No.1 Short News

Newsread
విమాన ప్రమాదంలో కుటుంబానికి రూ.319 కోట్ల పరిహారం
విమాన ప్రమాదంలో మరణించిన ఓ భారత మహిళా శిఖా గార్గ్(32) కుటుంబానికి రూ.319 కోట్ల పరిహారం అందించనున్నారు. 2019లో మార్చి 10వ తేదీన ఇథియోపియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ET302 (బోయింగ్ 737MAX) విమానం కూలిన ఘటనలో 157 మంది దుర్మరణం చెందారు. అందులో భారత్‌కు చెందిన శిఖా గార్గ్ కూడా ఉన్నారు.ఈ ప్రమాదానికి గానూ ఆమె కుటుంబానికి 35.8 మిలియన్ డాలర్లు పరిహారం చెల్లించాలని విమాన సంస్థని అమెరికా లోని షికాగో ఫెడరల్ కోర్టు నవంబర్ 12వ తేదీ 2025న ఆదేశించింది. శిఖా గార్గ్ UNOలో కన్సల్టెంట్ గా పనిచేస్తూ నైరోభిలో జరగబోయే UNO సమావేశాలకు వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. బోయింగ్ కంపెనీ శిఖా గార్గ్ కుటుంబానికి సుమారు 28.45 మిలియన్ డాలర్ల (సుమారు 240 కోట్లు ) చెల్లించాలి ఇందులో ఆమె చనిపోయే ముందు అనుభవించిన బాధకు 10 మిలియన్ డాలర్లు, ఆమె కుటుంబం అనుభవించిన దుఃఖానికి 10 మిలియన్ డాలర్లు. వీటితోపాటు అదనంగా ఆమె భర్త సౌమ్య భట్టాచార్యకు 3.45 మిలియన్ డాలార్లు, వీటికి వడ్డీ 26%తో కలిపి 35.8 మిలియన్ డాలర్లు (సుమారు 300 నుంచి 319 కోట్లు ) చెల్లించనున్నారు.
15 Nov 2025 16:29 PM
1
1

Newsread
For better experience and daily news update.
Download our app from play store.