No.1 Short News

Newsread
ఈరోజు ప్రతి రైతు ఇంట్లో పండుగ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
కురిచేడు మండలం, పొట్లపాడు గ్రామంలో బుధవారం అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం రెండో విడత నిధులు రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసే కార్యక్రమాన్ని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ప్రారంభించారు. వారితో పాటూ టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు, అగ్రికల్చర్ రెవిన్యూ, ఎంపీడీఓ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం మాట నిలుపుకొని రైతును నిలబెట్టే ప్రభుత్వం అని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రెండవ విడత క్రమం తప్పకుండా రైతులు ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 5,000, పీఎం కిసాన్ కింద గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఇచ్చే రూ. 2,000 కలిపి 7,000 రూపాయలు అర్హులైన ప్రతి రైతుకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ వ్యవసాయ శాఖ మాత్యులు కే అచ్చం నాయుడు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న దృఢ సంకల్పంతో నేడు ఈ పథకాన్ని రైతులకు అంకితం చేయడం జరుగుతుందన్నారు. ఆనాడు తొలివిడత నిధులు మన దర్శి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆనాడు కొందరు వైసీపీ నేతలు హేళన చేశారు ఇప్పుడు ఏం మాట్లాడతారు మాట నిలుపుకోవడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి రుజువైంది. ప్రజల సంక్షేమం అభివృద్ధి ద్వేయంగా మన ప్రభుత్వం 18 నెలల కూటమి పాలన సాగుతుందన్నారు. ఇటీవల కురిచిన తుఫాను తాకిడి పంట నష్టాలు అంచనా వేయడం జరిగిందని రైతులకు నష్టపరిహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది అన్నారు.
Latest News
19 Nov 2025 21:18 PM
1
1

Newsread
For better experience and daily news update.
Download our app from play store.