

No.1 Short News
న్యూస్ రీడ్ తాళ్లూరుఒంటి పూట బడుల సమయం మార్పు
AP: ఒంటి పూట బడుల సమయంలో స్వల్ప
మార్పులు చోటు చేసుకున్నాయి. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాలల్లో ఒంటిపూట బడుల ప్రారంభ సమయం మధ్యాహ్నం 1.30 గంటలకు మార్చాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. టెన్త్ పరీక్ష పత్రాలు వెళ్లేంత వరకు విద్యార్థులు ఎండలో వేచి ఉండాల్సి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు మ.1.15 గం.కు స్కూళ్లు ప్రారంభమయ్యేవి. ఇక సా. 5 గంటలకు పాఠశాలలను మూసివేయనున్నారు.
Education
18 Mar 2025 10:35 AM