వేదిక కన్వీనర్ నాదెండ్ల రాఘవ, పోతకమూరి మధుబాబు, మార్కాపూరాం వెంకట రామారావు పాల్గొన్నారు.
View More
Local Updates
20 Apr 2025 17:14 PM
2
1
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తాళ్లూరు రానున్న సినీనటి హెబ్బా పటేల్
తాళ్లూరు మండలం గుంటి గంగమ్మ జాతర తిరునాళ్ల సోమవారం జరగనుంది. ఈ వేడుకలకు తాను హాజరు అవుతున్నట్లు సినీ నటి హెబ్బా పటేల్ తెలిపారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు.
View More
Local Updates
14 Apr 2025 14:57 PM
2
1
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
గుంటి గంగమ్మకు బూచేపల్లి ప్రత్యేక పూజలు
తూర్పు గంగవరం సోమవరపాడు పరిధిలోని గుంటి గంగమ్మ గుడిలో సోమవారం ఉదయం ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి టెంకాయలు కొట్టి ప్రసాదాలు స్వీకరించారు. కార్య క్రమంలో EX ఎంపీపీ పోశం సుధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తూము వెంకట సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
View More
Local Updates
14 Apr 2025 14:57 PM
0
1
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
దొనకొండ: నీటి కుంటలో పడి బాలుడి మృతి
దొనకొండ మండలం గుట్టపల్లికి చెందిన తరుణ్ (13) బాలుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు... బాలుడు తండ్రితో పాటు గొర్రెలు మేపడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో జారిపడి మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
View More
Local Updates
07 Apr 2025 12:06 PM
0
1
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తాళ్లూరులో ఇళ్లను పరిశీలించిన DHH
గత ప్రభుత్వంలో నిర్మాణ దిశలో ఆగిపోయిన ఇళ్లను గురువారం జిల్లా హౌసింగ్ హెడ్ శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణాలకు SC, BC సామాజిక వర్గాలకు రూ.50వేలు, ST సామాజిక వర్గానికి రూ.75వేలు ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. జూన్ 1లోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.
View More
Local Updates
04 Apr 2025 11:23 AM
0
1
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
ముండ్లమూరులో పేకాట రాయులు అరెస్ట్
ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు గ్రామంలో పేకాట ఆడుతున్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో ముండ్లమూరు పోలీసులు గురువారం ఆ ప్రాంతంలో దాడులు నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకొన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ.3వేలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. గ్రామాలలో ఎవరైనా పేకాట, కోడిపందాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
View More
Local Updates
04 Apr 2025 11:23 AM
0
1
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తాళ్లూరులో రీ సర్వే అవగాహన ర్యాలీ
తాళ్లూరు మండలంలోని విఠలాపురం, బెల్లంకొండ వారి పాలెం గ్రామాలలో రీ సర్వే అవగాహన ర్యాలీ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పొలం కలిగిన ప్రతి రైతు సహకరించాలని తహశీల్దార్ సంజీవరావు కోరారు. అలాగే భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో రీ సర్వే డీటీ ప్రశాంత్, మండల సర్వేర్ అధికారులు పాల్గొన్నారు.
View More
Local Updates
04 Apr 2025 11:22 AM
0
1
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
చీమకుర్తి : ముగ్గురి మృతికి కారణమైన వ్యక్తికి జైలు
చీమకుర్తి - గంగవరం రోడ్డు రచ్చమిట్ట సెంటర్ వద్ద 2019లో లారీ ఢీ కొని బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు మృతిచెందారు. దీనిపై అప్పట్లో కేసు నమోదైంది. నిర్లక్ష్యంగా లారీ నడిపి ముగ్గురి మృతికి కారణమయ్యాడని నేర నిరూపణైంది. దీంతో ఎక్సైజ్ కోర్ట్ జడ్జి కోమలవల్లి నిందితుడికి 2 ఏళ్ల 3 నెలలు జైలు శిక్ష, రూ. 5,500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
View More
Local Updates
04 Apr 2025 11:22 AM
0
1
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
ఒంగోలులో జాతీయ ఆరోగ్య పథకాలపై సమీక్ష
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఆరోగ్య కార్యకర్త గర్భిణులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి వారికి సకాలంలో వైద్య సేవలను అందించాలని తెలిపారు. పుట్టిన ప్రతి బిడ్డకు నిర్దేశించిన అన్ని టీకాలను సకాలంలో వేయాలని సూచించారు. వేసవిలో వడదెబ్బ నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
View More
Local Updates
04 Apr 2025 11:21 AM
0
1
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తాళ్లూరు మండలం లో కొర్రపాటి వారి పాలెం గ్రామం లో TDP వార్డ్ మెంబర్ రాజీనామా
ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం కొర్రపటివారిపాలెం పంచాయితీ కి చెందిన TDP 1 వార్డు మెంబర్ వెంకట్రావు వార్డ్ మెంబర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తాళ్ళూరు మండల ఎంపీడీవో కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. గ్రామ సర్పంచ్, ఏకపక్ష నిర్ణయాల వల్ల గ్రామం లో ఎలాంటి అభివృద్ధి చేయలేక పోతున్నామని, తమకు ప్రాధాన్యత లేనందువల్ల, ప్రజలకు న్యాయం చేయలేక పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
View More
Local Updates
03 Apr 2025 20:45 PM
0
1
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తాళ్లూరు మండల ఆఫీసును విజిట్ చేసిన DHH
తాళ్లూరు మండలంలో గురువారం DHH శ్రీనివాస ప్రసాద్ విజిట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వివిధ దశలో ఉన్న హౌసింగ్ అదనపు సాయం గురించి చర్చించారు. అలాగే గ్రామంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జడ్పీటీసీ మార వెంకారెడ్డి పాల్గొన్నారు.
View More
Local Updates
03 Apr 2025 17:54 PM
0
1
View Latest Short News
😔
Oops! You're offline.
It looks like you've lost your internet connection.
Please check your network and try again.

Find News

News Categories

  • All Categories
  • Jobs (7)
  • Latest News (706)
  • Motivation (10)
  • Crime News (20)
  • Local Ads (37)
  • Entertainment (15)
  • Local Updates (194)
  • Sports News (12)
  • Education (10)
  • Business Promotions (1)
  • Politics (64)
  • Breaking News (96)
  • Install App
    ALL
    | newsread.in

    Newsread
    For better experience and daily news update.
    Download our app from play store.