TG: పాశమైలారం పరిశ్రమలో రియాక్టర్ పేలుడుకు సంబంధించి ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు దర్శనమిచ్చాయి. పేలుడు ధాటికి కార్మికులు ఎగిరిపడినట్లు తెలుస్తోంది. వారి మృతదేహాలు పరిసర ప్రాంతాల్లో గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి. ఇప్పటికే 40 మందికి పైగా మరణించారని అధికారులు చెబుతున్నా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. అటు పటాన్చెరు ఆసుపత్రిలోని మార్చురీలో మృతదేహాల వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి.