ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు దర్శి సర్కిల్ పరిధిలోని దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు పోలీస్ స్టేషన్లకు చెందిన రౌడీషీటర్లు మరియు సస్పెక్ట్ షీటర్లకు దర్శి సర్కిల్ ఆఫీస్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దర్శి సిఐ వై. రామారావు ఆధ్వర్యంలో ముండ్లమూరు ఎస్సై కె. కమలాకర్, తాళ్లూరు ఎస్ఐ మల్లికార్జున్ కలిసి నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐ రామారావు మాట్లాడుతూ, అందరూ సత్ప్రవర్తనతో ఉండాలని, నేరాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే ఆరు నెలల బైండోవర్లో ఉన్నప్పటికీ ఎవరైనా నేరాల్లో పాల్గొంటే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.