దర్శి టౌన్లో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు సిఐ వై. రామారావు, ఎస్ఐ మురళి మరియు రోడ్ సేఫ్టీ వారియర్స్ కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పొదిలి రోడ్డులోని షాపుల వద్ద, వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి అనే సందేశం ఇచ్చారు.
షాపుల్లో హెల్మెట్ అవగాహన స్టిక్కర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటుచేయాలని వ్యాపారులకు సూచించారు.
హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న కొంతమందిని గుర్తించి వారికి సిఐ రామారావు స్వయంగా అభినందనలు తెలుపుతూ స్వీట్లు పంచారు.
ఈ సందర్భంగా సిఐ రామారావు మాట్లాడుతూ, మంచు కాలంలో ప్రమాదాలు ఎక్కువ. అందరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి, రోడ్డు భద్రత పాటించాలి అన్నారు.