

No.1 Short News
Newsreadపోలియో రహిత భవిష్యత్తే లక్ష్యం – జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు
ఈ రోజు ఉదయం పొన్నలూరు మండలం, పొన్నలూరు గ్రామంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజా బాబు పోలియో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతిసారి రెండు చుక్కలు వేయడం ద్వారా పిల్లల ఆరోగ్యానికి సంపూర్ణ రక్షణ లభిస్తుందన్నారు. డిసెంబర్ 21, 2025 నుంచి పోలియో కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. 0–5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.