

No.1 Short News
Newsreadచాకచక్యంగా దొంగతనం కేసు ఛేదన – నిందితుల అరెస్ట్, భారీ రికవరీ
ఒంగోలు పట్టణంలోని బృందావనం కళ్యాణ మండపంలో జరిగిన దొంగతనం కేసును ప్రకాశం జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా స్వల్ప వ్యవధిలో ఛేదించారు. ఈ కేసులో సుమారు రూ.20.20 లక్షల విలువైన బంగారు నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు.
2025 నవంబర్ 27న పెళ్లి వేడుకల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు 158 గ్రాముల బంగారు నగలు, నగదుతో ఉన్న బ్యాగ్ను దొంగిలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది.
ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, తాలూకా సీఐ టి. విజయ కృష్ణ నేతృత్వంలో పోలీసులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్ఘర్ జిల్లా సాన్సి నివాసి గ్రామానికి వెళ్లి ఇద్దరు నిందితులు మరియు ఇద్దరు బాల నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బంగారు నగలు, రూ.1.25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు.
Latest News
17 Dec 2025 17:18 PM