No.1 Short News

Newsread
ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షూబ్లిని సత్కరించిన సయ్యద్ మెహతాజ్ బేగం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా నియమితులైన జనాబ్ ఫారూక్ షూబ్లి గారిని టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి సయ్యద్ మెహతాజ్ బేగం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఉర్దూ భాషాభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. ఉర్దూ భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణలో ఆయన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో ఉర్దూ భాషకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Latest News
20 Dec 2025 21:11 PM
1
1

Newsread
For better experience and daily news update.
Download our app from play store.