

No.1 Short News
Sk.Asma Reporter 9948680044AP Inter Students: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పరీక్ష ఫీజు చెల్లింపు గడువు..
ఏపీలో ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇంటర్ బోర్డు వారికి ఊరటనిచ్చే వార్త చెప్పింది. ఇంటర్మీడియట్ 2025 పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. వాస్తవానికి పరీక్షల ఫీజు చెల్లింపు గడువు నేటితో ముగిసింది. అయితే గడువును ఈ నెల 22వ తేదీ వరకు పొడిగిస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
జనరల్, వొకేషనల్ కోర్సులు చదివే ఇంటర్ ఫస్టియర్, సెకండియర్, రెగులర్, ప్రైవేట్ అభ్యర్థులు.. గడువులోగా ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు సూచించింది. థియరీ పేపర్లకు రూ.600, ప్రాక్టికల్స్కు రూ.275, బ్రిడ్జికోర్సు సబ్జెక్టుకు రూ.165 చొప్పున చెల్లించాలి. కాగా వెయ్యి రూపాయల అదనపు రుసుముతో ఈ నెల 30వ తేదీ వరకు ఫీజు చెల్లించొచ్చు. ఇదే చివరి అవకాశం అని, మరోసారి పొడిగింపు ఉండదని ఇంటర్ బోర్డు కార్యదర్శి తేల్చి చెప్పారు.
Education
10 Oct 2025 22:11 PM