ప్రజల కోసం పోరాడే నాయకత్వం. డా||లక్ష్మీ పట్టుదలకి ప్రభుత్వ స్పందన
దర్శి నియోజకవర్గంలో ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి అనేది డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ లక్ష్యం. ప్రజల సమస్యలను తమ సమస్యగా తీసుకుని పని చేసే అసలైన నాయకత్వం మళ్లీ నిరూపించారు.
ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రహదారి సమస్యలకు చివరకు శాశ్వత పరిష్కారం వచ్చింది. గ్రామాల మధ్య రోడ్లు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన డాక్టర్ లక్ష్మీ —ఈ సమస్యను నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వివరించారు.
పల్లె పండుగ 2.0 లో భాగంగా ప్రభుత్వం వెంటనే స్పందించి 10.17 కోట్ల రూపాయలతో 20.92 KM రోడ్లు దర్శికి మంజూరు చేసింది.
ఆమోదం పొందిన ప్రధాన రహదారులు: 1️⃣ మారెళ్ల – నూజళ్లపల్లి – బట్లపల్లి : ₹4.14 కోట్లు
2️⃣ పెద్ద ఉల్లగల్లు – సింగన్నపాలెం : ₹4.05 కోట్లు
3️⃣ దొనకొండ – గజ్జలకొండ వయా ఇండ్లచెరువు : ₹1.98 కోట్లు
ఈ రోడ్లు పూర్తయితే దర్శి ప్రజలకు ప్రయాణం సులభమవుతుంది, కనెక్టివిటీ పెరుగుతుంది, రైతులు–విద్యార్థులు–రోగులు ఇక మట్టిబాటల ఇబ్బందులు పడాల్సిన పని ఉండదు. దర్శి అభివృద్ధిలో ఇది ఒక పెద్ద ముందడుగు.