No.1 Short News

Shaida Reporter
చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ లేఖ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. 2024-25 ఏడాదికి కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన నిధులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని లేఖలో ఆయన కోరారు. రాష్ట్రానికి రావాల్సిన రూ. 3,324 కోట్లు తగ్గిన మాట నిజమా? కాదా? అని ఆయన ప్రశ్నించారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది నిధుల రాక తగ్గిందని అన్నారు. వాస్తవాలను వెల్లడించకుండా ఏపీకి రూ. 3 లక్షల కోట్లు ఇచ్చామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పడం దారుణమని అన్నారు.
Politics
06 Feb 2025 18:39 PM
0
42