No.1 Short News

P.Prakash
అవనిగడ్డ:
అంబేద్కర్ రాజ్యాంగానికి సమున్నత స్థాయి ఉందని టీడీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం అవనిగడ్డలోని టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విభిన్న మతాలు, విలక్షణ ప్రాంతాలకు నిలయమైన భారతదేశానికి ఉత్తమ రాజ్యాంగాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందించారని తెలిపారు. కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షులు దాసినేని శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు కర్రా సుధాకర్,మేడికొండ విజయ్, డేగల రాఘవ, లుక్కా పిచ్చియ్య, కొల్లూరి ఇమ్మానియేల్, మండలి రామ్మోహనరావు, ఘంటసాల రాజమోహనరావు (కన్నయ్య) గుంటూరు వినయ్, మొగల్ మురాద్ బేగ్, మెగావత్ గోపీ, కంచర్ల ఆనంద్ పాల్గొన్నారు.
Local Updates
28 Jan 2025 08:52 AM
0
24