విజయవాడ:
తెలుగు రాష్ట్రాల్లో మత విద్వేషాలకు చోటు లేదని ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షుబ్లి అన్నారు. మేడారం జాతర సందర్భంగా వేధింపులకు గురైన కోవా బన్ విక్రేత వలీకి యావత్ హిందూ సమాజం అండగా నిలవడం మత సామరస్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వంలో మత సామరస్య వాతావరణం కొనసాగుతోందని, కోవా బన్ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వలీ & అతని మిత్ర బృందానికి రూ.50,000 ఆర్థిక సహాయం అందజేశారు.