ఈరోజు భారతీయ జనతా పార్టీ బీహార్లో ఘన విజయం సాధించిన సందర్భంగా దర్శి పట్టణం స్థానిక బిజెపి నాయకులు బాణసంచాలు పేల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బిజెపి నాయకులు ఏపీ రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ మాడపాకుల శ్రీనివాసులు మాట్లాడుతూ ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో బీహార్లో సునామి సృష్టించారని రాబోవు స్థానిక ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో గాని భారతీయ జనతా పార్టీ హవా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు తిండి నారాయణ రెడ్డి, మండల అధ్యక్షుడు కాకర్లనాగసాయి, జిల్లా కార్యవర్గ సభ్యుడు అచ్యుత గురువర్ధన్ రావు, పట్టణ అధ్యక్షులు వల్లభ వరపు అమరేశ్వర రావు అచ్యుత్ శరత్ బచ్చు అనిల్ యువమోర్చా నాయకులు అనిల్, జనసేన నాయకులు పాపారావు, శివ కోటా చారి కార్యకర్తలు పాల్గొన్నారు.