పేదల గృహప్రవేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గం, దేవగుడిపల్లెలో పేదల గృహ ప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ముందుగా లబ్ధిదారు హేమలత కుటుంబంతో కలిసి గృహ ప్రవేశం చేశారు. అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గృహ ప్రవేశం సందర్భంగా హేమలత, ఆమె భర్త ఈశ్వర్కు నూతన వస్త్రాలు బహుకరించారు. మరో లబ్ధిదారు షేక్ ముంతాజ్ బేగం నివాసానికి సీఎం వెళ్లారు. గృహప్రవేశం అనంతరం నమాజ్లో పాల్గొన్నారు. ముంతాజ్ బేగం కుటుంబ సభ్యులకు కూడా సీఎం నూతన వస్త్రాలు అందించారు.