

No.1 Short News
Newsreadదొనకొండను మార్కాపురం జిల్లా లో కలపాలని డిమాండ్
దర్శి నియోజకవర్గంలోని దొనకొండను కొత్తగా ఏర్పడుతున్న మార్కాపురం జిల్లాలో కలపాలని డిబిహెచ్పిఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గొట్టిముక్కల సుజాత డిమాండ్ చేశారు.
ప్రస్తుతం ఏ పనికైనా ఒంగోలుకు 90 కిమీ ప్రయాణం చేయాల్సి వస్తోందని, మార్కాపురం 30 కిమీ దూరంలో ఉండడంతో ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. బస్సు సౌకర్యం లేమితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
దొనకొండ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చర్యలు తీసుకోవాలని, లేకపోతే నిరసనలకు దిగుతామని సుజాత హెచ్చరించారు.
Latest News
02 Dec 2025 16:32 PM