స్వచ్ఛతతోనే స్వర్ణాంధ్ర సాధ్యం – మంత్రి డోలా పిలుపు
కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండల కేంద్రంలో నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి , జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమని వారు పేర్కొంటూ ప్రజలు స్వచ్ఛత పాటించాలని పిలుపునిచ్చారు.