దర్శి లో రెండేళ్ల బిడ్డతో ఒక మహిళ కురిచేడు రోడ్డులోని సాగర్ కెనాల్ లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.అయితే అటుగా వెళ్తున్న ఎస్సై మురళి గమనించి స్థానికుల సహాయంతో సాగర్ కాలువలో కొట్టుకుపోతున్న తల్లి బిడ్డను బయటకు తీసి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బిడ్డ పరిస్థితి విషమం గా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. సకాలం లో స్పందించి ఎసై తల్లిబిడ్డను కాపాడారు. ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన మహిళను పోలీసులు విచారిస్తున్నారు..