No.1 Short News

Saleem Sayyad
సామాన్యుల అండగా MLA శ్రీ మద్దిపాటి వెంకటరాజు
ద్వారకాతిరుమలలో సామాన్యులకు అండగా MLA మద్దిపాటి వెంకటరాజు – సయ్యద్ ఇమామ్ సాహెబ్ కుటుంబానికి ఇంటి స్థలం పట్టా అందజేత ద్వారకాతిరుమల మండలం, దోరసానిపాడు గ్రామానికి చెందిన సయ్యద్ ఇమామ్ సాహెబ్ గారి కుటుంబానికి MLA శ్రీ మద్దిపాటి వెంకటరాజు గారు అండగా నిలిచారు. గత 30 సంవత్సరాలుగా భూవివాదంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ కుటుంబం తమ సమస్యను ఎమ్మెల్యే గారికి తెలియజేయగా, ఆయన వెంటనే స్పందించి వారికి న్యాయం చేశారు. గోపాలపురం నియోజకవర్గానికి చెందిన MLA మద్దిపాటి వెంకటరాజు గారు, ఇమామ్ సాహెబ్ కుటుంబానికి ద్వారకాతిరుమలలో కొత్త ఇంటి స్థలం కేటాయించి, అధికారికంగా పట్టా అందజేశారు. ఈ సందర్భంగా MLA గారు మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని, సామాన్యులకు న్యాయం చేసేందుకు ఎప్పుడూ ముందుండటమే తన ధ్యేయమని పేర్కొన్నారు. ఈ సహాయానికి సయ్యద్ ఇమామ్ సాహెబ్ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు MLA మద్దిపాటి వెంకటరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
Politics
01 Feb 2025 08:21 AM
4
38

Newsread
For better experience and daily news update.
Download our app from play store.