No.1 Short News

Sk.Asma Reporter 9948680044
పాడేరు పోలీసుల ప్రత్యేక డ్రైవ్
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆదేశాల మేరకు, ఈరోజు పాడేరు ఎస్డిపిఓ షహబాజ్ అహ్మద్, పాడేరు పోలీస్ స్టేషన్ సీఐ దీనబంధు ఆధ్వర్యంలో వాహన దారులకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీ షహబాజ్ అహ్మద్ గారు మాట్లాడుతూ హెల్మెట్ వాడకం తప్పనిసరి అని మైనర్లకు వాహనాల నడుపుట నిషేధం మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, మితిమీరిన వేగంతో వాహనాలు నడపకూడదని ప్రజలకు తెలిపారు. ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా, వాహన తనిఖీలు నిర్వహించి స్పెషల్ డ్రైవ్ ద్వారా మోటార్ వాహన చట్టాన్ని ఉల్లంఘించిన వారికి చలాన్లు జారీ చేయడం జరిగింది. ప్రజలందరూ ట్రాఫిక్ నియమాలు పాటించి సురక్షితంగా వాహనాలను నడిపి, తమ ప్రాణాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
Latest News
01 Jun 2025 19:33 PM
1
20