No.1 Short News

Newsread
ప్రజల ఆరోగ్యమే మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. డా|| గొట్టిపాటి లక్ష్మి.
ఈ రోజు దర్శి నియోజకవర్గంలోని 85 మంది పేద మరియు అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు మొత్తం ₹50,42,669 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను దర్శి లోని డా|| గొట్టిపాటి లక్ష్మీ నివాసం వద్ద దర్శి టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ చేతుల మీదుగా అందజేశారు. ప్రతి అనారోగ్య బాధితుడికి అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసిన డా|| గొట్టిపాటి లక్ష్మీ. ఈ కార్యక్రమంలో దర్శి, దొనకొండ, ముండ్లమూరు, తాళ్లూరు మండల పార్టీ అధ్యక్షులు మరెళ్ల వెంకటేశ్వర్లు, మోడీ ఆంజనేయులు, కూరపాటి శ్రీను, మేడగం వెంకటేశ్వరరెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్నా, నియోజకవర్గం టీడీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కూటమి శ్రేణులు ఉన్నారు.
18 Aug 2025 17:44 PM
2
1

Newsread
For better experience and daily news update.
Download our app from play store.