

No.1 Short News
Newsreadరాజమండ్రిలో హోమియోపతి వైద్యుడికి ఘన సన్మానం
రాజమండ్రి (దివాన్ చెరువు):
హోమియోపతి వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న ప్రముఖ వైద్యుడు డాక్టర్ మొహమ్మద్ జిలానిను ఒక హిందూ సోదరుడు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది.
డాక్టర్ జిలాని గారు అనేక సంవత్సరాలుగా వైద్యాన్ని వృత్తిగా కాకుండా సేవగా భావిస్తూ, కులమత భేదాలు లేకుండా ప్రజలకు చికిత్స అందిస్తున్నారు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ గ్రామంకు చెందిన ఓ వ్యక్తి, కుటుంబ కలహాల నేపథ్యంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, అతడిని రాజమండ్రికి తరలించి డాక్టర్ జిలాని గారి వద్ద చికిత్స అందించగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన ఆయన వైద్య ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.
ఇదే కాకుండా, తీవ్ర అనారోగ్యంతో ఉన్న తన అల్లుడినే స్వయంగా చికిత్స చేసి బ్రతికించిన ఘటన కూడా ఆయన సేవాభావాన్ని చాటుతోంది.
ఈ సందర్భంగా డాక్టర్ జిలాని గారి మనవడు, సామాజిక కార్యకర్త సయ్యద్ సలీం మాట్లాడుతూ,
“మా తాతయ్య గారు వైద్యాన్ని జీవిత ధర్మంగా భావించి సేవ చేశారు. ఆయనకు లభించిన ఈ గౌరవం సమాజానికి గర్వకారణం” అని తెలిపారు.