మాట నిలబెట్టిన కూటమి – తూర్పు వీరాయపాలెంలో అభివృద్ధికి 3 కోట్లు!
దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి రూ. 3 కోట్లు వ్యయంతో టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ శంకుస్థాపన చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టిందని ఆమె పేర్కొన్నారు.
లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి, స్కూల్ పిల్లలకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.