

No.1 Short News
Newsreadఏలూరు RTC బస్టాండ్లో కనీస సదుపాయాల లేమి – ప్రయాణికుల ఆగ్రహం
ఏలూరు: నగరంలోని ఆర్టీసీ ప్రధాన బస్టాండ్లో టాయిలెట్ సదుపాయాల వద్ద కనీస సదుపాయాల లేమి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. శుభ్రత సరిగా లేకపోవడంతో పాటు, రాత్రివేళల్లో విద్యుత్ లేకపోవడం ప్రయాణికుల అసౌకర్యానికి కారణమవుతోంది.
ప్రయాణికులు వాడే టాయిలెట్లలో కనీసంగా కరెంట్ లైట్లు కూడా లేకపోవడం గమనార్హం. దీనిపై పలువురు ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంత తక్కువ సదుపాయాలతో ఉన్నా, టాయిలెట్ వాడకానికి డబ్బులు వసూలు చేయడం అసంబద్ధమని విమర్శిస్తున్నారు.
దూర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు, వృద్ధులు రాత్రివేళ టాయిలెట్ల వద్ద కరెంట్ లేకపోవడంతో భయంతో వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు.
ప్రయాణికులు కోరుతున్నారంటే కనీసం శుభ్రత, కరెంట్ లైట్లు, మరియు బేసిక్ సదుపాయాలను బస్టాండ్ యాజమాన్యం కల్పించాలనీ, లేకపోతే అధికారులతో ఫిర్యాదు చేస్తామంటున్నారు.