No.1 Short News

Newsread
తపాలా శాఖలో 21413 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఇండియన్ పోస్ట్ ఆఫీస్ డిపార్ట్ మెంట్ నుంచి ఈ సంవత్సరంలో తొలి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పోస్టింగ్ కూడా సొంత జిల్లాలో ఉంటుంది. ఈనెల 10 వ తేదీన అప్లికేషన్లు పారంభం అయ్యాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీస్ ల్లో ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. మార్చి 3 లోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం పోస్టుల సంఖ్య: దేశవ్యాప్తంగా 30వేలకు పైగా ఉద్యోగాలు. గ్రామీణ డక్ సేవక్(జీడీఎస్), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ఏబీపీఎం), దఖ్ సేవక్.. తదితర కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీ ఉంటుంది. ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ ప్రారంభం తేదీ : 10 ఫిబ్రవరి . అప్లికేషన్ చివరి తేదీ: 03 మార్చి వరకు ఉంటుంది. ఎడిట్ అప్లికేషన్ తేదీలు : 06 మార్చి నుంచి 08 మార్చి వరకు విద్యార్హతలు : 10వ తరగతి పాస్ అయి ఉండాలి. మ్యాథమాటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో పాస్ మార్కులు వచ్చి ఉండాలి. 10వ తరగతి వరకు స్థానిక భాష ఒక సబ్జెక్ట్ గా కలిగి ఉండాలి. వయోపరిమితి : 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ వాళ్లకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఓబీసీ వాళ్లకు 03 సంవత్సరాలు ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు ఎలాంటి వయోపరిమితి లేదు. వేతనం: బీపీఎం ఉద్యోగులకు వేతనం నెలకు రూ. 12,000 నుంచి 29,380 వరకు ఉంటుంది. ఏబీపీఎం, దఖ్ సేవక్ ఉద్యోగులకు నెలకు రూ. 10,000 నుంచి రూ. 24, 470 వరకు ఉంటుంది. ఎంపిక విధానం : ఎలాంటి రాత పరీక్షలేదు. టెన్త్ క్లాస్ లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తీస్తారు. ఆ లిస్ట్ ప్రకారం ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు : జనరల్ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు. అభ్యర్థులు https://indiapostgdsonline.gov.in/ అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. దివ్యాంగులకు 10సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
Jobs
27 Feb 2025 11:00 AM
1
24