

No.1 Short News
Newsreadమాజీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన గులాం రసూల్
ఈ రోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, తెనాలి–పత్తిపాడు నియోజకవర్గ పరిశీలకులు గులాం రసూల్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ పరిస్థితులు, పార్టీ బలపరిచే కార్యక్రమాలు, శ్రేణుల సమస్యలు, కార్యకర్తల ఉత్సాహాన్ని పెంచే చర్యలు వంటి కీలక అంశాలపై గులాం రసూల్ జగన్తో మాట్లాడారు.
పార్టీ బలోపేతానికి తాను మరింత కృషి చేస్తానని గులాం రసూల్ హామీ ఇచ్చారు.
పారదర్శక రాజకీయాలు, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగాలి అన్న ముఖ్య సందేశాన్ని వైయస్ జగన్మోహన్ రెడ్డి అందించినట్లు సమాచారం.