

No.1 Short News
Sk.Asma Reporter 9948680044బీజేపీ పార్టీ లో చేరిన జకియా ఖానం కి ఘన స్వాగతం
విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్, ఎమ్మెల్సీ శ్రీమతి జకియా ఖానమ్ గారు Bharatiya Janata Party (BJP) లో చేరారు. పార్టీ రాష్ట్రఅధ్యక్షురాలు శ్రీమతి Daggubati Purandeswari గారితో కలిసి ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించాను.
అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన శ్రీమతి జకియా ఖానమ్ గారు.. గౌరవ ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితురాలై బీజేపీలో చేరారు. ముస్లిం సమాజం అభ్యన్నతికి సంబంధించి ప్రధాని మోదీ గారు ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చారు.
వక్ఫ్ ఆస్తుల సంరక్షణ కోసం వక్ఫ్ (సవరణ) చట్టం తేవడం, ముస్లిం మహిళలకు గుదిబండగా మారిన ట్రిపుల్ తలాక్ నిషేధించడమే కాక పేద ముస్లింలకు లబ్ధి చేకూర్చడానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. సబ్కా సాత్, సబ్కా వికాస్ని నాదంతో సమాజంలోని అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు వివక్ష లేకుండా అందిస్తున్నారు.
Latest News
15 May 2025 17:10 PM