ఆంధ్రప్రదేశ్లోని పదో తరగతి విద్యార్థులకు ముఖ్య గమనిక. ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. పదవ తరగతి పరీక్షల టైమ్టేబుల్ను ఎస్ఎస్సీ బోర్డు శుక్రవారం రోజున విడుదల చేసింది. మార్చి 16వ తేదీ నుంచి ఏపీలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి16న ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష ఉంటుంది, మార్చి 18న సెకెండ్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహిస్తారు, మార్చి 20న ఆంగ్లం, 23న గణితం, మార్చి 25న భౌతిక శాస్త్రం (ఫిజికల్ సైన్స్), మార్చి28న జీవశాస్త్రం ( బయలాజికల్ సైన్స్), మార్చి 30న సాంఘికశాస్త్రం (సోషల్ స్టడీస్) పరీక్షలు నిర్వహించనున్నారు.
మరోవైపు మార్చి 31న కాంపోజిట్ కోర్సులకు ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్-2) పరీక్ష ఉంటుంది. అలాగే ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -1 పరీక్ష నిర్వహిస్తారు. ఇక ఏప్రిల్ 1న ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్సులు చదివే విద్యార్థులకు ఏప్రిల్ ఒకటో తేదీన థియరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక వంద మార్కులకు నిర్వహించే పరీక్షలను ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకూ నిర్వహిస్తారు. 50 మార్కులకు నిర్వహించే పరీక్షలు (సైన్స్, సోషల్) ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి11 గంటల 30 నిమిషాల వరకూ నిర్వహిస్తారు. ఈ మేరకు ఎస్ఎస్సీ బోర్డు ప్రకటన విడుదల చేసింది.