

No.1 Short News
Umar Fharooqసేంద్రీయ ఎరువులతోనే సాగు భూముల రక్షణ
సేంద్రీయ ఎరువు భూమి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి నేల మృదువుగా గుల్ల బారేటట్లు కండ కలిగి ఉండేటట్లు చేస్తుందని ,సేంద్రియ పదార్థం వలన సూక్ష్మజీవులు పెరిగి మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషకాలతో పాటు హార్మోన్లు, ఎంజైన్లు సమకూర్చి,నేలస్థితి నీటిని పట్టి ఉంచే శక్తి గాలి ప్రసరణ మెరుగుపడి పంట మొక్కల వేర్లు ఆరోగ్యంగా పెరుగుతాయని, కనుక రైతులు ప్రతి ఎకరా పొలంలో కనీసం 5 ట్రాక్టర్ ట్రక్కుల నయ్యిదిబ్బ ఎరువును తోలి కలియ దున్నాలని మండల వ్యవసాయ అధికారి బి. ప్రసాద్ రావు తెలిపారు. విచక్షణారహితంగా వాడుతున్నా రసాయన ఎరువుల వల్ల భూములు సహజత్వాన్ని కోల్పోయి ఉప్పుచేడు, పాలచెడు ,కారుచేడు భూములుగా మారుతున్నాయని ,రసాయన కాలుష్య బారున పడినెల ఆరోగ్యం దెబ్బతిని పంట దిగుబడుల పై ప్రభావం చూపుతున్నదని ఎ ఓ తెలిపారు.ఈ కార్యక్రమంలో వి. ఎ.ఎ , k అశోక్ , రైతులు పాల్గొన్నారు.
Latest News
28 May 2025 11:17 AM