

No.1 Short News
Sk.Asma Reporter 9948680044వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి- డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
వెన్నుపోటు అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అందరికీ తెలుసు, దుర్మార్గపు ఐదేళ్ల వైసిపి పాలనలో ప్రజలను వంచించి కుటుంబంలో తల్లిని, చెల్లిని వెన్నుపోటు పొడిచి, బాబాయి గొడ్డలిపోటును రాజకీయం చేసి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు అంటుంటే హేళనగా ఉందని, దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఆదివారం ఒక పత్రికా ప్రకటనలో ఖండించారు. ఏడాది ప్రజా పాలన చూసి ఓర్వలేని జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు అంటూ నిరసన కార్యక్రమం చేపట్టడం సిగ్గుచేటు అన్నారు. గత వైసీపీ చేసిన ద్రోహాలు ప్రజలు మర్చిపోలేదని, నవరత్నాల పేరుతో నవ మోసాలు చేశారని విమర్శించారు. విద్యార్థి, యువత, వృద్ధులు, ఉద్యోగ వర్గాలు, వ్యాపార, వ్యవసాయ తదితర అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి ప్రజా విశ్వాసాన్ని కోల్పోయి కేవలం 11 సీట్లకు పరిమితమైన జగన్ రెడ్డి నేనున్నానంటూ మర్చిపోకుండా తమ పార్టీ ఉనికి కాపాడుకునేందుకు, చేజారుతున్న వైసీపీ నేతలను నిలబెట్టుకునే ప్రయత్నం ఈ నిరసన కార్యక్రమం అన్నారు. ఏడాదిగా ఎన్డీఏ కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధి ప్రజలలో ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. క్రమం తప్పకుండా పెన్షన్ల పంపిణీ, సూపర్ సిక్స్ హామీల అమలు, అభివృద్ధి సంక్షేమ పథకాలతో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా అమరావతిని విధ్వంసం చేసి, పోలవరాన్ని పట్టించుకోని ఐదేళ్ల పాలన చూసాం. మన ఏడాది పాలనలో రాజధాని అమరావతిలో 6 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు తీస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. గ్రామీణ రోడ్లు, పట్టణ రహదారి రోడ్ల మరమ్మత్తు పనులు, కాలవల మరమ్మత్తు పనులు ఇలా అభివృద్ధి రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ముందుకు వెళుతుందని, అంతేకాక జగన్ రెడ్డి దౌర్జన్యాలకు దోపిడీలకు రాష్ట్రాన్ని వీడి వెళ్లిన కంపెనీలు ఒక్కొక్కటి తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి, నిరుద్యోగ యువతకు ఊపిరి పోస్తున్నారు. మెగా డీఎస్సీ ని ప్రకటించారు, దీపం త్రీ పథకం ద్వారా ఉచిత గ్యాస్ పంపిణీ చేపట్టారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పథకం అమలు, అన్నదాత సుఖీభవ కింద రైతులకు వ్యవసాయ ఆసరా, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్ర ముందుకు వెళుతుంటే చూసి ఓర్వలేని జగన్ రెడ్డి ఇలాంటి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను చేపడుతూ ప్రజలతో చీకొట్టించుకుంటున్నారని డాక్టర్ లక్ష్మీ ధ్వజమెత్తారు. గత వైసిపి వెన్నుపోటు విధ్వంసకర పాలన నుండి ప్రజాభిముక్తి పొంది ఏడాది స్వేచ్ఛ జీవితాన్ని గడిపి సుఖశాంతులతో జీవిస్తున్న ఆనంద కాలమిది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో నారా చంద్రబాబునాయుడు , పవన్ కళ్యాణ్ , నారా లోకేష్ బాబు ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చేందుకు పడుతున్న నిరంతర కృషిని మనం స్ఫూర్తిగా తీసుకుందాం. అభివృద్ధివైపు అడుగులు వేద్దాం, జగన్ రెడ్డి లాంటి నాయకుల విమర్శలను తిప్పికొడదాం మన మంచి ప్రభుత్వాన్ని ఆదరిద్దాం అభిమానిద్దాం అని పేర్కొన్నారు.
Latest News
01 Jun 2025 19:49 PM