

No.1 Short News
Newsreadపదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు.
పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు. గత ఏడాది 81.1 శాతంగా ఉన్న ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది 85.25 శాతానికి పెరిగింది. బాలుర కంటే బాలికల ఉత్తీర్ణతా శాతం 5.22 శాతం ఎక్కువగా ఉండటం సంతోషకరం. ముఖ్యంగా ప్రభుత్వ బడులలో గత ఏడాది 72.8 శాతంగా ఉన్న ఉత్తీర్ణత ఈ సంవత్సరం 78.39 శాతానికి పెరగడం స్ఫూర్తిదాయకం. విద్యాశాఖ రూపొందించిన 100 రోజుల ప్రణాళికతో ఉత్తమ ఫలితాలను సాధించడం ప్రశంసనీయం. ఇందుకు ఐటి, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ తో సహా ఆ శాఖ అధికారులను, టీచర్లను, సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నాను. పిల్లల్లో నైతిక విలువల పెంపుతో పాటు సమగ్ర విద్యా వికాసానికి విద్యా శాఖ చేస్తున్న కృషిని మరింత ముందుకు తీసుకువెళ్లాలని కోరుతున్నాను.
డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ,
టిడిపి ఇంచార్జ్,
దర్శి నియోజకవర్గం.