గంటల్లోనే రోడ్డు నిర్మాణం—పవన్ కళ్యాణ్ కే సాధ్యం: డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
ముండ్లమూరు మండలంలోని రెడ్డి నగర్ నుంచి బసాపురం వరకు రోడ్డు నిర్మాణానికి గౌరవ ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ రూ.1 కోటి 90 లక్షలు మంజూరు చేసి దర్శి ప్రజలకు సంక్రాంతి కానుక అందించారని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు. శుక్రవారం ఆమె ఈ రోడ్డు పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి యువనేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.