

No.1 Short News
Umar Fharooqజూన్ 1వ తేదీ నుండి రేషన్ షాపుల వద్దనే లబ్ధిదారులకు రేషన్ సరఫరా
తాళ్లూరు లోని స్థానిక రెవెన్యూ కార్యాలయం నందు తహశీల్దార్ సంజీవరావు ఆధ్వర్యంలో రేషన్ డీలర్ల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తహశీల్దార్ సంజీవరావు మాట్లాడుతూ, రేషన్ డీలర్లు రేషన్ షాపుల వద్దనే రేషన్ అందించాలని,ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేయాలని సూచించారు. 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు,వికలాంగులకు ఇంటి వద్దనే రేషన్ పంపిణీ చేయాలని, ధరల పట్టిక తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ ఇమ్మానియేల్ రాజ్ , వి.ఆర్.ఓ లు చంద్రశేఖర రావు, నాగూర్ బి, మండల రేషన్ డీలర్లు హాజరయ్యారు.
Latest News
30 May 2025 11:28 AM