

No.1 Short News
Newsreadప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దు: గొట్టిపాటి లక్ష్మి
దొనకొండ ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ప్రజల వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ—ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలను ప్రత్యక్షంగా పరిష్కరిస్తున్న తీరు అందరికీ ఆదర్శమని అన్నారు. అదే స్ఫూర్తితో దర్శి నియోజకవర్గంలో కూడా అధికారులు అప్రమత్తంగా, జవాబుదారీతనంతో పనిచేయాలని కోరారు. చిన్న చిన్న సమస్యల కోసం ప్రజలను కార్యాలయాలు చుట్టూ తిరగనీయవద్దని, ముఖ్యంగా రెవిన్యూ, భూముల ఆన్లైన్ ఎంట్రీలు, పట్టాదారు పాసుపుస్తకాలు, భూ వివాదాలు వంటి అంశాల్లో వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
అంతేకాక విద్యుత్, పెన్షన్లు, రోడ్లు, డ్రైన్లు, పోలీస్ కేసులు వంటి సమస్యలకు కూడా త్వరితగతిన స్పందించాలని అన్నారు. వచ్చే ప్రజా వేదిక నాటికి అందిన అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేలా కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానికంగా సాధ్యం కాని సమస్యలు తన ద్వారా జిల్లా కలెక్టర్కు చేరవేస్తానని హామీ ఇచ్చారు.
దొనకొండలో ఉపాధి అవకాశాలు పెంచి వలసలు తగ్గించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, సోలార్ పార్క్, ఆయుధ తయారీ కేంద్రం వంటి పరిశ్రమలతో ఈ ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు.
కార్యక్రమంలో మండలంలోని అన్ని శాఖల అధికారులు, టిడిపి సీనియర్ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్–యూనిట్–బూత్ ఇంచార్జిలు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
Latest News
21 Nov 2025 14:48 PM