ఏపీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు సంబంధించిన సందడి మొదలైంది. నవంబర్ 15వ తేదీలోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురణ, ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాల్సి ఉందని ఇటీవల SEC తెలిపారు. నవంబర్ 30 లోగా పోలింగ్ కేంద్రాల ఖరారు, ఈవీఎంల సన్నాహాలు పూర్తి చేసి, డిసెంబర్ 15లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని SEC యోచన చేస్తోంది. 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి, అదే నెలలో ఫలితాలు ప్రకటించేందుకు SEC ప్రణాళిక సిద్ధం చేసిందని సమాచారం.