ఒంగోలు: సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) ఒంగోలు నియోజకవర్గం ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసాన్ని స్వాగతిస్తూ బ్యానర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ… రంజాన్ మాసం ముస్లింలకు ఆత్మశుద్ధి, నియమ నిష్ఠకు ప్రతీక అని పేర్కొన్నారు. ఉపవాసంతో పాటు ఇఫ్తార్ సమయంలో దేశ అభివృద్ధి, సమాజ ఐక్యత, శాంతి కోసం ప్రార్థనలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.